Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

High Court orders Nallapadu police in Singayya death incident1
ప్రయాణికులు.. ప్రమాదానికి బాధ్యులా?

సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా ఆ వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారే గానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది.ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్‌ జగన్‌­, ఇతర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజిని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ కేసు కొట్టివేయాలంటూ పిటిషన్లుసింగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తేలేంతవరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని తమ పిటిషన్లలో హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్య శ్రీరాం, చిత్తరవు రఘు, న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, ఆర్‌.యల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎస్పీ మొదట వేరే కారు అని చెప్పారు.. ఆ తర్వాత మాట మార్చారు... మొదట పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సింగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 సీఈ 0001 నంబర్‌ కారు ప్రమాదానికి కారణమని స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మూడు రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణమంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తులను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. వాహనంలో ఉన్న వారిని ఎలా విచారిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ప్రమాదం తరువాత సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఓ వ్యక్తి మరణానికి కారణమై ఇప్పుడు ఏమీ జరగలేదంటూ చెబుతున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుంది..? వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో.. ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జనసమూహంలోని ఓ వ్యక్తి వాహనం కింద పడితే.. ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్లిపోరుగా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించారు. దీనిపై అన్ని ఆధారాలున్నాయని, సమయం ఇస్తే వాటిని కోర్టు ముందుంచుతామని ఏజీ దమ్మాలపాటి నివేదించడంతో.. విచారణ మంగళవారానికి వాయిదా వేస్తామని, అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సమయంలో పొన్నవోలు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా, ఆ అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యంవైఎస్‌ జగన్‌ తరఫున శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఒక మాజీ సీఎంకార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలున్నా పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. మొదట బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106 కింద పెట్టిన కేసును పోలీసులు, తర్వాత 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌) కిందకు మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్‌ జగన్‌ భద్రత, జనసమూహాలను నియంత్రించే విషయంలో పోలీసులు తీవ్ర ఉదాశీనత ప్రదర్శిస్తున్నారన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘ప్రభుత్వాన్ని పూర్తి ఆధారాలు కోర్టు ముందుంచనివ్వండి... ఈలోపు మీకు కావాల్సింది రక్షణే కదా? మీకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిస్తా..’ అని తెలిపారు. అనంతరం శ్రీరామ్‌ స్పందిస్తూ.. తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ, అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.

Visakha Water Supply Employees Protest2
విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. మహిళల ఆందోళన

విశాఖ వాటర్‌ ఎమర్జెన్సీ అప్‌డేట్స్‌.. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. మహిళల ఆందోళన..విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ..బక్కన్నపాలెంలో ఖాళీ బిందెలతో నిరసనకు దిగిన మహిళలు..మంచి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామంటున్న మహిళలు..మేయర్‌తో ఇంకా ప్రారంభం కానీ వాటర్ సప్లై ఉద్యోగుల చర్చలు..చర్చలు సఫలమైనా నీటి విడుదలకు సమయం పట్టే అవకాశం..👉ఆప్కాస్‌ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు.👉దీంతో, మూడు లక్షల ఇంటి కులాయిలు, ఆసుపత్రులు సహా పలు కీలక పరిశ్రమలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం ఐదు గంటల నుంచి కులాయిలు రావాల్సి ఉన్నప్పటికీ నీటి సరఫరాకు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్‌పీసీఎల్‌, కోరమండల్, ఎస్సార్, ఆర్‌సీఎల్‌, పోర్ట్ మొదలగు పరిశ్రమలకు కూడా నీటి సరఫరా ఆగిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్‌ ప్రక్రియ స్థంభించిపోయింది. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని ఉద్యోగులు నిలిపివేశారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్టు సమాచారం. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని జీవీఎంసీ యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే సాంకేతిక సమస్యలు తప్పవని వాటర్ సప్లై ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.👉ఇక, నిన్న రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతోంది. మంచి నీళ్ళు లేక గ్రేటర్ విశాఖ జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో మేయర్‌తో మరోసారి చర్చలకు వెళ్ళనున్నారు వాటర్ సప్లై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. చర్చలు సఫలం అయితేనే నీటిని విడుదల చేస్తామంటున్న ఉద్యోగులు చెబుతున్నారు. జీవీఎంసీ చరిత్రలో మంచి నీటి సరఫరా ఆగిపోవడం ఇదే మొదటిసారి..👉ఇదిలా ఉండగా.. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమ్మెతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్‌ ఉద్యోగులతో కొంతమేర నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది అరకొరగానే ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.కార్మికుల డిమాండ్‌.. 👉ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్‌ విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మందిని సెమీ స్కిల్‌ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో జీవీఎంసీ కౌన్సిల్‌ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్‌ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్‌లోడ్‌ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చర్యలు చేపట్టండి👉తాగునీటి విభాగం ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్‌, అసౌకర్యానికి సహకరించాలని కోరారు.

Trump Must Stop Disrespectful Tone Against Khamenei3
ఖమేనీ జోలికొస్తే ఖబడ్డార్‌: ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్‌

టెహ్రాన్‌: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధ విరమణ అనంతరం పలు వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇరాన్‌ మరోమారు హెచ్చరించింది. అధ్యక్షుడు ట్రంప్ నిజంగా తమతో ఒక ఒప్పందానికి రావాలనుకుంటే, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ విషయంలో అగౌరవ, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలను చేయకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ నేత ఖమేనీపై చేసిన వ్యాఖ్యలను అబ్బాస్ అరఘ్చి ఖండించారు. ట్రంప్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో నిజాయితీ వ్యవహరించాలనుకుంటే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ విషయంలో అగౌరవంగా మాట్లాడకూడదన్నారు. ట్రంప్‌ తన అనుచిత వ్యాఖ్యలతో ఖమేనీ అభిమానులు, మద్దతుదారులను బాధపెడుతున్నారని అబ్బాస్ అరఘ్చి ఆరోపించారు.ఇరాన్‌ క్షిపణులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ అమెరికాను ఆశ్రయించిందని, ఇంతకుమించి ఆ దేశానికి మరో మార్గం లేదని అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు. ఇరానియన్ ప్రజలు.. బెదిరింపులు, అవమానాలకు లొంగిపోరని విదేశాంగ మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనిని హత్య నుండి రక్షించానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్న దరమిలా అబ్బాస్ అరఘ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ తమతో చర్చలకు తిరిగి రావాలని ట్రంప్‌ కోరారు. అయితే అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించేదిలేదని ఇరాన్ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ‘శశి థరూర్‌.. ఒవైసీ వేరుకాదు’: జావేద్‌ అక్తర్‌

Actress, Kaanta Laga Fame Shefali Jariwala Passed Away4
'కాంటా లగా' సాంగ్‌తో సెన్సేషన్‌.. నటి కన్నుమూత

బాలీవుడ్‌ నటి, కాంటా లగా సాంగ్‌ ఫేమ్‌ షెఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్‌ త్యాగి వెంటనే ఆమెను అంధేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే నటి మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టమ్‌ కోసం ఆమె మృతదేహాన్ని కూపర్‌ ఆస్పత్రికి తరలించారు. నటి మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.నటి ప్రయాణం సాగిందిలా..షెఫాలీ జరివాలా 2002లో వచ్చిన కాంటా లగా సాంగ్‌తో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యారు. అప్పటినుంచి అభిమానులు ఆమెను కాంటా లగా గర్ల్‌ అనే పిలుచుకుంటున్నారు. ఈ గుర్తింపుతోనే ముజ్సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి నటించే ఛాన్స్‌ వచ్చింది. అలాగే కన్నడలో హుడుగరు మూవీలో యాక్ట్‌ చేశారు. బేబీ కమ్‌నా అనే వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించారు. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లోనూ పాల్గొన్నారు. షెఫాలి.. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్‌ సింగ్‌ను పెళ్లాడారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2009లో విడిపోయారు. అనంతరం 2015లో నటుడు పరాగ్‌ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఆస్కార్‌ కమిటీలో ఇండియన్‌ స్టార్స్‌

Trump says whatever we want reciprocal tariffs not fixed5
సుంకాలపై ట్రంప్‌ కొత్త ట్విస్ట్‌.. అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పలు దేశాలపై విధించే సుంకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు చాలా వెసులుబాటు ఉందన్నారు. సుంకాలను తిరిగి విధించడానికి జులై తొమ్మిది గడువును ఇప్పుడే నిర్ణయించలేమని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఇక.. తాజాగా, అమెరికా అధ్యక్ష పదవిని ఉద్దేశిస్తూ ఆ పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు.అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా దిగుమతుల విషయంలో సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి మాకు స్వేచ్చ ఉంది. సుంకాల విధింపును అనుకున్న సమయం కంటే కుదించవచ్చు లేదా పొడిగించవచ్చు. అయితే, నేను వ్యక్తిగతంగా తొందరగా ముగించడానికే ఇష్టపడతాను. మీ అందరికీ ఓ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు 25 శాతం చెల్లిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. అయితే సుంకాలపై పెంపు నిర్ణయం మరింత వాయిదా పడే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బీసెంట్‌ సంకేతాలు ఇచ్చారు. అమెరికా కార్మిక దినోత్సవం (సెప్టెంబర్‌ 1) నాటికి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని హింట్‌ ఇచ్చారు.కెనడాతో కష్టం..అలాగే, కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికన్ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్‌ను దాడిగా అభివర్ణించారు. ఇందుకు దీటుగా కెనడాపై కూడా సుంకాలు విధిస్తామని అన్నారు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘ఇది చాలా దారుణమైన పన్ను, అందుకే కెనడాతో వాణిజ్య చర్చలన్నిటికీ తక్షణం ముగింపు పలుకుతున్నాము. కెనడాతో వాణిజ్యం చాలా కష్టం. వారు తమ తీరు మార్చుకునే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవు’ అని పేర్కొన్నారు.అధ్యక్ష పదవి డేంజర్‌..ఇక, తాజాగా ట్రంప్‌ హైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ గతేడాది పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్‌ గుర్తుచేసుకున్నారు. అనంతరం, ట్రంప్‌.. అధ్యక్ష పదవి ప్రమాదకరమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి బాధ్యతలను కారు రేసింగ్‌, బుల్‌ రైడింగ్‌ లాగే ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈవిషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే.. తాను ఈ రేసులో ఉండేవాడిని కాదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, గతంలో ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది.HOLY SH*T 🚨 President Trump just ENDED trade talks with Canada announcing massive tariffs soonAMERICA WILL NOT BE BULLIEDWE WILL NOT BACK DOWN pic.twitter.com/voOXgaBEes— MAGA Voice (@MAGAVoice) June 27, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో సారి అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్‌లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు పెంచిన సుంకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు జులై తొమ్మిదో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

IND U19 vs ENG U19: Vaibhav Suryavanshi, Kanishk Chouhan shine in Indias easy win6
వైభవ్ సూర్య‌వంశీ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌ను భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు ఘ‌నంగా ఆరంభించింది. హోవ్ వేదిక‌గా శుక్ర‌వారం ఇంగ్లండ్ అండ‌ర్‌-19 జ‌ట్టుతో జ‌రిగిన తొలి యూత్ వ‌న్డేలో 6 వికెట్ల తేడాతో భార‌త్ జయభేరి మోగించింది. ఈ విజ‌యంతో ఐదు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ ఇసాక్‌ మొహమ్మద్‌ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడగా... మిడిలార్డర్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తనయుడు రాకీ ఫ్లింటాఫ్‌ (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. భార‌త యువ బౌలర్లలో కనిష్క్ చౌహ‌న్‌ 3, హెనిల్‌ పటేల్, అంబ్రీశ్, మొహ్మద్‌ ఇనాన్‌ తలా 2 వికెట్లు తీశారు.వైభవ్ విధ్వంసం..అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ కేవలం 24 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. భార‌త ఓపెన‌ర్, ఐపీఎల్‌ సరికొత్త సంచలనం వైభవ్‌ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 48 ప‌రుగులు చేశాడు.కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో క‌లిసి తొలి వికెట్‌కు 71 ప‌రుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలోనే వీళ్లిద్దరు అవుటైనప్పటికీ అభిజ్ఞాన్ కుండు (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కుదురుగా ఆడటంతో ఏ ఇబ్బంది లేకుండా యువభారత్‌ గెలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫ్రెంచ్‌ 2 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య ఈ నెల 30న రెండో వన్డే నార్తాంప్టన్‌లో జరుగుతుంది.చదవండి: అది ఆసీస్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌

Air India Office Party Days After Plane Crash Video Viral7
బాధలో అహ్మదాబాద్‌ బాధితులు.. డీజే పార్టీ జోష్‌లో ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు

ఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్‌ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్‌ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఎయిర్‌ ఇండియా గ్రౌండ్‌ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే ఎస్‌ఏటీఎస్‌ లిమిటెడ్‌ (గతంలో సింగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ సర్వీసెస్‌) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్‌, బ్యాగేజ్‌ హ్యాండ్లింగ్‌ వంటి గ్రౌండ్‌ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్‌లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్‌లోని ఏఐఎస్‌ఏటీఎస్‌ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్‌ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd— Mid Day (@mid_day) June 23, 2025విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్‌ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది.

post offices across India officially begin accepting digital payments8
పోస్టాఫీసుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు

దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఆగస్టు నుంచి డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే విధానం అందుబాటులోకి రానుంది. డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌తో లావాదేవీలను నిర్వహించేందుకు ఉపయోగపడే ఐటీ మౌలిక సదుపాయాల కల్పన ఆగస్టు నాటికి అన్ని పోస్టాఫీసుల్లో పూర్తవుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఐటీ 2.0 కింద కొత్త సిస్టం పైలట్‌ ప్రాజెక్టు ఇప్పటికే కర్ణాటక సర్కిల్‌లో ప్రారంభమైందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ జీటీ సిరీస్‌లో స్పోర్ట్స్‌ కార్లుమైసూర్‌ హెడ్‌ ఆఫీస్, బాగల్‌కోట్‌ హెడ్‌ ఆఫీసు మొదలైన ప్రాంతాల్లో క్యూఆర్‌ ఆధారిత బుకింగ్‌ సేవలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించాయి. యూపీఐ వ్యవస్థతో పోస్టాఫీసుల ఖాతాలు అనుసంధానం కాకపోవడం వల్ల ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే వెసులుబాటు ఉండటం లేదు. గతంలో సేల్‌ కౌంటర్స్‌లో స్టాటిక్‌ క్యూఆర్‌ కోడ్‌ను పోస్టల్‌ శాఖ ప్రవేశపెట్టినప్పటికీ, పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ విధానాన్ని నిలిపివేసారు.

Tharoor and Owaisi are no different Javed Akhtar9
‘శశి థరూర్‌.. ఒవైసీ వేరుకాదు’: జావేద్‌ అక్తర్‌

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, యావత్‌ దేశంపై జరిగిన దాడి అని ప్రముఖ గీత రచయిత, స్క్రిప్ట్‌ రైటర్‌ జావేద్‌ అక్తర్ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’పై ప్రపంచదేశాలకు వివరించేందుకు ప్రతిపక్ష సభ్యుల బృందం వివిధ దేశాల్లో పర్యటనలు సాగిస్తోంది.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గీత రచయిత జావేద్‌ అక్తర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ నేత శశి థరూర్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకులను ప్రభుత్వం ఈ ప్రతినిధుల బృందంలో చేర్చడం సరైనదేనా? అని అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్ర దాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని అన్నారు. అందుకే దేశంలోని అన్నివర్గాల ప్రతినిధులూ వెళ్లారన్నారు. వీరిలోని కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని. కానీ దేశం విషయానికి వస్తే, అందరం ఒకటేనని అన్నారు. ఈ విధంగా చూస్తే ప్రతినిధుల బృందంలోని శశిథరూర్‌, అసదుద్దీన్‌ ఒ‍వైసీ వేరుకాదని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు.శశి థరూర్ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడతారని,ఇలాంటి కాంగ్రెస్ నేత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని, ఆయనకు ఐక్యరాజ్యసమితిలో దౌత్య అనుభవం ఉందని అక్తర్ పేర్కొన్నారు. భారత్‌- పాకిస్తాన్ మధ్య సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ 1965 యుద్ధం.. అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధం నాటి నుంచి కూడా వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయన్నారు. అయితే పాక్‌ ప్రభుత్వం ఇటువంటి వివాదాల్లో తన ప్రమేయం లేదని చెబుతూ వస్తున్నదన్నారు. పహల్గామ్‌ దాడి వారు చేసినదేనని అక్తర్‌ పేర్కొన్నారు.పాకిస్తాన్‌లోని కోట్లాది మంది భారతదేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నారని, అలాగే అక్కడి యువత భారతదేశానికి వచ్చి, వినోద పరిశ్రమతో పాటు కార్పొరేట్ రంగంలో పనిచేయాలని కోరుకుంటున్నారని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. అయితే అక్కడి సైనిక పాలకులకు ఇది నచ్చిన అంశమన్నారు. పాక్‌లో సైన్యం ఆధిపత్యం తెలుసుకున్న మీదటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌ను ఆహ్వానించారన్నారు. పాక్‌లో ప్రజాస్వామ్యం ఒక బూటకమని, సైన్యమే ఆ దేశాన్ని పాలిస్తుందని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అభినందన్‌ను బంధించానన్న.. పాక్‌ ఆర్మీ అధికారి మృతి

  Rasi Phalalu: Daily Horoscope On 28-06-2025 In Telugu10
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.తదియ ప.12.22 వరకు తదుపరి చవితి, నక్షత్రం: పుష్యమి ఉ.9.30 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.10.22 నుండి 11.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: రా.10.20 నుండి 11.55 వరకుసూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.34రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది. రుణయత్నాలు. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృషభం: కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.కర్కాటకం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.సింహం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.కన్య: కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆప్తుల నుండి పిలుపు రావచ్చు. వాహనాలు కొంటారు. ఆస్తులు సమకూరతాయి. సోదరుల నుండి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.తుల: ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆరి<క పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు: బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో కలహాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉండవచ్చు.మకరం: ఇంతకాలం శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. చర్చలు సఫలం. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.కుంభం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుండి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.మీనం: కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement