ప్రధాన వార్తలు

ఇక ఇంటింటికీ బాబు మోసాలు.. ప్రారంభించిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో ఐదువారాల పాటు బృహత్తర కార్యక్రమం జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ను ఆవిష్కరించిన ఆయన.. ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభించారు. సాక్షి, గుంటూరు: బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోందని అన్నారాయన. చంద్రబాబునాయుడు.. ఈ వ్యతిరేకత మధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్బుక్ పాలన చూస్తున్నాం. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం. అదే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏమిటంటే, కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి.అన్ని వ్యవస్థలు విధ్వంసంమన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం. కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది.రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో.. ఉద్దేశమిదేఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? అన్నింటిపై గ్రామ గ్రామాన, తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’(Recalling Chandrababus manifesto). అదే తెలుగులో.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’చంద్రబాబు హామీలు. బాండ్లుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. – ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? అన్న వివరాలతో బాండ్ వస్తుంది.దానిపై ఏమని ఉంటుంది అంటే..చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటూ ఆయన, పవన్కళ్యాణ్ ఇద్దరూ సంతకం చేశారు. ఇంకా ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ పథకాలు వివరించారు. తల్లికి వందనం కింద ఇంత, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.ప్రలోభాలు. పచ్చి మోసంఏపీ ప్రజలకు ఇలా బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, చంద్రబాబు అండ్ కో పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు? అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. అడగాలి.ఇవన్నీ ఎగ్గొట్టారుఒకవైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్. ఆరు త్రైమాసికాలు పెండింగ్. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరోవైపు వసతి దీవెన కింద ఏటా రూ.1100 చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు. పెండింగ్. ఆరోగ్యశ్రీ. నెలకు రూ.300 కోట్లు. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు పథకంలో వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం. తొలుత పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. వీళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి.ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి.చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది?. అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫోటోలతో పాటు, వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి, ఇంటింటా పంచారు. అవన్నీ రెడీగా పెట్టుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి.ఇవే కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు?. తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుంది.ప్రజలతో మమేకం కావాలిఏడాది గడిచింది. హానీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం.ఇది రాక్షస రాజ్యం. అందుకే..ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. కృషి చేయాలి.చివరగా.. ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ బాగా చేశారు. మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువతపోరు చాలా చోట్ల బాగా జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు అని వైఎస్ జగన్ కేడర్ను ఉద్దేశించి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు.

అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బయల్దేరడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన దేశం నుండి మొదటి వ్యోమగామి శుభాంశు శుక్లానే కావటం అందరూ గర్వించాల్సిన విషయం. శుక్లా సహా ఆయన టీమ్ ప్రయాణం సుఖవంతం కావాలి. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.A proud moment for India as Group Captain Shubhanshu Shukla from the Indian Air Force becomes the first ISRO astronaut to travel to the International Space Station on Axiom Mission 4. Wishing Group Captain Shukla and the entire crew a safe journey and a successful mission. The… pic.twitter.com/MX5Z8fkFmw— YS Jagan Mohan Reddy (@ysjagan) June 25, 2025భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి బయల్దేరారు. ఆయన ఈ మిషన్కు పైలట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నాం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నలుగురు వ్యోమగాములతో బయల్దేరింది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది.

టీడీపీకి భారీ షాక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి ఎస్.బాల సుబ్రమణ్యం
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్.శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ
ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా బ్యాకప్ పేసర్గా ఎంపికైన హర్షిత్ రాణాను బీసీసీఐ వెనక్కు పిలిచినట్లు తెలుస్తుంది. హర్షిత్ను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు భారత మేనేజ్మెంట్ రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు హర్షిత్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. రెండో టెస్ట్ కోసం బర్మింగ్హమ్కు పయనమైన భారత జట్టుతో పాటు హర్షిత్ లేడని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. వాస్తవానికి హర్షిత్ ఇంగ్లండ్ పర్యటన కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో లేడు. సుదీర్ఘంగా సాగే పర్యటన కావడంతో పేస్ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్ కోచ్ గంభీర్ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్ పేరును సిఫార్సు చేశాడు. దీంతో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు హర్షిత్ హుటాహుటిన ఇంగ్లండ్కు పయనమయ్యాడు. అయితే తాజా పరిస్థితుల ప్రకారం బ్యాకప్ పేసర్ అవసరం లేదని భారత మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జట్టులోని పేసర్లంతా ఫిట్గా ఉన్నారని సమాచారం. అందుకే మేనేజ్మెంట్ హర్షిత్ను బీసీసీఐకి సరెండర్ చేసినట్లు తెలుస్తుంది.గంభీర్పై విమర్శలుఇంగ్లండ్ పర్యటన కోసం హర్షిత్ను టీమిండియా బ్యాకప్ పేసర్ ఎంపిక చేసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వచ్చాయి. హర్షిత్ విషయంలో గంభీర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు బహిరంగ కామెంట్లు చేశారు. గంభీర్ కేకేఆర్ కోచ్గా ఉన్నప్పుడు హర్షిత్ను దగ్గరగా చూశాడు. అదే పరిచయంతో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక హర్షిత్ పేరును సెలెక్టర్లకు కూడా సిఫార్సు చేసినట్లు టాక్ వినిపించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాకే హర్షిత్ మూడు ఫార్మాట్లలో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. హర్షిత్లో గుర్తించదగ్గ ప్రత్యేకతలేమీ లేనప్పటికీ.. టీమిండియా తరఫున సులువుగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు హర్షిత్ను బ్యాకప్ పేసర్గా ఎంపిక చేయడంతో విమర్శల శృతి మించిందని గంభీరే స్వయంగా హర్షిత్ను బీసీసీఐ సరెండర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా, బ్యాకప్ పేసర్తో పాటు పేస్ బౌలింగ్ బలం సంపూర్ణంగా ఉన్నా భారత్ తొలి టెస్ట్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో భారత ఓటమికి బౌలింగ్ విభాగం కూడా ఒకానొక కారణం. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా పుణ్యమా అని (5 వికెట్ల ప్రదర్శన) ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైంది. బుమ్రా సహా బౌలింగ్ విభాగమంతా తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్కు పగ్గాలేయడం ఎవరి వల్ల కాలేదు. బుమ్రా సైతం చేతులెత్తేశాడు. ఫలితంగా భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది.

ఖర్గే చురకలు.. శశిథరూర్ కౌంటర్!
కాంగ్రెస్ అధిష్టానంతో సీనియర్ నేత శశిథరూర్కు ఉన్న విభేదాలు ఇవాళ మరోసారి అధికారికంగా బయటపడ్డాయి. శశిథరూర్ను ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. కాసేపటికే థరూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు ఇంగ్లీష్ చదవడం అంత బాగా రాదు. కానీ, శశిథరూర్ భాష చాలా బాగుంటుంది. అందుకే ఆయన ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నారు. మేము మాకు వచ్చిన భాషలో ‘‘దేశమే ముందు(మా తొలి ప్రాధాన్యం) అంటాం’’. భారత సైన్యానికి మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ కోసం ఐక్యంగా నిలబడ్డాం. కానీ కొంతమంది ‘‘మోదీనే ముందు.. ఆ తర్వాతే దేశం అంటారు. అలాంటప్పుడు మేమేం చేయాలి?’’ అని నవ్వుతూ అన్నారాయన. మోదీని ప్రశంసించినందుకు థరూర్పై చర్యలు ఉంటాయా? అని ఎదురైన ప్రశ్నకు.. ఆ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంటుందని, చర్యలు తీసుకునే ఉద్దేశమేదీ లేదని అన్నారు. అదే సమయంలో పార్టీ ఐక్యతే అధిష్టానానికి ముఖ్యం అని ఖర్గే పేర్కొన్నారు. #WATCH | #Congress President #MallikarjunKharge says #ShashiTharoor’s strong language skills earned him a spot in the party's working committee and emphasizes that the entire opposition stands united in support of the #IndianArmy.@kharge @ShashiTharoor pic.twitter.com/kiJLpcwE8K— The Federal (@TheFederal_News) June 25, 2025మరోవైపు.. ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తన ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. ‘‘ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. రెక్కలు నీవి.. ఆకాశం ఎవరి సొంతం కాదు’’ అంటూ ఓ పోస్ట్ను ఉంచారాయన. దీంతో ఇది ఖర్గేకు సెటైరే అంటూ ఆయన కామెంట్ సెక్షన్లో చర్చ నడుస్తోంది. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 20252020 – G-23 లేఖ దగ్గరి నుంచి శశిథరూర్కు, అధిష్టానం మధ్య గ్యాప్ మొదలైంది. థరూర్ సహా 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) తిరుగుబాటు లాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. శశిథరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా, థరూర్కు 1,000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక సూచించింది.2023–24.. శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ తాజాగా స్పష్టత ఇచ్చారు.

వైరల్ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్!
ముంబై: ముగ్గురు యువతులు బైక్పై త్రిబుల్ రైడింగ్ చేసూకుంటూ వెళుతున్నారు. స్కూటీని వేగంగా, ప్రమాదకరంగా మలుపులు తిప్పుతూ డ్రైవ్ చేస్తున్నారు. ఆ సమయంలో తన కుమార్తెను ట్యూషన్ కాలేజీకి తీసుకెళ్తున్న ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని ఆపి, తల్లిలా మందలించింది. కానీ వెరసి మహిళా కానిస్టేబుల్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అమ్మాయిల విషయంలో తాను చేసింది తప్పేనంటూ బహిరంగంగా క్షమాపణాలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే?మహరాష్ట్ర లాతూర్ సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రణిత ముస్నే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిని త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతులపై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రెనాపూర్ నాకా వద్ద చిత్రీకరించిన ఈ వీడియోలో.. కానిస్టేబుల్ ప్రణిత ముస్నే యువతులను మాటలతో దూషిస్తూ, చివరికి వారిలో ఒకరిని చెంపదెబ్బ కొడుతూ కనిపించారు. ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు.తర్వాత మీడియాతో మాట్లాడిన కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నా కుమార్తెలను ట్యూషన్కు వదిలి విధులకు వెళ్తున్న సమయంలో, ముగ్గురు యువతులు స్కూటర్పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని గమనించాను. వారిని ఆపి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాను. కానీ వారు 'నీ పని చూసుకో' అంటూ స్పందించారు. అందుకే వారిని వెంబడించి ఆపాను. ఆ సమయంలో నేను తల్లిలా స్పందించాను, కానిస్టేబుల్గా కాదు.అయితే, ఆమె అసభ్యంగా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు సైతం ఆమె మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు. చట్టం ప్రకారం.. యువతులపై చేయిచేసుకునే హక్కు లేదని ట్వీట్లు కూడా పెట్టారు. ఇలా ఆమె తీరు వివాదంగా మారింది. చివరికి ఆమె క్షమాపణలు చెప్పేందుకు దారి తీసింది. ‘నేను వాడిన భాష తప్పు. దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. కానీ నా ఉద్దేశం తప్పు కాదు’అని ఆమె స్పష్టం చేశారు.లాతూర్ పోలీస్ అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. Lady Traffic Constable Abuses, Beats Three Young Girls For Triple-Seat Riding In Latur pic.twitter.com/juTK3okkLg— ExtraOrdinary (@Extreo_) June 24, 2025

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) (ఐఎస్ఎస్) వైపుకు ఈ రోజే(బుధవారం జూన్ 25)చేరుకోనున్నారు. ఈ యాక్సియం స్పేస్ సంస్థ చేపడుతున్న యాక్సియం-4 (AX-4) మిషన్లో శుభాంశు కీలక పాత్ర పోషించనున్నారు. నాసా ప్రకటన ప్రకారం, ఈ ప్రయోగం ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, గురువారం సాయంత్రం 4:30కి వ్యోమనౌక ఐఎస్ఎస్తో డాకింగ్ కానుంది. మన భారతీయ వ్వోమగామి ఈ ప్రతిష్టాత్మక మిషన్లో భాగం కావడంతో యావత్తు దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈనేపథ్యంలో ఆయన కుటుంబ నేపథ్యం, లవ్స్టోరీ గురించి తెలుసుకుందామా..!.ఆయన బుధావారం మధ్యాహ్నం ఫాల్కన్ 9 రాకెట్ రాకెట్ లాంచ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు తన భార్య కోసం ఒక భావోద్వేగమైన లేఖ రాశారు. అదులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ..తన ప్రయాణంలో నువ్వులేని లేటుని భర్తీ చేయలేనిది అని భావోద్వేగంగా రాశారు. దానికి శుభాంశు భార్య కామ్నా గర్వంతో కూడిన ప్రేమతో స్పందించారు. ఈ క్రమంలోనే వారి ప్రేమ కథ తెరపైకి వచ్చింది. కామ్నా దంత వైద్యురాలు. ఆమెతో శుభాంశుకి దశాబ్దాల ప్రేమ బంధం ఉంది. వారిద్దరు మొదట లక్నోలోని ప్రాథమిక పాఠశాలలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆయన తరగతి గదిలో అత్యంత నిశబ్దంగా ఉండేవాడిని. అలాంటి వ్యక్తి జాతీయ స్థాయిలో ప్రేరణ నిలవడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు. తమ విద్యా రంగాల దృష్టా వేరైనా క్షణాలు ఎన్నో ఉన్నాయి. అయినా మా మధ్య ప్రేమ అలానే స్వచ్ఛంగా ఉంది. బహుశా అదే మమల్ని పెళ్లి పీటల వరకు వచ్చేలా చేసి ఉండొచ్చు. శుభాంశు కెరీర్ పరంగా ఎన్నో ఎడబాటులను తట్టుకుని నిలిచిన అపూర్వ ప్రేమ మాది అని కామ్నా సగర్వంగా చెప్పారు. అయితే తమ కొడుకు తన తండ్రితో గడిపే క్షణాలను కోల్పోడం మాత్రం ఇప్పటికీ బాధగానే ఉంటుంది. ఎన్ని బాధ్యతలున్నా..అతడి ఫోకస్ అచంచలంగా ఉంటుదని కీర్తించారు. అంతేగాదు శుభాంశు దృఢ సంకల్పాన్ని మహాభారతంలోని అర్జునుడితో పోల్చారామె. ఆయన మంచి ఏకాగ్రతతో స్పష్టమైన వైఖరి ఉన్న వ్యక్తిత్వం గలవాడని చెబుతున్నారు కామ్నా. ఫైటర్ జెట్ల నుంచి అంతరిక్షం వరకు చేరుకున్న అతడి కెరీర్ నిజంగా చాలా గొప్పదన్నారు. నక్షత్రాలలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలనే ఆ కాంక్షతోనే ఈ స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పుకొచ్చారామె. ఆయన ఎల్లప్పుడూ "పరిస్థితి ఎంత సవాలుగా ఉన్నా, ఈత కొడుతూనే ఉండండి" అనే నినాదాన్ని గట్టిగా విశ్వసిస్తారని చెప్పుకొచ్చారు కామ్నా. కార్గిల్ యుద్ధంతో కెరీర్ యూటర్న్..శుభాంశు శుక్లా లక్నోలోని అలీగంజ్ క్యాంపస్లోని సిటీ మాంటిస్సోరి స్కూల్ (CMS) ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కానీ 1998లో కార్గిల్ యుద్ధం సమయంలో కెరీర్ సడెన్గా మలుపు తిరిగింది. ఈ యుద్ధం అతనిలో దేశానికి సేవ చేయాలనే ప్రగాఢమైన కోరికను రేకెత్తించింది. దృఢ సంకల్పంతో తన కుటుంబానికి చెప్పకుండా UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణులయ్యారు. అలా శుభాంశు 2005లో కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమాన శిక్షణ పొందాడు. చివరికి 2006లో అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్లోకి నియమితులయ్యారు. ఆయన బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. చాలా ఏళ్లుగా శుక్లా భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్, టెస్ట్ పైలట్గా సేవలందించారు. అదీగాక దాదాపు 2 వేల గంటల విమానయాన అనుభవంతో సాధించిన రికార్డు వివిధ రకాల విమానాలను అధిరోహించేలా చేసింది. ఆ కెరీర్ నేపథ్యమే 2019లో భారతదేశం ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మిషన్ కోసం నాలుగు వ్యోమగాములలో ఒకరిగా అతని ఎంపికకు దారితీసింది. అప్పటి నుంచి ఆయన రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో, అలాగే బెంగళూరులోని భారతదేశ వ్యోమగామి శిక్షణా కేంద్రంలో కఠినమైన వ్యోమగామిగా శిక్షణ పొందారు.(చదవండి: ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్తో..)

దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కి తమిళ నటుడు సత్యరాజ్(Sathyaraj) వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ .. నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే… అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించాడు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్… తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, పవన్ వ్యాఖ్యలను ఇప్పటికే డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు తమిళనాడుతో మీకేం సంబంధం’ అని డీఎంకే కీలక నేత, మంత్రి శేఖర్ బాబు పవన్ని ప్రశ్నించారు. ‘మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించు’ అని పవన్కి సవాల్ విసిరాడు.

ఇవిగో ఈ తప్పులు చేశారో.. ఐటీ రిటర్న్ కొత్త రూల్స్..
దేశవ్యాప్తంగా పన్నుచెల్లింపుదారులు ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలులో తలమునకలై ఉన్నారు. ఐటీఆర్ ఫైలింగ్కు సాధారణంగా జూలై 31 చివరి తేదీ కాగా ఈ ఏడాది దీన్ని సెప్టెంబర్ 15 వరకూ పొడిగించారు. ట్యాక్స్ ఫైలింగ్లో సమ్మతి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.తప్పుడు మినహాయింపులు క్లయిమ్ చేసినా, ఆదాయాన్ని దాచినా పన్ను చెల్లింపుదారులకు కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టింది. "పన్ను బకాయిలో 200% వరకు జరిమానా, 24% వార్షిక వడ్డీ, సెక్షన్ 276 సి కింద ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవచ్చు" అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఈ పరిణామాలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.కొత్త నిబంధనలు.. కీలకాంశాలుకఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.రివైజ్డ్ రిటర్న్తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.తప్పు క్లెయిమ్లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్లు జరిమానాలకు దారి తీస్తాయి.పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు.
సముద్రపు ఒడ్డున బిగ్బాస్ అశ్విని శ్రీ.. ట్రెడిషనల్ లుక్లో వితికా షేరు!
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
మదనపల్లిలో బుస కొడుతున్న కాల్ నాగులు
30 రోజుల రీచార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్లు
మంచు విష్ణు కన్నప్ప.. ఏపీలో టికెట్ ధరల పెంపు
గౌతమ్ గంభీర్పై విమర్శల వర్షం
అర్ధరాత్రి వీడియో కాల్స్.. మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజినీర్ లైంగిక వేధింపులు
రూ.10వేలలో మరో కొత్త ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
వైరల్ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్!
ఆ ముగ్గురు చేతులెత్తేశారు: సతీష్రెడ్డి
నటి ఊర్మిళను రెండో పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల సురేష్
అల్లు అర్జున్ 'ఐకాన్'.. ఇక లేదు
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
పెరగనున్న రైలు చార్జీలు
నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయనకు మాత్రమే: చిరంజీవి
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
ఇరుకున పడ్డ ఇరాన్!
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
సముద్రపు ఒడ్డున బిగ్బాస్ అశ్విని శ్రీ.. ట్రెడిషనల్ లుక్లో వితికా షేరు!
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
మదనపల్లిలో బుస కొడుతున్న కాల్ నాగులు
30 రోజుల రీచార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్లు
మంచు విష్ణు కన్నప్ప.. ఏపీలో టికెట్ ధరల పెంపు
గౌతమ్ గంభీర్పై విమర్శల వర్షం
అర్ధరాత్రి వీడియో కాల్స్.. మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజినీర్ లైంగిక వేధింపులు
రూ.10వేలలో మరో కొత్త ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
వైరల్ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్!
ఆ ముగ్గురు చేతులెత్తేశారు: సతీష్రెడ్డి
అల్లు అర్జున్ 'ఐకాన్'.. ఇక లేదు
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
పెరగనున్న రైలు చార్జీలు
నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయనకు మాత్రమే: చిరంజీవి
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
ఇరుకున పడ్డ ఇరాన్!
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
సినిమా

కన్నప్పకు చిక్కులు! మంచు విష్ణు ఆఫీస్లో జీఎస్టీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కన్నప్ప చిత్రయూనిట్కు భారీ షాక్ తగిలింది. సినిమా రిలీజ్కు రెండు రోజుల ముందు జీఎస్టీ అధికారులు సోదాలకు దిగారు. మంచు విష్ణు (Vishnu Manchu)తో పాటు పలువురి ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. కన్నప్ప బడ్జెట్ను విష్ణు ఎన్నడూ బయటపెట్టలేదు. ఓ ఇంటర్వ్యూలో రూ.100 కోట్లా? రూ.200 కోట్లా? అని అడిగినప్పుడు కూడా చెప్పేందుకు నిరాకరించాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు తన ఆఫీసుకు వస్తారని, ఎందుకీ గొడవ అని సమాధానం దాటవేశారు. చివరకు సినిమా రిలీజ్కు ముందే అధికారులు మంచు విష్ణు కార్యాలయంలో సోదాలకు దిగారు.చదవండి: వంద కోట్ల క్లబ్లో 'కుబేర'

రజినీకాంత్ కూలీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. చికిటు అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ను రాజేందర్, అరివు, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.రజినీకి భారీ పారితోషికం..ఈ మూవీ బడ్జెట్తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం.#Chikitu 💃🕺 - https://t.co/TcCvuNmTSE#Coolie #CoolieFirstSingle Superstar @rajinikanth in a @Dir_Lokesh directorial 💥 @sunpictures ⚡️With the legendary TR sir, the genius @Arivubeing and thank you @iamSandy_Off for making us dance🙏🏻#Coolie releasing worldwide August… pic.twitter.com/KGjY2S3v8g— Anirudh Ravichander (@anirudhofficial) June 25, 2025

చిరు-నాగ్తో మల్టీస్టారర్.. ఇలా మిస్ అయింది!
టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి( Chiranjeevi,), నాగార్జున(Nagarjuna) ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పండుగ సమయంలో లేదా ఏదైనా శుభకార్యం జరిగితే ఫ్యామిలీతో కలిసి హాజరవుతుంటారు. కెరీర్ పరంగానే కాకుండా వ్యాపార పరంగానూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అంతా క్లోజ్గా ఉండే ఈ ఇద్దరు..ఇప్పటి వరకు కలిసి నటించకపోవడం గమనార్హం. వీరిద్దరి కలయికలో ఓ సినిమా వస్తే బాగుటుందని అటు అక్కినేని ఫ్యాన్స్తో పాటు ఇటు మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.అయితే గతంలోనే వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో అది ఆగిపోయిందట. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ..చిరు, నాగ్లతో ఓ సినిమా ప్లాన్ చేశాడట. వీరిద్దరికి ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా.. భారీ బడ్జెట్తో సినిమాను తీయాలని భావించాడట. అయితే దానికి తగ్గట్టుగా కథ సెట్ కాకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.ఆ తర్వాత కూడా పలువురు దర్శకుడు వీరిద్దరితో సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు.అయితే సరైన కథ దొరకపోవడంతో చిరంజీవి, నాగార్జున ఇప్పటివరకు కలిసి నటించలేదు. ఆ మధ్య అనిల్ రావిపూడి కూడా వీరిద్దరితో కలిసి సినిమా చేస్తాడనే రూమర్ వినిపించింది. చిరంజీవితో తీయబోయే సినిమాలో నాగార్జున కూడా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఒట్టి పుకారే అని తేలిపోయింది. సరైన కథ రావాలే కానీ కలిసి నటించడానికి తాము రెడీ అని చిరు, నాగ్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ మన దర్శక-రచయితలే వారిని మెప్పించే కథలను సిద్ధం చేయడం లేదు. మరి వారిద్దరు మెచ్చే కథ ఏ దర్శకుడు తీసుకొస్తాడో..అసలు చిరు-నాగ్ కాంబినేషన్లో సినిమా వస్తుందో రాదో చూడాలి.

వంద కోట్ల క్లబ్లో 'కుబేర'
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ కుబేర (Kuberaa Movie). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనాలకు విపరీతంగా నచ్చేసింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తాజాగా కుంభస్థలాన్ని కొట్టేసింది. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని కుబేర చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.కుబేర కథదీపక్ (నాగార్జున) నిజాయితీ గల సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. ఆయనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ.50 వేల కోట్లను బ్లాక్లో పంపించాలి. దానికోసం దీపక్.. నలుగురు భిక్షగాళ్లను తీసుకొచ్చి వాళ్ల పేరు మీద చెరో రూ.10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జత చేస్తాడు. ఆ తర్వాత నలుగురిలో ఒకరైన యాచకుడు దేవా (ధనుష్) తప్పించుకుని పారిపోతాడు. దేవా ఎందుకు తప్పించుకున్నాడు? దేవాను నీరజ్ గ్యాంగ్ పట్టుకుంటుందా? లక్ష కోట్లు చేతులు మారాయా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే! Wealth. Wisdom. And now... ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/xKr1UYXP60— Kuberaa Movie (@KuberaaTheMovie) June 25, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ క్రికెట్ టీమ్కు ఓనరయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)ఎడిషన్తో అరంగేట్రం చేయనున్న న్యూఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ISPL కమీషనర్ సూరజ్ సమత్ ధృవీకరించాడు. ISPLలో సల్మాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు. ISPLలో సల్మాన్ భాగస్వామ్యం లీగ్ యొక్క కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నాడు.ISPLలో ఇదివరకే పలువురు సినీ ప్రముఖులు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ (మాఝీ ముంబై), సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ (టైగర్స్ ఆఫ్ కోల్కతా), అక్షయ్ కుమార్ (శ్రీనగర్ కే వీర్), తమిళ నటుడు సూర్య (చెన్నై సింగమ్స్), హృతిక్ రోషన్ (బెంగళూరు స్ట్రైకర్స్), మెగా పవర్స్టార్ రామ్ చరణ్ (ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్) సంబంధిత ఫ్రాంచైజీలకు ఓనర్లుగా ఉన్నారు.ISPLకు శక్తివంతమైన కోర్ కమిటీ ఉంది. ఇందులో భారతరత్న సచిన్ టెండూల్కర్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యుడు మరియు క్యాబినెట్ మంత్రి ఆశిష్ షెలార్, మినల్ అమోల్ కాలే, సూరజ్ సమత్ సభ్యులుగా ఉన్నారు.ISPL అనేది టెన్నిస్ బాల్తో జరిగే టీ10 టోర్నమెంట్. ఈ టోర్నీని 2024లో ప్రారంభించారు. దేశం నలుమూలల్లో ఉండే క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈ లీగ్ పుట్టింది. ఈ లీగ్ కోసం ఆటగాళ్లను ఐపీఎల్ వేలం తరహాలో ఎంపిక చేసుకుంటారు.రెండు సీజన్లలోనే ఈ టోర్నీ విశేషమైన ప్రజాధరణ పొందింది. రానున్న సీజన్ కోసం ఇప్పటికే 42 లక్షల రిజిస్ట్రేషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ ఓనర్గా సల్మాన్ చేరిక రిజిస్ట్రేషన్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. త్వరలోనే అహ్మదాబాద్కు సంబంధించిన ఫ్రాంచైజీపై కూడా ప్రకటన రావచ్చని తెలుస్తుంది.ISPL మొదటి సీజన్లో టైగర్స్ ఆఫ్ కోల్కతా ఛాంపియన్గా అవతరించింది. గత సీజన్లో అమితాబ్ బచ్చన్ ఫ్రాంచైజీ మాఝీ ముంబై విజేతగా నిలిచింది. గత సీజన్ రికార్డు స్థాయిలో 28 మిలియన్లకు పైబడిన టీవీ వ్యూయర్షిప్ను పొందింది. అరంగేట్రం ఎడిషన్తో పోలిస్తే ఇది 47 శాతం అధికం.ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన అనంతరం సల్మాన్ ఖాన్ ఇలా స్పందించాడు. ISPL ప్రతిభావంతులైన ఆటగాళ్లకు సాధికారత కల్పిస్తుంది. భారత దేశంలోని ప్రతి వీధిలో ప్రతిధ్వనించే హృదయ స్పందన క్రికెట్. ఆ శక్తి స్టేడియంకు చేరుకున్నప్పుడు ISPL వంటి లీగ్లు పుడతాయి. క్రికెట్ పట్ల నేను ఎప్పుడూ మక్కువ కలిగి ఉంటాను. ఈ ప్రత్యేకమైన లీగ్ భారతదేశంలో అట్టడుగు స్థాయి క్రికెట్ను ప్రోత్సహించడమే కాకుండా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు విలువైన వేదికను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తుంది. కాబట్టి ISPLలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉందంటూ ఓ ప్రకటనలో తెలిపారు.కాగా, ISPLలో విజేతకు రూ. కోటి, రన్నరప్కు రూ. 50 లక్షలు బహుమతిగా ఇస్తారు.

ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్పై పంత్ ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరు (Gautam Gambhir)పై స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో అద్భుత శతకాలు బాదిన ఆటగాడిని తక్కువ చేసినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. వేరే వాళ్లను ప్రశంసించడంలో తప్పులేదని.. కానీ అందుకోసం పంత్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంతలా అసహనం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. ఇక ఈ సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది.ఐదు శతకాలుఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా మూడు సెంచరీలు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో పాటు కెప్టెన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) కూడా శతకాలతో అలరించారు.ఇక రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ (4), గిల్ (8) విఫలం కాగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (137), పంత్ (118) సెంచరీలు బాది.. జట్టును ఆదుకున్నారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యం విధించగలిగింది.అయితే, ఆఖరి రోజు వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు శతకాలు బాదినా టీమిండియాకు పరాభవమే మిగిలింది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయిఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. పంత్ ప్రదర్శన గురించి చెప్పాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన గౌతీ.. ‘‘ఈ మ్యాచ్లో మనకు మరో మూడో సెంచరీలు కూడా ఉన్నాయి.అవి కూడా అతిపెద్ద సానుకూల అంశాలే. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే, యశస్వి బాదిన 100, కెప్టెన్గా అరంగేట్రంలోనే గిల్ చేసిన శతకం.. కేఎల్ రాహుల్ 100 గురించి కూడా మీరు ప్రస్తావించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని.వీరు ఒక్కో సెంచరీ చేస్తే రిషభ్ పంత్ రెండు శతకాలు బాదాడు. ఒక్క టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు. నిజం చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రదర్శన. ఏదేమైనా మీ ప్రశ్న ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అంత అసహనం ఎందుకు?ఈ మేరకు గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా... పంత్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పంత్ సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ గౌతీని విమర్శిస్తున్నారు. కాగా ఒకే టెస్టు మ్యాచ్లో రెండు శతకాలు బాదిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు.మరోవైపు.. ఇంగ్లండ్లో రెండు ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన ఏడో భారత బ్యాటర్గా పంత్ నిలిచాడు. అయితే, టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడటంతో అతడి వీరోచిత ప్రదర్శన వృథాగా పోయింది. ఇరుజట్ల మధ్య జూలై 2- 6 వరకు బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025

Ind vs Eng 2nd Test: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో మార్పులు ఇవే!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar - Andersomn Trophy)లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానం వేదికగా గిల్ సేన ఐదు సెంచరీలు బాదినా ఫలితం లేకుండా పోయింది.ఇద్దరూ విఫలమేఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఆతిథ్య జట్టు చేతిలో ఓడింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్టోక్స్ బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక తొలి టెస్టులో విఫలమైన ఆటగాళ్లలో ప్రధానంగా ఇద్దరు బ్యాటర్ల పేర్లు చెప్పవచ్చు.లీడ్స్ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన చెన్నై యువ ఆటగాడు సాయి సుదర్శన్.. తొలి ఇన్నింగ్స్లో నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్(0)గా వెనుదిరిగాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 48 బంతుల్లో 30 పరుగులు చేయగలిగాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతడు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్కే వికెట్ సమర్పించుకున్నాడు.మరోవైపు.. ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ (Karun Nair) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో సాయి మాదిరే డకౌట్ అయిన కరుణ్.. రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులు చేయగలిగాడు. ఈ నేపథ్యంలో వీరు తదుపరి టెస్టు ఆడే అవకాశాలు సన్నగిల్లవచ్చని టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.అతడిని తీసుకోండిఅదే విధంగా.. బౌలింగ్ విభాగంలో చేయాల్సిన మార్పుల గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘జస్ప్రీత్ బుమ్రా ఫిట్గా ఉన్నాడో లేదో తెలియదు. ఇక తదుపరి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను తీసుకువస్తే మంచిది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అతడిని తీసుకుంటే బెటర్. బర్మింగ్హామ్లో పిచ్ మణికట్టు స్పిన్నర్లకు కాస్త సహకరిస్తుంది.వారిపై వేటు పడవచ్చుఅందుకే కుల్దీప్ వస్తే బాగుంటుంది అంటున్నాను. ఒకవేళ కాలం కలిసి రాకపోతే సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లపై వేటు పడే అవకాశం ఉంది. నేనైతే ప్రస్తుతానికి వారిని జట్టు నుంచి తప్పించాలని అనుకోవడం లేదు.ఏదేమైనా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకుంటే.. బ్యాటింగ్ లైనప్ బలపడుతుంది. బౌలింగ్ పరంగానూ కాస్త వైవిధ్యం చేకూరుతుంది’’ అని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య జూలై 2- 6 మధ్య రెండో టెస్టు జరుగనుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ ఇందుకు వేదిక. కాగా ఈ సిరీస్లో టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు:యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా. చదవండి: విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్

ఢిల్లీకి మారనున్న నితీశ్ రాణా
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించే నితీశ్ రాణా.. రానున్న దేశవాలీ సీజన్ (2025-26) కోసం జట్టు మారనున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్కు మకాం మార్చిన నితీశ్ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు దేశీయ క్రికెట్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. నితీశ్కు అత్యంత సన్నితంగా వ్యవహరించే ఓ వ్యక్తి (చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్) ఈ విషయాన్ని ధృవీకరించాడు. తదుపరి సీజన్లో నితీశ్ ఢిల్లీ తరఫున ఆడతాడని అతను చెప్పాడు.31 ఏళ్ల నితీశ్ 2023-24 సీజన్కు ముందు ఢిల్లీని వీడి ఉత్తర్ప్రదేశ్కు వలస వెళ్లాడు. గతంలో నితీశ్ ఢిల్లీకి కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. యూపీ తరఫున నితీశ్ పెద్దగా రాణించలేకపోయాడు. గత సీజన్లో అతను అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 9 మ్యాచ్ల్లో 111 పరుగులు.. విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్ల్లో 17 పరుగులు.. రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్ల్లో 150 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శనల కారణంగా నితీశ్ యూపీ జట్టులో స్థానం కోసం పాకులాడాల్సి వచ్చేది. ఎవరైనా మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితేనే నితీశ్కు అవకాశాలు వచ్చేవి. దీంతో ఉపయోగం లేదని అనుకున్న నితీశ్ సొంతగూటికి తిరిగి రావడానికి సిద్దమయ్యాడు.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్కు ఢిల్లీ జట్టులో గతంలోలా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పేలవ ఫామ్, జట్టును అకారణంగా వీడాడన్న కారణాల చేత ఢిల్లీ యాజమాన్యం నితీశ్ను గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ వ్యక్తి నితీశ్ను ఉద్దేశిస్తూ.. ఇదేమీ డంప్ యార్డ్ కాదని సంచలన కామెంట్లు చేశాడు. దీన్ని బట్టి చూస్తే నితీశ్ ఢిల్లీ జట్టులో చేరినా అతని కెరీర్ నల్లేరుపై నడకలా ఉండకపోవచ్చు. నితీశ్ త్వరలో జరుగున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ దేశీయ లీగ్లో అతను సత్తా చాటగలిగితే ఢిల్లీ దేశవాలీ జట్టులో పూర్వవైభవం సాధించవచ్చు.నితీశ్ వర్సెస్ ఢిల్లీ కెప్టెన్ఒకవేళ నితీశ్ ఢిల్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా అతని పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నితీశ్ ఢిల్లీ సారధి ఆయుశ్ బదోనితో గొడవపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా నితీశ్, బదోని బాహాబాహీకి దిగినంత పని చేశారు. ఆ సమయంలో అంపైర్లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.ఐపీఎల్లోనూ అదే ప్రదర్శననితీశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. ఈ సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను సామర్థ్యం మేరకు రాణించలేకపోయాడు. 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు.
బిజినెస్

కొత్త ఇన్సూరెన్స్ పథకం.. మంచి బెనిఫిట్స్తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కొత్తగా గెలాక్సీ మార్వెల్ పేరిట పాలసీని ప్రవేశపెట్టింది. తొలిసారి క్లెయిమ్ చేసేంతవరకు లేదా 55 ఏళ్లు వచ్చేంత వరకు ఒకే ప్రీమియంను కొనసాగించడం, 71 కన్జూమబుల్స్కు కవరేజీ, అపరిమిత స్థాయిలో 100 శాతం సమ్ ఇన్సూర్డ్ను రిస్టోర్ చేయడం, ప్రీమియం వెయివర్, ఔట్పేషంట్ బెనిఫిట్స్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.తమ పాలసీల విక్రయం కోసం పాలసీబజార్తో చేతులు కలిపినట్లు కంపెనీ ఎండీ జీ. శ్రీనివాసన్ తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభించిన గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4,730 పైగా పాలసీదార్లకు బీమా భద్రత కల్పించామని, రెండురాష్ట్రాల్లో 1893 మంది పైగా ఏజంట్లతో పటిష్టమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నామని ఆయన వివరించారు.

ముదురుతున్న ఏఐ వార్!
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక ప్రచారం ప్రారంభించినట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.నేరుగా సంప్రదింపులుకొన్ని సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మార్క్ జుకర్బర్గ్ సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా షార్ట్లిస్ట్ చేసి ఆయా నిపుణులను నేరుగా సంప్రదిస్తున్నారు. వారితో జరుపుతున్న చర్చల్లో కేవలం నియామకాల గురించే కాకుండా ఆర్టిఫిషియన్ జనరల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్తు కార్యకలాపాలు వంటి చాలా అంశాలను చర్చిస్తున్నారు.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం..మెటా కొన్ని రోజుల నుంచి మానవ స్థాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్’ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు ప్రపంచంలోనే టాప్ స్కిల్డ్ పర్సన్స్ను నియమించుకోవాలని మెటా భావిస్తోంది. దాంతో సరైన నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అలెగ్జాండర్ వాంగ్ స్థాపించిన స్కేల్ ఏఐ కంపెనీను 14 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వాల్యుయేషన్కు కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన వాంగ్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలో మెటా తరఫున పని చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంకొందరు విముఖతఅయితే కొందరు మాత్రం తమ నైపుణ్యాలకు, తాము స్థాపించిన కంపెనీలకు మెటా ఎంత వెచ్చిస్తానంటున్నా కలిసిరావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. జుకర్బర్గ్, మెటా ఏఐ చీఫ్ సైంటిస్ట్ యాన్ లెకున్ మధ్య ఫిలాసఫికల్ విభేదాల వల్ల ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ దీర్ఘకాలికంగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.

విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్
ఐటీ సర్వీసులు అందించే ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ తన భారత కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రూ.1,583 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక టెక్నాలజీ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. వైజాగ్లోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 22 ఎకరాల్లో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్యాంపస్ ద్వారా 8,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది.2026లో 800 మంది అసోసియేట్లకు వసతి కల్పించేలా తాత్కాలిక కేంద్రం ద్వారా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. 2029 ప్రారంభంలో పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. విశాఖపట్నం ప్రతిభకు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవి కుమార్ తెలిపారు. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ విస్తరించాలనే లక్ష్యానికి అనుగుణంగా వైజాగ్లో క్యాంపస్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని, అదే సమయంలో భవిష్యత్తులో శ్రామిక శక్తికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచుతుందని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంభారతదేశం అంతటా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ ఇప్పటికే భువనేశ్వర్, ఇండోర్లో కొత్త కేంద్రాలను, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ హబ్ను ఏర్పాటు చేసిందని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా కంపెనీ శ్రామిక శక్తి భారత్లో ఉన్నందున కాగ్నిజెంట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది.

మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) కూటమి దేశాల్లో ఒమన్ మొదటిసారి ఆదాయపు పన్నును ప్రవేశపెట్టనుంది. 42,000 రియాల్స్ (1,09,000 డాలర్లు-దాదాపు రూ.93 లక్షలు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వర్గానికి 5% పన్ను విధించనున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒమన్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ కథనం ప్రచురించింది. ఈ విధానం 2028 నుంచి అమల్లోకి రానుందని అంచనా వేసింది.చమురుకు తగ్గుతున్న డిమాండ్ముడిచమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై దేశం తక్కువగా ఆధారపడటానికి ఈ చర్య దోహదపడుతుందని ఒమన్ ఆర్థిక మంత్రి సయ్యద్ బిన్ మొహమ్మద్ అల్ సక్రీ తెలిపారు. అదే సమయంలో ప్రజా సేవలు, సామాజిక అవసరాలపై వ్యయాన్ని సమర్థంగా నిర్వర్తించవచ్చని చెప్పారు. మొత్తం ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశాలు ఆదాయంపై పన్ను విధించకుండా దూరంగా ఉన్న నేపథ్యంలో ఒమన్ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న జీరో ట్యాక్స్ విధానం అధిక ఆదాయం ఉన్న ప్రవాసులను ఆకర్షించడానికి సహాయపడింది. ఒకవేళ ఒమన్ ప్రతిపాదించిన విధానం ఆచరణలోకి వస్తే ప్రవాసుల ధోరణి ఎలా ఉంటుందో గమనించాల్సి ఉంటుంది.అబుదాబి కమర్షియల్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ మోనికా మాలిక్ ఈ పరిణామాన్ని ఆర్థికంగా కీలకమైనదిగా అభివర్ణించారు. ఒమన్ తన పక్క దేశాలతో అభివృద్ధిలో పోటీ పడేందుకు వీలుగా, రాజీపడకుండా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఇదిలాఉండగా, పొరుగు దేశాల మాదిరిగానే ఒమన్ కూడా సంపద సృష్టించడంలో భాగంగా ఇటీవలి కాలంలో ఆస్తుల అమ్మకాలు, ప్రైవేటీకరణ ద్వారా డబ్బు సమీకరిస్తోంది.గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటలో..?సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం పడుతుండటంతో ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం చాలా జీసీసీ దేశాలు మెరుగైన ప్రభుత్వ నిధులను కలిగి ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్జీసీసీ దేశాలు ఏవంటే..గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) అనేది ఆరు మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక కూటమి. అందులోని దేశాలు..బహ్రెయిన్కువైట్ఒమన్ఖతార్సౌదీ అరేబియాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)1981లో జీసీసీ స్థాపించారు. సౌదీ అరేబియాలోని రియాద్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది.
ఫ్యామిలీ

ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్ష
మనతోపాటు, మనకన్నా ముందే పుట్టిన అనేక రకాల ఔషధ మొక్కలు మానవ మనుగడలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి మనకు అందించిన మొక్కలను నిత్యం చూస్తున్నా.. వాటి ప్రయోజనాలు, విలువలను తెలుసుకోలేకపోతున్నాం. ఇంట్లో, పెరట్లో, మిద్దెలపై పెంచుతున్న పూలమొక్కలతోపాటు పలు రకాల ఔషధ మొక్కలను సైతం పెంచితే ఇంటికి అందంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు ఔషధ మొక్కల ప్రేమికులు.అందాన్ని పెంచే అలోవేరా (కలబంద), తిప్పతీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ, తులసి, పుదీనా, ఉసిరి, వేప, పసుపు, బ్రహ్మి, మెంతులు.. ఇలా మానవాళికి దోహదపడే ఔషధ మొక్కలు అనేకం ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో ఔషధ మొక్కల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో అనేక రకాల ఔషధ మొక్కలను సంరక్షిస్తున్నారు. అంతేకాదు.. వాటి ఉపయోగాలను తెలియజేసేలా ప్రచారం కూడా చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిఆకులు మందంగా, తెల్లగా ఉన్న ఈ మొక్క పేరు క్లినియా గ్రాండిఫ్లోరా (కుందేలు చెవిఆకు). ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. దీని ఆకులు, వేర్లు ఆరోగ్య సమస్యలకు చికిత్సగా వాడతారు. ఆకురసాన్ని దద్దుర్లు, దురదలను తగ్గించేందుకు వాడతారు. మూత్ర సంబంధ వ్యాధులను సైతం నివారిస్తుంది.ఆయిల్ నట్ట్రీ (నూనెగింజల చెట్టు). దీని విత్తనాల నుంచి నూనె తీస్తారు. ఔషధాల తయారీతోపాటు వంటల తయారీకి కూడా ఉపయోగిస్తారు. చర్మ సంబంధ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు ఈ నూనె వాడతారు. ఇంధనం, సబ్బులు, వార్నిష్ల తయారీకి సైతం దీని నూనెను ఉపయోగిస్తారు.నిమ్మగడ్డి. జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. వంటకాల్లో సైతం నిమ్మగడ్డి ఒక ప్రత్యేకమైన రుచితోపాటు సువాసనను అందిస్తుంది. వేడినీటిలో మరిగించి టీలా తాగుతారు కొందరు.నోని మొక్క. రుబియాసియే కుటుంబానికి చెందిన ఈ మొక్కతో ఔషధ ప్రయోజనాలు అనేకం. బ్లడ్ప్రెషర్ (బీపీ)ని కంట్రోల్ చేస్తుంది. కేన్సర్ నివారణకు ఈ మొక్క పండ్లు దోహదపడతాయి. నోనిలో యాంటీ యాక్సిడెంట్స్, ఖనిజాలు విటమిన్లు పుష్కలం. నోని పండ్లను నేరుగా లేదా జ్యూస్గా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ నియంత్రణకు దోహదపడుతుందంటున్నారు.ఈ చిత్రంలో కనిపిస్తున్న మొక్క వైల్డ్గ్రేప్ (నల్లేరు). విటాసియే కుటుంబానికి చెందింది. అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క ఎముకల పెరుగుదల, పగుళ్లను నయం చేయడం, దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలకు ఔషధంగా, కాల్షియం బూస్టర్గా పరిగణిస్తారు.అలోవేరా (కలబంద) ఈ మొక్క అందరికీ సుపరిచితం. గాయాలను నయం చేయడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. చర్మం, జుట్టు పెరుగుదల, సంరక్షణ, చుండ్రు నివారణకు దోహదపడుతుంది.రణపాల (బ్రయోఫిలమ్). కిడ్నీలో రాళ్లు, చర్మవ్యాధులు, దగ్గు, జ్వరం, జీర్ణ, ఎముకల సమస్యల నివారణకు ప్రత్యేకంగా ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులు ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయని వైద్యులు చెబుతారు.గణపత్రి. ఇది విస్తృతంగా కనిపించే సుగంధపు మొక్క. ఆకులు, పూలు, విత్తనాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. నొప్పి నివారణకు, యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఈ గణపత్రి మొక్క జీర్ణక్రియ మెరుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపునకు ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు నివారణకు, చర్మ సంబంధ వ్యాధుల చికిత్సలో సైతం ఉపయోగిస్తారు.మల్టీ విటమిన్ ప్లాంట్. సైంటిఫిక్ నేమ్ సౌరోపస్ ఆండ్రోజినస్. ఏ, బీ, సీ, కే విటమిన్లను సమృద్ధిగా అందించే మొక్క. కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి, రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, మధుమేహం, చెవినొప్పి నివారణలకు ఔషధంగా వినియోగిస్తారు.చదవండి: ఐదేళ్ల శ్రమ ఫలించింది.. ఇంగువ పండింది

వెయిట్లాస్ కోసం బ్లాక్బస్టర్ ఇంజెక్షన్ వచ్చేసింది, ధర ఎంత అంటే!
Wegovy Injection: అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఊరటి నిచ్చే వార్త ఇది. డెన్మార్క్కు చెందిన ఔషధ సంస్థ నోవో నార్డిస్క్.. 'వెగోవీ' అనే ఇంజెక్షన్ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మంగళవారం (జూన్ 24) ఈ మెడిసిన్ను లాంచ్ చేశారు. ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందని చెబుతోంది. ఈ నెలాఖరులోగా అన్ని ఫార్మా దుకాణాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీగోవీ అనే ఇంజెక్షన్ నాలుగు వారాల మోతాదు సైకిల్లోఉంటుంది. నాలుగు వారాల పాటు వారానికి 0.25 mg అతి తక్కువ మోతాదుతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక నెల పాటు వారానికి 0.5 mg మోతాదు క్రమంగా పెరుగుతుంది. నెల పాటు వారానికి 1 mg మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడి సిఫారసు మేరకు మోతాదును మరింత పెంచాలా, లేదా తగ్గించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇది 0.25 mg, 0.5 mg, 1 mg, 1.75 mg ,2.4 mg ఐదు మోతాదు రూపాల్లో మార్కెట్లోకి లభిస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైన పెన్ లాంటి పరికరంగా లభిస్తుంది.CNBC-TV18 Exclusive | We are confident of leading the weight loss #market as we are first to launch and have strong credibility, says Vikrant Shrotriya, MD & Corporate VP, Novo Nordisk India, as the company launches #Wegovy, a weight loss drug, in #India. Tells @ekta_batra that 1… pic.twitter.com/moiu37dB8c— CNBC-TV18 (@CNBCTV18News) June 24, 2025 ధరలు వివరాలునోవో నార్డిస్క్ వీగోవీ 0.25 mg, 0.5 mg , 1 mg మోతాదు నెలకు రూ. 17,345 ఖర్చవుతుంది. 1.75 mg అధిక మోతాదు ఇంజెక్షన్ నెలకు రూ. 24,280 ఖర్చవుతుంది. 2.4 mg మోతాదు రూ. 26,050 ఖర్చవుతుంది. దీర్ఘకాలిక బరువు నిర్వహణ ,హృదయ సంబంధ వ్యాధులకు వెగోవీ తొలిఏకైక బరువు నిర్వహణ ఔషధం. ఈ ఔషధం 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఇతర అనారోగ్యాలు లేనివారికి , 27 కంటే తక్కువ BMI ఉన్న, ఇతర అనారోగ్యాలున్నా ఇస్తారు.భారతదేశంలో వెగోవీ కోసం స్థానికంగా తయారీకి ఎటువంటి ప్రణాళికలు లేవని కంపెనీ స్పష్టం చేసింది. నోవో నార్డిస్క్ ఇప్పటికే 2022లో భారతదేశంలో నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Sundar Pichai: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..!
ప్రముఖుల సంభాషణల్లో గొప్ప గొప్ప సందేశాలు అలవోకగా దొర్లుతాయి. బహుశా అందుకే కాబోలు యువతను గొప్ప గొప్ప వ్యక్తుల ఉపన్యాసాలను వినమని సూచిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే..ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ స్పీచ్ ఒక గొప్ప సందేశాన్ని అందించడమే గాక యువతకు కనువిప్పు కలిగించింది. అంతేగాదు ఈ ఆధునిక సాంకేతికత, డిజిటల్ యుగం మనల్ని ఏవిధంగా ఏమార్చాతున్నాయో కళ్లకు కంటినట్లు చూపించాయి ఆ సన్యాసి మాటలు.అసలేం జరిగిందంటే..లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ మాట్లాడుతూ..తన బ్యాచ్మేట్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్తో జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి ఇంజనీరింగ్ వృత్తిని విడిచిపెట్టిన ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ గౌరంగ దాస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇద్దరు క్లాస్మేట్లు. అదే ఐఐటీ బ్యాచ్లోవారి బ్రాంచ్లు వేరే అయినా..ఇద్దరూ స్నేహితులు. అయితే కళాశాలలో తామిద్దరం ఒకరికొకరు తారసపడటం అత్యంత అరుదుగా ఉండేదన్నారు. కానీ ఇటీవలే చాలా ఏళ్ల తర్వాత తామిద్దరం కలుసుకుని చాలాసేపు ముచ్చటించుకున్నట్లు తెలిపారు. అయితే తన స్నేహితుడు పిచాయ్ నువ్వు నాకంటే చిన్నవాడిలా యంగ్గా కనిపిస్తున్నావని ప్రశంసించినట్లు గుర్తుచేసుకున్నారు. దీనికి గౌరంగ దాస్ స్పందిస్తూ..సుందర్ పిచాయ్ "ఒత్తిడిని సృష్టించే" గూగుల్తో వ్యవహరిస్తాడని, తాను ఒత్తిడిన మాయం చేసే ఆధ్యాత్మికతతో మమేకం అవుతున్నానని సమాధానమిచ్చారు. ఆ సదస్సులో గౌరంగ దాస్ పంచుకున్న కథ ఒక్కసారిగా డిజిటల్ వ్యసనం మనుషులను ఎలా బానిసలుగా మారుస్తుందో తెరపైకి వచ్చింది. దాని ప్రభావం వల్ల మానసిక ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో అనే దానిపై అవగాహన కలిగించేలా చేసింది. ఇక సన్యాసి గౌరంగ దాస్ కూడా అధిక స్క్రీన్ సమయం,సోషల్ మీడియా వాడకంతో పెరుగుతున్న మానసిక సమస్యల గురించి కూడా వివరించారు. పంచవ్యాప్తంగా 230 మిలియన్ల మంది ప్రజలు సోషల్ మీడియాకు బానిసలయ్యారని నివేదికలు చెబుతున్నాయన్నారు. భారతదేశంలోనే, 70% మంది టీనేజర్లు ప్రతిరోజూ ఏడు గంటలు ఆన్లైన్లో గడుపుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఒత్తిడిని తగ్గించుకునేలా చక్కటి మార్గాల తోపాటు కాసేపు మనతో మనం గడిపేలా చక్కటి ధ్యానం వంటివి చేస్తే..మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు గౌరంగ దాస్. View this post on Instagram A post shared by India Global Forum (@indiaglobalforum) (చదవండి: నటి సమంత ఆరోగ్య చిట్కాలు.. డయాబెటిస్ పేషెంట్లు ఇలా చేశారంటే..)

నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్గా
పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు. మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు. పదండి రమేష్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్ ఘోలప్. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్గా సేవలందిస్తున్నాడు. కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్కు జన్మించాడు రమేష్. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. 12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత దూరవిద్య ద్వారా ఆర్ట్స్లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.తన కల నిజం చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. 2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామస్తులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
ఫొటోలు
అంతర్జాతీయం

జపాన్ భూభాగంపై తొలి క్షిపణి పరీక్ష
టోక్యో: చైనాకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో జపాన్ తన సైనిక పాటవాన్ని వేగంగా పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా తొలిసారిగా మంగళవారం తన భూభాగంపై మొట్టమొదటి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. హొక్కైడై దీవిలోని షిజునాయ్ యాంటీ ఎయిర్ ఫైరింగ్ రేంజ్ నుంచి టైప్ 88 సర్ఫేస్ టు షిప్ తక్కువ శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు వెల్లడించింది.40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించిందని తెలిపింది. పరిమిత స్థలం, రక్షణ పరమైన జాగ్రత్తల రీత్యా ఇప్పటి వరకు జపాన్ తన క్షిపణి ప్రయోగాలను విస్తారభూభాగాలున్న అమెరికా, ఆస్ట్రేలియాల్లో చేపడుతూ వచ్చింది. ఈ మేరకు ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. సైనికపరమైన స్వయం సమృద్ధత సాధించే దిశగా మంగళవారం తన భూభాగంలోనే క్షిపణి పరీక్ష చేపట్టింది.

ఇంతకీ గెలిచిందెవరు?
పన్నెండు రోజులపాటు భీకరంగా సాగి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా పయనించిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తామే విజయం సాధించామని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి వారు ప్రకటించుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించుకోగా, తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగరేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదనా వినిపిస్తోంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలుసహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనంచేసి ఇరాన్కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పలు పోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది.ట్రంప్కు శాంతిదూతగా మార్కులుఇజ్రాయెల్– హమాస్ యుద్ధం, ఉక్రెయి న్–రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతిస్థాపనకు శతథా ప్రయత్నించానని ట్రంప్ చెప్పుకున్నారు. అయితే అక్కడ విఫలమైనా ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధాన్ని ఆపి సఫలీకృతుడిని అయ్యానని ట్రంప్ చెబుతున్నారు. శాంతిని కోరుకుంటూనే ఫోర్డో అణుకేంద్రంపై బాంబులేయడమేంటని అమెరికాలోనూ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.దోహాలోని తమ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినా ట్రంప్ సంయమనం కోల్పోలేదు. ఈ విషయంలో ట్రంప్కు మంచి మార్కులు పడ్డాయి. శాంతికాముకులు ట్రంప్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. శాంతి నోబెల్ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ ఆశలు ఈ కాల్పుల విరమణతో చిగురించినట్లే భావించాలి.గగనతలంపై ఇజ్రాయెల్ విజయంక్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్ గగనతలంపై తాము పూర్తి పట్టుసాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉన్నతాధి కారులు, అణు శాస్త్రవేత్తలను అంతంమొందించారు. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసంచేశారు. అణుకేంద్రాలు, మౌలిక వసతు లను కోలు కోనంతగా దెబ్బ తీశారు.ఇవన్నీ తన విజ యాలేనని నెతన్యా హూ సొంత డబ్బా భజా యించారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యా హూ భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధపర్వం నెతన్యాహూ పార్టీ విజయావకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ విజయం సాధించారు.అగ్రరాజ్యాన్నీ ఢీకొట్టగలనని ఇరాన్ సంకేతంతమ ఉనికే ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యూఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకూ తెలుసునని ఇరాన్ రుజువు చేసింది. పశ్చిమాసి యాలో ఎ న్నో దేశాల్లో అమెరికా స్థావరా లున్నా తమకు మిత్రదే శమైన ఖతార్లోని స్థావ రం మీదనే ఇరాన్ వ్యూహా త్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది.అమెరికా, ఇరాన్ కయ్యా నికి తమ భూభాగం రణక్షే త్రంగా మారొద్దని ఖతార్ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్ కేవలం అల్ ఉదేయిద్ బేస్పైనే దాడులు చేసింది. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తి త్వానికి తన వైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది.కొసమెరుపుఇప్పటికే హమాస్– ఇజ్రాయెల్ పోరు, ఉక్రెయిన్–రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురునౌకలపై దాడులతో అధిక పెట్రో ధరల కత్తి గుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచదేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కంచికి చేరడం అందరికీ పెద్ద ఊరట. అయితే అంతెత్తున ఎగసిన యుద్ధజ్వాలలు పూర్తిగా ఆరిపోతాయో లేదోనన్న అనుమానాలూ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయి.ఈ దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలను మళ్లీ రాజేసుకుని పశ్చిమాసియా ప్రశాంతతకు గండి కొడతాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులతో పాఠం నేర్చుకున్న ఇరాన్ మళ్లీ అత్యంత రహస్యంగా యురేనియంను వేరే చోట శుద్ధిచేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాంతిచర్చలు మొదలెట్టి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అత్యావశ్యకం.

యురేనియంను దాచేసింది!
గుట్టుచప్పుడుకాకుండా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులేసి పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని నాశనంచేశానని అమెరికా ఆనందపడేలోపే తాజా ఉపగ్రహ చిత్రాలు కొత్త భయాలను మోసుకొచ్చాయి. దాడులు ఖాయమన్న అంచనాతో ఇరాన్ సైన్యం ముందుగానే ఆ అణుకేంద్రం నుంచి వందల కేజీల అత్యంతశుద్ధమైన యురేనియంను అక్కడి నుంచి వేరే చోటుకు తరలించిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.ఎంతో కష్టపడి శుద్ధిచేసిన యురేనియంను గాల్లో దీపంలా అలా అణుకేంద్రంలో నిర్లక్ష్యంగా వదిలేసేంత అమాయకత్వం ఇరాన్కు లేదని, ఎంతో తెలివిగా యురేనియం నిల్వలను వేరే చోటుకు తీసుకెళ్లిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలకు బలంచేకూరేలా అమెరికా వైమానిక దాడులకు ముందే న్యూక్లియర్ సెంటర్కు కొన్ని భారీ ట్రక్కులు వచ్చి వెళ్లినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేం తెలీకుండానే యురేనియంలేని న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా హడావిడిగా బాంబులేసిందని కొందరు చెబుతున్నారు.పక్కా ప్రణాళికతో..చిన్నని స్థూపాకార ఉక్కు బ్యారెళ్లలో 400 కేజీల అత్యంత శుద్ధ యురేనియంను ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని వార్తలొచ్చాయి. ఈ చిన్న బ్యారెళ్లను తర్వాత చిన్న వాహనాల్లోకి మార్చి తరలించవచ్చు. కారు డిక్కీలో పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 400 కేజీల యురేనియంతో దాదాపు 10 అణుబాంబులను తయారుచేయొచ్చు. అణుకేంద్రంలో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం ఇప్పడు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ చీఫ్ రఫేల్ మారియానో గ్రస్సీ సైతం ధృవీకరించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శాంతిచర్చలకు సిద్ధమైతే, తమ వద్ద యురేనియం నిల్వలు ఉన్నాయని బెదిరించి ఇరాన్ తన డిమాండ్లను సాధించే వీలుంది.‘‘ చర్చల సమయంలో ఇరాన్ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి తమ డిమాండ్లు నెరవేరాలని కోరవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఏదేమైనా బాంబులు పేల్చి మేం వాళ్ల యురేనియం శుద్ధి కేంద్రాలను నాశనంచేశాం. ఇప్పట్లో ఇరాన్ మళ్లీ అణుశుద్ధిని మొదలుపెట్టడం అసాధ్యం’’ అని ఏబీసీ వార్తాసంస్థతో జేడీ వాన్స్ చెప్పారు. ఈ అంశంపై రఫేల్ మారియానో సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థలతో మాట్లాడారు. ‘‘ఇందులో దాచాల్సిందేమీ లేదు. అంతా బహిరంగ రహస్యమే.తమ యురేనియం నిల్వలను కాపాడుకునే దమ్ము తమకు ఉందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ యురేనియంతో అణుబాంబును తయారుచేయడం కుదరదు. కనిపించకుండా పోయిన యురేనియం శుద్ధత కేవలం 60 శాతమే. 90 శాతం శుద్ధత ఉంటేనే అణుబాంబుకు అక్కరకొస్తుంది. దాడులకు ఒక వారం ముందు అణు ఇంధన ఏజెన్సీ పర్యవేక్షణ బృంద సభ్యులు ఇస్ఫహాన్ అణుకేంద్రానికి వెళ్లినప్పుడు అక్కడ యురేనియం నిల్వలను చూశారు’’ అని రఫేల్ వెల్లడించారు. ఆ 16 ట్రక్కులు ఎక్కడ?ఫోర్డో భూగర్భ అణుకేంద్రం ముఖద్వారం వద్దకు దాడులకు ముందు 16 పటిష్టమైన ట్రక్కులు వచ్చినట్లు మాక్సార్ టెక్నాలజీస్ సంస్థ వారి ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రక్కుల నిండా ఏవో బ్యారెళ్లను నింపి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ట్రక్కులు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు. అయితే ట్రక్కులపై అమెరికా నిఘా వర్గాలు ఓ కన్నేశాయని, ట్రంప్ అనుమతి వచ్చాక వాటిపై దాడులుచేసేందుకు అమెరికా సేనలు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాతో మరో కథనం వెలువడింది.

ఆగిన దాడులు!
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్/జెరూసలేం: యుద్ధజ్వాలలతో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. పట్టపగ్గాల్లేని ప్రతీకారాలతో రణాగ్ని రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్ శాంతించాయి. ఇజ్రాయెల్కు దన్నుగా ఇరాన్పై బంకర్ బాంబుల వర్షం కురిపించిన అమెరికా, ఆ తర్వాత తీరిగ్గా శాంతిమంత్రం జపించింది. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరు దేశాలూ అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించారు. కానీ అప్పటినుంచి రోజంతా పలు నాటకీయ పరిణామాలు జరిగాయి.ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. దాంతో ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. ఒక దశలో ఇజ్రాయెల్పై కన్నెర్రజేశారు. తర్వాత ఎట్టకేలకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో 12 రోజులుగా సాగుతున్న పోరుకు ప్రస్తుతానికి తెర పడింది. ఈ పరిణామాన్ని భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయి. అయితే కాల్పుల విరమణ షరతులేమిటి, ఇరు దేశాలు వాటిలో ఎన్నింటికి, ఏ మేరకు అంగీకరించాయి వంటివన్నీ ప్రస్తుతానికైతే జవాబుల్లేని ప్రశ్నలే! ట్రంప్ తిట్ల వర్షం సంపూర్ణ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయంటూ మంగళవారం తెల్లవారుజామున ట్రంప్ తన సామాజిక మాధ్యమం‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు. ‘‘కాల్పుల విరమణ మరో ఆరు గంటల తర్వాత నెమ్మదిగా అమల్లోకి వస్తుంది. ఇరు దేశాలూ సైనిక చర్యల నుంచి వెనుదిరుగుతాయి. రెండు దేశాలను అభినందిస్తున్నా. ఈ యుద్ధం కొనసాగితే పశ్చిమాసియా భస్మీపటలం అవుతుంది. అంతదాకా పోనివ్వను. కాల్పుల విరమణతో ప్రపంచం, పశ్చిమాసియా శాంతిని గెల్చుకున్నాయి’’ అని చెప్పుకొచ్చారు. విరమణ వెనుక ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహీమ్ అల్ థానీ కృషి కూడా ఉందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కానీ ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు కొనసాగాయి.తమకు ఎలాంటి విరమణ ప్రతిపాదనా రాలేదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తొలుత ప్రకటించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్లోని బీర్òÙబా సిటీపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు చనిపోయారు. అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తాము దాడులు చేశామన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే, తొలుత దాడులు చేసింది ఇజ్రాయెలేనని గుర్తు చేశారు. వాళ్లే ముందుగా దాడులు ఆపితే తామూ ఆపుతామని ప్రకటించారు. తర్వాత దక్షిణ, ఉత్తర ఇరాన్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు చనిపోయారు. టెహ్రాన్ సమీపంలోని రాడార్ వ్యవస్థలపైనా ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో దాడులు చేసింది.మళ్లీ ఉల్లంఘనకు పాల్పడితే దీటుగా బదులిస్తామని హెచ్చరించింది. అయినా ఇరాన్ దాడులను ఉధృతం చేయడంతో మరోసారి ప్రతిదాడులకు దిగింది. ఈ పరిణామాలపై ట్రంప్ మండిపడ్డారు. రెండు దేశాలూ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వాటినుద్దేశించి పలు బూతు మాటలు కూడా ప్రయోగించారు. ‘‘బాంబులేయడం ఆపండి. మీ పైలట్లను వెంటనే వెనక్కి పిలిపించండి’’ అంటూ ఇజ్రాయెల్కు అలి్టమేటమిచ్చారు. యుద్దం మొదలయ్యాక ఇజ్రాయెల్పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడం ఇదే తొలిసారి. ‘‘ఇరాన్ ఇక ఎప్పటికీ అణ్వస్త్రదేశంగా అవతరించబోదు. అణుబాంబును తయారు చేయబోదు’’ అంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాత్రం అమెరికాకు లేదని స్పష్టం చేశారు.తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. దాంతో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు నెతన్యాహూ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బాంబుల మోతలు విని్పంచినట్టు తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఇరాన్లో 974 మంది చనిపోయారని, 3,458 మందికిపైగా గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే హ్యూమ్ రైట్స్ యాక్టివిస్ట్స్ సంస్థ ప్రకటించింది. తమ దేశంలో 28 మంది చనిపోయారని, 1,000 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రయెల్ పేర్కొంది. కొద్దిరోజులుగా మూసేసిన తన గగనతలాన్ని మంగళవారం సాయంత్రం తిరిగి తెరిచింది. పశ్చిమాసియా దేశాలకు విమాన సరీ్వసులను బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.పరిష్కారానికి తోడ్పడతాంఇరాన్–ఇజ్రాయెల్ నడుమ ఘర్షణలను తగ్గించడంలో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమని భారత్ ప్రకటించింది. ‘‘యుద్ధం ఏ సమస్యలకూ పరిష్కారం కాదు. చర్చలే ఏకైక మార్గం. ముందనుంచీ ఇదే భారత్ వైఖరి’’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొందిమరో శాస్త్రవేత్త మృతిఅణు కార్యక్రమంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన శాస్త్రవేత్త మొహమ్మద్ రెజా సెదీఘీ సాబర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ఇరాన్లోని ఆస్తనీయే అష్రాఫీయేలో తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న ఆయనపై దాడి చేసింది. జూన్ 13న జరిగిన దాడి నుంచి రెజా తప్పించుకున్నా ఆయన 17 ఏళ్ల కుమారుడు చనిపోయాడు. రెజాపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. ఆయన మృతితో తాజా పోరులో భాగంగా ఇజ్రాయెల్ హతమార్చిన ఇరాన్ అణుశాస్త్రవేత్తల సంఖ్య ఏకంగా 14కు పెరిగింది.
జాతీయం

ఓ తండ్రి దారుణం.. మార్కులే జీవితమా?
సాంగ్లీ: నీట్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి.. కూతురిని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాంగ్లికి చెందిన 17 ఏళ్ల సాధన వైద్య జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రాసింది. ఇటీవలే ఫలితాలు వచ్చాయి. సాధనకు తక్కువ మార్కులు రావడంతో ఆగ్రహించిన ధోండి రామ్ భోస్లే శుక్రవారం రాత్రి ఆమెను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లి ప్రీతి భోస్లే.. స్థానిక ఆసుపత్రికి తరలించింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.అనంతరం, అక్కడ చికిత్స పొందుతూ సాధన మరణించింది. కూతురికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ప్రీతి.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు.. ధోండి రామ్ భోస్లేను ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూన్ 24 వరకు పోలీసు కస్టడీకి విధించారు.

వేడెక్కుతున్న ఆసియా.. భారత్లో వారికే ప్రమాదమే..
పర్యావరణంపై ఓ కొత్త నివేదిక ఆసియాను ఆందోళన పరుస్తోంది. తీవ్రమైన వాతావరణ మార్పులు ఆసియాను సంక్షోభానికి గురి చేస్తాయని హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులపై ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా–2024’ను విడుదల చేసింది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకంటే ఆసియా రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని అధ్యయనం పేర్కొంది. ఈ మార్పు అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యలను కలిగిస్తుందని హెచ్చరించింది. మంచి నీటి వనరులతో పాటు, తీర ప్రాంతాలకు ముప్పు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.వేగంగా కరుగుతున్న హిమనీనదాలు ఆసియాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2024లో ఒకటిగా నమోదైందని నివేదిక తెలిపింది. 1991–2020 బేస్లైన్ కంటే సగటు ఉష్ణోగ్రతలు 1.04 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయని పేర్కొంది. ఖండం ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మధ్య ఆసియాలోని హిమాలయాలు, టియాన్ షాన్ వంటి కీలక పర్వత శ్రేణుల్లో హిమానీనదాలు కరగడం వేగవంతం అయ్యింది. దీనివల్ల కీలకమైన మంచినీటి వనరులు, పర్యావరణ వ్యవస్థలకు ప్రమాదం ఉందని వివరించింది. తీరప్రాంతాలకు ముప్పు.. ఆసియాలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా–2024’నివేదిక తెలిపింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన కారణంగా, ఆసి యా పసిఫిక్, హిందూ మహాసముద్ర తీరప్రాంతా ల్లో సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే వేగంగా పెరిగాయి. ఈ ధోరణులు భారత్తో సహా ఖండంలోని తీరప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలకు ప్రమాదమని పేర్కొంది. ఇవి వరదలు, తుఫానుల ప్రమాదాలను పెంచుతాయని వెల్లడించింది. 2024 ఆసియా ఖండం అంతటా తీవ్ర విపత్తులు సంభవించిన విషయం తెలిసిందే. తీవ్రమైన వేడి..ఆసియాలోని కొన్ని ప్రాంతాలను, ముఖ్యంగా భారత్, జపాన్లను సుదీర్ఘమైన వేడి గాలులు తాకాయని తెలిపింది. ఇవి వందలాది మంది మరణాలకు కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. సముద్ర ఉష్ణ గాలులు రికార్డు స్థాయిలో 15 మిలియన్ చదరపు కిలోమీటర్లకు చేరుకున్నాయని, ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. ఈ సంవత్సరంలో ఉష్ణమండల తుఫాను యాగి ఆగ్నేయాసియా అంతటా విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. ఇది గత సెపె్టంబర్లో ఉత్తర వియత్నాంలో డజన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను బలిగొంది. అలాగే, మధ్య ఆసియా 70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత దారుణమైన వరదలను చవి చూసింది. ఎన్నడూ లేనంత వర్షపాతంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెపె్టంబర్ 2024లో నేపాల్ కూడా విపరీతమైన వరదలొచ్చాయి. 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సకాలంలో పనిచేయడం, పరిపాలనా వ్యవస్థలు సమన్వయంతో ప్రతిస్పందించడంతో వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగారు. తక్షణ లక్ష్యాలు..ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తక్షణ వ్యూహాలు అత్యవసరమని నివేదిక సూచించింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి దేశాలన్నీ ఉమ్మడి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. పర్యావరణ మార్పుల వల్ల కలిగే మానవ, ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ముందస్తు చర్యలు చాలా అవసరమని, ప్రజల జీవితాలను, వారి జీవనోపాధిని రక్షించడానికి విపత్తు సంసిద్ధతను మెరుగుపరచాలని సూచించింది. ఇక రాబోయే ముప్పును గుర్తించడంలో జాతీయ వాతావరణ సేవలు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్

Jammu: దొంగకు చెప్పుల దండ.. పోలీసుల చర్యపై దర్యాప్తు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పోలీసులు విచిత్ర వివాదంలో చిక్కుకున్నారు. వారు ఒక దొంగకు చెప్పుల దండవేసి జమ్ములో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆ పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక దుకాణంలో నగదు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు.అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని విషయంలో అమానవీయంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. పోలీసులు సిబ్బంది ప్రవర్తనపై విఘర్శలు తలెత్తాయి. వారు వృత్తికి విరుద్ధంగా, అనుచితంగా ప్రవర్తించారంటూ, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, తాము వెంటనే విచారణకు ఆదేశించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు ఆ వ్యక్తిని అర్థనగ్నంగా చేసి, చేతులకు సంకెళ్లు వేసి, చెప్పుల దండతో పోలీసు జీపు బోనెట్పై కూర్చోబెట్టి జమ్మూ నగర వీధుల్లో తిప్పుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది. బక్షి నగర్ ప్రాంతంలో ఆ వ్యక్తి ఔషధం కొనుగోలు చేస్తూ, రూ. 40 వేలు చోరీ చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమయ్యింది. ఇది కూడా చదవండి: Uttarakhand: బహుభార్యత్వ వివాదం.. మాజీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

బంధం.. బలహీనం!
ప్రియుడితో ఫోన్ మాట్లాడొద్దని మందలించిన కన్న తండ్రిని.. తల్లి, అక్కతో కలిసి కొట్టి చంపిన కూతురు.. మహబూబాబాద్ జిల్లాలో ఘటనఆస్తి వివాదం కోసం కన్న తండ్రి ఎదుటే సోదరుడిని తుదముట్టించిన చెల్లెళ్లు.. జగిత్యాల జిల్లాలో ఘోరం ప్రేమకు అడ్డు వస్తోందని కన్నతల్లినే ప్రియుడితో హత్య చేయించిన 15 ఏళ్ల బాలిక.. తాజాగా హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం – సాక్షి సెంట్రల్ డెస్క్మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయనడానికి వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలే నిదర్శనం. చిన్న చిన్న కారణాలకు అయినవాళ్లను, ఆప్తులను అంతమొందించే పరిస్థితులు పెరిగిపోతున్నాయ్. ఓవైపు విజ్ఞానం పెరుగుతున్నా.. మరోవైపు ఇలాంటి అజ్ఞానమూ తాండవిస్తోంది. కుటుంబం అంటే అందమైన పొదరిల్లు అనే భావన క్రమంగా అంతర్థానమవుతోంది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో చిన్నచిన్న పంతాలు, పట్టింపులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడవి పగలు, హత్యల వరకు వెళ్లిపోయాయి. తమ ఆనందం కోసం ఏం చేయడానికైనా, ఎంతకు తెగించడానికైనా వెనకాడటంలేదు. తల్లి లేదు.. తండ్రి లేడు.. తోబుట్టువులైనా.. కట్టుకున్న వాళ్లైనా.. బంధనాల్లాంటి బంధాలు మాకొద్దు.. మా లైఫ్.. మా ఇష్టం.. మా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అడ్డొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు.. అనే తీరు నేడు ఎక్కువైపోయింది. రక్తపాతమే కావాలా?ఫోన్ మాట్లాడొద్దన్నారని.. ప్రేమ పెళ్లికి అంగీకరించడంలేదని.. కన్నవాళ్లనే కడతేరుస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో వారికి వేరే ఆప్షన్లు ఉన్నప్పటికీ, రక్తపాతాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? హత్య చేస్తే జైలుకు వెళతామనే ఆలోచన కూడా లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఇలాంటి ఘటనల వెనుక కారణాలు అన్ని కేసుల్లో ఒకేలా ఉండవు. పరిస్థితులు, అవసరాలను బట్టి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అయితే, ఇవేవీ ఆకస్మిక కోపం వల్లో, క్షణికావేశంలోనో జరిగే నేరాలు మాత్రం కావు. నిందితులకు ఉన్న మానసిక రుగ్మతలు, ఒత్తిడి, విభ్రాంతికరమైన ఆలోచనలు, కోరుకున్న వాతావరణం ఇంట్లో లేకపోవడం, తమకు ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదనుకోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లల్లో పెడాలోచనలు ఎందుకు? మా పిల్లలు మాట వినరు.. సరిగ్గా చదవరు.. ఎప్పుడూ ఫోన్తోనే ఉంటారని చెప్పని తల్లిదండ్రులే లేరంటే అతిశయోక్తి కాదు. మారుతున్న ప్రపంచంతోనే అందరి అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. పిల్లల ఆలోచనలు, అలవాట్లలో కూడా ఇదే కనిపిస్తోంది. పిల్లల్లో విపరీత మనస్తత్వానికి కారణం ఏమిటి అంటే... స్మార్ట్ ఫోన్ అనే సమాధానం ఠక్కున వస్తుంది. కొంతవరకు ఇది నిజమే అయినా.. ఇతర కారణాలూ ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు ఇరువురూ కలిసి సంపాదిస్తే తప్ప.. అవసరాలు తీరని పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి గడిపేందుకు సమయమే ఉండటంలేదు. వారితో ప్రేమగా మాట్లాడి, అవసరాలు తెలుసుకుని తీర్చే పరిస్థితి లేదు. ఇది క్రమంగా వారిలో ఒంటరితనానికి దారితీసి.. తమకు కావాల్సింది స్మార్ట్ ఫోన్లో వెతుక్కోవడం మొదలుపెడుతున్నారు. ఇంట్లో లభించని ప్రేమానురాగాలు బయటి వ్యక్తి చూపిస్తే.. అది నిజమో, అబద్ధమో కూడా తెలుసుకోకుండా వారికి దాసోహమైపోతున్నారు. అదే సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు తమను కంట్రోల్ చేయడం వారికి నచ్చడంలేదు. బయట తమకు ఎంతో స్వేచ్ఛ ఉందని.. ఇంట్లో అన్నింటికీ తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారనే భావన క్రమంగా పెరిగి.. వారిపై కోపం పెంచుకుంటున్నారు. అది ఏకంగా కన్నవారి అడ్డు తొలగించుకోవాలనుకునే స్థాయికి వెళ్లిపోతోంది. అయితే, అందరూ ఇలాగే ఉన్నారని కాదు. మానసిక రుగ్మతలు ఉన్నవారు, చాలాకాలంగా తల్లిదండ్రుల వైఖరితో విభేదిస్తున్నవారు, ప్రేమ వంటి విపరీతమైన భావోద్వేగంలో కూరుకుపోయి ఉన్నవారు.. ఏదీ ఆలోచించే పరిస్థితిలో ఉండరు. ఇలాంటివారు పర్యవసనాలను పట్టించుకోకుండా తాము అనుకున్నది చేయడానికే మొగ్గు చూపిస్తారు.తల్లిదండ్రులు ఏం చేయాలి? తమ పిల్లల ప్రతి చర్యకూ తల్లిదండ్రుల బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాలానికి తగ్గట్టే తల్లిదండ్రుల ప్రవర్తనలోనూ మార్పులు రావాలి. పిల్లలను ఎక్కువగా నియంత్రించడం, ఆంక్షలు పెట్టడం వంటివి చేయకూడదు.. అలా అని పూర్తిగా వదిలేయకూడదు. రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయాలి. పిల్లలను అదేపనిగా కట్టుదిట్టం చేస్తే ఒత్తిడిలో కూరుకుపోయి నిరాశలో మునిగిపోతారు.. లేదా తిరగబడతారు. రెండూ ప్రమాదకరమే. రోజులో వీలైనంత సమయం వారితో మాట్లాడాలి. ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అన్నింటికీ మేం ఉన్నాం అనే భరోసా కల్పించాలి. కుటుంబ బంధాలు, విలువల గురించి అర్థమయ్యేరీతిలో చిన్నప్పటి నుంచే తెలియజెప్పాలి. వ్యక్తిత్వ లోపాలే కారణం అకారణంగా హత్యలకు పాల్పడే వాళ్లకు ఐక్యూ లెవల్స్ తక్కువ ఉంటాయి. ఈ బెడద నుంచి తప్పించుకోవాలన్న తాత్కాలిక ఆలోచన వల్లే చంపుతున్నారు. వారి వ్యక్తిత్వంలోనే లోపాలు ఉంటాయి. మానసిక రుగ్మతలు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కుట్రలు చేసి, ఇతరులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు.. కుట్రలో పాల్గొనే వారందరికీ వ్యక్తిత్వ లోపాలు ఉంటాయి. ఇలాంటివారిలో చాలామంది.. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఒకరకమైన అనిశ్చితి, హింస, కోపాలకు గురై ఉంటారు. వారికి తాము చేసిన నేరం సమంజసమే అనిపిస్తుంది.– వీరేందర్, సైకాలజిస్ట్కనుమరుగవుతున్న బంధాలను కాపాడుకోవాలి కన్నవాళ్లను, కట్టుకున్నోళ్లను కడతేర్చడం వంటివి మామూలు హత్యకేసులు కావు. సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు, అనుబంధాలకు నిదర్శనంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించే ప్రేమను నిజమని నమ్మేస్తున్నారు. దానికి అడ్డుగా నిలిచినవారిని తొలగించాలనే తప్పుడు భావనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ బంధం లేనప్పుడు ప్రేమ ఒక వ్యసనంగా మారుతుంది. పిల్లలకు చిన్న వయసులోనే ఎమోషనల్ ఎడ్యుకేషన్ అందించడం ఇందుకు ఒక పరిష్కారం. తల్లిదండ్రులు పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారితో బంధానికి ఎక్కువ విలువనివ్వాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి, వారి ప్రైవసీని గౌరవించాలి. – సైకాలజిస్ట్ విశేష్ విలువలు నేర్పకపోవడం వల్లే.. చిన్న వయసులోనే ప్రేమ అనే భ్రమలో పడుతున్నారు. అది తల్లిదండ్రుల కంటే ఎక్కువనుకుంటున్నారు. తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం, వాళ్లని సరిగా అర్థం చేసుకోలేకపోవడం ఇందుకు కారణాలు.అందుకే పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారనేది చాలా ముఖ్యం. చాలా మంది టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పడంలేదు. బాల్యం నుంచే విలువలతోపాటు నేరాలు–చట్టాలపై అవగాహన కల్పించాలి. – డా. మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ కుటుంబ సభ్యులపైనే దాడులు, హత్యలకు కారణాలివీ..నియంత్రించడం (ఏదైనా వద్దు అని చెప్పడం, ఫోన్ తీసేసుకోవడం వంటివి) 38%ఆస్తి వ్యవహారాలు 10%విభేదాలు 8%కోపం, క్షణికావేశం 8%స్వేచ్ఛాయుత జీవితం కోరుకోవడం 7%
ఎన్ఆర్ఐ

Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్లోనే ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 🇮🇳🇭🇰🛫🛬🇭🇰Air India 315 requested to stay closer to Hong Kong citing technical reasons before deciding to return to HKIA."We don't want to continue further". 🔊 via https://t.co/E8ftHE3i9y📽️ via @flightradar24 https://t.co/XJjqSO9Lll pic.twitter.com/qWq3iXuVRW— Aaron Busch (@tripperhead) June 16, 2025ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్ ఎయిర్పోర్టులో) ల్యాండ్ చేశారు. విమానంలో హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. 🇮🇳 🇭🇰 🛫 🛬 🇭🇰 Air India 315 from Hong Kong to Delhi diverted back to Hong Kong after takeoff on Monday.The plane departed 3hrs and 26 minutes delayed, then returned to Hong Kong roughly an hour after takeoff. The flight was on a 7 year old Boeing 787-8 Dreamliner. pic.twitter.com/kTNvlcfMFV— Aaron Busch (@tripperhead) June 16, 2025ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం భారత్లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్లైనర్ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది.

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట'
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్లోని శియావాసీ పార్క్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్ను పూలతోటలా మార్చారు. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు. (చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్)
క్రైమ్

ప్రియుడితో కయ్యం.. ప్రేమ పిచ్చి దెయ్యం.. జైలు పాలైన వైనం
చెన్నై: నేటి తరం యువత ప్రేమ, వ్యామోహంతో క్షణికావేశంలో నిండు జీవితాల్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మేఘాలయాలో సోనమ్ రఘువంశీ, అనంతరంపురంలో శిరీష,హైదరాబాద్ జీడిమెట్ల తేజశ్రీ.. తాజాగా చెన్నైకి చెందిన రెనే జోషిల్డా. ఇలాంటివి రోజుకు ఎన్నో కథలు.. వ్యథలు.చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలాయిట్లో సీనియర్ రోబోటిక్స్లో కన్సల్టెంట్గా పనిచేస్తోంది. ఓ ప్రాజెక్ట్ సందర్భంగా బెంగళూరులో డివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే, ప్రేమ,దోమ ఇష్టం లేని ప్రభాకర్.. రెనే జోషిల్డా ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మనసు ముక్కలైంది. దీంతో డివిజ్ ప్రభాకర్ఫై ప్రతీకారానికి దిగింది. ప్రేమ పిచ్చితో అతగాడికి మనశాంతి లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది. బాంబు బెదిరింపులతో దేశవ్యాప్తంగా అలజడిఅ తర్వాత డివిజ్ ప్రభాకర్ పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూల్స్,ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపింది. ఒక్క అహ్మదాబాద్లోనే 21 ప్రదేశాలకు బెదిరింపులు పంపింది. మోతేరా నరేంద్ర మోదీ స్టేడియం, సర్కేజ్లోని జెనీవా లిబరల్ స్కూల్, సివిల్ హాస్పిటల్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఇలా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ బెదిరింపులు కలకలం రేపాయి.రీసెంట్గా ఎయిరిండియా విమాన ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానం టేకాఫ్ తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజీకి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో ‘మీకు మా దెబ్బ రుచి చూపించాం. మేమే విమానాన్ని కూల్చాం. ఇప్పుడు మీకు అర్థమైందేమో’ అని పేర్కొంది. ఈ బెదిరింపు మెయిల్ను రెనే జోషిల్డా పంపినట్లు పోలీసులు గుర్తించారు.ఒక చిన్న తప్పిదమే ఆమెను పట్టించేసింది టెక్నాలజీలో నిపుణురాలైన రెనే జోషిల్డా టోర్ బ్రౌజర్, డార్క్ వెబ్, వర్చువల్ నంబర్లను ఉపయోగించి తన డిజిటల్ ట్రేస్ను దాచింది. కానీ ఆరు నెలల క్రితం ఆమె ఓ చిన్న తప్పు చేసింది. అదే ఆమెను పట్టించేసింది. ఒకసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈమెయిల్స్ను ఓపెన్ చేసింది. బెదిరింపు కాల్స్తో అప్రమత్తమైన సైబర్ పోలీసులు రెనే జోషిల్డా ఐపీ అడ్రస్ను గుర్తించారు. అమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఐశ్వర్యతోనే పిల్లల్ని కనాలని..
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. ఐశ్వర్య(సహస్ర) కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యనూ అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమల్ రావు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది.తిరుమల్ రావుకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అయితే ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతోనే పిల్లలను కనాలని భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తేజేశ్వర్తో పాటు తన భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆపై ఐశ్వర్యతో కలిసి లడాఖ్కు ట్రిప్ ప్లాన్ వేశాడు. అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఆ ప్లాన్ను విరమించుకున్నాడు. కేవలం తేజేశ్వర్ను మాత్రమే చంపాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు.ఇందుకోసం .. తేజేశ్వర్ హత్య జరిగిన ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అయితే అప్పటికే భర్త తేజేశ్వర్ను చంపేందుకు ఐశ్వర్య ఐదుసార్లు ప్రయత్నించింది. జూన్ 17వ తేదీన ఆరోసారి చేసిన ప్రయత్నంలో తేజేశ్వర్ బలయ్యాడు. సుపారీ గ్యాంగ్కు సమాచారం అందించేందుకు తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది ఐశ్వర్య. దాని ఆధారంగా అతనికి లొకేషన్ వివరాలను ఆ ముఠాకు అందించింది. ఆపై సర్వే పేరిట తేజేశ్వర్ను వెంట తీసుకెళ్లిన రాజు, పరమేశ్వర్, పరుశరామ్.. కత్తితో పొడిచి చంపారు.కర్నూలు శివారులో పడేసిన మృతదేహాన్ని ఆ మరుసటిరోజు తిరుమల్ వెళ్లి చూసొచ్చాడు. అటుపైనే సుపారీ గ్యాంగ్కు రూ. 2 లక్షలు అందించాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమల్ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అతను లడఖ్లోని ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.కేసు నేపథ్యం ఇదే.. జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. తేజేశ్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్ను నమ్మించింది. దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్రావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమల్రావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది.

జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు.

నా భర్త భాస్కర్ వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నాడు..!
నారాయణపేట: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ దొంగగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన చాపల భాస్కర్ (35) మృతి అనుమానాస్పదంగా మారింది. బెయిల్పై విడుదలైన వ్యక్తిని వికారాబాద్ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెబుతుంటే.. మాకేం సంబంధం లేదంటున్నారు. దీనికి తోడు సొంతూరులో కాకుండా వేరేరాష్ట్రంలో అంత్యక్రియలు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్కి చెందిన చాపల భాస్కర్ కొన్నేళ్లుగా దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. పోలీసుశాఖలో చాపల భాస్కర్ మోస్ట్ వాంటెడ్గా గుర్తింపు పొందారు. ఆరు మాసాలుగా మహబూబ్నగర్ జైలులో ఉన్నాడు. కాగా.. ఈ నెల 20వ తేదీన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే వికారాబాద్ జిల్లాలో 14 చోరీల్లో భాస్కర్పై కేసులు నమోదు కావడంతో భాస్కర్ను మహబూబ్నగర్ జైలు నుంచి బయటికి వచ్చినవెంటనే సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.⇒ వికారాబాద్ పోలీస్స్టేషన్ నుంచి చాపలి భాస్కర్ భార్య తారమ్మకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి.. మీరొచ్చి మీ భర్తను తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నారంటూ పోలీసులను అడిగినట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ నుంచి మఫ్టీలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓ ప్రైవేట్ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి గుర్మిట్కల్ దగ్గరలోని ఓ గ్రామస్టేజీ వద్ద చాపలి భాస్కర్ను వారి బంధువుకు అప్పజెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భాస్కర్ను ఓ ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడించి కానిస్టేబుళ్లు.. అందులో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చేస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఆస్పత్రికి వచ్చేసరికి మృతి..స్పృహలో లేని భాస్కర్ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు భాస్కర్ వెంబడి వచ్చిన బంధువు చేరవేశారు. వెంటనే భార్య తారమ్మతో పాటు కుటుంబసభ్యులు వచ్చి ఆస్పత్రిలో శవమై కనిపించిన చాపలిభాస్కర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే నారాయణపేట పీఎస్కు వెళ్లగా ఈ కేసు తమ పరిధిలో రాదంటూ సీఐ, ఎస్ఐలు చేతులెత్తేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో శనివారం సాయంత్రం భాస్కర్ మృతదేహాన్ని వికారాబాద్ పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. ఆరా తీశారు. మేము కస్టడీలోకి తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బుకాయించినట్లు తెలుస్తోంది. దీంతో దీంతో చేసేదేమి లేక తిరిగి నారాయణపేటకు చేరుకున్నారు. చివరకు ఆదివారం నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాముడు తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చాపలి భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం ఊట్కూర్ అయినప్పటికీ భాస్కర్ అత్తగారి ఊరు కర్ణాటకలోని సంకలాపూర్కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.