Top Stories
ప్రధాన వార్తలు

పప్పు బెల్లాల్లా మెడికల్ కాలేజీలు 'అమ్మబడును'!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ప్రభుత్వ నూతన వైద్య కళాశాల. వైఎస్ జగన్ ప్రభుత్వం 47.58 ఎకరాల్లో రూ.500 కోట్లతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం చేపట్టింది. వైఎస్సార్సీపీ హయాంలోనే దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు గత ప్రభుత్వంలోనే ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. తొలి ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించేందుకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చంద్రబాబు సర్కారు దీన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపూరితంగా లేఖ రాసి సీట్లను రద్దు చేయించింది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కారుచౌకగా ఎకరం ఏడాదికి రూ.100 చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ఎకరం మార్కెట్ రేటు రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని ఏడాదికి కేవలం రూ.4,700 చొప్పున ప్రభుత్వం లీజుకు ఇచ్చేస్తోంది. అంతేకాకుండా ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించేందుకు సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాలేజీని ప్రైవేట్కు కట్టబెట్టి ఏకంగా 66 ఏళ్ల పాటు హక్కులు కల్పించబోతోంది. ఇదే తరహాలో గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోంది. సాక్షి, అమరావతి: ప్రభుత్వానికి విలువైన సంపద సమకూరుస్తూ రూ.వందల కోట్లతో దాదాపుగా పూర్తి చేసిన మెడికల్ కాలేజీలను ఏ ప్రభుత్వమైనా సద్వినియోగం చేసుకుంటుంది! ప్రజలకు ఆరోగ్యం, విద్యార్థులకు వైద్య సీట్లు చేరువలో అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటుంది! కానీ కేవలం రూ.ఐదు వేలు.. పది వేల కోసం ఓ మెడికల్ కాలేజీని ఎవరైనా ఇచ్చేస్తారా? అన్ని వసతులతో సిద్ధమైన ప్రభుత్వ వైద్య కళాశాలను భవనాలతో సహా అప్పగించేస్తారా? అవి కూడా ఒకటి రెండు కాదు.. ఏకంగా పది కాలేజీలు!! చంద్రబాబు సర్కారు మాత్రం సరిగ్గా ఇదే చేస్తోంది. అన్ని వసతులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎకరం రూ.వందకే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. మరికొద్దిగా వ్యయం చేస్తే ఇవన్నీ అందుబాటులోకి వచ్చి పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాల్టీ వైద్యం.. మన విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ పెద్దలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేసి పప్పు బెల్లాల మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలలను తన సన్నిహితులకు కట్టబెడుతున్నారు. ఈ స్కామ్కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు ఓ కన్సల్టెన్సీని తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నారు. తనకు ఆది నుంచి అలవాటైన రీతిలో సీఎం చంద్రబాబు తెర చాటున పావులు కదుపుతున్నారు. ఓ వైద్య కళాశాలను సాధించాలంటే ప్రభుత్వం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఈ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా తీసుకురాకపోగా ఇప్పటికే మంజూరై దాదాపుగా పూరై్తన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కి అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల వైద్య సేవల కోసం అటు పేదలు.. వైద్య సీట్లు కోల్పోయి ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పేదలకు వైద్యం, పిల్లలకు చదువులు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఈ రెండింటినీ నెరవేరుస్తూ గత ప్రభుత్వం ఒకేసారి భారీగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో సాకారమైన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలకు కట్టబెట్టే యత్నాలను టీడీపీ కూటమి సర్కారు ముమ్మరం చేసింది. ప్రభుత్వ కళాశాలలు, బోధనాస్పత్రులను ప్రైవేట్కు ఏకంగా 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంతో పాటు వైద్య సేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసే హక్కు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు ధారాదత్తం చేయడంపై కేపీఎంజీ సంస్థ వైద్య శాఖకు ఫీజిబిలిటీ నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ అధికారుల కమిటీ దీనికి ఆమోదం తెలిపాక టెండర్లు పిలవనున్నారు.ఒకేసారి 17 కాలేజీలకు వైఎస్ జగన్ శ్రీకారం..రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థుల వైద్య విద్య అవకాశాలను పెంపొందించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏకంగా 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023–24లో, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇవి కాకుండా మిగిలిన 10 కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో అప్పగించనుంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కళాశాలలను పీపీపీలో ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయించింది. తొలి దశలో నాలుగు కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న వారికి ఎకరం భూమిని కేవలం రూ.100కే ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన రూ.వందల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు గతేడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే వీటిలో తొలి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మిగిలిన అరకొర పనులూ పూర్తి చేసి ప్రైవేట్ వ్యక్తులే 66 ఏళ్ల పాటు నిర్వహించుకునేలా హక్కులు కల్పించనుంది. తొలుత 33 ఏళ్లు తర్వాత 33 ఏళ్ల పాటుఆటో రెన్యువల్ అయ్యేలా నిబంధనలు రూపొందించినట్టు సమాచారం.సేవలకు డబ్బులు వసూలు..ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవు. అదే ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి లాంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇన్–పేషెంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే వీలు కల్పించారు. సగం మెడిసిన్ సీట్లను కూడా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగా అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీలిచి్చంది. అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దు చేస్తామని నాడు నారా లోకేశ్ నమ్మబలికారు. గద్దెనెక్కాక సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను ఎత్తివేయకపోగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్కు కట్టబెడుతున్నారు.తెల్ల కోటు కల ఛిద్రం..!ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెడుతూ మన విద్యార్థుల తెల్లకోటు కలను చంద్రబాబు చిదిమేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలు ప్రారంభం కాకుండా అడ్డుçపడ్డారు. 50 సీట్లతో పులివెందుల కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వగా టీడీపీ కూటమి సర్కారు కుట్రపూరితంగా లేఖలు రాసి అనుమతులు రద్దు చేయించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి గతేడాది 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉండగా చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ఏకంగా 700 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కాలేజీలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే ఒక్క కళాశాలకు కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోనున్నారు.

చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల హక్కులను గౌరవించకుండా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. యువకులపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి ‘తెనాలిలో దళిత, మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్ విక్టర్, దోమా రాకేశ్, షేక్ బాబూలాల్ అలియాస్ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్ల మీద లాఠీలతో దారుణంగా కొట్టారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్.. బాధితుల కాళ్లను తొక్కిపట్టగా, మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాఠీలతో దాడి చేశారు. మిగిలినవారు ఈ దాడిని వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ కొత్తవి అందజేశారు. వీడియో వైరల్ అయ్యాకే విషయం వెలుగులోకి... ఘోర ఘటనపై మాట్లాడడానికి కూడా ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు. వీడియో వైరల్ అయ్యాకే దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో ఈ ఉదంతం చెబుతోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇలాంటి ఎన్నో దారుణ, అమానవీయ దాడులు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు నోరు విప్పలేని పరిస్థితులు ఉండటం వల్ల వెలుగులోకి రావడం లేదు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కేవలం కాగితంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది మానవ హక్కులను కాలరాసే చర్య... తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల దాడి మానవ హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి చేయడమే. పోలీసులు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను సమరి్పంచాలే తప్ప... వాళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి, శిక్షించే పని చేపట్టకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కొట్టడం, హింసించడానికి చోటే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ట్రంప్ మరో సంచలనం.. విద్యార్థి వీసా ఇంటర్వూలకు బ్రేక్
వాషింగ్టన్: అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్ ప్రభుత్వం ఆందోళనల నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక, ఇప్పటికే షెడ్యూలింగ్ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, ఈరోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు అత్యయిక ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగ నిపుణులు విశ్లేషించచనున్నారు. ఎఫ్, ఎం, జే కేటగిరీ దరఖాస్తుల సోషల్మీడియా ఖాతాల పాత పోస్ట్లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు.అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్మీడియా ప్రొఫైల్, హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూలదాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది. క్లాసులు డుమ్మా కొడితే వీసా రద్దు.. ఇదిలా ఉండగా.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్ స్టేటస్ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది.

వచ్చేస్తోంది ఐదో తరం ఫైటర్
న్యూఢిల్లీ: మారుతున్న యుద్ధతంత్రాలకు అనుగుణంగా అధునాతన ఐదోతరం యుద్ధవిమానాన్ని రూపొందించే బృహత్తర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అడ్వాన్స్డ్ మీడి యా కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ–అమ్కా)గా పిలిచే నవతరం యుద్ధవిమానం మోడల్ తయారీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆమోదముద్ర వేశారు. ఏఎంసీఏ ప్రాజెక్ట్లో భాగంగా గగనతలంలో మెరుపువేగంతో దూసుకుపోతూ శత్రు రాడార్లు, నిఘా వ్యవస్థలను ఏమారుస్తూ భీకర స్థాయిలో దాడి చేయగల మధ్యస్థాయి బరువైన ఐదో తరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయనున్నారు.కొత్త ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచడంతోపాటు స్థానిక వైమానిక తయారీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి ఇది బాటలు వేయనుందని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) రక్షణ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఏఎంసీఏ మోడల్ను అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్ సంస్థలకూ ప్రాజెక్టులో భాగస్వామ్యం దక్కుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.‘‘ఈ ప్రాజెక్ట్ను స్వతంత్ర సంస్థలాగా లేదంటే జాయింట్ వెంచర్లాగా లేదంటే కన్సార్షియం మాదిరి నెలకొల్పి ప్రారంభించనున్నాం. ఈ కొత్త సంస్థను భారతీయ సంస్థగానే నమోదు చేస్తాం. పూర్తిగా భారతీయ చట్టాలు, నియమనిబంధనలకు లోబడే ఈ సంస్థ పనిచేయనుంది. ఏఎంసీఏ ప్రోటోటైప్ దేశీయ రక్షణరంగ సత్తాను చాటేలా ఉంటుంది. రక్షణరంగంలో స్వావలంబన, ఆత్మనిర్భరత సాధనలో ఇది మైలురాయిగా నిలవనుంది’’అని రక్షణ శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ను రూ.15,000 కోట్ల ఆరంభ వ్యయంతో మొదలు పెట్టనున్నారు.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయుసేన, నావికాదళం డిమాండ్లకు తగ్గట్లు ఏఎంసీఏ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతోంది. తేలికపాటి యుద్ధవిమానమైన తేజస్ తర్వాత మధ్యశ్రేణి బరువైన అడ్వాన్స్డ్ మీడియా కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ త యారీ దిశగా భారత్ ముందడుగు వేయడం విశేషం. దీన్ని 2035కల్లా తయారు చేయాలని డీఆర్డీవో భావిస్తుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గతేడాది ఈ ప్రాజెక్ట్కు అంగీకారం తెలిపింది. పదేళ్లలోపు తయారు చేస్తామని డీఆర్డీఓ పేర్కొంది. భిన్న రకాల బాంబులు అమ్కాలో వేర్వేరు రకాల క్షిపణులు, మందుగుండును అమర్చవచ్చు. ⇒ గైడెడ్ మిస్సైళ్లతోపాటు నాలుగు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించవచ్చు. ⇒ 1,500 కేజీల బరువైన బాంబులను సునాయాసంగా జారవిడవగలదు. ⇒ ఇది అత్యల్పస్థాయిలో విద్యుదయస్కాంత స్వ భావాన్ని ప్రదర్శిస్తుంది. దాంతో శత్రు రాడార్లు దీని జాడను కనిపెట్టడం చాలా కష్టం.మూడు దేశాల వద్దే ప్రస్తుతం మూడు దేశాల వద్ద మాత్రమే ఐదో తరం యుద్ధవిమానాలున్నాయి. ⇒ అమెరికా: ఎఫ్–22 రాప్టర్, ఎఫ్–35ఏ లైట్నింగ్– ఐఐ ⇒ చైనా: చెంగ్డూ జె–20 మైటీ డ్రాగన్, జె–35 ⇒ రష్యా: సుఖోయ్ 57ఇ సైలెంట్ కిల్లర్ కొత్త తరహా సెన్సార్ వ్యవస్థ, అంతర్గత ఆయుధ వ్యవస్థ, కమ్యూనికేషన్, నావిగేషన్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం ఇలా ఎన్నో విశిష్టతల సమాహారంగా అమ్కా ఫైటర్ జెట్ రూపుదిద్దుకోనుంది. ఇందులోని విశేషాలు అన్నీ ఇన్నీ కావు... ⇒ అమ్కా మొత్తం బరువు 25 టన్నులు. ఇందులో జంట ఇంజిన్లు ఉంటాయి. సుదూరాలకు ప్రయాణించగలిగేలా 6.5 టన్నుల ఇంధనాన్ని విమానంలో నింపొచ్చు. ⇒ కొత్త యుద్ధవ్యూహాలకు తగ్గట్లు, శత్రు రాడార్లకు చిక్కకుండా, నిశ్శబ్దంగా దూసుకెళ్లేలా దీనిని డిజైన్ చేస్తారు. ఇది ఏకంగా 55,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. ⇒ కృత్రిమ మేధ సాయంతో దీనిని పైలట్ లేకుండానే భూమి మీద నుంచే నియంత్రించవచ్చు. ⇒ ఉపగ్రహాల నుంచి అందే రియల్టైమ్ డేటా ను విశ్లేషించుకుంటూ కొత్తరకం నెట్ సెంట్రిక్ వార్ఫేర్ సిస్టమ్తో ఇది పనిచేస్తుంది. ⇒ ఇది అన్ని రకాల వాతావరణాల్లో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరి్నరోధంగా దూసుకెళ్లగలదు. ⇒ శత్రు గగనతలంలోకి వెళ్లగానే ఎల్రక్టానిక్, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థల సాయంతో వారి రాడార్లను పేల్చేసే ‘సీడ్’అనే ప్రత్యేక వ్య వస్థ ఈ విమానం సొంతం. అలా శత్రువుల క్షిపణి ప్రయోగ వ్యవస్థ నిర్విర్యమవుతుంది. మన యుద్ధవిమానాల పని సులువవుతుంది. ⇒ అమ్కా వేగంగా యాంటీ–రేడియేషన్ క్షిపణులను ప్రయోగించగలదు. ⇒ దీనిలో వాడే ఇంజన్ను విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాను్యఫ్యాక్చరర్ (ఓఈఎం)లతో సంయుక్తంగా తయారు చేయనున్నారు.ఏమిటీ ఐదో తరం? ⇒ 1940–50 దశకంలో తయారైన వాటిని తొలి తరం యుద్ధవిమానాలుగా పేర్కొంటారు. వీటిల్లో రాడార్లు ఉండవు. కేవలం మెషీన్ గన్ బిగించి ఉంటుంది. వేగమూ తక్కువే. ⇒ 1950–60 కాలంలో తయారైనవి రెండో తరానికి చెందినవి. ప్రాథమిక స్థాయి రాడార్ వ్యవస్థ వీటిల్లో ఉండేది. సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేవి. మిగ్–21, మిరాజ్–3 ఈ రకానివే. ⇒ 1970–80ల్లో తయారైనవి మూడో తరానికి చెందినవి. ఇవి శత్రు విమానాలను గాల్లోనే పేల్చేయగలవు. ఎఫ్–4, మిగ్–23, జాగ్వార్ ఈ కోవకు వస్తాయి. ⇒ 1980–90 కాలంలో తయారైనవి 3.5 తరానికి చెందినవి. వీటిల్లో డిజిటల్ వ్యవస్థలు వచ్చేశాయి. ఆకాశంలో 40 కి.మీ. దూరంలోని విమానాలను కూడా పేల్చేసే శక్తిసామర్థ్యాలు వీటి సొంతం. ఎఫ్–5ఈ టైగర్2, మిగ్–21 బిసాన్ ఈ రకానివే. ⇒ 1990 తర్వాత నాలుగో తరం యుద్ధవిమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్నవన్నీ 4, 4.5 తరాలకు చెందినవే.

ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.6.43 వరకు, తదుపరి విదియ తె.4.34 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం: మృగశిర తె.3.15 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.9.49 నుండి 11.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.22 వరకు, అమృత ఘడియలు: రా.7.01 నుండి 8.32 వరకు.సూర్యోదయం : 5.29సూర్యాస్తమయం : 6.25రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం... కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.మిథునం.... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.కర్కాటకం... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. బంధువులను కలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.సింహం..... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.కన్య.... శ్రమ మరింత పెరుగుతుంది. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.తుల.... కుటుంబంలో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.వృశ్చికం... ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ధనుస్సు... నూతన వ్యక్తుల పరిచయాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త పనులకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.మకరం..... మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కుంభం....... రాబడికి మించి ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.మీనం.... నూతన ఒప్పందాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. కొత్త రూల్తో బెనిఫిట్స్ జీరో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్యూ)కు సంబంధించిన ఉద్యోగుల పెన్షన్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు డిస్మిస్ అయినా, మధ్యలో తొలగింపునకు గురైనా అతడికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందవు. అయితే, సదరు ఉద్యోగి డిస్మిస్ లేదా తొలగింపును పరిపాలనా శాఖ పునఃసమీక్షిస్తుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) రూల్స్–2021లో మార్పులు చేసి, సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) అమెండ్మెంట్ రూల్స్–2025 తీసుకొచ్చారు.ఇక, ఈ కొత్త నిబంధనలను ఈ నెల 22న నోటిఫై చేశారు. సర్వీసులో ఉన్నప్పుడు మధ్యలో దు్రష్పవర్తన కారణంగా తొలగింపునకు గురైతే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి అవకాశం లేదు. మధ్యలో డిస్మిస్ అయినా సరే రిటైర్మెంట్ ప్రయోజనాలు యథావిధిగా అందేవి. 2003 డిసెంబర్ 31 కంటే ముందు నియమితులైన కేంద ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) రూల్స్–2021 వర్తిస్తాయి. రైల్వే ఉద్యోగులకు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు మినహాయింపు ఉంటుంది.

అవే గొప్పలు.. అదే విద్వేషం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిందేమీ లేకపోవడంతో సీఎం చంద్రబాబు.. ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విషం కక్కడానికే సమయమంతా వెచ్చించారు. మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ.. కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పంథాను కొనసాగించింది. సూపర్ సిక్స్ హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్క దాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని లేనివి ఉన్నట్లు మహానాడులో చిత్రీకరించారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్ సిక్స్ శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి.. ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్తో చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్ సిక్స్ శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకువస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఇచ్చిన హామీలకే దిక్కు లేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేశ్ శాసనాలంటూ సరికొత్త పద ప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి, మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు.. ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వం అంటూ అదే పనిగా విషంచంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలంతా గత ప్రభు త్వం, జగన్ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడేదో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్ కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సివస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఇక రాష్ట్రానికి తాను చేసేదేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్రహింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతున్నట్లు అర్థమవుతోంది. పార్టీ కార్యకర్తల మనసుల్లో విద్వేషం నింపి వారిని పగతో రగిలేలా చేయడం కోసమే గత ప్రభుత్వంపై అభాండాలు మోపడాన్ని చంద్రబాబు ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాన్ని మహానాడులోనూ కొనసాగించారు. ఇందులో భాగంగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని సీఎం ఎలా చెబుతారని ప్రజలు మండిపడుతున్నారు.తండ్రీ కొడుకులపై పొగడ్తలు ఎన్టీఆర్ హయాంలో సంస్కరణలు అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని అభివృద్ధి చేశామని, 2014–19లో ఇరగదీశామని ఇంకా పాత కథలు చెప్పుకోవడానికే చంద్రబాబు సహా నేతలంతా ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు పార్టీ నేతలంతా చంద్రబాబును, ఆయన కొడుకు, మంత్రి లోకేశ్ను పొగడటానికే పోటీపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంది నేతలు భూ ప్రపంచంలో చంద్రబాబు, లోకేశ్ అంత గొప్ప వారు ఎవరూ లేరన్న రీతిలో కీర్తించారు.‘మహా’కష్టాలు» నేలకూలిన కటౌట్లు.. పరుగులు తీసిన కార్యకర్తలు» మధ్యాహ్న భోజనాల దగ్గర తోపులాట » పార్టీ శ్రేణులు లేక బోసిపోయిన ప్రాంగణం » నిర్వాహకులపై బాబు సీరియస్ » మీడియాపై లోకేశ్ ఆంక్షలు సాక్షి ప్రతినిధి, కడప/కడప రూరల్: తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేలకొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడటంతో పార్కింగ్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే ఇద్దరు వీఆర్వోలు గాయపడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంత మంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు. ‘ఏమి ఏర్పాట్లో.. ఏమి కమిటీలో.. కనిపిస్తూనే ఉంది’ అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కాగా, మధ్యాహ్నం భోజన సమయానికి మహానాడు ప్రాంగణం సగం ఖాళీ కాగా, సాయంత్రానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు నిర్వాహకులపై సీరియస్ అయినట్లు సమాచారం. చివరగా మాట్లాడిన చంద్రబాబు.. చివరి వరకూ ఉండాలని, దీనిని బుధవారం నుంచైనా పాటించాలని కోరడం గమనార్హం. మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు. లోకేశ్ అక్కడికి రాగానే.. కెమెరాలు ఆఫ్ చేయాలంటూ ఆదేశించారు. ఎవరైనా కెమెరా ఆన్ చేస్తే లాక్కొవాలంటూ పోలీసులకు సూచించారు. ఫొటోలు కూడా తీయనివ్వలేదు. మంత్రి లోకేశ్ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్చాట్ నిర్వహించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ అధికారులకు డ్యూటీలు వేశారు. జిల్లా సర్వోన్నతాధికారి డ్యూటీ పాస్లు ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు ఎల్లో ట్యాగు తగలించుకొని కనిపించారు. కాగా, మహానాడుకు ముందే కరోనా పాజిటివ్ కేసులు రిమ్స్లో నమోదు అయితే, అబ్బే అలాంటిదేమీ లేదని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు.

ఆ ఒక్క నగరంలో 10 లక్షల మంది టెకీలు..
భారత సిలికాన్ వేలీగా పేరొందిన బెంగళూరులో టెకీ సిబ్బంది సంఖ్య 10 లక్షల మార్కును దాటింది. తద్వారా అంతర్జాతీయంగా 12 టెక్నాలజీ హబ్లలో ఒకటిగా నిలిచింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసిన గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్బుక్ 2025’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిపుణుల లభ్యత, నాణ్యత, వ్యయాల ప్రాతిపదికన 115 మార్కెట్లను మదింపు చేసి మూడు కేటగిరీలుగా వర్గీకరించారు.అత్యధిక స్థాయిలో నిపుణుల లభ్యత, తీవ్రమైన పోటీ ఉన్న మార్కెట్లను పవర్హౌస్లుగా, ప్రతిభావంతుల లభ్యత నిలకడగా ఉండే మార్కెట్లను ఎస్టాబ్లిష్డ్ మార్కెట్లుగా, సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ వృద్ధి చెందుతున్న మార్కెట్లను వర్ధమాన మార్కెట్లుగా వర్గీకరించారు. 12 టెక్ పవర్హౌస్లలో బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్, ప్యారిస్ తదితర నగరాల సరసన బెంగళూరు కూడా నిల్చింది.ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బీజింగ్, షాంఘైతో పాటు బెంగళూరులో అత్యధికంగా టెక్నాలజీ నిపుణులు ఉన్నారని, టెక్ సిబ్బంది సంఖ్య 10 లక్షల పైగా ఉందని నివేదిక పేర్కొంది. గ్లోబల్ టెక్ పవర్హౌస్గా బెంగళూరు ఎదగడమనేది భారత్లో డిజిటల్ ఆవిష్కరణలు, కృత్రిమ మేథకు సంబంధించి లోతైన పరిజ్ఞానాన్ని తెలియజేస్తోందని వివరించింది.ఇదీ చదవండి: అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితంఉద్యోగం చేసే వయస్సు గల జనాభాపరంగా 12 భారీ మార్కెట్లలో బెంగళూరు నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 28 యూనికార్న్లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్లు), సానుకూల నిబంధనలు మొదలైనవి నగరానికి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. 2024లో 3.3 బిలియన్ డాలర్లు విలువ చేసే 140 వెంచర్ క్యాపిటలిస్ట్ డీల్స్కి బెంగళూరు కేంద్రంగా నిల్చింది. వీటిలో 34 డీల్స్ కృత్రిమ మేథకు సంబంధించినవి ఉన్నాయి.

ఒకే ఇంట్లో షెహన్షా, బాద్షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్గా షారుక్ ఖాన్
ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్స్టార్ 'షారుక్ ఖాన్'ను కందేరే ప్రీమియం లైఫ్స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్కు, మరోవైపు ఆధునికత, డిజైన్పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్కు షారుక్ ఖాన్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్గా 75కి పైగా రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్షా (బచ్చన్) మరియు బాద్షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

జితేశ్ జితాదియా
లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్... మయాంక్తో కలిసి చేసిన బ్యాటింగ్ మ్యాజిక్ మ్యాచ్నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సీజన్లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్ మార్ష్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిట్జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్ పంత్ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్ ప్రతాపం మొదలైంది. పవర్ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్ ధనాధన్ షోతో ఓవర్కు సగటున పది పరుగుల రన్రేట్ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్ కూడా ఫోర్, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్ పటిదార్ (14) ఫోర్, సిక్సర్ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్స్టోన్ (0)ను అవుట్ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగిపోవడంతో రన్రేట్ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్ మిడాఫ్లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్కు మయాంక్, జితేశ్లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 67; బ్రిట్జ్కీ (బి) తుషార 14; పంత్ నాటౌట్ 118; పూరన్ (సి) యశ్ దయాళ్ (బి) షెఫర్డ్ 13; సమద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్: తుషార 4–0–26–1, కృనాల్ పాండ్యా 2–0–14–0, యశ్ దయాళ్ 3–0–44–0, భువనేశ్వర్ 4–0–46–1, సుయశ్ 3–0–39–0, షెఫర్డ్ 4–0–51–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) దిగ్వేశ్ (బి) ఆకాశ్ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్ఖాన్ 54; పటిదార్ (సి) సమద్ (బి) రూర్కే 14; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్: ఆకాశ్ 4–0–40–1, విల్ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్ రాఠి 4–0–36–0, షాబాజ్ 3–0–39–0, అవేశ్ఖాన్ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’క్వాలిఫయర్–1 (మే 29)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్ (మే 30)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
ఇది గ్రహణమే!
ప్రాథమిక హక్కుల రక్షణ కోర్టు బాధ్యత
ఎవరెస్ట్ మాన్ కొత్త రికార్డు
బంగ్లాలో నిరసనల హోరు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
ధాన్యం రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంచాలి
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్బుక్ కర్కశత్వం
‘సింగరేణి జాగృతి’
జూన్ 2న యువ వికాసం మంజూరు పత్రాలు
ఎందుకీ సాగదీత?
రేవ్ పార్టీ.. 20 మంది అమ్మాయిలు అరెస్టు..!
భారత్తో మనుగడకే ప్రమాదం
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
వద్దుసార్! ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తోనే ఊపిరాడటం లేదు!
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
మీ పనే బాగుంది సార్! ముందు యుద్ధాలకు ఉసిగొల్పి.. తర్వాత కాల్పుల విరమణ అని భలే బిల్డప్ ఇస్తున్నారు!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
కొత్త రేషన్ కార్డులకు మోక్షం
సాక్షి కార్టూన్ 27-05-2025
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ప్రియుడు మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు..
ఇది గ్రహణమే!
ప్రాథమిక హక్కుల రక్షణ కోర్టు బాధ్యత
ఎవరెస్ట్ మాన్ కొత్త రికార్డు
బంగ్లాలో నిరసనల హోరు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
ధాన్యం రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంచాలి
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్బుక్ కర్కశత్వం
‘సింగరేణి జాగృతి’
జూన్ 2న యువ వికాసం మంజూరు పత్రాలు
ఎందుకీ సాగదీత?
రేవ్ పార్టీ.. 20 మంది అమ్మాయిలు అరెస్టు..!
భారత్తో మనుగడకే ప్రమాదం
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
వద్దుసార్! ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తోనే ఊపిరాడటం లేదు!
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
మీ పనే బాగుంది సార్! ముందు యుద్ధాలకు ఉసిగొల్పి.. తర్వాత కాల్పుల విరమణ అని భలే బిల్డప్ ఇస్తున్నారు!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
కొత్త రేషన్ కార్డులకు మోక్షం
సాక్షి కార్టూన్ 27-05-2025
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ప్రియుడు మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు..
అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?
సినిమా

మరో వివాదంలో గుడ్ బ్యాడ్ అగ్లీ.. లీగల్ యాక్షన్ తీసుకుంటానన్న స్టార్ హీరో తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా ఈ మూవీపై మరో వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో మూడు పాటలను ఉపయోగించడంపై నటుడు ధనుశ్ తండ్రి, చిత్రనిర్మాత కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన చిత్రాల్లోని మూడు పాటలు - పంజు మిట్థై, ఓథా రూబా థారెన్, తూటువలై ఇలై అరాచి లాంటి పాటలు వినియోగించారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారని ఆయన విమర్శించారు.కస్తూరి రాజా మాట్లాడుతూ.. 'ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్య తీసుకుంటా' అని తెలిపారు.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్)ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్..కాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓథా రూబా థారెన్ పాటను ఉపయోగించారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా తన మూడు పాటలను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపారు. రూ. కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కోరారు. మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించినప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. మేము సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతి తీసుకున్నామని తెలిపారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలా వరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు.

స్టేజీపై రచ్చ చేసిన తమన్నా.. పూల్లో అనసూయ
స్టేజీ ఫెర్ఫార్మెన్స్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన తమన్నాశ్రీలంకలో స్విమ్మింగ్ పూల్లో అనసూయ ఎంజాయ్చీరలో ముద్దబంతి పువ్వులా ఆషికా రంగనాథ్కలర్ కలర్ డ్రస్సులో శ్రీలీల.. తోడుగా ఫన్నీ కొటేషన్బెండ్ అయిన పోజుల్లో అదితీ రావ్ హైదరీమరింత గ్లామరస్గా మారిపోతున్న ఛార్మీపడుకుని మత్తెక్కించే పోజులిచ్చిన శివాత్మిక View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటిస్తోన్న తాజా చిత్రం మార్గన్. కోలీవుడ్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన లియో జాన్ పాల్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మర్టర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెరపై ఒక్కసారి కనిపించకున్నా...లేడీ సూపర్ స్టారే...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సీతార ఘట్టమనేని(Sitara Ghattamaneni) పేరు ఇప్పుడు ప్రకటనల ప్రపంచంలో మార్మోగుతోంది. అయితే ఓ అగ్రనటుడి కుమార్తెగానో లేక బాల నటిగానో కాదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన యాడ్ ఫేస్గా ఆమె సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసడర్గా, యాడ్ మోడల్గా ఆమె చూపిస్తున్న టాలెంట్కు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఆమె వయస్సు కేవలం 11 ఏళ్లు మాత్రమే అయినా, చూపే ప్రొఫెషనలిజం, కెమెరా ముందు చూపుతున్న కాన్ఫిడెన్స్ చూసి యాడ్ రూపకర్తలు ఆమెవైపు అమితంగా ఆకర్షితులవుతున్నారు.సీతార కెమెరా ముందు మొదటిసారి కనిపించింది ఓ ఫ్యామిలీ యాడ్లో. అందులో తన తల్లి నమ్రత శిరోద్కర్, తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రచారంలో కనిపించింది. ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, బ్రాండ్కు పెద్దగా ప్రాచుర్యం వచ్చింది.అప్పటి నుంచి సీతారకు యాడ్స్ ఆఫర్లు వెల్లువెత్తడం ప్రారంభమైంది. అనుకోకుండా చేసిన యాడ్తో వచ్చిన పాప్యులారిటీతో ఇతర బ్రాండ్లు కూడా ఆమెను సంప్రదించాయి. ఆ తర్వాత ఆమె ‘బేబీ స్కిన్ కేర్‘, ‘ఎడ్యుకేషన్ ప్యాకేజింగ్‘, ‘ఫ్యాషన్‘ వంటి విభాగాల్లో చేసిన యాడ్స్ లక్షల సంఖ్యలో వ్యూస్ ఆదరణ సాధించాయి. పిఎంజె జ్యూయల్స్, ఒట్లో క్లోతింగ్, టాటా సంపన్న్ జూనియర్ ఫుడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మామిఎర్త్, జీ తెలుగు ఫ్యామిలీ ప్రోమో, ట్రెండ్స్... ఇలా అనేక టాప్ బ్రాండ్స్లో ఆమె కనిపిస్తోంది. వీటిలో తన డాడీ మహేష్తో కలిసి చేసిన ట్రెండ్స్ సంస్థ యాడ్ నిజంగా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.యాడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, సీతార ఒక్కో యాడ్ కు రూ. 15 – 25 లక్షల వరకు పారితోషికం( Remuneration) అందుకుంటోంది. వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్ల పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఆదాయం ప్రత్యేకంగా ఆమె పేరిట ఓ ట్రస్ట్ ఖాతాలో వేస్తున్నామని, ఈ మొత్తం భవిష్యత్తులో ఆమె విద్య, క్రియేటివ్ అభిరుచుల విస్త్రుతికి ఉపయోగించనున్నట్లు సమాచారం.కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ కావడంతో పాటు అమాయకత్వంతో కూడిన గ్లామర్ సితారకు ప్లస్ అవుతోంది. అలాగే తండ్రి, తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అభినయ ప్రతిభ కూడా ఆమెకు మరో బలం. ముఖ్యంగా తల్లి నమ్రత శిరోద్కర్ గతంలో మిస్ ఇండియా గా ఉన్నందున, ఫ్యాషన్, కెమెరా నైపుణ్యాల్లో తల్లి గైడెన్స్ ఆమెకు బాగా ఉపయోగపడుతోంది.ఇంతింతై..సితార స్టారై...ఇప్పటికే సితార పేరుతో ఇంటర్నెట్లో ప్రత్యేక ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఆమె ఏ వీడియో వదిలినా మిలియన్ల వ్యూస్ వస్తాయి. ప్రస్తుతం తను పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది, అయితే యాడ్ ఫిల్మ్స్ను పేషన్గా తీసుకుంటోందో లేక రేపటి బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రిహార్సల్గా తీసుకుంటుందో గానీ... తెరపై నైపుణ్యం పెరిగే కొద్దీ, ఆమె పెద్ద తెరపై నటిగా అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెను ‘చైల్డ్ లీడ్ రోల్‘లో తీసుకోవాలని కొందరు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.చిన్న వయసులో పెద్ద నెపథ్యంతో తెరపైకి వచ్చినా, ఆమె చూపిస్తున్న ప్రతిభ మాత్రం పూర్తిగా ఒరిజినల్. ఇదే విధంగా తండ్రి స్టార్ పవర్, తల్లి గైడెన్స్, తన స్వంత ప్రతిభ మేళవిస్తూ సితార కొనసాగితే ఆమె చరిత్ర సృష్టించకుండా అసాధ్యం అనే చెప్పాలి. ఇప్పుడు యాడ్ ప్రపంచంలో చైల్డ్ ఐకాన్ గా ఆమె సృష్టిస్తున్న సందడి చూస్తుంటే, అప్పుడే ఏమైంది? ‘‘ఇంకా చాలా ఉంది చూడడానికి!’’ అనిపించడం మాత్రం ఖాయం.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

జితేశ్ జితాదియా
లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్... మయాంక్తో కలిసి చేసిన బ్యాటింగ్ మ్యాజిక్ మ్యాచ్నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సీజన్లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్ మార్ష్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిట్జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్ పంత్ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్ ప్రతాపం మొదలైంది. పవర్ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్ ధనాధన్ షోతో ఓవర్కు సగటున పది పరుగుల రన్రేట్ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్ కూడా ఫోర్, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్ పటిదార్ (14) ఫోర్, సిక్సర్ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్స్టోన్ (0)ను అవుట్ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగిపోవడంతో రన్రేట్ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్ మిడాఫ్లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్కు మయాంక్, జితేశ్లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 67; బ్రిట్జ్కీ (బి) తుషార 14; పంత్ నాటౌట్ 118; పూరన్ (సి) యశ్ దయాళ్ (బి) షెఫర్డ్ 13; సమద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్: తుషార 4–0–26–1, కృనాల్ పాండ్యా 2–0–14–0, యశ్ దయాళ్ 3–0–44–0, భువనేశ్వర్ 4–0–46–1, సుయశ్ 3–0–39–0, షెఫర్డ్ 4–0–51–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) దిగ్వేశ్ (బి) ఆకాశ్ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్ఖాన్ 54; పటిదార్ (సి) సమద్ (బి) రూర్కే 14; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్: ఆకాశ్ 4–0–40–1, విల్ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్ రాఠి 4–0–36–0, షాబాజ్ 3–0–39–0, అవేశ్ఖాన్ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’క్వాలిఫయర్–1 (మే 29)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్ (మే 30)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడిన జితేశ్.. ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 2, ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్కు చేరింది.మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి.

IPL 2025, LSG VS RCB: విధ్వంసకర శతకం.. పల్టీ కొట్టిన పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొన్న పంత్ ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో పంత్కు ఇది రెండో సెంచరీ. సెంచరీ పూర్తి చేసిన అనంతరం పంత్ ఆనందంతో పల్టీ కొట్టాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోలు సోషల్మీడియాలో వైరవలవుతున్నాయి.Coldest IPL hundred celebration 🥶pic.twitter.com/WDHHIvLVv6— CricTracker (@Cricketracker) May 27, 2025ఎట్టకేలకు పంత్ తనపై పెట్టిన పెట్టుబడికి (రూ. 27 కోట్లు) న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఈ సీజన్లో పంత్ చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్కు ముందు 12 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ చాలా మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో పంత్ సెంచరీతో సత్తా చాటాడు.ఇటీవలికాలంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. ఐపీఎల్లో పంత్ చివరిగా 2018 సీజన్లో సెంచరీ చేశాడు. నాడు సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నేటికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా చలామణి అవుతుంది. తాజా శతకంతో పంత్ తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు.ఆర్సీబీతో మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం గుజరాత్, ఆర్సీబీ పోటీలో ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.

LSG VS RCB: అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ మార్ష్
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర ఆటగాడు మిచెల్ మార్ష్ టీ20ల్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 115వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 201 మ్యాచ్లు ఆడిన మార్ష్ 136 స్ట్రయిక్రేట్తో 2 సెంచరీలు, 31 అర్ద సెంచరీల సాయంతో 5000 పరుగుల మార్కును దాటాడు.ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్లో మార్ష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మార్ష్ 12 ఓవర్ల అనంతరం 45 పరుగులతో అజేయంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచి అదిరిపోయే ఫామ్లో ఉన్న మార్ష్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్ల్లో సెంచరీ, 5 అర్ద సెంచరీల సాయంతో 607 పరుగులు చేసి పరుగుల వేటను కొనసాగిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కష్టాలు కొని తెచ్చుకుంది. లక్నో ఆదిలోనే బ్రీట్జ్కీ (14) వికెట్ కోల్పోయినప్పటికీ.. రిషబ్ పంత్ (59), మిచెల్ మార్ష్ (47) విధ్వంసం సృష్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 131/1గా ఉంది.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నా ఎందుకో ఈ జట్టు విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం పోటీలో గుజరాత్, ఆర్సీబీ ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
బిజినెస్

రూ.5.5 లక్షల నుంచి.. ఏడాదికే రూ.45 లక్షలు: టెకీ ట్వీట్
సాధారణంగా ఉద్యోగంలో చేరితే.. ప్రతిఏటా 10 శాతం లేదా 20 శాతం శాలరీ హైక్ ఉంటుంది. కొన్ని కంపెనీలలో హైక్ అనేమాట చాలా అరుదుగా వినిపిస్తుంది. కానీ ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక ఏడాదిలోనే కనీవినీ ఎరుగని ఆఫర్ పొందినట్లు. తన జీతం కూడా దాదాపు 10 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ క్కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీకి చెందిన ఒక యువ సాఫ్ట్వేర్ డెవలపర్ తన కెరీర్ ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే తన జీతం.. రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు చేరిందని పేర్కొన్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేష్ అనే టెక్నీషియన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తాను ఐబీఎంలో రూ. 5.5 లక్షల సీటీసీకి ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ. 45 లక్షల ఆఫర్ ఉందని చెప్పాడు. నాలాంటి మధ్యతరగతి వ్యక్తికి, ఇది ఇప్పటికీ ఒక కల అని చెప్పుకొచ్చాడు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కొందరు అతన్ని ప్రశంసించారు, మరొకొందరు తమ అనుమానాలను వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఏఐ పరిస్థితి ఇంతే!.. ఉద్యోగులకు భయమేలకెరీర్ ప్రారంభంలో జీతం కంటే నైపుణ్యాలపై ద్రుష్టి పెట్టాలి. అలాంటప్పుడే మీకు మంచి ప్యాకేజీ లభిస్తుంది. ప్రారంభంలో తక్కువ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరినా దిగులు పడొద్దు, ఎందుకంటే మీ నైపుణ్యాలను పెంచుకుంటూ పోతే తప్పకుండా మంచి ఆఫర్స్ వస్తాయని టెకీ పేర్కొన్నాడు.Never mentioned it but tbh, I still sometimes think I am still in a dream, bcoz I started my full time career last year at IBM with just a CTC of 5.5 LPA, and now having an offer of over 45 LPA CTC in hand within an year, for a middle class guy like me, it's still a dream❤️.— Devesh (@theywayshhh) May 26, 2025

5జీ వైఫై సేవల కోసం జియో
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రంతో వైఫై సేవలు అందించడంపై రిలయన్స్ జియో కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 26 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ టెలికం శాఖలో సాంకేతిక విభాగమైన టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్కి (టీఈసీ) కంపెనీ విజ్ఞప్తి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.2022 స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం 5జీ కోసం కేటాయించిన స్పెక్ట్రంను వేరే టెక్నాలజీ కోసం ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2022లో నిర్వహించిన స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. రూ. 88,078 కోట్ల బిడ్లతో జియో ఇందులో దాదాపు సగం స్పెక్ట్రంను దక్కించుకుంది.

అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితం
కృషి, పట్టుదలతో సాధించిన విజయాలు ఎందరికో మార్గదర్శకం అవుతాయి. మరికొన్ని సంఘటనలు ఊహకందని మలుపులు తిరుగుతూ అదఃపాతాళానికి తొక్కేస్తాయి. కారణం ఏదైనా.. కర్త మాత్రం ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో చూసేద్దాం.ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి 'సుబ్రమణియన్' ఒక ప్రతిభావంతులైన ఇంజనీర్.. బ్యాంకర్ కూడా. జీరోతో మొదలై వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈయన కారాగారంలో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని స్థాపించిన ఈయన.. లాభాలను గడించారు.రూ. 137 కోట్ల పెట్టుబడిసుబ్రమణియన్ ప్రారంభించిన విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థ.. ప్రైమ్ ఇన్వెస్ట్, అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీ బాండ్, లిక్విడ్ ప్లస్, సేఫ్టీ ప్లస్ వంటి పథకాలను ప్రసిద్ధి చెందింది. ఈ పథకాలన్నీ ఇతర బ్యాంక్ డిపాజిట్లు లేదా పెట్టుబడి ఎంపికల కంటే గణనీయంగా అధిక రాబడికి హామీ ఇచ్చాయి. వీటన్నింటికీ ఆకర్షితులైన.. సుమారు 587 మంది పెట్టుబడిదారులు ఏకంగా రూ. 137 కోట్ల పెట్టుబడిగా పెట్టారు. ఇందులో ఎక్కువగా మధ్యతరగతి వ్యక్తులు, చిన్న వ్యాపార యజమానులు, పదవీ విరమణ చేసినవారే ఉన్నారు.సుభిక్షకు మద్దతువిశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించిన తరువాత 1997లో 'సుభిక్ష' అనే రిటైల్ సంస్థను సుబ్రమణియన్ స్టార్ట్ చేశారు. ఇది భారతదేశంలో ఏకంగా 1600 కంటే ఎక్కువ అవుట్లెట్లకు విస్తరించింది. కంపెనీ విలువ రూ. 3,500 కోట్లకు చేరుకుంది. అజీమ్ ప్రేమ్జీ, ఐసిఐసిఐ వెంచర్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి హై-ప్రొఫైల్ పెట్టుబడిదారులు కూడా సుభిక్షకు మద్దతు ఇచ్చారు.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిఅన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకుంటున్న సమయంలో.. పెట్టుబడిదారుల నిధులను సుబ్రమణియన్ షెల్ కంపెనీలకు మళ్లించారు. ఇదే ఈయన జీవితాన్ని మలుపుతిప్పి కష్టాల సుడిగుండంలోకి తీసుకెళ్లింది. 2008లో సుబ్రమణియన్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నారు. దీంతో పెట్టుబడిదారులకు కూడా రిటర్న్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. 2009లో సుభిక్ష క్లోజ్ అయింది. దీంతో సుబ్రమణియన్ విశ్వసనీయత కుప్పకూలింది.20 సంవత్సరాల జైలు శిక్ష10 సంవత్సరాలుగా స్వచ్ఛంద డిపాజిట్లు చేయడంలో విఫలమయ్యారని, అన్ని కార్యక్రమాలలో డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.137 కోట్లకు పైగా చెల్లింపులు చేయలేకపోయారని తెలిసింది. దీంతో నవంబర్ 2023లో, తమిళనాడులోని చెన్నైలోని ఒక ప్రత్యేక కోర్టు వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసినందుకు 'సుబ్రమణియన్'ను దోషిగా నిర్ధారించి.. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

స్టీల్ హింజ్స్ ఫ్యాక్టరీపై బీఐఎస్ రైడ్
హైదరాబాద్: నకిలీ ఐఎస్ఐ ముద్రలతో ఉత్పత్తులు తయారు చేస్తున్న ఓ పరిశ్రమపై భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS), హైదరాబాద్ శాఖా కార్యాలయ అధికారులు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఓ పరిశ్రమలో నకిలీ ఐఎస్ఐ ముద్రలతో ఇంటి తలుపులకు వాడే స్టీల్ హింజ్స్ను తయారుచేస్తూ, మార్కెట్కు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఉత్పత్తులతో పాటు నకిలీ ఐఎస్ఐ ముద్రించిన ప్యాకేజింగ్ లేబుల్ అట్టలనూ సీజ్ చేసినట్లూ బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ తెలిపారు.IS 1341:2018 ప్రమాణానికి లోబడి స్టీల్ బట్ హింజ్స్ను తయారు చేయాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఈ ఉత్పత్తికి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ గెజిట్ ద్వారా బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. దీన్ని తయారు చేసేందుకు కచ్చితంగా బీఐఎస్ నుంచి ధ్రువీకరణ పొందడంతో పాటు మార్కెట్లో నిల్వ చేయాలన్నా, విక్రయించాలన్నా దానిపై ఐఎస్ఐ ముద్రతో పాటు తయారీదారు లైసెన్సు వివరాలు ముద్రించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే ఐఎస్ఐ మార్కును అనధికారికంగా వినియోగిస్తున్నట్లు బీఐఎస్ అధికారులు గుర్తించారు. బీఐఎస్ డైరెక్టర్ తమ్మాడి సుజాత, జాయింట్ డైరెక్టర్ తన్నీరు రాకేశ్ నేతృత్వంలోని బృందం దాడుల్లో పాల్గొంది.బీఐఎస్ చట్టం 2016 ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని పీవీ శ్రీకాంత్ తెలిపారు. తప్పనిసరి జాబితాలో ఉన్న ఏ ఉత్పత్తిని అయినా బీఐఎస్ ధ్రువీకరణ లేకుండా తయారుచేసినా, నిల్వ చేసినా, విక్రయించినా చర్యలుంటాయన్నారు. దీనికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల దాకా జరిమానాతో పాటు ఏడాది నుంచి 5ఏళ్ల దాకా జైలు శిక్షా పడే అవకాశముందన్నారు.వినియోగదారులు కొనే ప్రతీ వస్తువునూ బీఐఎస్ కేర్ యాప్లో నాణ్యత పరీక్షించుకొని కొనాలని.. నకిలీ నాణ్యతా చిహ్నాల పట్లా ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రతీ ఐఎస్ఐ మార్కు పైన ఆ వస్తువు యొక్క ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) నెంబరు, కింద ఆ తయారీదారు లైసెన్సు నెంబరు కచ్చితంగా ఉండాలన్నారు. ఆ లైసెన్సు నెంబరును బీఐఎస్ కేర్ యాప్లో నమోదు చేసి వస్తువు యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. బంగారు ఆభరణాలకైతే హెచ్యూఐడీ తప్పనిసరి ఉండాలని.. దాని ద్వారా ఆ ఆభరణం శుద్ధతనూ ఇదే యాప్లో తెలుసుకోవచ్చన్నారు. ఇదే ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షించేందుకూ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బీఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఉల్లంఘనలు మీ దృష్టికి వచ్చినా బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఇతర వివరాలకు హైదరాబాద్ శాఖా కార్యాలయాన్ని +91 9154843230/31 నెంబర్లను సంప్రదించాలన్నారు.
ఫ్యామిలీ

అకాల వర్షాలు.. కొండెక్కిన ధరలు.. ఇలాగే ఉంటే...!
దాదర్: గత వారం, పదిరోజులుగా రాష్టవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల వివిధ రకాల పంటలతోపాటు కూరగాయల తోటలకు అపార నష్టం వాటిల్లింది. వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూరగాయల తోటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల ట్రక్కులు, టెంపోలలో రవాణాకు సిద్ధంగా ఉంచిన కూరగాయలు కుళ్లిపోవడంతో అక్కడే రోడ్లపై పారేయాల్సిన పరిస్ధితి వచి్చంది. ఫలితంగా న్యూ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ), అలాగే థానేలోని హోల్సేల్ మార్కెట్లలో కూరగాయల లోడుతో వచ్చే వాహనాల సంఖ్య తగ్గిపోయింది. సరుకు కొరత ఏర్పడడంతో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు అకాల వర్షాల వల్ల చుక్కలను తాకుతున్నాయి. అసలే వర్షాలు, ఆపై కూరగాయల కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. 18 ఏళ్ల తరువాత మళ్లీ... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత వారం, పదిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు కొంత ముందుగానే ఆరంభమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ 20 రోజుల ముందుగానే ఊహించని వర్షాలతో సామాన్య జనాలతో పాటు రైతులు కూడా ఆందోళనకు గురయ్యారు. గత 18 ఏళ్ల కిందట మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు రికార్డు బ్రేక్ చేశాయని కొలాబా, శాంటాకృజ్ వాతావరణ శాఖలు తెలిపాయి. చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!ఇలాగే ఉంటే...మరింత పైపైకి... కొద్ది నెలలుగా స్ధిరంగా కూరగాయలు, ఉల్లి, బంగాళదుంపలు, టమాటాలు, ఆకు కూరల ధరలు కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటుండటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నారు. కొరత కారణంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు ఇప్పటికే 10–20 శాతం పెరిగాయి.రాష్ట్రంలోని అనేక జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో సరుకులు కుళ్లీపోకే ముందే అక్కడే ఖాళీ చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయించి కనీసం పెట్టుబడి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రేట్లు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు

Kannaram 120 ఏళ్ల కన్నారం.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
విద్యానగర్(కరీంనగర్): నాటి అలిపిరాల నుంచి నేటి కరీంనగర్ వరకు శాతవాహనుల నుంచి కాకతీయల వరకు ఎందరో ఏలిన గడ్డ ఇది. ఎలగందుల కేంద్రంగా నిజాంల పాలన, ఉగ్గుపాలతో ఉద్యమాలను రంగరించిన వీరమాతలు, ఉరకలేత్తే చైతన్య సమరయోధుల గర్జన, చాళక్యుల కాలం నుంచి జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేకస్థానాన్ని నిలుపుకుంది. ఎలగందల్ జిల్లా అవల్ తాలుకుదార్ గోవింద్ నాయక్ కరీంనగర్లో 1918లో క్లాక్ టవర్ నిర్మించారు. 1935లో నిజాంపాలన రజతోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న నిజాం ప్రభువులకు స్వాగతం పలికేందుకు షేక్ఖాన్ స్వాగత ద్వారంగా కమాన్ నిర్మించారు. చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!1905కు ముందే పోలీస్స్టేషన్ ఏర్పాటు కాగా.. ప్రస్తుతం కరీంనగర్ రూరల్స్టేషన్గా కొనసాగుతోంది. 1920లో మానేరు నదిపై రాతి వంతెన నిర్మాణం జరిగింది. 1958లో ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. 1956లో వేంకటేశ్వర ఆలయం దగ్గర తొలివాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. 1956లో ప్రస్తుత మల్టీఫ్లెక్స్స్థానంలో పాతబస్స్టేషన్ ఉండేది. 1960 తర్వాత గాంధీ సెంటీనరీ మ్యూజియం, 1956 ఎస్సారార్, 1969లో సైన్సివింగ్ కాలేజీ, 1967లో జిల్లా ప్రధానాస్పత్రి, జిల్లా కోర్టు భవనాలు, 1973లో మహిళా డిగ్రీ కళాశాల, 1980లో కలెక్టరేట్, అంబేద్కర్ స్టేడియం, 1980లో ప్రస్తుత బస్టాండ్ నిర్మించారు. 1980 తర్వాత పురపాలక సంఘ భవనం, కళాభారతి నిర్మించారు. 1982లో ఎల్ఎండీ నిర్మాణం పూర్తయింది. 1994లో మానేరునదిపై కొత్త వంతెన నిర్మించారు. 2001లో ఉజ్వల పార్కు, 2004లో జింకల పార్కు నిర్మించారు.ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులుపాత నగర స్వరూపంపాత పట్టణ ప్రాంతాలైన పాత జిర్రాబాయి పరిసరాలు, పాత బజార్, అహ్మద్పురా, బంజరుదొడ్డి, ఫతేపూరా, కుమ్మరి కాపువాడలు, మేదరివాడ, షా సాహెబ్ మొçహీల్లా, పద్మశాలి, బ్రహ్మణ వీధులు, బోయ, దోభీవాడ, సిక్కువాడ, ప్రకాశం గంజ్, పెద్ద గడియారం, అస్లాం మజీద్ రోడ్, జాఫ్రీరోడ్, తిలక్రోడ్ వాడలున్నాయి. ప్రస్తుత ఆంధ్రా బ్యాంక్ ప్రాంతం అజ్మత్పురా, గుర్రాలపై స్వారీ చేస్తూ విధులు నిర్వహించిన పోలీస్ జమేదార్లు నివసించే ప్రాంతం సవరన్ మొహాల్లాగా ఏర్పడింది. డాక్ బంగ్లా వెనుక ప్రాంతం ముకరంపురగా, మిషన్ హాస్పిటల్ ఎదుట క్రిస్టియన్కాలనీ, దాని వెనక కురుమవీధి ఏర్పడ్డాయి.మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు..1952లో 45వేల జనాభాతో కరీంనగర్ మూడోగ్రేడ్తో 24 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడింది. తొలి మున్సిపల్ చైర్మన్గా ఖాజాబషీరుదీ్దన్ ఉండగా ఆయన హయాంలోనే గ్రేడ్–2 మున్సిపాలిటీగా మారింది. 1981–85 పాలకవర్గం కాలంలో గ్రేడ్–1, 1987లో కరీంనగర్ పరిధిలోని రాంపూర్, రాంనగర్ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిశాయి. 2005లో నగరపాలక సంస్థంగా అవతరించి, 66 డివిజన్లతో కొనసాగుతోంది. మొదటి మేయర్గా దేశివేని శంకర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రత్యేక పాలన సాగుతోంది. కరీంనగర్ ప్రస్తుతం అభివృద్ధి పథకంలో కొనసాగుతోంది. స్మార్ట్ సిటీగా నయాలుక్ సంతరించుకుంటోంది. శాతవాహన యునివర్సిటీ, రైల్వేస్టేషన్, కేబుల్బ్రిడ్జి, ఐటీ టవర్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఏర్పడ్డాయి.

సీఈవోగా గృహిణి..! ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో..
మధ్యతరగతిలో పెరిగిన ఆమె పార్ట్ టైం జాబ్లు చేసి మరీ అమెరికా చదువుని పూర్తి చేసింది. చిన్నా.. చితక స్టోర్ల నుంచి ఆభరణాల స్టోర్ వరకు ప్రతిదాంట్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ..తన కాబోయే భర్తను కలుసుకుంది. అతడు కూడా ఆమెలానే రెస్టారెంట్ అంతస్తులు శుభ్రం చేసే హౌస్ కీపింగ్ స్థాయి నుంచి ఓ కంపెనీని స్థాపించే రేంజ్కి ఎదిగిన వ్యక్తి. ఇద్దరి కష్టపడేతత్వం, అభిరుచులు ఒక్కటై..స్నేహితులుగా, ఆ తర్వాత జంటగా మారారు. అలా ఇరువురు మంచి వ్యాపారవేత్తలుగా మారినా..గృహిణిగా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడక తన కాళ్లపై తాను నిలబడేందుకే మక్కువ చూపించింది. అలా ఆమె అనతికాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుని..అత్యంత లగ్జరీయస్ భవంతిలో నివాసం ఉండే స్థాయికి చేరుకున్నారామె. ఇప్పటికీ తనకు భర్త సంపాదనపై ఆధారపడి బతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదని చెబుతోంది. మరీ అంతలా సక్సెస్ని అందుకున్న ఆ గృహిణి ఎవరంటే..విలాసాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆ గృహిణే దుబాయ్కి చెందిన అనితా సురానీ. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె, అమెరికాలో చదువుకు కొనసాగించడానికి ఎన్నో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేది. ఒక కన్వీనియన్స్ స్టోర్ నుంచి జ్యువెలరీ స్టోర్ వరకు..ఇలా ప్రతి చిన్న పార్ట్ టైం ఉద్యోగాన్ని వదులుకోకుండా ఆహర్నిశలు కష్టపడి అమెరికా చదువుని విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలో అనిత తన ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన వ్యాపారం చేసే యత్నంలో ఉండగా..తన కాబోయే భర్త వ్యాపార భాగస్వామి మోయిజ్ ఖోజాను కలిసింది. మోయిజ్ కూడా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. అతడు కూడా ఒకప్పుడు రెస్టారెంట్ అంతస్తులను శుభ్రం చేసి, విజయవంతమైన టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. అతనితో కలిసి అనిత టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించింది. వ్యాపారభాగస్వాములుగా ఉన్న ఇద్దరు జీవిత భాగస్వాములయ్యారు. తమ వ్యవస్థాపక ప్రయాణం ఒక అమెరికన్ మాల్లోని ఒక చిన్న సెల్ ఫోన్ కియోస్క్తో ప్రారంభమైందని చెబుతోంది అనిత. అలా అలా విస్తరించి ఇవాళ దాదాపు 100కు పైగా దుకాణాలతో రిటైల్ సామ్రాజ్యంగా విస్తరించిందని తెలిపింది. ఇక మోయిజ్ ఈ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా..అనిత తన ఇంటీరియర్ డిజైన్ పట్ల ఉన్న ఆసక్తితో అటువైపుగా తన వ్యాపారాన్ని నిర్మించాలనుకుంది. అందుకోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక అనుభవజ్ఞుడైన సహోద్యోగితో భాగస్వామ్యం కుదుర్చుకుని..దుబాయ్లో జేనా ఇంటీరియర్స్ను ప్రారంభించింది. చూస్తుండగానే అతి కొద్దికాలంలో అనిత డిజైన్ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. జస్ట్ ఇద్దరు వ్యక్తుల నుంచి ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఇంటీరియర్ డిజైనర్లతో సహా 40 మందికి పైగా ఉద్యోగులకు విస్తరించింది. అయితే తన సక్సెస్కి ప్రేరణ తన కుమార్తె జెనా అని అంటోంది. జీవితాన్ని సమతుల్యం చేసుకునేలా ఎలా మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలో తన కూతురు చూపించాలనేదే తన ధ్యేయమని, అందుకోసమే ఓటమిని దరిదాపుల్లోకి రాకుండా కష్టపడతానని చెబుతోంది. అందుకోసమే తన కంపెనీకి కూడా తన కూతుర జెనా పేరుని పెట్టానని చెబుతున్నారామె. అనితా జెనా బోటిక్ కంపనీని కూడా నిర్వహిస్తోంది. ఇందులో అంతా మహిళా ఉద్యోగులే పనిచేస్తారని చెబుతోంది. లగ్జరీ భవంతి..ఆమె దుబాయ్ ఇల్లు అత్యంత లగ్జరీయస్గా..రెండు కళ్లు సరిపోవేమో..! అన్నంత అందంగా ఉంటుందట. ఆమె ఇంటి సీలింగ్ 24-క్యారెట్ల బంగారంతో చేసి ఉంటుందట. ఆమె ఆఫీస్ కూడా అంతే అందంగా లగ్జరీయస్ ఉంటుందట. అయితే అనిత తన వ్యాపారానికి నిధులు సమకూర్చుకోవడానికి కుటుంబ సంపదపై అస్సలు ఆధారపడదట. ఎందుకంటే తన భర్త స్పష్టమైన ఆర్థిక సరిహద్దులను నిర్దేశించారట, అందుకనుగుణంగానే నడుచుకుంటానంటోంది. తన ఆఫీస్ పెట్టుబడిని తిరిగి చెల్లించడమే గాక ఉద్యోగుల జీతాలను కూడా తానే భరిస్తానంటోంది. ఆ ఒత్తిడే ఆమెను మరింత కష్టపడి పనిచేసేలా చేసి, కంపెనీ అభివృద్ధి దోహదపడుతుందని చెబుతోంది. అంతేకాదండోయ్ అనిత డబ్బుని ఆర్చించేలా కష్టపడి పరిచేస్తా..అలాగే సంపాదించినదంతా ఖర్చు పెట్లేందుకు వెనకడుగు వేయను అని తేల్చి చెబుతోంది. పైగా అందులో ఉన్న సంతృప్తే 'వేరేలెవెల్' అని చెబుతోంది అనిత.(చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!)

స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు
నాణ్యమైన విద్య దేశ అభివృద్ధికి బాటలు వేస్తుంది. "పఢేగా ఇండియా తభీ తో బడేగా ఇండియా" అన్నట్టు 136 కోట్లకు పైగా జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశంలో విద్య ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గతంలో అనేకమంది సంఘ సంస్కర్తలు, పాలకులు నాణ్యమైన విద్యకోసం సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యాలయాల కోసం, గ్రామీణభారతంలో విద్యాభివృద్ధికోసం ఎన్నో గుప్త దానాలు చేశారు. తాజాగా రాజస్థాన్లోని శిశోద అనే గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు వార్తల్లో నిలిచారు. గ్రామీణ పిల్లలకు తమ గ్రామంలో ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.రాజస్థాన్ సోదరుల దాతృత్వంరాజస్థాన్కు చెందిన సోదరులు మేఘరాజ్-అజిత్ నగరాలకు పరిమితమైన ఉత్తమ విద్యను తమ గ్రామంలోని విద్యార్థులకు కూడా అందాలని కలగన్నారు. ఈ లక్ష్యంతోనే తమ గ్రామంలోని స్కూలు అభివృద్ధికోసం ఏకంగా 15 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. కంకుబాయి-సోహన్లాల్ ధకాడ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ను అత్యాధునికంగా తయారు చేశారు. ఆధునిక ప్రయోగశాలలు , సకల హంగులతో తరగతి గదులు, భారతదేశంలోని టాప్ ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా తీర్చిదిద్దారు. View this post on Instagram A post shared by startupsmedia (@startups_media)తమ గ్రామంలో పిల్లలకు ‘అందరికీ విద్య హక్కు’ నినాదానికి అనుగుణంగా చక్కటి వాతావరణాన్ని సృష్టించారు. విద్య అనేది కేవలం ధనవంతులకే కాదు.. అందరికీ అని చాటి చెప్పారు. ప్రతి పిల్లవాడు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడని , రాజస్థాన్ను గర్వించదగిన రాష్ట్రంగా మలుస్తున్నారని వీరు నమ్ముతున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవ వేడుకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. పలువురి నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: చెఫ్ల వైట్ క్యాప్ వెనుక రహస్యం? వీటికీ ర్యాంకులుంటాయా?వీరి చొరవ కారణంగా రాజస్థాన్లోని శిషోడా గ్రామంలో ఉన్న కంకుబాయి-సోహన్లాల్ ధకాడ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ఇపుడు ఆధునిక మూడు అంతస్తుల క్యాంపస్లో 40 స్మార్ట్ తరగతి గదులతో అలరారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ టూల్స్తో పాటు, విశాలమైన ఆట స్థలంకూడా ఉంది. ప్రతి తల్లిదండ్రులు విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని మేఘరాజ్, అజిత్ తెలిపారు. తరగతి గదుల వెలుపల కూడా విద్యాబోధన జరిగేలా పుస్తకాలు, పచ్చదనంతో కూడిన చక్కటి లైబ్రరీతో తీర్చిదిద్దామని తెలిపారు.దీనిపై గ్రామస్తులు సంతోషాన్ని వెలిబుచ్చారు. "ఇప్పుడిక మా పిల్లలను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఇలాంటి పాఠశాల గురించి కలలో కూడా ఊహించలేదు." అంటూ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. మేఘరాజ్ - అజిత్ సోదరులు ఈ స్కూల్లోనే చదువుకున్నారు. అందుకే తమకు విద్యను ప్రసాదించిన గ్రామానికి ఏదైనా గొప్పగా ఇవ్వాలని భావించి, స్థానికి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేశారు.
ఫొటోలు
అంతర్జాతీయం

మాక్రాన్కు చెంపదెబ్బ?
పారిస్: వియత్నాం పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఉదంతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. అధికారిక పర్యటన నిమిత్తం భార్య బ్రిగెట్తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హనోయ్ చేరుకున్నారు. తలుపు తెరుచుకుని, విమానం దిగేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బ్రిగెట్ ఒక్కసారిగా మాక్రాన్ ముఖంపై కొడుతున్నట్టుగా కన్పించారు. ఆమె చేతులు మాక్రాన్ ముఖంపై విసురుగా పడుతూ కన్పించాయి. ఆ ధాటికి మాక్రాన్ ఉన్నట్టుండి వెనక్కు ఒంగిపోయారు. దాంతో ఆయన ఒక్కసారిగా కంగుతిన్నా, కెమెరాలన్నీ తనపైనే ఉండటం గమనించి వెంటనే సర్దుకున్నారు. చిరునవ్వుల నడుమ అభివాదసూచకంగా చేతి ఊపుతూ విమానం నిచ్చెనపైకి చేరుకున్నారు. ఆ వెనకే బ్రిగేట్ కూడా వచ్చి మాక్రాన్ పక్కన నుంచున్నారు. కానీ ఆయన చెయ్యందివ్వబోగా పట్టించుకోలేదు. ఇద్దరూ కలి‘విడి’గానే నిచ్చెన దిగి వచ్చారు. మీడియా కెమెరాలకు చిక్కిన ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడమే గాక తీవ్ర దుమారం కూడా రేపింది. పైగా, ఆ వీడియో నకిలీది కావచ్చన్న ఫ్రెంచి ప్రభుత్వ వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. దాంతో ఇక లాభం లేదని అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగారు. అదో సరదా ఘటన తప్ప ఇంకేమీ కాదంటూ మీడియా సాక్షిగా వివరణ ఇచ్చుకున్నారు. ‘‘నేను, మా ఆవిడ జోక్ చేసుకుంటున్న క్రమంలో జరిగిన ఉదంతమది. ఏమీ లేనిదాన్ని అనవసరంగా పెద్దది చేసి చూస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. దానిపై ఎవరికి తోచించి వాళ్లు ప్రచారం చేస్తూ అనవసరంగా కుట్ర సిద్ధాంతాలకు తెర తీస్తున్నారంటూ ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో వాపోయింది. మాక్రాన్ దంపతుల నడుమ విభేదాలు సాగుతున్నాయని, అవి తారస్థాయికి చేరాయనేందుకు ఈ ఉదంతమే తాజా నిదర్శనమని ఫ్రెంచి పత్రికలు ఎడాపెడా రాసేయడమే అందుకు కారణం. ఏక్ చోటీ సీ ప్రేమ్ కహానీ!: మాక్రాన్, బ్రిగేట్ బంధం తొలినుంచీ వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది. మాక్రాన్ కంటే ఆమె దాదాపు పాతికేళ్లు పెద్దది కావడం విశేషం! బ్రిగేట్ 1953 ఏప్రిల్ 13న పుట్టగా మాక్రాన్ జన్మదినం 1977 డిసెంబర్ 21. అంతేకాదు, హైసూ్కలు రోజుల్లో మాక్రాన్కు బ్రిగేట్ టీచర్ కూడా! ఆయనకు ఫ్రెంచ్, లాటిన్ బోధించేవారు. అలా లైసీ లా ప్రావిన్స్లో మాక్రాన్ టీనేజీ బాలునిగా చదువుకునే రోజుల్లోనే, అంటే 1993లో వారి ప్రేమ కథకు బీజం పడింది. అప్పటికి ఆయనకు కేవలం 15 ఏళ్లు. కాగా, బ్రిగేట్కు 39 ఏళ్లు. ఆంద్రె లూయిస్ అనే బ్యాంకర్తో ఆమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. పైగా బ్రిగేట్ పెద్ద కూతురు లారెన్స్ మాక్రాన్కు స్వయానా క్లాస్మేట్ కూడా! అయినా ఇవేవీ వారి ప్రేమకు అడ్డంకి కాలేకపోయాయి. బ్రిగేట్ ఓ నాటక సంఘానికి పర్యవేక్షకురాలిగా కూడా వ్యవహరించేవారు. సాహితీ అభిమాని అయిన మాక్రాన్ అందులో సభ్యునిగా చేరారు. స్కూలు వేళలు అయిపోయాక ఇద్దరూ అక్కడ కలుసుకునేవారు. ఎంత గోప్యంగా ఉంచినా వారి వ్యవహారం మాక్రాన్ ఇంట్లో తెలిసిపోయింది. మాక్రాన్ ప్రేమలో పడ్డట్టు అప్పటికే వాళ్లకు అనుమానంగా ఉండేదట. అయితే, అది బ్రిగేట్ కూతురు కావచ్చని వాళ్లు భావించారట! మాక్రాన్ మహా మేధావి అంటూ ఆ అమ్మాయి వారితో నిత్యం ఎంతో గొప్పగా చెప్పడమే అందుకు కారణం. తీరా చూస్తే తమవాడు ప్రేమలో పడింది పిల్లతో కాదు, తల్లితోనని తెలిసి వారు కంగుతిన్నారు! ఈ అసాధారణ ప్రేమ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలని పై చదువుల పేరిట మాక్రాన్ను ఉన్నపళంగా పారిస్ పంపించేశారు. అలా 17వ ఏట హైసూ్కల్ ఫైనలియర్ కోసం ఆయన పారిస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ దూరం కూడా వారి ప్రేమకు అడ్డం కాలేకపోయింది. పైగా మాక్రాన్ పారిస్ వెళ్లేముందు, ‘నువ్వేం చెప్పినా, ఏం చేసినా నేను మాత్రం ఎప్పటికైనా నిన్నే పెళ్లాడతా’ అని బ్రిగేట్కు కుండబద్దలు కొట్టి మరీ వీడ్కోలు తీసుకున్నారట. తర్వాత ఇద్దరూ తరచూ లేఖలు రాసుకుంటూ, వీలైనప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి ఆమె కూడా పారిస్ చేరుకున్నారు. అలా పుష్కర కాలం పాటు ప్రేమించుకున్నాక బ్రిగేట్ తన భర్తకు విడాకులిచ్చి 2007లో మాక్రాన్ను పెళ్లాడారు. తొలి వివాహం ద్వారా ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు.

‘నా భార్య నన్ను కొట్టలే’.. ఫ్రాన్స్ అధ్యక్షుడు
యూరప్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మొహం మీద ఆయన సతీమణి బ్రిగిట్టే మేక్రాన్ కొట్టారంటూ ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ను బ్రిగిట్టే నిజంగా కొట్టారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?దాదాపూ పదేళ్ల తర్వాత అధ్యక్షుడు మేక్రాన్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయాసియా దేశాల్లో సుదీర్ఘ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో అమెరికా, చైనాకు ఫ్రాన్స్ ప్రత్యామ్నాయమనే సంకేతాలిచ్చేలా డిఫెన్స్, ఎనర్జీ, టెక్నోలజికల్ ఇన్నోవేషన్తో పాటు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.ఈ పర్యటనలో భాగంగా మే 25న వియత్నాం రాజధాని హనోయిలో అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో హనోయి నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ సమయంలో జరిగిన ఓ ఊహించని ఘటన మీడియా కంట పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చకు దారి తీసింది.Bizarre moment Emmanuel Macron is slapped by his wife Brigitte pic.twitter.com/kYsE5MCDV1— The Sun (@TheSun) May 26, 2025 అసలేమైందంటే? మేక్రాన్, బ్రిగిట్టేలు ప్రత్యేక విమానం లోపలి నుంచి బయటకు వచ్చే సమయంలో విమానం డోర్లు తెరుచుకున్నాయి. అయితే, ఆ డోర్ ఓపెన్ అయ్యే సమయంలో బ్రిగిట్టే తన రెండు చేతులతో మేక్రాన్ మొహం మీద కొట్టిన దృశ్యాలు కనిపించాయి. బ్రిగిట్టే చేతులు తన మొహం మీద తగలడంతో వెంటనే తన తలను వెనక్కి జరిపారు. దీంతో మేక్రాన్ను బ్రిగిట్టే కొట్టారంటూ అంతర్జాతీయ మీడియా వీడియోల్ని ప్రసారం చేశాయి.అందుకు ఊతం ఇచ్చేలా ఈ ఘటన తర్వాత తన చేతిని పట్టుకోమని బ్రిగిట్టేకు తన చేతిని అందించబోయాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. తిరస్కరించింది. కోపంగా అక్కడి నుంచి కదిలింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.ఈ ఘటనపై మేక్రాన్ను మీడియా మాట్లాడారు. వైరల్ అవుతున్న వీడియోల్లో నిజం లేదన్నారు. భార్య బ్రిగిట్టే తనను కొట్టలేదని, తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవ పడుతూ ఉంటామని అన్నారు. కానీ, ఆ వీడియోలో కనిపిస్తున్న సీరియస్నెస్ను చూస్తే మాత్రం మేక్రాన్ అబద్దం చెబుతున్నాడనే విషయం స్పష్టమవుతోందటూ అంతర్జాతీయ మీడియా కథనాల్ని వండి వార్చేస్తోంది.

స్నేహ బంధం గెలిచినా.. విషాదం తప్పలేదు
బంధాలన్నీ వేటికవే ప్రత్యేకం. బాల్యం నుంచి మొదలు కడదాకా స్నేహ బంధంలో కలిసి నడిచేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఆ బంధపు మాధుర్యం గురించి చెప్పుకుంటే పోతే బోలెడన్ని కబుర్లు. అయితే ఇక్కడ తమ మిత్రుడి కోసం ఇప్పటిదాకా ఎవరూ చేయని ప్రయత్నం చేశారు కొందరు విద్యార్థులు. ఈ ప్రయత్నంలో స్నేహ బంధం గెలిచినా.. విషాదం మాత్రం తప్పలేదు.చైనా సిచువాన్ ప్రావిన్స్(Sichuan Province)లోని యిలాంగ్ మిడిల్ స్కూల్ విద్యార్థి రెన్(15). ప్రాణాంతక క్యాన్సర్తో ఏడాది నుంచి చికిత్స తీసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయేసరికి.. చివరకు సొంతూరిలోనే ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కారణంగా అతని ఏడాది చదువు పోయింది. మరో నెలలో ఆ అకడమిక్ ఇయర్ ముగియనుంది. ఈలోపు.. రెన్కు చదువు చెప్పిన టీచర్కు ఓ ఆలోచన వచ్చింది. దానికి అతని క్లాస్మేట్స్, రెన్ తల్లిదండ్రులు అంగీకరించారు.మే 17వ తేదీన.. బడి నుంచి కాలినడకన రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించి రెన్ (Ren) ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆస్పత్రికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి అతనికి యూనిఫాం తొడిగి బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంగణంలోనే అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆపై అతను త్వరగా కోలుకోవాలంటూ పుష్ఫ గుచ్చాలతో పాటు కానుకలపై సంతకాలు చేసి మరీ అతనికి అందించారు. ఈ చర్యతో నెట్టింట జనం మురిసిపోయారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ, జరిగింది మరొకటి. గ్రూప్ ఫొటో దిగిన కొన్ని గంటలకే(ఆ మరుసటి ఉదయం) రెన్ కన్నుమూసినట్లు అతని తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ విషాదాంతం అందరినీ షాక్కు గురి చేసింది. మరో నెలలో అతని 16వ ఏడులోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈలోపు తుదిశ్వాస విడవడంతో ఆ తల్లిదండ్రులు, అతని స్నేహితులు గుండెలు అవిసేలా రోదించారు. ఈ గ్రాడ్యుయేషన్ ఫొటో(China Graduation Photo).. ప్రపంచంలోని అత్యుత్తమ ఫొటోగా నెట్టింట అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ మధుర క్షణం కోసమే అప్పటిదాకా అతని ఊపిరి ఆగిపోలేదేమోనని కొందరు కామెంట్ చేయగా.. వచ్చే జన్మలోనైనా ఆ చిన్నారి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని మరికొందరు కోరుకుంటూ నివాళులర్పిస్తున్నారు.ఇదీ చదవండి: పాక్.. చివరకు ఇలా కూడా పరువు తీసుకుందా?

ఫోన్లకు తాళం.. జ్ఞానానికి గాలం.. స్కాట్లాండ్ స్కూల్లో సరికొత్త విధానం
ఏరా బుడ్డోడా ఆదుకోవడం లేదురా అని అడిగితే అమ్మ ఫోన్ ఇవ్వడం లేదన్నా అన్నాడు ఓ పిల్లాడు. అది కాదురా ఆదుకోవడం అంటే గ్రౌండ్లో ఆదుకోవడం ఫోన్లో కాదురా అని ఆ పెద్దాయన వాడికి సర్దిచెప్పాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆటలు అంటే ఫోన్లో.. సినిమా అంటే ఫోన్లో.. కబుర్లు అంటే ఫోన్లో.. అన్నీ ఫోన్లోనే నడుస్తున్నాయి.. ఆఖరుకు పిల్లలకు ఫోన్ చూపిస్తే తప్ప బువ్వ కూడా తినని పరిస్థితి. ఉగ్గు తినిపిస్తూ కూడా ఫోన్లో వీడియోలు చూపిస్తున్న తల్లులున్న కాలమిది.ఏ బస్సుల్లో.. ట్రైన్లలో.. పెళ్లి పేరంటాళ్లలో చూస్తున్నా పిల్లలు ఆటపాటలు కాకుండా ఫోన్లలోనే కనిపిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి పిల్లలను బయటకు తీసుకొచ్చి వారిని సొంతంగా ఆలోచించడం.. ఆడుకోవడం వంటి పనుల్లో పెట్టడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ అయిపొయింది. స్కూళ్లలో కూడా పిల్లలు నిత్యం ఫోన్లు చూస్తున్నారు. అటు క్లాసులు నడుస్తుంటే ఇటు వెనుకబెంచిలో ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ ఫోన్ మానియా నుంచి పిల్లలను బయటకు తెచ్చి ఎక్కువసేపు పుస్తకాలతో గడిపేలా చేసేందుకు తల్లిదండ్రులు.. టీచర్స్ కూడా యాతనపడుతున్నారు.ఈ క్రమంలో స్కాట్లాండు లోని ఎడిన్బర్గ్ పట్టణంలో రెండు సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే పిల్లలను ఫోన్ల నుంచి మరల్చేందుకు సరికొత్తగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పోర్టోబెల్లో హై స్కూల్ , క్వీన్స్ఫెర్రీ హై స్కూల్ లో ఈ కొత్త ప్రక్రియ మొదలు పెడుతున్నారు. అలాగని పిల్లల నుంచి ఫోన్లు లాక్కోవడం వంటి బలవంతపు చర్యలు వంటివి ఉండవు.. ఫోన్లు వాళ్ళచేతుల్లోనే ఉంటాయి.. కానీ చూడకూడదు.. అదన్నమాట సరికొత్త డీ అడిక్షన్ కాన్సెప్ట్. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రతిరోజు ఉదయం పాఠశాలకు వచ్చిన వెంటనే తమ ఫోన్లను యోండ్ర్ పౌచ్ల (Yondr pouches) లో భద్రంగా పెట్టాలి.విద్యార్థులందరూతమ మొబైల్ ఫోన్లను లాక్ చేయగలిగే మరియు మాగ్నెటిక్గా ఓపెన్ చేసే ప్రత్యేక పౌచ్లలో ఉంచాలి. ఈ పౌచ్లు వారి దగ్గరే ఉంటాయి కానీ స్కూల్ టైం మొత్తం వాటిని ఓపెన్ చేయలేరు. ఈ పాలసీని అమలు చేయడానికి ముందు 6 నెలలపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులతో చర్చలు జరిగాయి. ప్రత్యేకమైన గ్రూపులు ఏర్పాటు చేయగా, పోర్టోబెల్లో హై స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో 86% మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ప్రక్రియవలన పిల్లల్లో మరింత హుషారు.. ఉత్సాహాన్ని నింపడానికి అవకాశం కలుగుతుందని అంటున్నారు. దీంతోబాటు పిల్లలు తమ క్లాస్మేట్స్ తో ఎక్కువసేపు గడపడం.. మాట్లాడడం.. ఆటపాటల్లో నిమగ్నం కావడం వంటి పనుల్లో నిమగ్నం అవుతారని టీచర్లు అంటున్నారు.అధ్యయనాల ప్రకారం, ఫోన్-ఫ్రీ వాతావరణం విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ సరికొత్త విధానం గురించి కౌన్సిలర్ జోన్ గ్రిఫిత్ మాట్లాడుతూ "విద్యార్థులకు పాఠశాల సమయాల్లో మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచే విధానం ప్రారంభించడం అనందంగా ఉంది. పిల్లలు క్లాసురూముల్లో టీచర్ల మీద.. వారు చెప్పే పాఠాల మీద దృష్టి పెట్టకుండా ఫోన్లు చూస్తున్నారు. ఇది వారి విజ్ఞానాన్ని.. తెలివిని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఫోన్లకు తాళం వేయడంతో పిల్లలు క్లాసురూముల్లో ఏకాగ్రతతో పాఠాలు వింటారు' అన్నారు.-సిమ్మాదిరప్పన్న
జాతీయం

కాలీగంజ్ ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన టీఎంసీ
నదియా: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జూన్ 19న జరగనున్న కాలీగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నిక(Kaliganj Assembly by-election)కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తమ అభ్యర్థిగా అలీఫా అహ్మద్ను ప్రకటించింది. అలీఫా అహ్మద్ దివంగత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ కుమార్తె. ఈ విషయాన్ని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది.‘పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మార్గదర్శకత్వంలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం. కాలీగంజ్ అభ్యర్థి అలీఫా అహ్మద్’ అని టీఎంసీ తెలిపింది. సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు నసీరుద్దీన్ అహ్మద్(Naseeruddin Ahmed) మృతితో కాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ‘లాల్ దా’గా పేరొందిన అహ్మద్ తన 70వ ఏట కన్నుమూశారు. ఆయన కాలీగంజ్ నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు.ఈ సీటుకు ఎంతో రాజకీయ ప్రాముఖ్యత ఉంది. ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సవరణ తర్వాత, కాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.5 లక్షల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని కాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్ 19న ఉప ఎన్నిక జరగనున్నదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆదే రోజున ఉప ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాలీగంజ్ ఒకటి. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23న ప్రకటించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2. జూన్ 3న వీటి పరిశీలన జరగనుంది. అభ్యర్థులు జూన్ 5 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఇది కూడా చదవండి: ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు దుర్మరణం

‘గేట్ వే-మాండ్వా’ లాంచీల నిలిపివేత , జేజే ఆసుపత్రిలోకి నీరు
గేట్ వే ఆఫ్ ఇండియా–మాండ్వాల మధ్య సోమవారం నుంచి లాంచి సేవలను నిలిపివేశారు. మారిటైం బోర్డు ఆదేశాల మేరకు లాంచి యజమానులు సేవలు నిలిపివేశారు. దీంతో నిత్యం ఈ మార్గంలో లాంచీలలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకనుంచి ఎక్కువ చార్జీలు చెల్లించి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. లాంచీ సేవలు మళ్లీ సెప్టెంబరు 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని లాంచీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ మహాడ్కర్ తెలిపారు. ముంబై పరిసరా ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు పక్షం రోజుల ముందే వర్షాలు ప్రారంభం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 26వ తేదీ నుంచి లాంచి సేవలు నిలిపివేయాలని మారిటైం బోర్డు నిర్ణయించింది. ఏటా వర్షా కాలంలో జూన్ ఒకటో తేదీ నుంచి లాంచీ సేవలు నిలిపివేస్తారు. కానీ ఈసారి వర్షాలు తొందరగా ప్రారంభం కావడంతో వారం రోజుల సర్వీసులను నిలిపివేశారు. రోరో సేవల కొనసాగింపు... ముంబైకి సమీపంలో ఉన్న వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అలీబాగ్ ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉన్నప్పటికీ 90 శాతం పర్యాటకులు లాంచీలను ఆశ్రయిస్తారు. రోడ్డు మార్గం కంటే సముద్ర మార్గం ద్వారా అలీబాగ్కు చేరుకోవడం చాలా సులభం. బస్సు చార్జీలతో పోలిస్తే లాంచీ చార్జీలు చాలా తక్కువ. గేట్ వే ఆప్ ఇండియా–మాండ్వా మ«ధ్య ప్రతీరోజు 40–50 లాంచీలు నడుపుతారు. వర్షాకాలంలో సముద్రంలో అలలు ఉవ్వేత్తున ఎగిసిపడతాయి. ముఖ్యంగా హై టైడ్ కారణంగా లాంచీలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఈసారి ముందుగానే వర్షాలు మొదలుకావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకముందే లాంచీ సర్వీసులను నిలిపివేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే భావుచా ధక్క–మాండ్వా మధ్య రోల్ ఆన్–రోల్ ఆఫ్ (రోరో) సేవలు కొనసాగుతాయని మారిటైం బోర్డు తెలిపింది. ఉపాధి..ఆదాయానికి గండి.... గేట్ వే–మాండ్వా మధ్య పీఎన్పీ, మాల్దార్, అజంత, అపోలే కంపెనీల లాంచీలు సేవలందిస్తున్నాయి. దాదాపు మూడు నెలలకుపైగా లాంచిసేవలు నిలిచిపోనుండటంతో వీటి యజమానులు, అక్కడి హోటళ్లు, లాడ్జింగులు, వాహనాల యజమానుల ఆదాయానికి గండిపడనుంది. ముంబై నుంచి బయలుదేరే పర్యాటకులతోపాటు అలీబాగ్ నుంచి ముంబైకి వచ్చే వ్యాపారులు, ఉడ్యోగుల రాకపోకలు కూడా నిలిచిపోతాయి. ఇకనుంచి వీరంతా రోడ్డు మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది వ్యయ, ప్రయాసలతో కూడున్నదైనప్పటికీ తప్పదని అధికారులు అంటున్నారు. కేఈఎం, జేజే ఆసుపత్రుల్లోకి వరదనీరు మోకాల్లోతులో నీటిలో ఆసుపత్రుల ప్రధాన భవనాలు, పరిసరాలు వరదనీటిలోనే రోగుల క్యూ ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. వర్షాల కారణంగా కేఈఎం, జె.జె. ఆసుపత్రులు నీట మునిగాయి. పరేల్లోని కేఈఎం ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం , పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) వద్ద అలాగే కొన్ని రోగుల గదుల వెలుపల భా రీగా నీరు నిలిచిపోయింది. టాటా ఆసుపత్రి, కేఈఎం ఆసుపత్రి, వార్డు 4ఏ వరండాల్లో నీరు చేరింది. నీటి పంపులతో వెంటనే నీటిని తొల గించినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ జోషి తెలిపారు. ఇక జె.జె. ఆసుపత్రిలో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. ప్రధాన భవనం వెలుపల, అలాగే ఆసుపత్రి నివాస భవనాల పరిసరాలు మోకాలి లోతు నీటిలో మునిగిపోయింది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కోసం వచ్చిన రోగులు నీటిలోనే నిలబడాల్సి వచ్చింది. అవుట్ పేషెంట్ భవనం నుంచి ప్రధాన భవనానికి వెళ్లే రోగులు పూర్తిగా నీటిలోనే నడవాల్సి వచి్చంది. జె.జె. ఆసుపత్రి సమీ పంలోని పోలీస్ స్టేషన్ ప్రాంతం, ప్రజా పనుల విభాగం ఆవరణలోనూ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అ యితే గత సంవత్సరం లాగా ఆసుపత్రి భవనం ఈసారి పూర్తిగా నీటమునగలేదని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని జె.జె. ఆసుపత్రి డీన్ డాక్టర్ అజయ్ భండార్వర్ తెలిపారు.

ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. గాంధీ వంతెనపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అత్యంత అనూహ్య రీతిలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిపై ఒక ఎస్యూవీ వాహనం డివైడర్ను ఢీకొంది. దీంతో అప్రమత్తమైన ఎస్యూవీలోని ఆరుగురు ప్రయాణికులు కిందకు దిగారు. ఇంతలో అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. బీడ్ పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ కన్వత్ ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ గెవ్రాయ్ పట్టణానికి సమీపంలోని ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిలోని గాంధీ వంతెనపై ఒక ఎస్యూవీ డివైడర్ను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురిలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అయితే డివైడర్ నుండి తమ వాహనాన్ని పక్కకు తప్పించేందుకు వారు ప్రయత్నిస్తుండగా, అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కన్వత్ తెలిపారు.ఇది కూడా చదవండి: Nehru Death Anniversary: చైనాతో ఓటమిని జీర్ణించుకోలేక..

Nehru Death Anniversary: చైనాతో ఓటమిని జీర్ణించుకోలేక..
1964.. మే 27.. భారతదేశం తన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru)ను కోల్పోయింది. నాడు ఆయన ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకున్న ప్రజాదరణ ఎంతటిదంటే.. ఆయన మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా పలు వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది. నాడు భారత ప్రధాని నెహ్రూ మరణ వార్తను న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో రెండవ ప్రధాన వార్తగా ముద్రించింది.భారత తొలి ప్రధాని జవహర్లాల్ మరణించిన సమయానికి దేశానికి స్వాతంత్యం సిద్ధించి, కొన్నేళ్లే అయ్యింది. దీనికి తోడు 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓటమి పాలయ్యింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ ఈ లోకాన్ని వీడటం యావత్ దేశాన్ని ఆవేదనలోకి నెట్టివేసింది. చైనా(China) చేతిలో భారత్ ఓటమి దరిమిలా ప్రధాని నెహ్రూ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైందని చెబుతారు. ఈ యుద్ధంలో భారతదేశం ఓటమిని నెహ్రూ తట్టుకోలేకపోయారని అంటారు.1962, నవంబర్ 20న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. చైనా నుంచి తమ సైనిక ఓటమిని అంగీకరించారు. వాలాంగ్, సిల్లా, బోమ్డిలా ప్రాంతాలలో భారత సైన్యం ఓడిపోయిందని ఆయన ప్రకటించారు. ఇదేవిధంగా ఆయన పార్లమెంటులోనూ చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అప్పటి భారత రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణన్(President S. Radhakrishnan) కూడా సొంత ప్రభుత్వంపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం చైనాను తేలికగా నమ్ముతోందని, వాస్తవాలను విస్మరిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ ప్రశ్నలు ప్రధాని నెహ్రూను అమితంగా బాధించాయని చెబుతారు.ఈ విమర్శల దరిమిలా నాటి ప్రధాని నెహ్రూ అప్పటి యుద్ధంలో భారత ఓటమికి చైనా చేసిన ద్రోహమే కారణమని భావించారు. ఆ తరువాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో ఆయన ఒక ఏడాదిపాటు కశ్మీర్లో గడిపారు. 1964 మే నెలలో నెహ్రూ ఢిల్లీకి తిరిగి వచ్చారు. మే 27న ఉదయం బాత్రూమ్ నుండి తన గదిలోనికి వస్తూ, స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే అక్కడి సిబ్బంది వైద్యులను పిలిపించారు. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గుండెపోటుతో మరణించారని వైద్యులు ప్రకటించారు.ప్రముఖ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్ ఒకప్పుడు దేశ రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు. నెహ్రూ శకాన్ని చూసిన కొద్దిమంది నేతలలో ఆయన ఒకరు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ ‘పండిట్ నెహ్రూకు ఎటువంటి వ్యాధి లేదు. 1962లో చైనా.. భారతదేశంపై దాడి చేసింది. ఆయుధాల కొరత ఉన్నప్పటికీ మన సైన్యం ధైర్యాన్ని ప్రదర్శించింది. అయినప్పటికీ భారత్.. చైనా ముందు నిలువలేకపోయింది. దీంతో నెహ్రూ తీవ్రంగా కలత చెందారు. ఈ ఆవేదనతోనే నెహ్రూ మృతి చెందారు’ అని అన్నారు.జవహర్లాల్ నెహ్రూ భద్రతా అధికారిగా పనిచేసిన కె.ఎం. రుస్తమ్జీ ‘ఐ వజ్ నెహ్రూ షాడో’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో తాను నెహ్రూ భద్రతా బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఆయన వయస్సు 63 ఏళ్లని రాశారు. అయినా ఆయన 33 ఏళ్ల వ్యక్తిలా కనిపించేవారని పేర్కొన్నారు. నెహ్రూ ఎప్పుడూ లిఫ్ట్ ఉపయోగించలేదని, ఉత్సాహంగా మెట్లు ఎక్కేవారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘జగన్నాథ్’ పేరుపై హక్కులెవరివి?
ఎన్ఆర్ఐ

న్యూజెర్సీలో విజయవంతంగా 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్
అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA), యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్ ( USCA), యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ (USAF) ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన 29 వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్తో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. సుమారు 30 రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ‘మాట’ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగొని, సహా వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, గౌరవ సలహాదారులు రఘు రామ్ వీరమల్లు, USCF వాలంటీర్ చరణ్ ఖజానా అండ్ టీం, USCA అధ్యక్షులు అతుల్ భావే, షకీల్, తదితరులు ఈ పోటీలు విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మే1న కిక్ ఆఫ్ ఈవెంట్ తో ఘనంగా ప్రారంబమైన పోటీలు మే4 న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిసాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్ట మొదటి సారి జూనియర్స్ కేటగిరీలో క్యారమ్స్ పోటీలు నిర్వహించటం విశేషం.మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్ పోటీల్లో 60కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్లో ఎంతో ఉత్సహంగా పాల్గొన్నాయి. రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో ఢోల్ ఎఫెక్ట్ బాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సింగల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టూ పోటా-పోటీగా జరిగింది. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది. సింగర్స్ అనిత కృష్ణ, సిజి ఆనంద్ తమ గ్రాతంతో ఆడియన్స్ని మైమరపించారు.మే4న గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఇటీవల భారత్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి.. గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్ పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇక జూనియర్స్ US నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్కి అనుహ్య స్పందన వచ్చింది. USCA అధ్యక్షులు అతుల్ భావే, USCA మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్ కామెంటేటర్లుగా వ్యవరించారు. ఇక ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు అందజేశారు. గెలిచిన విజేతలకు అందరికీ కలిపి 10 వేల వంద డాలర్ల నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలే లో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్ని అలరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచే, సింగర్ అంజన సౌమ్య తమ గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజన సౌమ్య జోడి.. పలు సూపర్ హిట్ సాంగ్స్తో హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్ని నిర్వహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడిల్సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డా. ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి ముస్సాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్ గా మాట, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, రియల్ టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించిన యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్ఫ్యూజన్, సాషా రియాల్టీ, 9i సోలుషన్స్ని నిర్వహకులు అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ యూత్ శ్రీచరణ్ ఖజానా అండ్ టీమ్ని కొనియాడుతూ, సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవ్వటంలో కీలక పాత్ర పోషించిన స్పోర్ట్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్టెక్ సర్వీసెస్ CEO, మాట హానరీ అడ్వైసర్ రఘురామ్ వీరలమల్లుని ఘనంగా సన్మానించి, సత్కరించారు. మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి, USCA ప్రెసిడెంట్ అతుల్ భావే.. విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాట టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనటం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వహకులను పలువురు అభినందించారు.(చదవండి: అమెరికాలో ఎన్ఆర్ఐలే మా టార్గెట్)

అమెరికాలో నల్గొండ విద్యార్థిని కన్నుమూత
ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన మరో భారతీయ విద్యార్థి కన్నుమూసింది. ఇటీవలి కాలంలోఅమెరికాలో భారత విద్యార్థుల మృతుల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం మరింత విషాదం. తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన యువతి మృతి చెందింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్) చదువుతోంది. అనారోగ్యంతో మృతి చెందడం విషాదాన్ని నింపింది.అలబామా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేసిన ప్రియాంక అక్కడే పార్ట్ టైం వర్క్ చేస్తోంది. బ్రెయిన్ డెడ్ (మెదడు మృతి) స్థితికి చేరుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించి ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన వైద్యులు తెలిపారు. స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గమనించి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్

విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. ఆ 20 మంది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.

అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్(6), శివాన్‡్ష(3) ఉన్నారు. మహేందర్ ప్రస్తుతం గల్ఫ్లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచి్చన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు. అమ్మా.. లేమ్మా.. గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్లో ఉన్న మహేందర్కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముక్క శంకర్ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్ఆర్పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.

మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల క్యాబ్పై ఆగంతకుల దాడి
బంజారాహిల్స్(హైదరాబాద్): మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకెళుతున్న క్యాబ్ను ముగ్గురు ఆగంతకులు మద్యం మత్తులో దారికాసి అడ్డగించి బెదిరించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో ఉంటున్న నలుగురు యువతులు కోకాపేటలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు విధులు ముగించుకుని సంస్థ కేటాయించిన క్యాబ్లో ఇంటికి బయలుదేరారు. రోడ్డు నెంబర్–12 మీదుగా వీరు వెళ్తున్న కారును మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అడ్డగించి కారు అద్దాలను పగులగొట్టారు. కారు తాళాలు లాక్కున్నారు. తాము క్రిమినల్స్మని, అటాక్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం పోలీసులకు చెబితే అంతుచూస్తామని హెచ్చరించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితులు నేరుగా బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.