Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల హక్కులను గౌరవించకుండా ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలు చేస్తోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. యువకులపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి ‘తెనాలిలో దళిత, మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్ విక్టర్, దోమా రాకేశ్, షేక్ బాబూలాల్ అలియాస్ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్ల మీద లాఠీలతో దారుణంగా కొట్టారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్.. బాధితుల కాళ్లను తొక్కిపట్టగా, మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాఠీలతో దాడి చేశారు. మిగిలినవారు ఈ దాడిని వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ కొత్తవి అందజేశారు. వీడియో వైరల్ అయ్యాకే విషయం వెలుగులోకి... ఘోర ఘటనపై మాట్లాడడానికి కూడా ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు. వీడియో వైరల్ అయ్యాకే దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో ఈ ఉదంతం చెబుతోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇలాంటి ఎన్నో దారుణ, అమానవీయ దాడులు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు నోరు విప్పలేని పరిస్థితులు ఉండటం వల్ల వెలుగులోకి రావడం లేదు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కేవలం కాగితంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది మానవ హక్కులను కాలరాసే చర్య... తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల దాడి మానవ హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి చేయడమే. పోలీసులు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను సమరి్పంచాలే తప్ప... వాళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి, శిక్షించే పని చేపట్టకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కొట్టడం, హింసించడానికి చోటే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ట్రంప్ మరో సంచలనం.. విద్యార్థి వీసా ఇంటర్వూలకు బ్రేక్
వాషింగ్టన్: అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్ ప్రభుత్వం ఆందోళనల నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక, ఇప్పటికే షెడ్యూలింగ్ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, ఈరోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు అత్యయిక ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగ నిపుణులు విశ్లేషించచనున్నారు. ఎఫ్, ఎం, జే కేటగిరీ దరఖాస్తుల సోషల్మీడియా ఖాతాల పాత పోస్ట్లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు.అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్మీడియా ప్రొఫైల్, హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూలదాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది. క్లాసులు డుమ్మా కొడితే వీసా రద్దు.. ఇదిలా ఉండగా.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్ స్టేటస్ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది.

బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్కు మళ్లీ పిలుపు
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్ను మరో సారి ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించగా... ఆ్రస్టేలియాలో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో సహాయక కోచ్ అభిషేక్ నాయర్తో పాటు దిలీప్ను తొలగించింది.ఫీల్డింగ్ కోచ్గా విదేశీయుడిని నియమించాలని బోర్డు ప్రయత్నించనా... అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్ను తిరిగి ఎంపిక చేసింది. "దిలీప్ చాలా మంచి కోచ్. నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు అతడిని తిరిగి నియమించాం"అని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్టు కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్, సుదర్శన్ జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్తో జరిగే వార్మప్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: జితేశ్ జితాదియా

కెనడాకు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కెనడా విలీన ఆఫర్ను ప్రకటించారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా (Canada) చేరితే.. గోల్డెన్ డోమ్ను ఉచితంగా పొందవచ్చు అని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అమెరికా రక్షణ కోసం అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్ డోమ్ (Golden Dome)’ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టులో చేరేందుకు అమెరికా పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబర్చింది.#BREAKING: Donald Trump says Canada is considering his offer to become the 51st state pic.twitter.com/QNPGN7VB92— 6ixBuzzTV (@6ixbuzztv) May 27, 2025ఈ నేపథ్యంలో కెనడా విషయమై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. మరోసారి విలీన డిమాండ్ను లేవనెత్తారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా చేరితే.. గోల్డెన్ డోమ్ను ఉచితంగా పొందొచ్చని వ్యాఖ్యానించారు. లేదంటే 61 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కెనడా ఈ ఆఫర్ను పరిశీలించుకోవచ్చు అంటూ సలహా ఇచ్చారు. ఇక, ట్రంప్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కెనడా నుంచి ఎలాంటి ప్రతి స్పందనా రాలేదు.గోల్డెన్ డోమ్ ఇలా..అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచం గోల్డెన్ డోమ్పై డొనాల్డ్ ట్రంప్ ఈ ప్లాన్ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు విలువ 175 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది అమెరికాను బాలిస్టిక్, క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలావరకు అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా.. మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉండనుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకమైంది. వీటిల్లో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా రోనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్వార్స్ వ్యవస్థను తలపిస్తోంది.అమెరికా విశాలమైన దేశం కావడంతో.. అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే.. అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లతో ఓ నెట్వర్క్నే సృష్టించాల్సి ఉంటుందని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఫారెన్ పాలసీ ప్రోగ్రామ్ పరిశోధన విభాగం డైరెక్టర్ మిషెల్ ఓ హన్లోన్ అభిప్రాయపడ్డారు. లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలిక కాదని.. అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు ఇతర సామగ్రిని పెద్ద మొత్తంలో రోదసీలోకి చేర్చాల్సి ఉంటుందన్నారు. ఇది చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీనిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చైనా, రష్యా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి తీవ్రస్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని.. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపించాయి.

కన్నడ, తమిళ భాషపై కమల్ వ్యాఖ్యలు.. కర్ణాటకలో దుమారం
చెన్నై: కన్నడ భాషకు తమిళమే మాతృక అంటూ ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కమల్ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కమల్ కార్యక్రమానికి కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఆదివారం చెన్నైలో జరిగిన తన సినిమా థగ్లైఫ్ ఆడియో విడుదల వేడుకలో కమల్ హాసన్, శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమల్ మాట్లాడుతూ.. కన్నడ భాషకు తమిళమే మాతృక. ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివరాజ్ కుమార్) ఇక్కడకి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో కమల్ వ్యాఖ్యలను పలు కన్నడ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే కర్ణాటకలో కమల్ సినిమాలను బహిష్కరిస్తామని కన్నడ రక్షణ వేదిక హెచ్చరించింది. బెంగళూరు వ్యాప్తంగా థగ్లైఫ్ సినిమా బ్యానర్లను నిరసన కారులు చించేశారు. ఆ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన థగ్లైఫ్ ప్రీ రిలీజ్ కార్యక్రమ వేదిక వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. కమల్పై నల్ల ఇంకు పోస్తామంటూ హెచ్చరించారు. తమకు భయపడి ఆయన వేడుకకు గైర్హాజరయ్యారని ఎద్దేవా చేశారు.Kamal Haasan says Kannada came from TamilHello @ikamalhaasan before making such claims, learn some real history. This land doesn’t need language lessons from Periyar fanatics🤡Kannada has a history spanning over 2,000 years, one of the world’s oldest living languages, with… pic.twitter.com/BQFUloI0Sg— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) May 27, 2025మరోవైపు.. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప, తదితరులు కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయేంద్ర యడియూరప్ప స్పందిస్తూ..‘కమల్ హాసన్ సంస్కారం లేని వ్యక్తి. కన్నడ భాషను అవమానించారు. మాతృ భాషను ప్రేమించడం మంచిదే కానీ, ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదు. కన్నడ, సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, తన ప్రసంగంలో తమిళాన్ని గొప్పగా చెబుతూ శివరాజ్కుమార్ను అందులో భాగం చేయడం కన్నడను అవమానించడమే కాదు.. అహంకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ಮಾತೃಭಾಷೆಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು, ಆದರೆ ಅದರ ಹೆಸರಿನಲ್ಲಿ ದುರಭಿಮಾನ ಮೆರೆಯುವುದು ಸಂಸ್ಕೃತಿ ಹೀನ ನಡವಳಿಕೆಯಾಗುತ್ತದೆ. ಅದರಲ್ಲೂ ಕಲಾವಿದರಿಗೆ ಪ್ರತಿಯೊಂದು ಭಾಷೆಯನ್ನೂ ಗೌರವಿಸುವ ಸಂಸ್ಕಾರ ಇರಬೇಕು. ಕನ್ನಡವೂ ಸೇರಿದಂತೆ ಅನೇಕ ಭಾರತೀಯ ಭಾಷೆಗಳಲ್ಲಿ ನಟಿಸಿರುವ ನಟ @ikamalhaasan ತಮ್ಮ ತಮಿಳು ಭಾಷೆಯನ್ನು ವೈಭವಿಕರಿಸುವ ಮತ್ತಿನಲ್ಲಿ ನಟ… pic.twitter.com/PrfKX099lZ— Vijayendra Yediyurappa (@BYVijayendra) May 27, 2025

ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకానమీ ఔట్లుక్ ప్రకారం.. భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2021లో యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్న భారత్.. దశాబ్దం తరువాత జపాన్ను వెనక్కి నెట్టింది. ఇప్పుడు ఇండియా ముందున్న దేశాలు.. జర్మనీ, చైనా, అమెరికా మాత్రమే. అంటే ఇప్పుడు మన టార్గెట్ జర్మనీని అధిగమించడమే.2027నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారి.. జర్మన్ దేశాన్ని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించడమే భారత్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి విజయవంతంగా అమలు చేయాల్సిన అనేక సంస్కరణలను నిపుణులు రూపొందించారు. ఇందులో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలను ఆధునీకరించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం వ్యవసాయ సంస్కరణలు చేయడం.. ప్రగతిశీల మార్పుల కోసం కార్మిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, విద్య & ఉపాధి అవకాశాలపై భారీగా పెట్టుబడి పెట్టడం మొదలైనవి ఉన్నాయి.ప్రపంచ ఆర్ధిక అనిశ్చితులు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. అమెరికా టారీఫ్స్ ప్రభావం వంటివన్నీ ఉన్నప్పటికీ భారత్ జీడీపీ వృద్ధి రేటు స్థిరంగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది ప్రపంచంలోనే.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలువనుంది. ఒక అంచనా ప్రకారం.. 2025లో జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగా ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: జపాన్ను అధిగమించిన భారత్: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?కేంద్ర మంత్రి 'పియూష్ గోయల్' భారతదేశ ఆర్థిక పనితీరు 'అత్యుత్తమమైనది' అని ప్రశంసించారు. వృద్ధి పరంగా దేశం అన్ని జీ7, జీ20, BRICS దేశాలను సైతం అధిగమించిందని పేర్కొన్నారు. అయితే భారతదేశ వృద్ధి ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన అమెరికా, చైనా కంటే చాలా వెనుకబడి ఉంది. అయినప్పటికీ, భారత్ తన స్థిరమైన వృద్ధి వేగంతో ముందుకు సాగుతోంది.భారతదేశ ఆర్థిక మైలురాళ్ళు ఇలా..➤2007లో భారత్ మొదటి 1 ట్రిలియన్ డాలర్ల GDPని చేరుకోవడానికి 60 సంవత్సరాలు పట్టింది.➤2014 నాటికి.. 2 ట్రిలియన్ డాలర్స్ మార్కును దాటింది.➤COVID-19 మహమ్మారి వల్ల ఏర్పడిన అంతరాయాలు ఉన్నప్పటికీ.. 2021లో ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ➤ఇప్పుడు, కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత, భారతదేశం జపాన్ దేశాన్ని అధిగమించగలిగింది.

నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్
నాగార్జున హీరోగా సినిమాలు చేయట్లేదు. అలా అని ఖాళీగా ఏం లేరు. కుబేర, కూలీ లాంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్తో కలిసి 'కుబేర'లో నటించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ధనుష్.. నాగ్తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్.. ఆయన సినిమాల్లో 'రక్షకుడు' అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. దీంతో అసలు ఏంటి సినిమా అని కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో మాత్రం నాగ్ సినిమాలు చేశారు గానీ అప్పట్లో తమిళంలోనూ పలు చిత్రాలు చేశారు. అలాంటి ఓ మూవీనే రక్షకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)ప్రవీణ్ గాంధీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాని కుంజుమోన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైంది గానీ ఘోరమైన డిజాస్టర్గా నిలచింది. అక్కడక్కడ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్... అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇది తప్పితే స్టోరీ పరంగా తేలిపోవడంతో ఫ్లాప్ అయింది. అలాంటి మూవీ ధనుష్కి నచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టాడు.నాగ్ ప్రస్తుతం హీరోగా కంటే కీలక పాత్రలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చివరగా 'నా సామి రంగ' మూవీ చేశారు. తర్వాత అదిగో ఇదిగో అంటున్నారు గానీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ లేదు. మరోవైపు కుబేర, కూలీ లాంటి క్రేజీ మూవీస్ చేశారు. జైలర్ 2లోనూ నాగ్ విలన్గా చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. (ఇదీ చదవండి: 'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్)

వచ్చేస్తోంది ఐదో తరం ఫైటర్
న్యూఢిల్లీ: మారుతున్న యుద్ధతంత్రాలకు అనుగుణంగా అధునాతన ఐదోతరం యుద్ధవిమానాన్ని రూపొందించే బృహత్తర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అడ్వాన్స్డ్ మీడి యా కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ–అమ్కా)గా పిలిచే నవతరం యుద్ధవిమానం మోడల్ తయారీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆమోదముద్ర వేశారు. ఏఎంసీఏ ప్రాజెక్ట్లో భాగంగా గగనతలంలో మెరుపువేగంతో దూసుకుపోతూ శత్రు రాడార్లు, నిఘా వ్యవస్థలను ఏమారుస్తూ భీకర స్థాయిలో దాడి చేయగల మధ్యస్థాయి బరువైన ఐదో తరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయనున్నారు.కొత్త ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచడంతోపాటు స్థానిక వైమానిక తయారీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి ఇది బాటలు వేయనుందని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) రక్షణ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఏఎంసీఏ మోడల్ను అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్ సంస్థలకూ ప్రాజెక్టులో భాగస్వామ్యం దక్కుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.‘‘ఈ ప్రాజెక్ట్ను స్వతంత్ర సంస్థలాగా లేదంటే జాయింట్ వెంచర్లాగా లేదంటే కన్సార్షియం మాదిరి నెలకొల్పి ప్రారంభించనున్నాం. ఈ కొత్త సంస్థను భారతీయ సంస్థగానే నమోదు చేస్తాం. పూర్తిగా భారతీయ చట్టాలు, నియమనిబంధనలకు లోబడే ఈ సంస్థ పనిచేయనుంది. ఏఎంసీఏ ప్రోటోటైప్ దేశీయ రక్షణరంగ సత్తాను చాటేలా ఉంటుంది. రక్షణరంగంలో స్వావలంబన, ఆత్మనిర్భరత సాధనలో ఇది మైలురాయిగా నిలవనుంది’’అని రక్షణ శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ను రూ.15,000 కోట్ల ఆరంభ వ్యయంతో మొదలు పెట్టనున్నారు.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయుసేన, నావికాదళం డిమాండ్లకు తగ్గట్లు ఏఎంసీఏ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతోంది. తేలికపాటి యుద్ధవిమానమైన తేజస్ తర్వాత మధ్యశ్రేణి బరువైన అడ్వాన్స్డ్ మీడియా కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ త యారీ దిశగా భారత్ ముందడుగు వేయడం విశేషం. దీన్ని 2035కల్లా తయారు చేయాలని డీఆర్డీవో భావిస్తుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గతేడాది ఈ ప్రాజెక్ట్కు అంగీకారం తెలిపింది. పదేళ్లలోపు తయారు చేస్తామని డీఆర్డీఓ పేర్కొంది. భిన్న రకాల బాంబులు అమ్కాలో వేర్వేరు రకాల క్షిపణులు, మందుగుండును అమర్చవచ్చు. ⇒ గైడెడ్ మిస్సైళ్లతోపాటు నాలుగు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించవచ్చు. ⇒ 1,500 కేజీల బరువైన బాంబులను సునాయాసంగా జారవిడవగలదు. ⇒ ఇది అత్యల్పస్థాయిలో విద్యుదయస్కాంత స్వ భావాన్ని ప్రదర్శిస్తుంది. దాంతో శత్రు రాడార్లు దీని జాడను కనిపెట్టడం చాలా కష్టం.మూడు దేశాల వద్దే ప్రస్తుతం మూడు దేశాల వద్ద మాత్రమే ఐదో తరం యుద్ధవిమానాలున్నాయి. ⇒ అమెరికా: ఎఫ్–22 రాప్టర్, ఎఫ్–35ఏ లైట్నింగ్– ఐఐ ⇒ చైనా: చెంగ్డూ జె–20 మైటీ డ్రాగన్, జె–35 ⇒ రష్యా: సుఖోయ్ 57ఇ సైలెంట్ కిల్లర్ కొత్త తరహా సెన్సార్ వ్యవస్థ, అంతర్గత ఆయుధ వ్యవస్థ, కమ్యూనికేషన్, నావిగేషన్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం ఇలా ఎన్నో విశిష్టతల సమాహారంగా అమ్కా ఫైటర్ జెట్ రూపుదిద్దుకోనుంది. ఇందులోని విశేషాలు అన్నీ ఇన్నీ కావు... ⇒ అమ్కా మొత్తం బరువు 25 టన్నులు. ఇందులో జంట ఇంజిన్లు ఉంటాయి. సుదూరాలకు ప్రయాణించగలిగేలా 6.5 టన్నుల ఇంధనాన్ని విమానంలో నింపొచ్చు. ⇒ కొత్త యుద్ధవ్యూహాలకు తగ్గట్లు, శత్రు రాడార్లకు చిక్కకుండా, నిశ్శబ్దంగా దూసుకెళ్లేలా దీనిని డిజైన్ చేస్తారు. ఇది ఏకంగా 55,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. ⇒ కృత్రిమ మేధ సాయంతో దీనిని పైలట్ లేకుండానే భూమి మీద నుంచే నియంత్రించవచ్చు. ⇒ ఉపగ్రహాల నుంచి అందే రియల్టైమ్ డేటా ను విశ్లేషించుకుంటూ కొత్తరకం నెట్ సెంట్రిక్ వార్ఫేర్ సిస్టమ్తో ఇది పనిచేస్తుంది. ⇒ ఇది అన్ని రకాల వాతావరణాల్లో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరి్నరోధంగా దూసుకెళ్లగలదు. ⇒ శత్రు గగనతలంలోకి వెళ్లగానే ఎల్రక్టానిక్, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థల సాయంతో వారి రాడార్లను పేల్చేసే ‘సీడ్’అనే ప్రత్యేక వ్య వస్థ ఈ విమానం సొంతం. అలా శత్రువుల క్షిపణి ప్రయోగ వ్యవస్థ నిర్విర్యమవుతుంది. మన యుద్ధవిమానాల పని సులువవుతుంది. ⇒ అమ్కా వేగంగా యాంటీ–రేడియేషన్ క్షిపణులను ప్రయోగించగలదు. ⇒ దీనిలో వాడే ఇంజన్ను విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాను్యఫ్యాక్చరర్ (ఓఈఎం)లతో సంయుక్తంగా తయారు చేయనున్నారు.ఏమిటీ ఐదో తరం? ⇒ 1940–50 దశకంలో తయారైన వాటిని తొలి తరం యుద్ధవిమానాలుగా పేర్కొంటారు. వీటిల్లో రాడార్లు ఉండవు. కేవలం మెషీన్ గన్ బిగించి ఉంటుంది. వేగమూ తక్కువే. ⇒ 1950–60 కాలంలో తయారైనవి రెండో తరానికి చెందినవి. ప్రాథమిక స్థాయి రాడార్ వ్యవస్థ వీటిల్లో ఉండేది. సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేవి. మిగ్–21, మిరాజ్–3 ఈ రకానివే. ⇒ 1970–80ల్లో తయారైనవి మూడో తరానికి చెందినవి. ఇవి శత్రు విమానాలను గాల్లోనే పేల్చేయగలవు. ఎఫ్–4, మిగ్–23, జాగ్వార్ ఈ కోవకు వస్తాయి. ⇒ 1980–90 కాలంలో తయారైనవి 3.5 తరానికి చెందినవి. వీటిల్లో డిజిటల్ వ్యవస్థలు వచ్చేశాయి. ఆకాశంలో 40 కి.మీ. దూరంలోని విమానాలను కూడా పేల్చేసే శక్తిసామర్థ్యాలు వీటి సొంతం. ఎఫ్–5ఈ టైగర్2, మిగ్–21 బిసాన్ ఈ రకానివే. ⇒ 1990 తర్వాత నాలుగో తరం యుద్ధవిమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్నవన్నీ 4, 4.5 తరాలకు చెందినవే.

ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!
ఉద్యోగం మానేయమని చెప్పానని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది! తను ఉద్యోగం చేస్తే ఎవరిమాటా వినడం లేదనే ఉద్యోగం మానిపించాం. మళ్లీ తిరిగి వచ్చాక ఎలాగోలా మానిపిద్దాము అనుకుంటే నేను తాగుతున్నాను అనే వంకతో తిరిగి రానంటోంది. ఇప్పుడు నాకు కూడా తనంటే ఇష్టం పోయింది. ఏం చేయమంటారు? – పవన్ కుమార్, రాజమండ్రిమీరు వెంటనే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. మీలాంటి పురుషాధిక్య భావజాలం ఉన్న వ్యక్తితో ఎవరూ ఉండకూడదు. మీ నుంచి ఆవిడకి విముక్తి అవసరం. భర్తని తన తల్లిదండ్రుల నుంచి విడదీయాలి అనుకోవడం క్రూరత్వం అని చాలా సందర్భాలలో కోర్టులు ఎలాగైతే చెప్పాయో, భార్య చేస్తున్న ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనుకోవటం, భర్త – అత్తామామల ఆజ్ఞలు మాత్రమే పాటించాలి అనుకోవడం కూడా అలాగే ‘గృహ హింస’ కిందకి వస్తాయి. ఆవిడా మీరు వద్దని అంటోంది కాబట్టి సామరస్యంగా మాట్లాడుకొని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ (పరస్పర అంగీకార విడాకులు) తీసుకుని మిమ్మల్ని మీరు కేసులనుండి కాడుకోవటం మంచిది.నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు నెలసరి వడ్డీకి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద సంతకాలు, సాక్షుల సంతకాలు తీసుకున్నాను. అయితే అతను అసలు వడ్డీ కట్టకపోగా అసలు కూడా ఇవ్వడం లేదు. అతనికి, అతని భార్యకి, పిల్లలకి కూడా ఆస్తులు ఉన్నాయి. ఎంత అడిగినా ‘నేను చెక్కులు కూడా ఇవ్వలేదు కదా ఏం చేసుకుంటావో చేసుకో’ అంటున్నాడు. నా డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారమే లేదా? – ఎస్డీ. జహంగీర్, హైద్రాబాద్మీరు డబ్బులు ఇచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది అని చెప్తున్నారు కాబట్టి మీరు సివిల్ కోర్టును ఆశ్రయించి అతనిపై దావా వేయవచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతను మిమ్మల్ని మోసం చేశాడు అనడానికి ఏదైనా ఆధారం లేదా రుజువు చేసే పత్రాలు ఉంటే ΄ోలీసులను ఆశ్రయించి క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే వీలు ఉంది. మీ లేఖలో రాసిన దాని ప్రకారం మీ డబ్బులు మీకు తిరిగి రావు అని చెప్పలేము. అలాగే కచ్చితంగా వస్తాయి అని కూడా చెప్పలేము. మీ దగ్గర ఉన్న పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, మీ ఆర్థిక స్థితిగతులు చూపించడానికి వీలు ఉండే ఏదైనా ఆధారాలు తీసుకొని ఒక లాయర్ గారిని కలవండి. అన్నీ పరిశీలించిన తర్వాత మీ కేసులో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. కొత్త రూల్తో బెనిఫిట్స్ జీరో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్యూ)కు సంబంధించిన ఉద్యోగుల పెన్షన్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు డిస్మిస్ అయినా, మధ్యలో తొలగింపునకు గురైనా అతడికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందవు. అయితే, సదరు ఉద్యోగి డిస్మిస్ లేదా తొలగింపును పరిపాలనా శాఖ పునఃసమీక్షిస్తుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) రూల్స్–2021లో మార్పులు చేసి, సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) అమెండ్మెంట్ రూల్స్–2025 తీసుకొచ్చారు.ఇక, ఈ కొత్త నిబంధనలను ఈ నెల 22న నోటిఫై చేశారు. సర్వీసులో ఉన్నప్పుడు మధ్యలో దు్రష్పవర్తన కారణంగా తొలగింపునకు గురైతే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి అవకాశం లేదు. మధ్యలో డిస్మిస్ అయినా సరే రిటైర్మెంట్ ప్రయోజనాలు యథావిధిగా అందేవి. 2003 డిసెంబర్ 31 కంటే ముందు నియమితులైన కేంద ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) రూల్స్–2021 వర్తిస్తాయి. రైల్వే ఉద్యోగులకు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు మినహాయింపు ఉంటుంది.
OP Sindoor: పాక్ ఎయిర్బేస్పై భారత్ గట్టి దెబ్బ
అంధత్వం కాదు అక్షర బంధుత్వం..
దేశమంతా ఒకే ధరకు ఈ కారు!
రెడ్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
డిష్ వాష్బార్లతో చేతులు పాడవ్వుతున్నాయా..?
టర్కీ కంపెనీతో కాంట్రాక్ట్ రద్దు
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
దిగ్గజ కంపెనీ నిర్ణయం: వేలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!
ఇద్దరు పిల్లలున్న అమ్మలకు గుడ్న్యూస్..!
రేవ్ పార్టీ.. 20 మంది అమ్మాయిలు అరెస్టు..!
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)
భారత్తో మనుగడకే ప్రమాదం
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
వద్దుసార్! ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తోనే ఊపిరాడటం లేదు!
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
మీ పనే బాగుంది సార్! ముందు యుద్ధాలకు ఉసిగొల్పి.. తర్వాత కాల్పుల విరమణ అని భలే బిల్డప్ ఇస్తున్నారు!!
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
కొత్త రేషన్ కార్డులకు మోక్షం
సాక్షి కార్టూన్ 27-05-2025
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
ప్రియుడు మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు..
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
OP Sindoor: పాక్ ఎయిర్బేస్పై భారత్ గట్టి దెబ్బ
అంధత్వం కాదు అక్షర బంధుత్వం..
దేశమంతా ఒకే ధరకు ఈ కారు!
రెడ్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
డిష్ వాష్బార్లతో చేతులు పాడవ్వుతున్నాయా..?
టర్కీ కంపెనీతో కాంట్రాక్ట్ రద్దు
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
దిగ్గజ కంపెనీ నిర్ణయం: వేలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!
ఇద్దరు పిల్లలున్న అమ్మలకు గుడ్న్యూస్..!
రేవ్ పార్టీ.. 20 మంది అమ్మాయిలు అరెస్టు..!
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
భారత్తో మనుగడకే ప్రమాదం
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
వద్దుసార్! ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తోనే ఊపిరాడటం లేదు!
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
మీ పనే బాగుంది సార్! ముందు యుద్ధాలకు ఉసిగొల్పి.. తర్వాత కాల్పుల విరమణ అని భలే బిల్డప్ ఇస్తున్నారు!!
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
కొత్త రేషన్ కార్డులకు మోక్షం
సాక్షి కార్టూన్ 27-05-2025
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
ప్రియుడు మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు..
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ కమెడియన్.. ఎన్ని కోట్లో తెలుసా?
సినిమా

రజినీకాంత్ కూలీ.. పారితోషికం ఏకంగా అన్ని కోట్లా?
రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రంగా నిలవనుంది. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.ఈ మూవీ బడ్జెట్తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం. ఇవన్నీ కలిపితే కూలీ బడ్జెట్ రూ.375 పైగానే ఉండనుంది.భారీ ధరకు కూలీ ఓటీటీ రైట్స్..ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ హక్కులు రూ. 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ. 240 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్కుమార్తో 'జైలర్ 2లో నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

తెరపై ఒక్కసారి కనిపించకున్నా...లేడీ సూపర్ స్టారే...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సీతార ఘట్టమనేని(Sitara Ghattamaneni) పేరు ఇప్పుడు ప్రకటనల ప్రపంచంలో మార్మోగుతోంది. అయితే ఓ అగ్రనటుడి కుమార్తెగానో లేక బాల నటిగానో కాదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన యాడ్ ఫేస్గా ఆమె సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసడర్గా, యాడ్ మోడల్గా ఆమె చూపిస్తున్న టాలెంట్కు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఆమె వయస్సు కేవలం 11 ఏళ్లు మాత్రమే అయినా, చూపే ప్రొఫెషనలిజం, కెమెరా ముందు చూపుతున్న కాన్ఫిడెన్స్ చూసి యాడ్ రూపకర్తలు ఆమెవైపు అమితంగా ఆకర్షితులవుతున్నారు.సీతార కెమెరా ముందు మొదటిసారి కనిపించింది ఓ ఫ్యామిలీ యాడ్లో. అందులో తన తల్లి నమ్రత శిరోద్కర్, తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రచారంలో కనిపించింది. ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, బ్రాండ్కు పెద్దగా ప్రాచుర్యం వచ్చింది.అప్పటి నుంచి సీతారకు యాడ్స్ ఆఫర్లు వెల్లువెత్తడం ప్రారంభమైంది. అనుకోకుండా చేసిన యాడ్తో వచ్చిన పాప్యులారిటీతో ఇతర బ్రాండ్లు కూడా ఆమెను సంప్రదించాయి. ఆ తర్వాత ఆమె ‘బేబీ స్కిన్ కేర్‘, ‘ఎడ్యుకేషన్ ప్యాకేజింగ్‘, ‘ఫ్యాషన్‘ వంటి విభాగాల్లో చేసిన యాడ్స్ లక్షల సంఖ్యలో వ్యూస్ ఆదరణ సాధించాయి. పిఎంజె జ్యూయల్స్, ఒట్లో క్లోతింగ్, టాటా సంపన్న్ జూనియర్ ఫుడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మామిఎర్త్, జీ తెలుగు ఫ్యామిలీ ప్రోమో, ట్రెండ్స్... ఇలా అనేక టాప్ బ్రాండ్స్లో ఆమె కనిపిస్తోంది. వీటిలో తన డాడీ మహేష్తో కలిసి చేసిన ట్రెండ్స్ సంస్థ యాడ్ నిజంగా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.యాడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, సీతార ఒక్కో యాడ్ కు రూ. 15 – 25 లక్షల వరకు పారితోషికం( Remuneration) అందుకుంటోంది. వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్ల పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఆదాయం ప్రత్యేకంగా ఆమె పేరిట ఓ ట్రస్ట్ ఖాతాలో వేస్తున్నామని, ఈ మొత్తం భవిష్యత్తులో ఆమె విద్య, క్రియేటివ్ అభిరుచుల విస్త్రుతికి ఉపయోగించనున్నట్లు సమాచారం.కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ కావడంతో పాటు అమాయకత్వంతో కూడిన గ్లామర్ సితారకు ప్లస్ అవుతోంది. అలాగే తండ్రి, తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అభినయ ప్రతిభ కూడా ఆమెకు మరో బలం. ముఖ్యంగా తల్లి నమ్రత శిరోద్కర్ గతంలో మిస్ ఇండియా గా ఉన్నందున, ఫ్యాషన్, కెమెరా నైపుణ్యాల్లో తల్లి గైడెన్స్ ఆమెకు బాగా ఉపయోగపడుతోంది.ఇంతింతై..సితార స్టారై...ఇప్పటికే సితార పేరుతో ఇంటర్నెట్లో ప్రత్యేక ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఆమె ఏ వీడియో వదిలినా మిలియన్ల వ్యూస్ వస్తాయి. ప్రస్తుతం తను పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది, అయితే యాడ్ ఫిల్మ్స్ను పేషన్గా తీసుకుంటోందో లేక రేపటి బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రిహార్సల్గా తీసుకుంటుందో గానీ... తెరపై నైపుణ్యం పెరిగే కొద్దీ, ఆమె పెద్ద తెరపై నటిగా అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెను ‘చైల్డ్ లీడ్ రోల్‘లో తీసుకోవాలని కొందరు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.చిన్న వయసులో పెద్ద నెపథ్యంతో తెరపైకి వచ్చినా, ఆమె చూపిస్తున్న ప్రతిభ మాత్రం పూర్తిగా ఒరిజినల్. ఇదే విధంగా తండ్రి స్టార్ పవర్, తల్లి గైడెన్స్, తన స్వంత ప్రతిభ మేళవిస్తూ సితార కొనసాగితే ఆమె చరిత్ర సృష్టించకుండా అసాధ్యం అనే చెప్పాలి. ఇప్పుడు యాడ్ ప్రపంచంలో చైల్డ్ ఐకాన్ గా ఆమె సృష్టిస్తున్న సందడి చూస్తుంటే, అప్పుడే ఏమైంది? ‘‘ఇంకా చాలా ఉంది చూడడానికి!’’ అనిపించడం మాత్రం ఖాయం.

నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా తీయడం మాటేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా ఈ సినిమా కాస్త సైడ్ అయింది. కానీ మరో నెలలో రిలీజ్ పెట్టుకుని, ఇప్పుడు హార్ట్ డిస్క్ దొంగతనం జరగడంతో సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.దొంగతనానికి గురైన హార్డ్ డిస్క్లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు సీజీ వర్క్స్కి సంబంధించిన దాదాపు 90 నిమిషాల కంటెంట్ ఇందులో ఉందని అంటున్నారు. అసలు ఇంత ముఖ్యమైన హార్డ్ డిస్క్ని ముంబై నుంచి కొరియర్ లో పంపడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాయం కావడం, దీంతో మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఇప్పుడు ఈ విషయాలపై స్వయంగా మంచు విష్ణు స్పందించాడు. మొత్తంగా కాకుండా సింపుల్గా ఒక్క ఫొటో పోస్ట్ చేశాడు. అందులో..'జటాజూఠదారీ నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?' అని ట్వీట్ చేశాడు. అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇవన్నీ చూస్తుంటే సినిమా వాయిదా పడటం గ్యారంటీ అనిపిస్తుంది.ఈ సంగతి అలా ఉంచితే 'కన్నప్ప' ఓటీటీ డీల్ కూడా ఇంకా సెట్ కాలేదని, అంతా చూస్తుంటే జూన్ 27న చెప్పిన తేదీకి థియేటర్ విడుదల కావడం కష్టమేమో అనిపిస్తుంది. మూవీ టీమ్ మాత్రం చెప్పిన డేట్కి రావడం పక్కా అని అంటున్నారు. మరి నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి ఇక?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్)#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025

జూన్ నుంచి జోరుగా...
లొకేషన్ సెర్చ్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలకపాత్రల్లో నటించనున్నారు.పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించనున్నారు. జూన్ చివరి వారంలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. షూటింగ్ ఆరంభించినప్పటి నుంచి మొత్తం సినిమా పూర్తయ్యేవరకూ షెడ్యూల్స్ని జోరుగా జరిపేలా ప్లాన్ చేశారట. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై ఏరియాల్లో లొకేషన్స్ రెక్కీ చేస్తోంది పూరి అండ్ టీమ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

వరల్డ్ చాంపియన్షిప్ పతకమే లక్ష్యం
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం... పారిస్ ఒలింపిక్స్... 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్... భారత్కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ సమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పతకం సాధించగల షూటర్ల జాబితాలో ఆమె కూడా ఉంది. సంవత్సరం ముందు ఇదే ఈవెంట్లో సిఫ్ట్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం కూడా అందుకు ఒక కారణం. అయితే అసలు సమయంలో రైఫిల్ గురి చెదిరింది. సగటు భారత అభిమాని కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఒక్కసారిగా పేలవ ప్రదర్శన నమోదైంది.32 మంది పోటీ పడితే సిఫ్ట్ కౌర్ 31వ స్థానంతో ముగించింది! ఈ షాక్కు ఒక్కసారిగా సిఫ్ట్ ఆట నుంచి తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇకపై భవిష్యత్తు గురించి సందేహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు నాటి పరాభవం నుంచి కోలుకున్న సిఫ్ట్ ఇప్పుడు మళ్లీ చిరునవ్వులు చిందించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో ఆమె స్వర్ణంతో మెరిసి ఒలింపిక్ బాధను కాస్త మర్చిపోయేలా చేసుకుంది. నిరాశ నుంచి కోలుకొని... పారిస్లో ఘోర ప్రదర్శన తర్వాత సిఫ్ట్ కౌర్ మానసికంగా చాలా కుంగిపోయింది. ఆ ఈవెంట్ ముగిసిన సమయం నుంచి ఆమెను సాధారణ స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ వేదిక నుంచి ఆమెను విహారయాత్ర కోసం వారు మరో నగరానికి తీసుకెళ్లి సరదాగా గడిపి వచ్చారు. స్వదేశానికి తిరిగొచ్చాక తండ్రి మరో రూపంలో ఆమెను బిజీగా ఉంచే ప్రయత్నం చేశారు. మళ్లీ మళ్లీ వైఫల్యం గురించి, స్కోర్ల గురించి ఆలోచించకుండా సరదాగా గన్స్తో ఆడుతున్నట్లుగానే ఆడమంటూ రైఫిల్ రేంజ్కే తీసుకెళ్లే ఓదార్చే ప్రయత్నం చేశాడు. మన దేశంలో అభిమానులు ఒలింపిక్స్ క్రీడలకు అన్నింటికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని... అందరి దృష్టీ వాటి ఫలితాలపైనే ఉండటం వల్ల అసలు సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సిఫ్ట్ చెప్పుకుంది. కోలుకునేందుకు కొంత సమయం పట్టినా... తాను వెనక్కి వెళ్లి ఫలితాన్ని మార్చలేను కాబట్టి ఇక ఆలోచించడం అనవసరం అని ఆమె భావించింది. జాతీయ స్థాయి పోటీలతో... దాదాపు ఆరు నెలల తర్వాత సిఫ్ట్ మళ్లీ షూటింగ్లో పోటీ పడేందుకు సిద్ధమైంది. అందుకు ముందుగా పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఆమె స్థాయికి ఈ క్రీడలు చిన్నవే అయినా... ఆరంభానికి ఇదే సరైందని సిఫ్ట్ భావించింది. సహజంగానే స్వర్ణం నెగ్గడంతో కాస్త ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ తర్వాత వరుసగా రెండు సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ చేసిన 595 పాయింట్ల స్కోరు పారిస్లో సాధించి ఉంటే ఆమె ఫైనల్స్కు చేరేది! తాజా ప్రదర్శనతో అర్జెంటీనాలో జరిగే వరల్డ్ కప్ షూటింగ్కు సిఫ్ట్ ఎంపికైంది. సవాల్ను అధిగమించి... బ్యూనస్ఎయిర్స్లో కొత్తగా నిర్మించిన రేంజ్లో వరల్డ్ కప్ స్థాయి పోటీలు జరగడం ఇదే తొలిసారి. వాతావరణం, గాలి దిశ... ఇలా అన్నీ కొత్తగానే ఉండటంతో సిఫ్ట్ కాస్త ఆందోళన చెందింది. 16.1 డిగ్రీల ఉష్ణోగ్రతలో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పోటీలు మొదలైనా ఇంకా చలిగానే ఉంది. తమ సన్నాహాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. అయితే పట్టుదలగా ఆడి క్వాలిఫికేషన్ను ఆమె అధిగమించింది. ఆపై ఫైనల్ పోరులో మళ్లీ తడబాటు. ‘నీలింగ్’ పొజిషన్ ముగిసేసరికి ఆమె చివరి స్థానంలో ఉంది. ‘ప్రొన్’ పొజిషన్ కాస్త మెరుగ్గా ఆడినా ఆ తర్వాతా అదే ఆఖరి స్థానం! ఆ తర్వాత తనకిష్టమైన ‘స్టాండింగ్’ పొజిషన్కు ఆమె సిద్ధమైంది. అసాధారణ ప్రదర్శన కనబరిస్తే గానీ ముందుకెళ్లే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో సిఫ్ట్ తన ఆటకు పదును పెట్టింది. అద్భుతంగా లక్ష్యంపైకి బుల్లెట్లు సంధిస్తూ దూసుకుపోయింది. తుది ఫలితం చూస్తే 458.6 పాయింట్ల స్కోరుతో సిఫ్ట్కు స్వర్ణ పతకం. ‘నీలింగ్’ ముగిసిన తర్వాత సిఫ్ట్కంటే ఏకంగా 7.2 పాయింట్లు ముందంజలో ఉన్న జర్మనీ షూటర్ అనితను వెనక్కి నెట్టిన సిఫ్ట్ అగ్రస్థానం సాధించడం విశేషం. ఇప్పుడు సిఫ్ట్ తర్వాతి లక్ష్యం వరల్డ్ షూటింగ్ చాంపియన్షిప్. నవంబర్లో జరిగే ఈ పోటీల్లో చెలరేగి భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన మహిళగా నిలవాలని సిఫ్ట్ కౌర్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే ఇప్పుడు తీవ్ర సాధనను కొనసాగిస్తోంది.

సింధు, ప్రణయ్ శుభారంభం
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–14, 21–9 తేడాతో వెన్ యూ జాంగ్ (కెనడా)పై విజయం సాధించింది. 31 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన తెలుగమ్మాయి వరస గేమ్ల్లో గెలుపొందింది. బుధవారం జరగనున్న ప్రిక్వార్టర్స్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ యూ ఫీ (చైనా)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–16, 21–14తో రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)పై గెలుపొందాడు. 72 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్లో ఓడిన అనంతరం తిరిగి పుంజుకున్న ప్రణయ్... ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరుస్తూ మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. తదుపరి రౌండ్లో ఫ్రాన్స్ షట్లర్ క్రిస్టోవ్ పొపోవ్తో ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా ఈ టోర్నీలో మిగిలిన భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్, అన్మోల్ పరాజయం పాలవగా... పురుషుల సింగిల్స్లో ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జ్కు నిరాశ తప్పలేదు. మాళవిక, ప్రియాన్షు తొలి గేమ్ గెలిచినప్పటికీ అదే జోరు కొనసాగించడంలో విఫలమై పరాజయాల పాలయ్యారు. మాళవిక 21–14, 18–21, 11–21తో ఎనిమిదో సీడ్ సుపనిడా కటెథాంగ్ (థాయ్లాండ్) చేతిలో... ప్రియాన్షు 21–14, 10–21, 14–21తో ఏడో సీడ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు. అన్మోల్ 11–21, 22–24తో చెన్ చేతిలో... కిరణ్ జార్జ్ 19–21, 17–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో సంతోష్ రామ్రాజ్ 14–21, 8–21తో కిమ్ గా ఇన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత సూర్య–అమృత ప్రథమేశ్ జోడీలు నిరాశ పరచగా... మహిళల డబుల్స్లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింగ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.

జితేశ్ జితాదియా
లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్... మయాంక్తో కలిసి చేసిన బ్యాటింగ్ మ్యాజిక్ మ్యాచ్నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సీజన్లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్ మార్ష్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిట్జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్ పంత్ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్ ప్రతాపం మొదలైంది. పవర్ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్ ధనాధన్ షోతో ఓవర్కు సగటున పది పరుగుల రన్రేట్ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్ కూడా ఫోర్, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్ పటిదార్ (14) ఫోర్, సిక్సర్ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్స్టోన్ (0)ను అవుట్ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగిపోవడంతో రన్రేట్ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్ మిడాఫ్లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్కు మయాంక్, జితేశ్లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 67; బ్రిట్జ్కీ (బి) తుషార 14; పంత్ నాటౌట్ 118; పూరన్ (సి) యశ్ దయాళ్ (బి) షెఫర్డ్ 13; సమద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్: తుషార 4–0–26–1, కృనాల్ పాండ్యా 2–0–14–0, యశ్ దయాళ్ 3–0–44–0, భువనేశ్వర్ 4–0–46–1, సుయశ్ 3–0–39–0, షెఫర్డ్ 4–0–51–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) దిగ్వేశ్ (బి) ఆకాశ్ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్ఖాన్ 54; పటిదార్ (సి) సమద్ (బి) రూర్కే 14; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్: ఆకాశ్ 4–0–40–1, విల్ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్ రాఠి 4–0–36–0, షాబాజ్ 3–0–39–0, అవేశ్ఖాన్ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’క్వాలిఫయర్–1 (మే 29)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్ (మే 30)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడిన జితేశ్.. ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 2, ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్కు చేరింది.మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి.
బిజినెస్

ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకానమీ ఔట్లుక్ ప్రకారం.. భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2021లో యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్న భారత్.. దశాబ్దం తరువాత జపాన్ను వెనక్కి నెట్టింది. ఇప్పుడు ఇండియా ముందున్న దేశాలు.. జర్మనీ, చైనా, అమెరికా మాత్రమే. అంటే ఇప్పుడు మన టార్గెట్ జర్మనీని అధిగమించడమే.2027నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారి.. జర్మన్ దేశాన్ని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించడమే భారత్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి విజయవంతంగా అమలు చేయాల్సిన అనేక సంస్కరణలను నిపుణులు రూపొందించారు. ఇందులో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలను ఆధునీకరించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం వ్యవసాయ సంస్కరణలు చేయడం.. ప్రగతిశీల మార్పుల కోసం కార్మిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, విద్య & ఉపాధి అవకాశాలపై భారీగా పెట్టుబడి పెట్టడం మొదలైనవి ఉన్నాయి.ప్రపంచ ఆర్ధిక అనిశ్చితులు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. అమెరికా టారీఫ్స్ ప్రభావం వంటివన్నీ ఉన్నప్పటికీ భారత్ జీడీపీ వృద్ధి రేటు స్థిరంగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది ప్రపంచంలోనే.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలువనుంది. ఒక అంచనా ప్రకారం.. 2025లో జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగా ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: జపాన్ను అధిగమించిన భారత్: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?కేంద్ర మంత్రి 'పియూష్ గోయల్' భారతదేశ ఆర్థిక పనితీరు 'అత్యుత్తమమైనది' అని ప్రశంసించారు. వృద్ధి పరంగా దేశం అన్ని జీ7, జీ20, BRICS దేశాలను సైతం అధిగమించిందని పేర్కొన్నారు. అయితే భారతదేశ వృద్ధి ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన అమెరికా, చైనా కంటే చాలా వెనుకబడి ఉంది. అయినప్పటికీ, భారత్ తన స్థిరమైన వృద్ధి వేగంతో ముందుకు సాగుతోంది.భారతదేశ ఆర్థిక మైలురాళ్ళు ఇలా..➤2007లో భారత్ మొదటి 1 ట్రిలియన్ డాలర్ల GDPని చేరుకోవడానికి 60 సంవత్సరాలు పట్టింది.➤2014 నాటికి.. 2 ట్రిలియన్ డాలర్స్ మార్కును దాటింది.➤COVID-19 మహమ్మారి వల్ల ఏర్పడిన అంతరాయాలు ఉన్నప్పటికీ.. 2021లో ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ➤ఇప్పుడు, కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత, భారతదేశం జపాన్ దేశాన్ని అధిగమించగలిగింది.

ఆ ఒక్క నగరంలో 10 లక్షల మంది టెకీలు..
భారత సిలికాన్ వేలీగా పేరొందిన బెంగళూరులో టెకీ సిబ్బంది సంఖ్య 10 లక్షల మార్కును దాటింది. తద్వారా అంతర్జాతీయంగా 12 టెక్నాలజీ హబ్లలో ఒకటిగా నిలిచింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసిన గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్బుక్ 2025’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిపుణుల లభ్యత, నాణ్యత, వ్యయాల ప్రాతిపదికన 115 మార్కెట్లను మదింపు చేసి మూడు కేటగిరీలుగా వర్గీకరించారు.అత్యధిక స్థాయిలో నిపుణుల లభ్యత, తీవ్రమైన పోటీ ఉన్న మార్కెట్లను పవర్హౌస్లుగా, ప్రతిభావంతుల లభ్యత నిలకడగా ఉండే మార్కెట్లను ఎస్టాబ్లిష్డ్ మార్కెట్లుగా, సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ వృద్ధి చెందుతున్న మార్కెట్లను వర్ధమాన మార్కెట్లుగా వర్గీకరించారు. 12 టెక్ పవర్హౌస్లలో బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్, ప్యారిస్ తదితర నగరాల సరసన బెంగళూరు కూడా నిల్చింది.ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బీజింగ్, షాంఘైతో పాటు బెంగళూరులో అత్యధికంగా టెక్నాలజీ నిపుణులు ఉన్నారని, టెక్ సిబ్బంది సంఖ్య 10 లక్షల పైగా ఉందని నివేదిక పేర్కొంది. గ్లోబల్ టెక్ పవర్హౌస్గా బెంగళూరు ఎదగడమనేది భారత్లో డిజిటల్ ఆవిష్కరణలు, కృత్రిమ మేథకు సంబంధించి లోతైన పరిజ్ఞానాన్ని తెలియజేస్తోందని వివరించింది.ఇదీ చదవండి: అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితంఉద్యోగం చేసే వయస్సు గల జనాభాపరంగా 12 భారీ మార్కెట్లలో బెంగళూరు నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 28 యూనికార్న్లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్లు), సానుకూల నిబంధనలు మొదలైనవి నగరానికి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. 2024లో 3.3 బిలియన్ డాలర్లు విలువ చేసే 140 వెంచర్ క్యాపిటలిస్ట్ డీల్స్కి బెంగళూరు కేంద్రంగా నిల్చింది. వీటిలో 34 డీల్స్ కృత్రిమ మేథకు సంబంధించినవి ఉన్నాయి.

ఇక జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్స్
న్యూఢిల్లీ: జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సేవలు ప్రారంభించేందుకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, యూఎస్కు చెందిన బ్లాక్రాక్కు చెరో 50 శాతం వాటా కలిగిన జాయింట్ వెంచర్ (జేవీ) కంపెనీ ఇది.‘జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్’కు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తోపాటు.. జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్కు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీగా వ్యవహరించేందుకు జియో బ్లాక్ రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్కు సెబీ ఈ నెల 26న అనుమతి మంజూరు చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు జియో ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్లడించింది. మరోవైపు జియోబ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సిద్ స్వామినాథన్ను ఎండీ, సీఈవోగా నియమించుకున్నట్టు ప్రకటించింది. ఈ వార్తలతో జియో ఫైనాన్షియల్ షేరు 3.50% పెరిగి రూ.292 వద్ద స్థిరపడింది. ఒకదశలో 4% లాభపడింది.

ఐటీఆర్ గడువుపై బిగ్ అప్డేట్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26కు సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్లు) దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు ఏటా పన్ను రిటర్నుల దాఖ లుకు జూలై 31 తుది గడువుగా ఉంటోంది.సాంకేతిక సమస్యలు, ఇతరత్రా ప్రతికూల పరిస్థితుల్లో ఈ గడువును ఆదాయపన్ను శాఖ పొడిగిస్తుంటుంది. ఈ ఏడాది ఐటీఆర్లో మార్పులు చేయడంతో.. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు, ఐటీఆర్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీబీటీ తెలిపింది.
ఫ్యామిలీ

కల్చర్ మారింది సామీ..! అడవి బిడ్డల వివాహాల్లో 'పెళ్లి సందడి'..
కొండ కొనల్లో నివసించి..అడవి తల్లిని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగించే డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు వారి సంప్రదాయాలను గౌరవిస్తు ఆధునిక పద్ధతిలో వివాహాలు చేసుకుని తమదంటూ నాగరికతను చాటుకుంటున్నారు. ఒకప్పుడు వివాహాలు వారి సంప్రదాయాల ప్రకారం గుట్టు చప్పుడు లేకుండా జరిగేవి. నచ్చిన యువతిని తీసుకువచ్చిన వరుడు తమ పెద్దల సమక్షంలో వివాహం చేసుకునే వారు. ఆచార వ్యవహారాల ప్రకారం వారి ఇద్దరిని వివాహం చేసేవారు పెద్దలు. కాని అందుకు భిన్నంగా నేటి యువత వివాహాలను ఆర్భాటంగా కొనసాగిస్తున్నాయి. వివాహాల్లొ ఆధునికత ఊరేగింపులు విందు, వినోదాలతో పాటు సంప్రదాయ నృత్యాలతో వివాహాలు కొనసాగుతున్నాయి. వధువు, వరుని తరఫున పెండ్లి కి ఆహ్వానించే కార్డులను ముద్రించి వారి బంధువులను ఆత్మీయులను ఆహ్వానించడం కనిపిస్తుంది. జిల్లాలొని బిసంకటక్ సమితి కుర్లి గ్రామంలొ డ్రేకు జకసిక కొడకు సేతు జకసిక అదే గ్రామానికి చెందిన బండీ వడక కూతురు వనిత వడకతొ వివాహం నిశ్చయమయ్యింది . ఈ క్రమంలో వివాహం సొమవారం నాడు జరిగింది. వరుడుకి ముకుటం ధరించి డిజే సౌండ్ ల మధ్య వరుడి ఊరేగింపు కార్యక్రమం అందరిని ఆకర్షించింది. యువత నృత్యాలతో కొనసాగిన ఊరేగింపులో భాగంగా సాంప్రదాయమైన ఆదివాసీ నృత్యా లు కూడా చోటు చేసుకున్నాయి. సుమారు 5 వేల మంది బంధువుల మధ్య వివాహాం జరిగింది. ఇంతటి ఆర్భాటంగా వివాహం జరగడంతో డొంగిరియా తెగన్లో ఇదే ప్రధమమని చెప్పాలి. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..)

అందాల పోటీల్లో పత్తా లేని పాన్ ఇండియా స్టార్లు
హైదరా‘బాత్’.. క్యా హై!తమ గ్లోబల్ ఈవెంట్ మరింత ప్రజాదరణ పొందేలా చేయడానికి మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులు దేశంలోని సినీ రంగ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపడం సాధారణమే. ఫ్యాషన్, గ్లామర్, సామాజిక సేవ అనే రంగాల సంగమంగా ఈ వేడుక సాగుతుంది కాబట్టి సినిమా రంగం తోడ్పాటును వారు ఎప్పుడూ ఆహా్వనిస్తారు. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు జడ్జీలుగా లేదా స్పెషల్ గెస్టులుగా కూడా పాల్గొంటారు. అయితే ఈ దఫా ఈవెంట్లో జడ్జిగా ఇప్పటివరకూ ఒక్క సోనూసూద్ పేరు తప్ప మరెవరి పేరూ వినిపించడం లేదు. అలాగే నగరం వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో నాగార్జున లాంటి ఒకరిద్దరు తప్ప టాలీవుడ్ సెలబ్రిటీల జాడ కనపడడం లేదు. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సార్లుగా పేరు తెచ్చుకున్న పలువురు టాలీవుడ్ నటులు ఈ పోటీల వైపు కన్నెత్తి చూస్తున్నట్టు గానీ, వీటి గురించి పన్నెత్తి మాట్లాడుతున్నట్టు గానీ లేదు. తుది పోటీలకు ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఫైనల్స్లో అయినా టాలీవుడ్ తారలు సందడి చేస్తారని, నగర ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింపజేసే ఈవెంట్కు అదనపు జోష్ జత చేస్తారని ఆశిద్దాం.సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత పురాతనమైన అందాల పోటీ మిస్ వరల్డ్. ఈ పోటీలు మన దేశపు అతివల అందాన్ని మాత్రమే కాదు మేధస్సును, శక్తియుక్తులను ప్రపంచానికి అనేకసార్లు చాటి చెప్పాయి. ఈ పోటీలకు ఆతి«థ్యం ఇచ్చే అవకాశం తొలిసారి ఓ తెలుగు రాష్ట్రానికి, అందులోనూ తెలంగాణకు దక్కింది. గత కొన్నిరోజుల క్రితం ప్రారంభమైన ఈ పోటీలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వివిధ రకాల పోటీల్లో పాల్గొంటూ సుందరీమణులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్లో ఇంత హల్చల్ జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం అంత పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నిరాసక్తత చర్చనీయాంశంగా మారుతోంది. నేరుగా మోడలింగ్, సినిమాలతో అనుబంధం కలిగి ఉండే ఈ పోటీల విషయంలో చిత్ర పరిశ్రమ తీరు ఆశ్చర్యకరంగా, ఒకింత ఆక్షేపణీయంగా కూడా ఉంది. బెంగళూరు.. బాలీవుడ్ సందడి ప్రపంచ సుందరి పోటీలు భారత్లో ఇంతకుముందు రెండుసార్లు జరిగాయి తొలుత బెంగళూరులో 1996లో జరగగా, 2024లో ముంబయిలో జరిగాయి. ఈ రెండు సందర్భాల్లోనూ మిస్ వరల్డ్ ఈవెంట్కు భారతీయ సినిమా పరిశ్రమ నుంచి విశేష మద్దతు లభించింది. తొలిసారి బెంగళూరులో జరిగిన పోటీల నిర్వహణ బాధ్యతలను బిగ్ బి అమితాబ్ బచ్చన్కు చెందిన ఏబీసీఎల్ తలకెత్తుకోగా.. బాలీవుడ్ నుంచి పలువురు తారాగణం తరలివచ్చి ఆ ఈవెంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మన తొలి మిస్ వరల్డ్గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యా రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముంబై... స్టార్స్ జై ముంబైలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ బాధ్యతల్లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, మేగన్ యంగ్ సంస్థలు పాలుపంచుకున్నాయి. అప్పుడు కూడా భారతీయ సినీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్తో పాటు దీపికా పదుకొణె, ఆలియా భట్..దక్షిణాది నుంచి మణిరత్నం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, మానుషి చిల్లర్ వంటి మిస్ వరల్డ్ మాజీ విజేతలు ఆ పోటీలకు అదనపు ఆకర్షణ చేకూర్చారు. ఇక కృతిసనన్, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, మన్నారా చోప్రా తదితర హీరోయిన్లతో పాటు నిర్మాత, దర్శకుడు సాజిద్ నడియాడ్వాలాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలకు హాజరైన వారిలో బాలీవుడ్ చిన్నితెర ప్రముఖులు కూడా ఉండడం విశేషం. రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా, దివ్యాంకా త్రిపాఠి, వివేక్ దహియా తదితర చిన్నితెర స్టార్స్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్ గాయనీ గాయకులు నేహా కక్కర్, టోనీ కక్కర్లు, షాన్లు తమ సంగీత ప్రదర్శనలతో అలరించారు.

వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా
స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు (Samantha Ruth Prabhu ) ముంబైలో జరిగిన వోగ్ బ్యూటీ అవార్డ్స్ (Vogue Beauty Awards)లో కటౌట్ డ్రెస్లో టోన్డ్-బాడీతో కనిపించి ఫ్యాన్స్ని విస్మయ పర్చింది. నిర్మాతగా శుభం మూవీ విజయం తరువాత సమంత చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాజ్ నిడిమోరుతో డేటింగ్ బజ్ మధ్య వోగ్ బ్యూటీ అవార్డ్స్లో ఆమె డ్రెస్, స్టన్నింగ్ లుక్ వైరల్గా మారింది.మే 26న సమంత వోగ్ బ్యూటీ అవార్డ్స్ కు హాజరైంది. ఈ కార్యక్రమానికి అదితి రావు హైదరి, శిల్పా శెట్టి కుంద్రా, భూమి పెడ్నేకర్, సారా టెండూల్కర్ లాంటి అనేక మంది బాలీవుడ్ దివాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమంత లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, దృష్టినీ ఆకర్షించింది. ఈ ఈవెంట్ కోసం, సమంత చాక్లెట్ బ్రౌన్-హ్యూడ్ బాడీ-ఫిటెడ్ గౌనులోదుస్తుల్లో మెరిసింది. సమంత టోన్డ్ బాడీ, గిరజాల జుట్టులో లుక్ ను మరింత హైలైట్గా నిలిచింది. సమంతలుక్కు సంబంధించిన వీడియో వైరల్గాకాగానే నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కునిపించారు. నిజంగా సమంతనా? డిఫరెంట్ కనిపిస్తోంది"మునుపటి కంటే సంతోషంగా, కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు" ‘‘కాన్స్ ఫెస్టివల్కు ఎందుకు వెళ్లలేదు’’ లాంటి కమెంట్లు వెల్లు వెత్తాయి. "ఆమె ఎందుకు అంత సన్నగా కనిపిస్తోంది?" అని మరికొందరు ఆశ్చర్యపోయారు.Serving fire with every curve @Samanthaprabhu2 x @VOGUEIndia! 😍 🔗 https://t.co/tG3hraSulg #VogueBeautyAwards2025#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/B2Cycjeu1g— Samantha FC || TWTS™ (@Teamtwts2) May 27, 2025 వోగ్ బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమంలో శిల్పా శెట్టి కాలర్డ్ స్కర్ట్ , క్రాప్ టాప్ ధరించింది. మరోవైపు, సారా టెండూల్కర్ నల్లటి దుస్తులు ధరించి, హాఫ్-బన్ హోయిర్ స్టైల్లోనూ,అదితి రావు హైదరి నల్లటి బంగారు రంగు గ్లిట్టర్ గౌనులో మెరిసింది.

ఒక ముద్దు, ఓ పాట..అద్భుతమే చేశాయ్..!
భార్య అందం తగ్గిందని వదిలేసే ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో.. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా..? అని విస్తుపోతారు. ఎందుకంటే..భార్య మంచానికే పరిమితమైతే..వదిలేసే భర్తలెందరో ఉన్నారు ఈ సమాజంలో. అంతేగాదు తన అవసరాలన్నీ తీరిస్తేనే..భార్య. లేదంటే అనవసరం అనే మగవాళ్లనే చూశాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అనారోగ్యంతో పోరాడుతుందని తెలిసి పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా..తాను చేయగలిగంతా చేసి కాపాడుకునే యత్నం చేశాడు. అయినా విధి కన్నెర్రజేసి భార్య కోమాలోకి వెళ్లిపోయేలా చేసినా..ఆశను వదులుకోలేదు. బతికి బట్టగలిగేలా చేసుకున్నాడు. భర్త అంటే ఇలా ఉండాలి అని అంతా కుళ్లుకునేలా నెటిజన్ల మనసుని గెలుచుకున్నాడు.అతడే చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్కు చెందిన 30 ఏళ్ల డెంగ్ యూకాయ్. తన భార్య యే మెయిడీ ప్రాణాంతక కేన్సర్తో పోరాడుతున్నా..ఆమె చేయిని వదలలేదు. ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా తనకే అంకితమై కంటిపాపలా కాచుకున్నాడు. అయితే ఆ కేన్సర్..డెంగ్ ప్రేమను ముక్కలు చేసేలా విజృభించి భార్యను కోమాలోకి వెళ్లిపోయిలా చేసింది. డాక్టర్లు సైతం చేతులెత్తేసిన వేళ కూడా.. తన ప్రేమతోనే భార్యను బతికించుకోవాలనుకున్న ఓ గొప్ప భర్త స్టోరీ ఇది.ఇక డెంగ్, మెయిడీల ప్రేమ కథ 2016లో ఓ స్నేహితుడిలో వివాహంలో ప్రారంభమైంది. ఇక్కడ మెయిడీ తీవ్ర బ్రెయిన్ కేన్సర్తో బాధపడుతోంది. ఆ విషయం తెలిసినప్పటికీ..ఆమెనే ప్రేమించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడుడెంగ్. మెయిడీ తన ప్రేమను అంగీకరించేంత వరకు ఆమె చుట్టూనే తిరిగాడు. అయితే మెయిడీ తనెంతో కాలం బతకననే ఉద్దేశ్యంతో అతడి ప్రేమను అంగీకరించలేదు. కానీ డెంగ్ తనని ఎట్టి పరిస్థితిలో వదిలేయనని, అన్ని విధాల చేదోడువాదోడుగా ఉంటూ చూసుకుంటానని హామీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. అలా వారిద్దరూ 2019లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి 2021లో హన్హాన్ అనే కుమార్తె జన్మించింది. ఆ ఒక్క ఏడాది తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించటం ప్రారంభమైంది. కోమాలో చేరువైపోయే స్థితికి చేరుకుంది. ఆ సమయంలో మెయిడీ తన చికిత్స కోసం ఖర్చు చేయొద్దని..లాభం లేదని భర్త డెంగ్కి చెప్పేసింది. ఎందుకంటే అప్పటికే డెంగ్ ఆమె వైద్యం కోసం దాదాపు రూ. 2 కోట్లుపైనే ఖర్చేపెట్టేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకుపూర్తిగా కోమాలోకి వెళ్లిపోయింది మెయిడీ. అయితే డెంగ్ ఆశను వదులుకోవడానికి ఇష్టపడలేదు. మెయిడీని ఇంటికి తీసుకువచ్చి..కుటుంబసభ్యులతో వీడ్కోలు మాదిరిగా పలుకుతూ..తన కుమార్తెతో కలి మెయిడీ బుగ్గపై ప్రేమగా ముద్దుపెట్టారు.అంతేగాదు ఆ అపురూపమైన భావోద్వేగా దృశ్యాన్ని క్లిక్మనిపించి.. సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతే నెట్టింట డెంగ్కి భావోద్వేగ మద్ధతు తోపాటు భారీగా విరాళలు వచ్చాయి. ఆ సాయంతో భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాడు. అంతే జస్ట్ మూడు నెలల్లో మెయిడీ కోలుకోవడం..మళ్లీ యథావిధిగా మాట్లాడటం ప్రారంభించింది. అంతేగాదు ఆ మూడు నెలలు డెంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి..ఆమెకు పూర్తికాల సంరక్షకుడిగా కంటికి రెప్పలా కాచుకున్నాడు. అంతేగాదు స్ప్రుహలోకి వచ్చేలా ఆమె ముందు పాడుతూ..డ్యాన్స్ చేస్తూ..ఉత్సాహాం నింపేవాడు. దాంతో త్వరితకాలంలోనే మెయిడీ ఏదో మిరాకిల్ చేసినట్లుగా కోలుకోవడమే గాక ఎవరీ సాయం లేకుండా నడిచేలా ఆరోగ్యవంతంగా కోలుకుంది. ఇప్పుడామె భర్తకు ఆర్థిక తోడ్పాటును అందించేలా వీధి దుకాణం నడపటం విశేషం. చివరగా డెంగ్ మాట్లాడుతూ.."ఆమె మమ్మల్ని వదిలివెళ్లడం నాకస్సలు ఇష్టం లేదు. ఎలాగైన బతికించుకోవాలన్న తపన, ఆమెపై ఉన్న అచంచలమైన ప్రేమ తదితరాలతోనే తన భార్యను తిరిగి దక్కించుకున్నానని సంతోషంగా చెబుతున్నాడు." డెంగ్. అంతేగాదు భారతీయ వివాహ వ్యవస్థలో ఉండే 'నాతి చరామీ' అనే పదానికి అసలైన అర్థం చెప్పాడు ఈ చైనా భర్త డెంగ్
ఫొటోలు
అంతర్జాతీయం

స్కూలు భవనంపై ఇజ్రాయెల్ దాడులు
దెయిర్ అల్బలా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు నానాటికీ ఉధృతమవుతున్నాయి. సోమవారం నాటి దాడుల్లో 46 మంది మృతి చెందారు. దరాజ్ ప్రాంతంలో పునారావస కేంద్రంగా మారిన పాఠశాల భవనంపై జరిగిన దాడిలోనే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 55 మందికి పైగా గాయపడ్డారు. అందులోని వారంతా నిద్రలో ఉండగానే సోమవారం తెల్లవారుజామున మూడుసార్లు దాడులు జరిగాయి. వాటి ధాటికి అంటుకున్న మంటల్లో చాలామంది నిస్సహాయంగా కాలిపోయారు. ఉగ్రవాదులు పాఠశాల నుంచి పని చేస్తున్నందునే దాన్ని లక్ష్యం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ చెప్పింది. పౌరుల మరణాలకు హమాస్ కారణమని ఆరోపించింది. జాబాలియాలో ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మరణించారు. మరోవైపు గాజాలో మానవతా సహాయాన్ని అమెరికాకు చెందిన సంస్థకు అప్పగించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. సోమవారం నుంచి సహాయం ప్రారంభించింది.

నిద్ర లేమితో గుండెకు చేటు
స్టాక్హోం: మానవులతో పాటు సకల జీవులకు నిద్ర ఎంత ముఖ్యమే మనందరికీ తెలిసిందే. శరీరంలో జీవ క్రియలు సజావుగా సాగాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర లేమి కారణంగా ఇతర అవయవాలతోపాటు గుండె సైతం బలహీనపడుతుంది. వరుసగా మూడు రోజులపాటు చాలినంత నిద్ర లేకపోతే గుండెకు తీవ్ర ముప్పు తప్పదని స్వీడన్కు చెందిన ఉప్సలా యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. రాత్రిపూట నిద్రను కేవలం నాలుగు గంటలకే పరిమితం చేసుకుంటే గుండెకు రక్తం చేరడంలో మార్పులు వస్తాయని, తద్వారా గుండె జబ్బుల ముప్పు పెరగడం ఖాయమని పరిశోధకులు గుర్తించారు. అంటే వరుసగా మూడు రోజులపాటు కేవలం నాలుగు గంటల చొప్పున నిద్రిస్తే గుండెజబ్బుల ముప్పు తప్పదని స్పష్టమవుతోంది. → మనసులో ఒత్తిడిలో ఉన్నప్పుడు, తగినంత నిద్రలేక శరీరం అలసటగా ఉన్నప్పుడు లేదా వ్యాధులతో పోరాడుతున్నప్పుడు రక్తంలో ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్స్ ఉత్పత్తి అవుతాయి. → ఈ ప్రొటీన్లు రక్తంలో ఎక్కువకాలం అధిక మోతాదులో ఉంటే రక్త నాణాలు దెబ్బతింటాయి. తద్వారా గుండె వైఫల్యం, గుండె నొప్పి, కరోనరీ గుండె వ్యాధులు తలెత్తుతాయి. గుండె కొట్టుకోవడం అనేది క్రమం తప్పుతుంది. → అధ్యయనంలో భాగంగా 16 మంది యువకులను పరిశీలించారు. వారిని కొన్నిరోజులపాటు ప్రయోగశాలలోనే ఉంచి అధ్యయనం నిర్వహించారు. → అధ్యయనంలో భాగంగా యువకులు మొదటి మూడు రోజులు 8.5 గంటల చొప్పున నిద్రపోయారు. తర్వాత మూడు రోజులు 4.2 గంటల చొప్పున నిద్రించారు. నిద్ర నుంచి లేచిన తర్వాత సైక్లింగ్ చేశారు. సైక్లింగ్కు ముందు, తర్వాత వారి రక్తాన్ని పరీక్షించారు. ఈ రక్తం నమూనాల్లో 90 రకాల ప్రొటీన్లను గుర్తించారు. 4.2 గంటల చొప్పున నిద్రపోయినప్పుడు వారి రక్తంలో గుండు జబ్బులకు కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్లు పెరిగినట్లు వెల్లడయ్యింది. → సాధారణంగా నిద్ర నుంచి లేచిన తర్వాత వ్యాయామం చేస్తే రక్తంలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు పెరుగుతాయి. కానీ, మూడు రోజులపాటు తక్కువ సమయం నిద్రించినవారిలో ఇలాంటి ప్రొటీన్లు చాలా బలహీనంగా ఉన్నట్లు తేలింది. → ఆధునిక కాలంలో పని వేళలు మారిపోయాయి. ప్రతి నలుగురిలో ఒకరు రాత్రి పూట పని చేయాల్సి వస్తోంది. వారికి చాలినంత నిద్ర ఉండడం లేదు. అలాంటివారు త్వరగా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హె చ్చరిస్తున్నారు. యువకులు, పూర్తి ఆరో గ్యంతో ఉన్నవారు సైతం తగినంత సమ యం నిద్ర పోవాలని సూచిస్తున్నారు. → గుండెను భద్రంగా కాపాడుకోవాలంటే ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్రించాలని చెబుతున్నారు. → సెల్ఫోన్లతో రాత్రంతా కాలం గడిపే పి ల్లలు, యువతీ యువకులు మరింత అ ప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.

మాక్రాన్కు చెంపదెబ్బ?
పారిస్: వియత్నాం పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఉదంతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ను తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. అధికారిక పర్యటన నిమిత్తం భార్య బ్రిగెట్తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హనోయ్ చేరుకున్నారు. తలుపు తెరుచుకుని, విమానం దిగేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బ్రిగెట్ ఒక్కసారిగా మాక్రాన్ ముఖంపై కొడుతున్నట్టుగా కన్పించారు. ఆమె చేతులు మాక్రాన్ ముఖంపై విసురుగా పడుతూ కన్పించాయి. ఆ ధాటికి మాక్రాన్ ఉన్నట్టుండి వెనక్కు ఒంగిపోయారు. దాంతో ఆయన ఒక్కసారిగా కంగుతిన్నా, కెమెరాలన్నీ తనపైనే ఉండటం గమనించి వెంటనే సర్దుకున్నారు. చిరునవ్వుల నడుమ అభివాదసూచకంగా చేతి ఊపుతూ విమానం నిచ్చెనపైకి చేరుకున్నారు. ఆ వెనకే బ్రిగేట్ కూడా వచ్చి మాక్రాన్ పక్కన నుంచున్నారు. కానీ ఆయన చెయ్యందివ్వబోగా పట్టించుకోలేదు. ఇద్దరూ కలి‘విడి’గానే నిచ్చెన దిగి వచ్చారు. మీడియా కెమెరాలకు చిక్కిన ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడమే గాక తీవ్ర దుమారం కూడా రేపింది. పైగా, ఆ వీడియో నకిలీది కావచ్చన్న ఫ్రెంచి ప్రభుత్వ వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. దాంతో ఇక లాభం లేదని అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగారు. అదో సరదా ఘటన తప్ప ఇంకేమీ కాదంటూ మీడియా సాక్షిగా వివరణ ఇచ్చుకున్నారు. ‘‘నేను, మా ఆవిడ జోక్ చేసుకుంటున్న క్రమంలో జరిగిన ఉదంతమది. ఏమీ లేనిదాన్ని అనవసరంగా పెద్దది చేసి చూస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. దానిపై ఎవరికి తోచించి వాళ్లు ప్రచారం చేస్తూ అనవసరంగా కుట్ర సిద్ధాంతాలకు తెర తీస్తున్నారంటూ ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో వాపోయింది. మాక్రాన్ దంపతుల నడుమ విభేదాలు సాగుతున్నాయని, అవి తారస్థాయికి చేరాయనేందుకు ఈ ఉదంతమే తాజా నిదర్శనమని ఫ్రెంచి పత్రికలు ఎడాపెడా రాసేయడమే అందుకు కారణం. ఏక్ చోటీ సీ ప్రేమ్ కహానీ!: మాక్రాన్, బ్రిగేట్ బంధం తొలినుంచీ వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది. మాక్రాన్ కంటే ఆమె దాదాపు పాతికేళ్లు పెద్దది కావడం విశేషం! బ్రిగేట్ 1953 ఏప్రిల్ 13న పుట్టగా మాక్రాన్ జన్మదినం 1977 డిసెంబర్ 21. అంతేకాదు, హైసూ్కలు రోజుల్లో మాక్రాన్కు బ్రిగేట్ టీచర్ కూడా! ఆయనకు ఫ్రెంచ్, లాటిన్ బోధించేవారు. అలా లైసీ లా ప్రావిన్స్లో మాక్రాన్ టీనేజీ బాలునిగా చదువుకునే రోజుల్లోనే, అంటే 1993లో వారి ప్రేమ కథకు బీజం పడింది. అప్పటికి ఆయనకు కేవలం 15 ఏళ్లు. కాగా, బ్రిగేట్కు 39 ఏళ్లు. ఆంద్రె లూయిస్ అనే బ్యాంకర్తో ఆమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. పైగా బ్రిగేట్ పెద్ద కూతురు లారెన్స్ మాక్రాన్కు స్వయానా క్లాస్మేట్ కూడా! అయినా ఇవేవీ వారి ప్రేమకు అడ్డంకి కాలేకపోయాయి. బ్రిగేట్ ఓ నాటక సంఘానికి పర్యవేక్షకురాలిగా కూడా వ్యవహరించేవారు. సాహితీ అభిమాని అయిన మాక్రాన్ అందులో సభ్యునిగా చేరారు. స్కూలు వేళలు అయిపోయాక ఇద్దరూ అక్కడ కలుసుకునేవారు. ఎంత గోప్యంగా ఉంచినా వారి వ్యవహారం మాక్రాన్ ఇంట్లో తెలిసిపోయింది. మాక్రాన్ ప్రేమలో పడ్డట్టు అప్పటికే వాళ్లకు అనుమానంగా ఉండేదట. అయితే, అది బ్రిగేట్ కూతురు కావచ్చని వాళ్లు భావించారట! మాక్రాన్ మహా మేధావి అంటూ ఆ అమ్మాయి వారితో నిత్యం ఎంతో గొప్పగా చెప్పడమే అందుకు కారణం. తీరా చూస్తే తమవాడు ప్రేమలో పడింది పిల్లతో కాదు, తల్లితోనని తెలిసి వారు కంగుతిన్నారు! ఈ అసాధారణ ప్రేమ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలని పై చదువుల పేరిట మాక్రాన్ను ఉన్నపళంగా పారిస్ పంపించేశారు. అలా 17వ ఏట హైసూ్కల్ ఫైనలియర్ కోసం ఆయన పారిస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ దూరం కూడా వారి ప్రేమకు అడ్డం కాలేకపోయింది. పైగా మాక్రాన్ పారిస్ వెళ్లేముందు, ‘నువ్వేం చెప్పినా, ఏం చేసినా నేను మాత్రం ఎప్పటికైనా నిన్నే పెళ్లాడతా’ అని బ్రిగేట్కు కుండబద్దలు కొట్టి మరీ వీడ్కోలు తీసుకున్నారట. తర్వాత ఇద్దరూ తరచూ లేఖలు రాసుకుంటూ, వీలైనప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి ఆమె కూడా పారిస్ చేరుకున్నారు. అలా పుష్కర కాలం పాటు ప్రేమించుకున్నాక బ్రిగేట్ తన భర్తకు విడాకులిచ్చి 2007లో మాక్రాన్ను పెళ్లాడారు. తొలి వివాహం ద్వారా ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు.

‘నా భార్య నన్ను కొట్టలే’.. ఫ్రాన్స్ అధ్యక్షుడు
యూరప్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మొహం మీద ఆయన సతీమణి బ్రిగిట్టే మేక్రాన్ కొట్టారంటూ ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ను బ్రిగిట్టే నిజంగా కొట్టారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?దాదాపూ పదేళ్ల తర్వాత అధ్యక్షుడు మేక్రాన్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయాసియా దేశాల్లో సుదీర్ఘ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో అమెరికా, చైనాకు ఫ్రాన్స్ ప్రత్యామ్నాయమనే సంకేతాలిచ్చేలా డిఫెన్స్, ఎనర్జీ, టెక్నోలజికల్ ఇన్నోవేషన్తో పాటు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.ఈ పర్యటనలో భాగంగా మే 25న వియత్నాం రాజధాని హనోయిలో అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో హనోయి నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ సమయంలో జరిగిన ఓ ఊహించని ఘటన మీడియా కంట పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చకు దారి తీసింది.Bizarre moment Emmanuel Macron is slapped by his wife Brigitte pic.twitter.com/kYsE5MCDV1— The Sun (@TheSun) May 26, 2025 అసలేమైందంటే? మేక్రాన్, బ్రిగిట్టేలు ప్రత్యేక విమానం లోపలి నుంచి బయటకు వచ్చే సమయంలో విమానం డోర్లు తెరుచుకున్నాయి. అయితే, ఆ డోర్ ఓపెన్ అయ్యే సమయంలో బ్రిగిట్టే తన రెండు చేతులతో మేక్రాన్ మొహం మీద కొట్టిన దృశ్యాలు కనిపించాయి. బ్రిగిట్టే చేతులు తన మొహం మీద తగలడంతో వెంటనే తన తలను వెనక్కి జరిపారు. దీంతో మేక్రాన్ను బ్రిగిట్టే కొట్టారంటూ అంతర్జాతీయ మీడియా వీడియోల్ని ప్రసారం చేశాయి.అందుకు ఊతం ఇచ్చేలా ఈ ఘటన తర్వాత తన చేతిని పట్టుకోమని బ్రిగిట్టేకు తన చేతిని అందించబోయాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. తిరస్కరించింది. కోపంగా అక్కడి నుంచి కదిలింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.ఈ ఘటనపై మేక్రాన్ను మీడియా మాట్లాడారు. వైరల్ అవుతున్న వీడియోల్లో నిజం లేదన్నారు. భార్య బ్రిగిట్టే తనను కొట్టలేదని, తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవ పడుతూ ఉంటామని అన్నారు. కానీ, ఆ వీడియోలో కనిపిస్తున్న సీరియస్నెస్ను చూస్తే మాత్రం మేక్రాన్ అబద్దం చెబుతున్నాడనే విషయం స్పష్టమవుతోందటూ అంతర్జాతీయ మీడియా కథనాల్ని వండి వార్చేస్తోంది.
జాతీయం

ఐఏఎస్ అధికారిణికి బీజేపీ ఎమ్మెల్సీ క్షమాపణలు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరణమ్(Fouzia Taranum)కు క్షమాపణలు చెప్పారు. ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అక్కడ. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్య చేయలేదంటూ మంగళవారం ఆయన క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో ేనేను భావోద్వేగంలో ఉన్నా. మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటి పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అందుకు క్షమాపణలు చెబుతున్నా అని ఎన్డీటీవీతో ఎన్ రవికుమార్(N Ravikumar) అన్నారు.అసలేం జరిగిందంటే..బీజేపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే(ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ.. ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్ హౌజ్ వద్ద నిరసనలు తెలిపారు. అయితే.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరణమ్ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్ పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు.ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్ ఇక్కడ ఐఏఎస్ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్ వ్యాఖ్యానించారు.మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్లో ఫిర్యాదు నమోదుకాగా.. రవికుమార్పై కేసు ఫైల్ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంకోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని, రవికుమార్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఆరా తీస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాకు వెల్లడించారు.

పాక్కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్(Gujarat) పర్యటనలో ఉన్నారు. నేడు(మంగళవారం) ఆయన గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో రూ.5,536 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, పలు అభివృద్ది పనులను శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్ తీరుపై దుమ్మెత్తిపోశారు. తాను రెండు రోజులుగా గుజరాత్లో ఉన్నానని, ఎక్కడికి వెళ్లినా రెపరెపలాడే త్రివర్ణ పతాకాన్ని చూశానన్నారు. ప్రజల హృదయాల్లో మాతృభూమిపై ఉన్న అపారమైన ప్రేమ, దేశభక్తిని చూశానన్నారు. శరీరం ఎంత బలంగా లేదా ఆరోగ్యంగా ఉన్నా, ఒక ముల్లు(ఉగ్రవాదం) నిరంతర నొప్పిని కలిగిస్తుందని, అందుకే ఆ ముల్లును తొలగించాలని మేము నిర్ణయించుకున్నామన్నారు.1947లో భారతమాత రెండు ముక్కలుగా విడిపోయింది. ఆ రాత్రే కశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్ర దాడి జరిగింది. ముజాహిదీన్ పేరుతో ఉగ్రవాదుల సహాయం తీసుకుని పాకిస్తాన్ ఇండియాలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ రోజు ఈ ముజాహిదీన్లను అంతమొందించేందుకు సర్దార్ పటేల్ సలహాను అంగీకరించి ఉంటే, గడచిన 75 ఏళ్లుగా కొనసాగుతున్న ఉగ్రవాద ఘటనలు జరిగేవి కాదని మోదీ పేర్కొన్నారు. పీఓకేను తిరిగి దక్కించుకనేంత వరకు భారత సైన్యం తిరిగి రాకూడదని సర్దార్ పటేల్(Sardar Patel) కోరుకున్నారు. అయితే ఆయన మాటలను నాడు ఎవరూ అంగీకరించలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.దాని ఫలితం 75 ఏళ్లుగా అనుభవిస్తున్నాం. ఇప్పుడు పహల్గామ్ రూపంలో చూశాం. పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడల్లా, భారతదేశ సైనిక శక్తి పాకిస్తాన్ను ఓడిస్తూ వచ్చింది. యుద్ధంలో ఏనాటికీ భారత్ను ఓడించలేమని పాకిస్తాన్కు తెలుసు. అందుకే అది పరోక్ష యుద్ధానికి దిగింది. ఉగ్రవాదులను సిద్ధం చేయడం ప్రారంభించి, వారిని భారతదేశంపైకి ఉసిగొల్పుతోంది. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, 22 నిమిషాల్లో కూల్చివేశాం. అంతా కెమెరా ముందే జరిగింది. మే 6న ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్తాన్లో ప్రభుత్వ గౌరవం లభించింది. వారి శవపేటికలపై పాకిస్తాన్ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి సైన్యం వారికి సెల్యూట్ చేసింది. పాకిస్తాన్ పన్నిన యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.ఒకప్పుడు ఉప్పు తప్ప మరేమీ లేని గుజరాత్ నేడు ప్రపంచంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కోసం రాబోయే 10 సంవత్సరాలకు మనం ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించాలి. అప్పటికి గుజరాత్ పారిశ్రామిక, వ్యవసాయం, విద్య , క్రీడా రంగాలలో ఎక్కడికి చేరుకుంటుందో మనం ఒక దార్శనికతను నిర్దేశించుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘జగన్నాథ్’ పేరుపై హక్కులెవరివి?

ఆర్భాటాలకు పోకండి.. వివాహాలు సాదాసీదాగానే జరిపించండి
ఆర్థిక స్తోమత లేకున్నా.. అప్పులు చేసి మరీ పిల్లల వివాహాలను ఘనంగా నిర్వహించే తల్లిదండ్రులను చూస్తున్నాం. అయినా కూడా గొంతెమ్మ కోరికలతో అత్తింటి వాళ్లను ఇబ్బంది పెట్టే అల్లుళ్లను.. ఆ వేధింపులను మౌనంగా భరించే కూతుళ్లను చూస్తున్నాం. మహారాష్ట్రలో ఇలాంటి వేధింపుల ఉదంతం.. సంచలన కేసు.. అక్కడి మరాఠా పెద్దలను చలించిపోయేలా చేసింది. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర మరాఠా కమ్యూనిటీ (Maratha Community) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వివాహాల విషయంలో ఆర్భాటాలు వద్దని, వీలైనంత వరకు సాదాసీదాగానే జరిపించాలని ఒక తీర్మానం చేసింది. ఎన్సీపీ బహిష్కృత నేత రాజేంద్ర హగవానే చిన్న కోడలు వైష్ణవి అదనపు కట్నం వేధింపులకు బలైంది. ఈ ఘటన నేపథ్యంతో సోమవారం మరాఠా కమ్యూనిటీ ఉన్నత కుటుంబాలకు చెందిన కొందరు పెద్దలు, రాజకీయ నాయకులు సమావేశమై పై నిర్ణయం తీసుకున్నారు.వైష్ణవి(Vaishnavi) తల్లిదండ్రులు ఎన్సీపీ నేతలు. అదే పార్టీకి చెందిన నేత రాజేంద్ర హగవానే చిన్నకొడుక్కి 2023లో వైష్ణవిని ఇచ్చి వివాహం జరిపించారు. కోరినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా జరిపించినా.. ఫలితం లేకుండా పోయింది. మరో 2 కోట్ల రూపాయల అదనపు కట్నం తేవాలంటూ అత్తింటివాళ్లు ఆమెను వేధించారు. ఈ క్రమంలో నదిలో దూకి ఒకసారి, ఎలుకల మందు తిని మరోసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.ఇరు కుటుంబాలు రాజకీయాల్లో ఉండడంతో.. మరాఠా పెద్దలు విషయాన్ని పెద్దది కానివ్వకుండా పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించామనుకున్నారు. కానీ ఓ బిడ్డ పుట్టాక కూడా ఆ వేధింపులు అలాగే కొనసాగాయి. ఈ క్రమంలో.. ఆ వేధింపులు తాళలేక ఆమె పుణే పింప్రి-చించ్వాద్లోని పుట్టింటికి చేరింది.ఈ నెల 16వ తేదీన ఇంట్లో ఎవరూలేని టైంలో ఆమె ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. రాజేంద్ర హగావానే, అతని కోడుకు అరెస్ట్ కావడం, వైష్ణవి 10 నెలల కొడుకు ఆమె తల్లిదండ్రుల చెంతకు చేరడం పలువురిని కంటతడి పెట్టించింది. ‘‘ఈరోజుల్లో తల్లిదండ్రులకు తగిన ఆర్థిక స్తోమత లేకున్నా.. అంగరంగ వైభవంగా వివాహాలు జరిపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే వైష్ణవి ఉదంతం మమ్మల్ని కదిలించింది. ఇక నుంచి ఆర్భాటంగా వివాహాలు జరిపించొద్దని తల్లిదండ్రులను కోరుతున్నాం. వివాహాలను మేం ఏర్పాటు చేసిన నియమావళి ప్రకారమే జరిపించాలని తీర్మానించాం’’ అని మరాఠా పెద్దలు ప్రకటించారు. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. వివాహాలు సాదాసీదాగానే జరిపించాలి. అత్తవారింట్లో కోడళ్లకు తగిన గౌరవం, సముచిత స్థానం లభించాలి. అత్తలు కోడళ్లను కూతుళ్లలా, కోడళ్లు అత్తలను తల్లులుగా భావిస్తూ వాళ్ల మధ్య బంధం సజావుగా సాగాలి. అలాగే.. వరకట్న వేధింపులు ఎదురైనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా స్పందించాలి అనే విషయాలపైనా అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించాలని మరాఠా పెద్దలు తీర్మానించారు.ఇదీ చదవండి: పెళ్లి కొడుకును ఎత్తుకెళ్లిపోయారు, చివరకు..

కాలీగంజ్ ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన టీఎంసీ
నదియా: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జూన్ 19న జరగనున్న కాలీగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నిక(Kaliganj Assembly by-election)కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తమ అభ్యర్థిగా అలీఫా అహ్మద్ను ప్రకటించింది. అలీఫా అహ్మద్ దివంగత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ కుమార్తె. ఈ విషయాన్ని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది.‘పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మార్గదర్శకత్వంలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం. కాలీగంజ్ అభ్యర్థి అలీఫా అహ్మద్’ అని టీఎంసీ తెలిపింది. సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు నసీరుద్దీన్ అహ్మద్(Naseeruddin Ahmed) మృతితో కాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ‘లాల్ దా’గా పేరొందిన అహ్మద్ తన 70వ ఏట కన్నుమూశారు. ఆయన కాలీగంజ్ నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు.ఈ సీటుకు ఎంతో రాజకీయ ప్రాముఖ్యత ఉంది. ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సవరణ తర్వాత, కాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.5 లక్షల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని కాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్ 19న ఉప ఎన్నిక జరగనున్నదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆదే రోజున ఉప ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాలీగంజ్ ఒకటి. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23న ప్రకటించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2. జూన్ 3న వీటి పరిశీలన జరగనుంది. అభ్యర్థులు జూన్ 5 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఇది కూడా చదవండి: ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు దుర్మరణం
ఎన్ఆర్ఐ

న్యూజెర్సీలో విజయవంతంగా 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్
అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA), యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్ ( USCA), యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ (USAF) ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన 29 వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్తో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. సుమారు 30 రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ‘మాట’ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగొని, సహా వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, గౌరవ సలహాదారులు రఘు రామ్ వీరమల్లు, USCF వాలంటీర్ చరణ్ ఖజానా అండ్ టీం, USCA అధ్యక్షులు అతుల్ భావే, షకీల్, తదితరులు ఈ పోటీలు విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మే1న కిక్ ఆఫ్ ఈవెంట్ తో ఘనంగా ప్రారంబమైన పోటీలు మే4 న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిసాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్ట మొదటి సారి జూనియర్స్ కేటగిరీలో క్యారమ్స్ పోటీలు నిర్వహించటం విశేషం.మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్ పోటీల్లో 60కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్లో ఎంతో ఉత్సహంగా పాల్గొన్నాయి. రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో ఢోల్ ఎఫెక్ట్ బాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సింగల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టూ పోటా-పోటీగా జరిగింది. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది. సింగర్స్ అనిత కృష్ణ, సిజి ఆనంద్ తమ గ్రాతంతో ఆడియన్స్ని మైమరపించారు.మే4న గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఇటీవల భారత్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి.. గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్ పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇక జూనియర్స్ US నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్కి అనుహ్య స్పందన వచ్చింది. USCA అధ్యక్షులు అతుల్ భావే, USCA మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్ కామెంటేటర్లుగా వ్యవరించారు. ఇక ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు అందజేశారు. గెలిచిన విజేతలకు అందరికీ కలిపి 10 వేల వంద డాలర్ల నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలే లో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్ని అలరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచే, సింగర్ అంజన సౌమ్య తమ గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజన సౌమ్య జోడి.. పలు సూపర్ హిట్ సాంగ్స్తో హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్ని నిర్వహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడిల్సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డా. ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి ముస్సాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్ గా మాట, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, రియల్ టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించిన యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్ఫ్యూజన్, సాషా రియాల్టీ, 9i సోలుషన్స్ని నిర్వహకులు అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ యూత్ శ్రీచరణ్ ఖజానా అండ్ టీమ్ని కొనియాడుతూ, సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవ్వటంలో కీలక పాత్ర పోషించిన స్పోర్ట్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్టెక్ సర్వీసెస్ CEO, మాట హానరీ అడ్వైసర్ రఘురామ్ వీరలమల్లుని ఘనంగా సన్మానించి, సత్కరించారు. మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి, USCA ప్రెసిడెంట్ అతుల్ భావే.. విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాట టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనటం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వహకులను పలువురు అభినందించారు.(చదవండి: అమెరికాలో ఎన్ఆర్ఐలే మా టార్గెట్)

అమెరికాలో నల్గొండ విద్యార్థిని కన్నుమూత
ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన మరో భారతీయ విద్యార్థి కన్నుమూసింది. ఇటీవలి కాలంలోఅమెరికాలో భారత విద్యార్థుల మృతుల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం మరింత విషాదం. తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన యువతి మృతి చెందింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్) చదువుతోంది. అనారోగ్యంతో మృతి చెందడం విషాదాన్ని నింపింది.అలబామా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేసిన ప్రియాంక అక్కడే పార్ట్ టైం వర్క్ చేస్తోంది. బ్రెయిన్ డెడ్ (మెదడు మృతి) స్థితికి చేరుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించి ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన వైద్యులు తెలిపారు. స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గమనించి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్

విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. ఆ 20 మంది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.

అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్(6), శివాన్‡్ష(3) ఉన్నారు. మహేందర్ ప్రస్తుతం గల్ఫ్లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచి్చన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు. అమ్మా.. లేమ్మా.. గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్లో ఉన్న మహేందర్కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముక్క శంకర్ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్ఆర్పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.

మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల క్యాబ్పై ఆగంతకుల దాడి
బంజారాహిల్స్(హైదరాబాద్): మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకెళుతున్న క్యాబ్ను ముగ్గురు ఆగంతకులు మద్యం మత్తులో దారికాసి అడ్డగించి బెదిరించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో ఉంటున్న నలుగురు యువతులు కోకాపేటలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు విధులు ముగించుకుని సంస్థ కేటాయించిన క్యాబ్లో ఇంటికి బయలుదేరారు. రోడ్డు నెంబర్–12 మీదుగా వీరు వెళ్తున్న కారును మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అడ్డగించి కారు అద్దాలను పగులగొట్టారు. కారు తాళాలు లాక్కున్నారు. తాము క్రిమినల్స్మని, అటాక్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం పోలీసులకు చెబితే అంతుచూస్తామని హెచ్చరించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితులు నేరుగా బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.