సాక్షి, హైదరాబాద్ : ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన అవెంజర్ బైక్ దొంగతనానికి గురైన ఘటన హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. కొద్దిరోజుల క్రితం జుమ్మేరాత్ బజార్ వద్ద పెట్రోల్ పంప్ ఎదురుగా గల్లీలో నిలిపి ఉంచిన అవెంజర్ను ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీకి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మంగళహాట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఏకంగా అవెంజర్కే ఎసరెట్టాడు!
Published Fri, Aug 28 2020 2:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:24 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement