Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Serious on Chandrababu Naidu Govt over Tenali Police Incident1
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ మంగళవారం ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు.తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల హక్కులను గౌరవించకుండా ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ అమలు చేస్తోంది’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. యువకులపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి ‘తెనాలిలో దళిత, మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్‌ విక్టర్, దోమా రాకేశ్, షేక్‌ బాబూ­లాల్‌ అలియాస్‌ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్ల మీద లాఠీలతో దారుణంగా కొట్టారు. ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.. బాధితుల కాళ్లను తొక్కిపట్టగా, మరొక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లాఠీలతో దాడి చేశారు. మిగిలినవారు ఈ దాడిని వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ కొత్తవి అందజేశారు. వీడియో వైరల్‌ అయ్యాకే విషయం వెలుగులోకి... ఘోర ఘటనపై మాట్లాడడానికి కూడా ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు. వీడియో వైరల్‌ అయ్యాకే దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో ఈ ఉదంతం చెబుతోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఇలాంటి ఎన్నో దారుణ, అమానవీయ దాడులు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు నోరు విప్పలేని పరిస్థితులు ఉండటం వల్ల వెలుగులోకి రావడం లేదు. పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కేవలం కాగితంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది మానవ హక్కులను కాలరాసే చర్య... తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల దాడి మానవ హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి చేయడమే. పోలీసులు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను సమరి్పంచాలే తప్ప... వాళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి, శిక్షించే పని చేపట్టకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కొట్టడం, హింసించడానికి చోటే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

USA Govt Pauses new student visa interviews2
ట్రంప్‌ మరో సంచలనం.. విద్యార్థి వీసా ఇంటర్వూలకు బ్రేక్‌

వాషింగ్టన్‌: అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్‌ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్‌ ప్రభుత్వం ఆందోళనల నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక, ఇప్పటికే షెడ్యూలింగ్‌ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, ఈరోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్‌ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు అత్యయిక ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్‌మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగ నిపుణులు విశ్లేషించచనున్నారు. ఎఫ్, ఎం, జే కేటగిరీ దరఖాస్తుల సోషల్‌మీడియా ఖాతాల పాత పోస్ట్‌లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు.అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్‌మీడియా ప్రొఫైల్, హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూలదాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్‌ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్‌ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది. క్లాసులు డుమ్మా కొడితే వీసా రద్దు.. ఇదిలా ఉండగా.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్‌ స్టేటస్‌ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది.

BCCI reinstates T Dilip as India’s fielding coach for England Tests3
బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. దిలీప్‌కు మ‌ళ్లీ పిలుపు

భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్‌ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్‌ను మరో సారి ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్‌ టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించగా... ఆ్రస్టేలియాలో ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో సహాయక కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో పాటు దిలీప్‌ను తొలగించింది.ఫీల్డింగ్‌ కోచ్‌గా విదేశీయుడిని నియమించాలని బోర్డు ప్రయత్నించనా... అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్‌ను తిరిగి ఎంపిక చేసింది. "దిలీప్‌ చాలా మంచి కోచ్‌. నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అతడిని తిరిగి నియమించాం"అని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్టు కొత్త కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్, సుదర్శన్‌ జూన్‌ 6 నుంచి ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగే వార్మప్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ జూన్‌ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: జితేశ్‌ జితాదియా

Donald Trump Says Golden Dome Free For Canada4
కెనడాకు ట్రంప్‌ బంపరాఫర్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కెనడా విలీన ఆఫర్‌ను ప్రకటించారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా (Canada) చేరితే.. గోల్డెన్‌ డోమ్‌ను ఉచితంగా పొందవచ్చు అని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అమెరికా రక్షణ కోసం అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమయ్యారు. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్‌ డోమ్‌ (Golden Dome)’ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టులో చేరేందుకు అమెరికా పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబర్చింది.#BREAKING: Donald Trump says Canada is considering his offer to become the 51st state pic.twitter.com/QNPGN7VB92— 6ixBuzzTV (@6ixbuzztv) May 27, 2025ఈ నేపథ్యంలో కెనడా విషయమై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ.. మరోసారి విలీన డిమాండ్‌ను లేవనెత్తారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా చేరితే.. గోల్డెన్‌ డోమ్‌ను ఉచితంగా పొందొచ్చని వ్యాఖ్యానించారు. లేదంటే 61 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కెనడా ఈ ఆఫర్‌ను పరిశీలించుకోవచ్చు అంటూ సలహా ఇచ్చారు. ఇక, ‍ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కెనడా నుంచి ఎలాంటి ప్రతి స్పందనా రాలేదు.గోల్డెన్‌ డోమ్‌ ఇలా..అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచం గోల్డెన్‌ డోమ్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ప్లాన్‌ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు విలువ 175 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది అమెరికాను బాలిస్టిక్‌, క్రూజ్‌ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది. గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలావరకు అవి టేకాఫ్‌ అవ్వక ముందే లేదా.. మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉండనుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ల నెట్‌వర్కే అత్యంత కీలకమైంది. వీటిల్లో లేజర్‌ ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా రోనాల్డ్‌ రీగన్‌ ప్రతిపాదించిన స్టార్‌వార్స్‌ వ్యవస్థను తలపిస్తోంది.అమెరికా విశాలమైన దేశం కావడంతో.. అన్ని నగరాలు గోల్డెన్‌ డోమ్‌ కింద కవర్‌ అవ్వాలంటే.. అంతరిక్షంలో ఇంటర్‌సెప్టర్లతో ఓ నెట్‌వర్క్‌నే సృష్టించాల్సి ఉంటుందని బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫారెన్‌ పాలసీ ప్రోగ్రామ్‌ పరిశోధన విభాగం డైరెక్టర్‌ మిషెల్‌ ఓ హన్‌లోన్‌ అభిప్రాయపడ్డారు. లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలిక కాదని.. అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు ఇతర సామగ్రిని పెద్ద మొత్తంలో రోదసీలోకి చేర్చాల్సి ఉంటుందన్నారు. ఇది చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీనిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చైనా, రష్యా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి తీవ్రస్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని.. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపించాయి.

Kamal Haasan Says Kannada Was Born Out Of Tamil5
కన్నడ, తమిళ భాషపై కమల్‌ వ్యాఖ్యలు.. కర్ణాటకలో దుమారం

చెన్నై: కన్నడ భాషకు తమిళమే మాతృక అంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కమల్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కమల్‌ కార్యక్రమానికి కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌ కుమార్‌ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఆదివారం చెన్నైలో జరిగిన తన సినిమా థగ్‌లైఫ్‌ ఆడియో విడుదల వేడుకలో కమల్‌ హాసన్‌, శివరాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమల్‌ మాట్లాడుతూ.. కన్నడ భాషకు తమిళమే మాతృక. ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివరాజ్‌ కుమార్) ఇక్కడకి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో కమల్‌ వ్యాఖ్యలను పలు కన్నడ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే కర్ణాటకలో కమల్‌ సినిమాలను బహిష్కరిస్తామని కన్నడ రక్షణ వేదిక హెచ్చరించింది. బెంగళూరు వ్యాప్తంగా థగ్‌లైఫ్‌ సినిమా బ్యానర్లను నిరసన కారులు చించేశారు. ఆ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన థగ్‌లైఫ్‌ ప్రీ రిలీజ్‌ కార్యక్రమ వేదిక వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. కమల్‌పై నల్ల ఇంకు పోస్తామంటూ హెచ్చరించారు. తమకు భయపడి ఆయన వేడుకకు గైర్హాజరయ్యారని ఎద్దేవా చేశారు.Kamal Haasan says Kannada came from TamilHello @ikamalhaasan before making such claims, learn some real history. This land doesn’t need language lessons from Periyar fanatics🤡Kannada has a history spanning over 2,000 years, one of the world’s oldest living languages, with… pic.twitter.com/BQFUloI0Sg— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) May 27, 2025మరోవైపు.. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప, తదితరులు కమల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయేంద్ర యడియూరప్ప స్పందిస్తూ..‘కమల్ హాసన్‌ సంస్కారం లేని వ్యక్తి. కన్నడ భాషను అవమానించారు. మాతృ భాషను ప్రేమించడం మంచిదే కానీ, ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదు. కన్నడ, సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, తన ప్రసంగంలో తమిళాన్ని గొప్పగా చెబుతూ శివరాజ్‌కుమార్‌ను అందులో భాగం చేయడం కన్నడను అవమానించడమే కాదు.. అహంకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ಮಾತೃಭಾಷೆಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು, ಆದರೆ ಅದರ ಹೆಸರಿನಲ್ಲಿ ದುರಭಿಮಾನ ಮೆರೆಯುವುದು ಸಂಸ್ಕೃತಿ ಹೀನ ನಡವಳಿಕೆಯಾಗುತ್ತದೆ. ಅದರಲ್ಲೂ ಕಲಾವಿದರಿಗೆ ಪ್ರತಿಯೊಂದು ಭಾಷೆಯನ್ನೂ ಗೌರವಿಸುವ ಸಂಸ್ಕಾರ ಇರಬೇಕು. ಕನ್ನಡವೂ ಸೇರಿದಂತೆ ಅನೇಕ ಭಾರತೀಯ ಭಾಷೆಗಳಲ್ಲಿ ನಟಿಸಿರುವ ನಟ @ikamalhaasan ತಮ್ಮ ತಮಿಳು ಭಾಷೆಯನ್ನು ವೈಭವಿಕರಿಸುವ ಮತ್ತಿನಲ್ಲಿ ನಟ… pic.twitter.com/PrfKX099lZ— Vijayendra Yediyurappa (@BYVijayendra) May 27, 2025

India Can Make It To Top 3 Economies By 2027 Here is The Details6
ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకానమీ ఔట్‌లుక్ ప్రకారం.. భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2021లో యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్న భారత్.. దశాబ్దం తరువాత జపాన్‌ను వెనక్కి నెట్టింది. ఇప్పుడు ఇండియా ముందున్న దేశాలు.. జర్మనీ, చైనా, అమెరికా మాత్రమే. అంటే ఇప్పుడు మన టార్గెట్ జర్మనీని అధిగమించడమే.2027నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారి.. జర్మన్ దేశాన్ని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించడమే భారత్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి విజయవంతంగా అమలు చేయాల్సిన అనేక సంస్కరణలను నిపుణులు రూపొందించారు. ఇందులో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలను ఆధునీకరించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం వ్యవసాయ సంస్కరణలు చేయడం.. ప్రగతిశీల మార్పుల కోసం కార్మిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, విద్య & ఉపాధి అవకాశాలపై భారీగా పెట్టుబడి పెట్టడం మొదలైనవి ఉన్నాయి.ప్రపంచ ఆర్ధిక అనిశ్చితులు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. అమెరికా టారీఫ్స్ ప్రభావం వంటివన్నీ ఉన్నప్పటికీ భారత్ జీడీపీ వృద్ధి రేటు స్థిరంగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది ప్రపంచంలోనే.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలువనుంది. ఒక అంచనా ప్రకారం.. 2025లో జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగా ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: జపాన్‌ను అధిగమించిన భారత్: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?కేంద్ర మంత్రి 'పియూష్ గోయల్' భారతదేశ ఆర్థిక పనితీరు 'అత్యుత్తమమైనది' అని ప్రశంసించారు. వృద్ధి పరంగా దేశం అన్ని జీ7, జీ20, BRICS దేశాలను సైతం అధిగమించిందని పేర్కొన్నారు. అయితే భారతదేశ వృద్ధి ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన అమెరికా, చైనా కంటే చాలా వెనుకబడి ఉంది. అయినప్పటికీ, భారత్ తన స్థిరమైన వృద్ధి వేగంతో ముందుకు సాగుతోంది.భారతదేశ ఆర్థిక మైలురాళ్ళు ఇలా..➤2007లో భారత్ మొదటి 1 ట్రిలియన్ డాలర్ల GDPని చేరుకోవడానికి 60 సంవత్సరాలు పట్టింది.➤2014 నాటికి.. 2 ట్రిలియన్ డాలర్స్ మార్కును దాటింది.➤COVID-19 మహమ్మారి వల్ల ఏర్పడిన అంతరాయాలు ఉన్నప్పటికీ.. 2021లో ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ➤ఇప్పుడు, కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత, భారతదేశం జపాన్ దేశాన్ని అధిగమించగలిగింది.

Dhanush Reveals Nagarjuna Rakshakudu His Favorite Movie7
నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్

నాగార్జున హీరోగా సినిమాలు చేయట్లేదు. అలా అని ఖాళీగా ఏం లేరు. కుబేర, కూలీ లాంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి 'కుబేర'లో నటించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ధనుష్.. నాగ్‌తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్.. ఆయన సినిమాల్లో 'రక్షకుడు' అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. దీంతో అసలు ఏంటి సినిమా అని కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో మాత్రం నాగ్ సినిమాలు చేశారు గానీ అప్పట్లో తమిళంలోనూ పలు చిత్రాలు చేశారు. అలాంటి ఓ మూవీనే రక్షకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)ప్రవీణ్ గాంధీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాని కుంజుమోన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైంది గానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలచింది. అక్కడక్కడ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్... అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇది తప్పితే స్టోరీ పరంగా తేలిపోవడంతో ఫ్లాప్ అయింది. అలాంటి మూవీ ధనుష్‌కి నచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టాడు.నాగ్ ప్రస్తుతం హీరోగా కంటే కీలక పాత్రలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చివరగా 'నా సామి రంగ' మూవీ చేశారు. తర్వాత అదిగో ఇదిగో అంటున్నారు గానీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‪‌మెంట్ లేదు. మరోవైపు కుబేర, కూలీ లాంటి క్రేజీ మూవీస్ చేశారు. జైలర్ 2లోనూ నాగ్ విలన్‌గా చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. (ఇదీ చదవండి: ‍'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్)

India To Develop Its Own 5th Gen Fighter Aircraft AMCA8
వచ్చేస్తోంది ఐదో తరం ఫైటర్‌

న్యూఢిల్లీ: మారుతున్న యుద్ధతంత్రాలకు అనుగుణంగా అధునాతన ఐదోతరం యుద్ధవిమానాన్ని రూపొందించే బృహత్తర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అడ్వాన్స్‌డ్‌ మీడి యా కంబాక్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ–అమ్కా)గా పిలిచే నవతరం యుద్ధవిమానం మోడల్‌ తయారీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఆమోదముద్ర వేశారు. ఏఎంసీఏ ప్రాజెక్ట్‌లో భాగంగా గగనతలంలో మెరుపువేగంతో దూసుకుపోతూ శత్రు రాడార్లు, నిఘా వ్యవస్థలను ఏమారుస్తూ భీకర స్థాయిలో దాడి చేయగల మధ్యస్థాయి బరువైన ఐదో తరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయనున్నారు.కొత్త ప్రాజెక్ట్‌ దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచడంతోపాటు స్థానిక వైమానిక తయారీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి ఇది బాటలు వేయనుందని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ) రక్షణ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఏఎంసీఏ మోడల్‌ను అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్‌ సంస్థలకూ ప్రాజెక్టులో భాగస్వామ్యం దక్కుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.‘‘ఈ ప్రాజెక్ట్‌ను స్వతంత్ర సంస్థలాగా లేదంటే జాయింట్‌ వెంచర్‌లాగా లేదంటే కన్సార్షియం మాదిరి నెలకొల్పి ప్రారంభించనున్నాం. ఈ కొత్త సంస్థను భారతీయ సంస్థగానే నమోదు చేస్తాం. పూర్తిగా భారతీయ చట్టాలు, నియమనిబంధనలకు లోబడే ఈ సంస్థ పనిచేయనుంది. ఏఎంసీఏ ప్రోటోటైప్‌ దేశీయ రక్షణరంగ సత్తాను చాటేలా ఉంటుంది. రక్షణరంగంలో స్వావలంబన, ఆత్మనిర్భరత సాధనలో ఇది మైలురాయిగా నిలవనుంది’’అని రక్షణ శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.15,000 కోట్ల ఆరంభ వ్యయంతో మొదలు పెట్టనున్నారు.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయుసేన, నావికాదళం డిమాండ్లకు తగ్గట్లు ఏఎంసీఏ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చుతోంది. తేలికపాటి యుద్ధవిమానమైన తేజస్‌ తర్వాత మధ్యశ్రేణి బరువైన అడ్వాన్స్‌డ్‌ మీడియా కంబాక్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ త యారీ దిశగా భారత్‌ ముందడుగు వేయడం విశేషం. దీన్ని 2035కల్లా తయారు చేయాలని డీఆర్‌డీవో భావిస్తుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ గతేడాది ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపింది. పదేళ్లలోపు తయారు చేస్తామని డీఆర్‌డీఓ పేర్కొంది. భిన్న రకాల బాంబులు అమ్కాలో వేర్వేరు రకాల క్షిపణులు, మందుగుండును అమర్చవచ్చు. ⇒ గైడెడ్‌ మిస్సైళ్లతోపాటు నాలుగు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించవచ్చు. ⇒ 1,500 కేజీల బరువైన బాంబులను సునాయాసంగా జారవిడవగలదు. ⇒ ఇది అత్యల్పస్థాయిలో విద్యుదయస్కాంత స్వ భావాన్ని ప్రదర్శిస్తుంది. దాంతో శత్రు రాడార్లు దీని జాడను కనిపెట్టడం చాలా కష్టం.మూడు దేశాల వద్దే ప్రస్తుతం మూడు దేశాల వద్ద మాత్రమే ఐదో తరం యుద్ధవిమానాలున్నాయి. ⇒ అమెరికా: ఎఫ్‌–22 రాప్టర్, ఎఫ్‌–35ఏ లైట్నింగ్‌– ఐఐ ⇒ చైనా: చెంగ్డూ జె–20 మైటీ డ్రాగన్, జె–35 ⇒ రష్యా: సుఖోయ్‌ 57ఇ సైలెంట్‌ కిల్లర్‌ కొత్త తరహా సెన్సార్‌ వ్యవస్థ, అంతర్గత ఆయుధ వ్యవస్థ, కమ్యూనికేషన్, నావిగేషన్, సూపర్‌ క్రూయిజ్‌ సామర్థ్యం ఇలా ఎన్నో విశిష్టతల సమాహారంగా అమ్కా ఫైటర్‌ జెట్‌ రూపుదిద్దుకోనుంది. ఇందులోని విశేషాలు అన్నీ ఇన్నీ కావు... ⇒ అమ్కా మొత్తం బరువు 25 టన్నులు. ఇందులో జంట ఇంజిన్లు ఉంటాయి. సుదూరాలకు ప్రయాణించగలిగేలా 6.5 టన్నుల ఇంధనాన్ని విమానంలో నింపొచ్చు. ⇒ కొత్త యుద్ధవ్యూహాలకు తగ్గట్లు, శత్రు రాడార్లకు చిక్కకుండా, నిశ్శబ్దంగా దూసుకెళ్లేలా దీనిని డిజైన్‌ చేస్తారు. ఇది ఏకంగా 55,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. ⇒ కృత్రిమ మేధ సాయంతో దీనిని పైలట్‌ లేకుండానే భూమి మీద నుంచే నియంత్రించవచ్చు. ⇒ ఉపగ్రహాల నుంచి అందే రియల్‌టైమ్‌ డేటా ను విశ్లేషించుకుంటూ కొత్తరకం నెట్‌ సెంట్రిక్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ⇒ ఇది అన్ని రకాల వాతావరణాల్లో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరి్నరోధంగా దూసుకెళ్లగలదు. ⇒ శత్రు గగనతలంలోకి వెళ్లగానే ఎల్రక్టానిక్, ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్‌ వ్యవస్థల సాయంతో వారి రాడార్లను పేల్చేసే ‘సీడ్‌’అనే ప్రత్యేక వ్య వస్థ ఈ విమానం సొంతం. అలా శత్రువుల క్షిపణి ప్రయోగ వ్యవస్థ నిర్విర్యమవుతుంది. మన యుద్ధవిమానాల పని సులువవుతుంది. ⇒ అమ్కా వేగంగా యాంటీ–రేడియేషన్‌ క్షిపణులను ప్రయోగించగలదు. ⇒ దీనిలో వాడే ఇంజన్‌ను విదేశీ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాను్యఫ్యాక్చరర్‌ (ఓఈఎం)లతో సంయుక్తంగా తయారు చేయనున్నారు.ఏమిటీ ఐదో తరం? ⇒ 1940–50 దశకంలో తయారైన వాటిని తొలి తరం యుద్ధవిమానాలుగా పేర్కొంటారు. వీటిల్లో రాడార్‌లు ఉండవు. కేవలం మెషీన్‌ గన్‌ బిగించి ఉంటుంది. వేగమూ తక్కువే. ⇒ 1950–60 కాలంలో తయారైనవి రెండో తరానికి చెందినవి. ప్రాథమిక స్థాయి రాడార్‌ వ్యవస్థ వీటిల్లో ఉండేది. సూపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లేవి. మిగ్‌–21, మిరాజ్‌–3 ఈ రకానివే. ⇒ 1970–80ల్లో తయారైనవి మూడో తరానికి చెందినవి. ఇవి శత్రు విమానాలను గాల్లోనే పేల్చేయగలవు. ఎఫ్‌–4, మిగ్‌–23, జాగ్వార్‌ ఈ కోవకు వస్తాయి. ⇒ 1980–90 కాలంలో తయారైనవి 3.5 తరానికి చెందినవి. వీటిల్లో డిజిటల్‌ వ్యవస్థలు వచ్చేశాయి. ఆకాశంలో 40 కి.మీ. దూరంలోని విమానాలను కూడా పేల్చేసే శక్తిసామర్థ్యాలు వీటి సొంతం. ఎఫ్‌–5ఈ టైగర్‌2, మిగ్‌–21 బిసాన్‌ ఈ రకానివే. ⇒ 1990 తర్వాత నాలుగో తరం యుద్ధవిమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్నవన్నీ 4, 4.5 తరాలకు చెందినవే.

legal Advice: Womens careers were destroyed by domestic abuse9
ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!

ఉద్యోగం మానేయమని చెప్పానని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది! తను ఉద్యోగం చేస్తే ఎవరిమాటా వినడం లేదనే ఉద్యోగం మానిపించాం. మళ్లీ తిరిగి వచ్చాక ఎలాగోలా మానిపిద్దాము అనుకుంటే నేను తాగుతున్నాను అనే వంకతో తిరిగి రానంటోంది. ఇప్పుడు నాకు కూడా తనంటే ఇష్టం పోయింది. ఏం చేయమంటారు? – పవన్‌ కుమార్, రాజమండ్రిమీరు వెంటనే డైవర్స్‌ పిటిషన్‌ ఫైల్‌ చేయండి. మీలాంటి పురుషాధిక్య భావజాలం ఉన్న వ్యక్తితో ఎవరూ ఉండకూడదు. మీ నుంచి ఆవిడకి విముక్తి అవసరం. భర్తని తన తల్లిదండ్రుల నుంచి విడదీయాలి అనుకోవడం క్రూరత్వం అని చాలా సందర్భాలలో కోర్టులు ఎలాగైతే చెప్పాయో, భార్య చేస్తున్న ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనుకోవటం, భర్త – అత్తామామల ఆజ్ఞలు మాత్రమే పాటించాలి అనుకోవడం కూడా అలాగే ‘గృహ హింస’ కిందకి వస్తాయి. ఆవిడా మీరు వద్దని అంటోంది కాబట్టి సామరస్యంగా మాట్లాడుకొని మ్యూచువల్‌ కన్సెంట్‌ డివోర్స్‌ (పరస్పర అంగీకార విడాకులు) తీసుకుని మిమ్మల్ని మీరు కేసులనుండి కాడుకోవటం మంచిది.నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు నెలసరి వడ్డీకి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద సంతకాలు, సాక్షుల సంతకాలు తీసుకున్నాను. అయితే అతను అసలు వడ్డీ కట్టకపోగా అసలు కూడా ఇవ్వడం లేదు. అతనికి, అతని భార్యకి, పిల్లలకి కూడా ఆస్తులు ఉన్నాయి. ఎంత అడిగినా ‘నేను చెక్కులు కూడా ఇవ్వలేదు కదా ఏం చేసుకుంటావో చేసుకో’ అంటున్నాడు. నా డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారమే లేదా? – ఎస్‌డీ. జహంగీర్, హైద్రాబాద్‌మీరు డబ్బులు ఇచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది అని చెప్తున్నారు కాబట్టి మీరు సివిల్‌ కోర్టును ఆశ్రయించి అతనిపై దావా వేయవచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతను మిమ్మల్ని మోసం చేశాడు అనడానికి ఏదైనా ఆధారం లేదా రుజువు చేసే పత్రాలు ఉంటే ΄ోలీసులను ఆశ్రయించి క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేసే వీలు ఉంది. మీ లేఖలో రాసిన దాని ప్రకారం మీ డబ్బులు మీకు తిరిగి రావు అని చెప్పలేము. అలాగే కచ్చితంగా వస్తాయి అని కూడా చెప్పలేము. మీ దగ్గర ఉన్న పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, మీ ఆర్థిక స్థితిగతులు చూపించడానికి వీలు ఉండే ఏదైనా ఆధారాలు తీసుకొని ఒక లాయర్‌ గారిని కలవండి. అన్నీ పరిశీలించిన తర్వాత మీ కేసులో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్‌..! బతకదు అనుకున్న భార్యను..)

Central govt employees Major pension rule change PSUs10
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. కొత్త రూల్‌తో బెనిఫిట్స్‌ జీరో

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ)కు సంబంధించిన ఉద్యోగుల పెన్షన్‌ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు డిస్మిస్‌ అయినా, మధ్యలో తొలగింపునకు గురైనా అతడికి రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు అందవు. అయితే, సదరు ఉద్యోగి డిస్మిస్‌ లేదా తొలగింపును పరిపాలనా శాఖ పునఃసమీక్షిస్తుంది. ఈ మేరకు సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) రూల్స్‌–2021లో మార్పులు చేసి, సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) అమెండ్‌మెంట్‌ రూల్స్‌–2025 తీసుకొచ్చారు.ఇక, ఈ కొత్త నిబంధనలను ఈ నెల 22న నోటిఫై చేశారు. సర్వీసులో ఉన్నప్పుడు మధ్యలో దు్రష్పవర్తన కారణంగా తొలగింపునకు గురైతే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి అవకాశం లేదు. మధ్యలో డిస్మిస్‌ అయినా సరే రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు యథావిధిగా అందేవి. 2003 డిసెంబర్‌ 31 కంటే ముందు నియమితులైన కేంద ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మేరకు సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పెన్షన్‌) రూల్స్‌–2021 వర్తిస్తాయి. రైల్వే ఉద్యోగులకు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి సర్వీసులకు మినహాయింపు ఉంటుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement