Top Stories
ప్రధాన వార్తలు

వల్లభనేని వంశీకి అస్వస్థత.. అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు
కంకిపాడు: విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారు. కస్టడీ నిమిత్తం వంశీని కంకిపాడు తీసుకొచ్చారు. కస్టడీ అనంతరం స్టేషన్లోనే ఉంచారు. అస్వస్థతకు గురి కావడంతో వంశీని కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లోనే వంశీ వాంతులు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని నడిపేవారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండికానీ మనిషిని చంపి పైశాచికానందం పొందాలనుకోవడం సరికాదు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పుచేశాడంట. అప్పుడేమో చంద్రబాబుకి.. లోకేష్ కి సమ్మగా ఉందంట.. ఇప్పుడేమో పగలదీస్తారంట. తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరు. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టడం.. నడవలేకుండా చేస్తున్నారు. ఎవడ్ని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులను తెచ్చారు. రేపైనా ఇలాగే ఉంటుంది. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం కంకిపాడు ప్రభుత్వాసుపత్రి నుంచి వంశీని పోలీసు స్టేషన్కు తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీకి తరలించారు.కంకిపాడు పీఎస్లో వంశీ విచారణ బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ను శుక్రవారం కంకిపాడు పోలీసుస్టేషన్లో పోలీసులు విచారించారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న వంశీని 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.

కొండంత అప్పు.. బాబు ‘సెల్ఫ్’ డప్పు!
కొండను సైతం అవలీలగా మోస్తానని గొప్పలు చెప్పుకున్న ఓ పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు.. మీరు మోసుకొస్తే చాలు.. నేను మోసేస్తా..! అని జారుకున్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు! రైతులిచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలే 8 వేల ఎకరాలను విక్రయించి రూ.లక్ష కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని.. అందుకోసం మరో 44 వేల ఎకరాలకుపైగా భూములను రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెబుతున్నారు!! రూ.లక్ష కోట్లతో రాజధానిని నిర్మించడం అటుంచితే దాదాపు లక్ష ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, అమరావతి: ‘‘రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు... ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది..!’’ సీఎం చంద్రబాబు తరచూ వల్లించే మాటలివీ! కానీ.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తుండగా ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లను కేటాయించింది.రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని స్వయంగా సీఎం చంద్రబాబు గతనెల 16న కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించారు. అది కూడా ఇప్పటికే సేకరించిన 53,748 ఎకరాల్లో రాజధాని పనులు చేపట్టడానికే ఈ నిధులు అవసరమని తేల్చారు.తాజాగా స్మార్ట్ ప్రాజెక్టుల పేరుతో మరో 44,676.64 ఎకరాలను రాజధాని కోసం సమీకరించే దిశగా టీడీపీ కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ఇక అందులో నిర్మాణ పనులు చేపట్టి.. మొత్తం రాజధానిని పూర్తి చేయాలంటే అన్నీ కలిపి కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని.. ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బానేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఆ అప్పు తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాజధానిపై లీకులు.. ఇన్సైడర్ ట్రేడింగ్! రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారని.. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని దేవతల రాజధాని అమరావతిని తలపించే రీతిలో ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరాన్ని నిరి్మస్తానంటూ 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతంపై వందిమాగధులకు ముందే లీకులిచ్చారు. ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ ద్వారా తన బినామీలు, సన్నిహితులు కారు చౌకగా రైతుల నుంచి భూములు కాజేశాక రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలను సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములతో కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ.) రాజధాని నిర్మాణం అంటూ హడావుడి చేశారు. కామధేనువు కాదు అప్పుల కుప్ప.. ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పులు ఓ చిన్న ఇల్లు కట్టాలన్నా ముందుగానే తగిన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటారు. అలాంటిది ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే (నిధులున్నాయో లేదో చూసుకోకుండా) 2016–19 మధ్య రాజధాని ప్రాంతంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధి పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఇందుకోసం సీఆర్డీఏ రూ.8,540.52 కోట్ల అప్పులు తెచ్చింది. అయితే 2019 మే నాటికి ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.28,047.82 కోట్లతో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పుడు రద్దు చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. 2018–19 ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరలు పెద్దగా పెరగలేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105 శాతం పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనుల పేరుతో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు వెరసి రూ.31 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఆర్డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే ఏకంగా రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. అమరావతి కామధేనువు కాదు.. అప్పుల కుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి బాబు చెబుతున్న సెల్ఫ్ పైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది ఆయనకే తెలియాలి! ఇకపోతే రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని గత నెలలో సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్ ఇవ్వడం గమనార్హం. మరో 44,676.64 ఎకరాల సమీకరణ దిశగా.. భూ సమీకరణ కింద రైతుల నుంచి సేకరించిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దాంతో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా స్మార్ట్ ప్రాజెక్టులు వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిరి్మంచాలని చెబుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవంటూ.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో 44,676.64 ఎకరాలను సమీకరించే దిశగా ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇక ఆ భూముల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణంతోపాటు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే సుమారుగా మరో రూ.80 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి పెరిగే ధరలను (ఎస్కలేషన్) పరిగణనలోకి తీసుకుంటే అన్నీ కలిపి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని లెక్కగడుతున్నారు. అదంతా అప్పులు చేయాల్సిందే. వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందో ఊహించవచ్చు. ఆ అప్పు అంతా చివరకు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తంతోనే తీర్చాల్సి ఉంటుందని తేటతెల్లమవుతోంది. అమరావతిపై బాబు డాబుసరి మాటలివిగో..‘రాజధానిగా అమరావతి కామధేనువు లాంటి ప్రాజెక్టు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. భూ సమీకరణ కింద తీసుకున్న భూములు.. రైతులకు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లుతోసహా అన్ని పోనూ ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయి. వాటిని అమ్ముకుంటే భారీగా నిధులు వస్తాయి’ – 2020 ఆగస్టు 7న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి అందరికి ఆమోదయోగ్యమైంది. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అందరికీ ఇవ్వగా మిగిలే 8 వేల ఎకరాలకుపైగా భూములను అమ్ముకుంటే ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అక్కడ ఏ భవనం తాత్కాలికం కాదు.. అన్నీ శాశ్వత భవనాలే’ – 2020 ఆగస్టు 14న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా. మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. ఇక్కడ సృష్టించే సంపదతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను చేపడతాం’ – 2024 జూన్ 19న సీఎం చంద్రబాబు‘అమరావతిలో రైతులిచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది’ – 2024 జూన్ 20న సీఎం చంద్రబాబు

కవిత లేఖ కలకలం.. కేటీఆర్ కీలక ప్రెస్మీట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత లేఖ, కామెంట్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించనున్నారు. తెలంగాణభవన్లో ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.ఇక, అంతకుముందు కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కవిత..‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే.. దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.నాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో.. ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది అని అన్నారు. మరోవైపు.. కవిత అభిమానులు.. ఆమెను సీఎం.. సీఎం.. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

పాక్ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్
న్యూయార్క్: దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై భారత్ ప్రశ్నిస్తూ.. దాయాదిని ఇరుకునపెడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అంతటితో ఆగకుండా.. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి పై వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్.. పాకిస్తాన్కు కౌంటరిచ్చారు. హరీశ్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదు. పాక్ ప్రతినిధి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోంది.26/11 ముంబై దాడుల నుంచి ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్ర దాడులు చేశారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ను నిర్వహించి పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరై నివాళులర్పించడం చూశాం. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు చేసింది. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకుంది. ఇలాంటి పనులు చేస్తూ బోధనలు చేయడం హాస్యాస్పదం అంటూ చురకలు అంటించారు.#IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 2025భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. 65 సంవత్సరాల క్రితం సింధు జల ఒప్పందంలోకి చిత్తశుద్ధితో ప్రవేశించింది. ఒప్పందంపై స్పూర్తితో, స్నేహ భావంతోనే ఇన్ని రోజులు ఉంది. ఆరున్నర దశాబ్దాలుగా భారత్పై పాకిస్తాన్ మూడు యుద్ధాలు చేసింది. ఉగ్రదాడులకు పాల్పడింది. సింధు జలాల ఒప్పందం స్పూర్తిని ఉల్లంఘించింది. నాలుగు దశాబ్దాలలో 20,000 మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారు అని చెప్పుకొచ్చారు.

ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులతో బరితెగించి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు శిశుపాలుని మాదిరి పాపాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు ఎంత మాత్రం క్షమించరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఎల్లయ్య కుమారుడు హరికృష్ణ పట్ల దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్లో దాచి పెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతడిని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? చంద్రబాబూ.. రెడ్బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని ఆ పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.

పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాక్కు తంటాలు తప్పడం లేదు. యుద్ధ సమయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో పాక్ తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. దాంతో ఆర్థికంగా, వాణిజ్యం పరంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ నుంచి ఓడరేవుల ద్వారా వచ్చే సరుకుల రవాణాను భారతదేశం నిషేధించింది. ఇది ఆ దేశ దిగుమతులు, ఎగుమతులను గణనీయంగా ప్రభావితం చేస్తోంది.ఈ చర్య వల్ల పాకిస్థాన్కు, అక్కడి నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రత్యక్ష సర్వీసులను కోర్ షిప్పింగ్ లైన్లు నిలిపివేశాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాక్ ఫీడర్ నౌకలపై ఆధారపడవలసి వస్తుంది. ఈ నిషేధం వల్ల ముఖ్యంగా ఐరోపాతో దాయాది దేశం వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. భారతదేశంలోని ముంద్రా నౌకాశ్రయం పాక్ నుంచి యూరప్ వెళ్లే ఎగుమతులకు కీలకమైన ట్రాన్స్షిప్మెంట్ కేంద్రంగా ఉంది. కానీ పాక్ ఉగ్రవాదులు భారత పర్యాటకులను దారుణంగా హతమార్చిన నేపథ్యంలో భారత్ విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ను అమలు చేసింది. ఈ సమయంలో పాక్ సరుకు రవాణాను నిషేధించింది.భారంగా బీమా ఛార్జీలుప్రస్తుతం పాకిస్థాన్ షిప్పింగ్ కంపెనీలు కొలంబో, సలాలా, జెబెల్ అలీ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్స్ ద్వారా సరుకును రవాణా చేస్తున్నాయి. దాంతో పాక్ సంస్థలకు అదనంగా బీమా ఛార్జీలు భారంగా మారాయి. దాంతోపాటు పాకిస్థానీ అమ్మకందారులతో వ్యవహరించే వ్యాపారులను బ్యాంకు గ్యారంటీలు ఇవ్వమని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇది వాణిజ్య కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది.ఇదీ చదవండి: ‘భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధం’పేరుకుపోతున్న నిల్వలుఇప్పటికే కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కీలక పరికరాలు, ముడిసరుకులు, యంత్రాల దిగుమతుల్లో జాప్యాన్ని ఎదుర్కొంటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ధాన్యాలు, వస్త్రాల ఎగుమతులు కూడా దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల పాకిస్థాన్లోని వివిధ టెర్మినల్స్ వద్ద ఎగుమతి కంటైనర్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. దాంతో సరుకుల రవానా ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఆలస్యం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

The Diplomat Review: మాయ మాటలు నమ్మి పాకిస్తాన్ వెళితే..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం డిప్లొమాట్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. వాస్తవ కథలను సినిమాగా తీయడం ఓ సవాల్ అనే చెప్పాలి. అందులోనూ నిజంగా జరిగిన సున్నిత ఘటనలను సినిమా రూపంలో తీయాలంటే దర్శకుడికి కత్తి మీద సామే. అలాంటి ప్రయత్నమే ‘డిప్లొమాట్’( Diplomat Movie Review ) సినిమాలో చేశారు దర్శకుడు శివమ్ నాయర్. ఈ మూవీ చూస్తున్నంతసేపూ ఆ కథను మనం దగ్గరగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో దర్శకుడు నటీనటులతో జీవింపచేశారు. జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించగా సాధియా కతీబ్ మరో పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఏం ఉందో చూద్దాం. ఇదో యథార్థ గాథ. 2017లో ఉజ్మా అహ్మద్ అనే భారతీయ వివాహితను పాకిస్తాన్కు చెందిన తాహిర్ అనే యువకుడు మాయ మాటలతో తమ దేశం రప్పించుకుంటాడు. కేన్సర్ బారిన పడ్డ ఉజ్మా కూతురు వేరే దేశంలో ఉంటుంది. తన కూతురి ఆరోగ్యం కోసం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తాహిర్ వలలో పడుతుంది ఉజ్మా. పాకిస్తాన్ వెళ్లాక ఉజ్మాకు అతని అసలు రంగు తెలుస్తుంది. తరువాత తాహిర్ ఆమెపై అత్యాచారం జరిపి, చిత్రహింసలు పెడుతుంటాడు. ఈ దశలో ఆ అమ్మాయి అతని దగ్గర నుండి తప్పించుకుని పాకిస్తాన్లోని ఇండియన్ ఎంబసీలోకి శరణార్థిగా ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారి అయిన జేపీ సింగ్కు తన గోడు వెళ్ళబోసుకుంటుంది. ఇంతలో తాహిర్ నానా రకాలుగా ఎంబసీలోకి రావడానికి ప్రయత్నించి చివరకు ఉజ్మా మీద, ఇండియన్ ఎంబసీ మీద కేసు పెడతాడు. అక్కడ నుండి కథ పలు మలుపులు తిరిగి, చివర్లో ఉజ్మాను భారతదేశానికి జేపీ సింగ్ ఎలా క్షేమంగా చేర్చాడన్నదే సినిమా. ఇక్కడ ఉజ్మా వల్ల భారత్–పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు చాలానే వస్తాయి. వాటిని అధిగమించి ఈ భారతదేశ బిడ్డను పాకిస్తాన్ నుండి ఎలా చేర్చాడు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. సినిమా చివర్లో నిజమైన ఉజ్మాతో పాటు అప్పటి ఎంబసీ అధికారిని... వారి చిత్రాలతో చూపించడం చాలా బావుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘డిప్లొమాట్’ నిజంగా సూపర్ థ్రిల్లర్. వర్త్ఫుల్ వాచ్ ఫర్ వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు

ట్రంప్ సర్కార్కు బిగ్ షాక్..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక తగిలింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల చేరిక అంశంపై ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. దీంతో, ట్రంప్కు ఝలక్ ఇచ్చినట్టు అయ్యింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని టార్గెట్ చేశారు. వర్సిటీకి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేసిన ట్రంప్ సర్కార్.. తాజాగా ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని గురువారం రద్దు చేసింది. దీంతో, ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టులో యూనివర్సిటీ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్ బరోస్.. ట్రంప్ సర్కార్పై మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు.తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ఎస్ఈవీపీ వ్యవస్థ నుంచి విశ్వవిద్యాలయాన్ని తొలగించడం అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవతుందని హార్వర్డ్ తన తాజా పిటిషన్లో పేర్కొంది.BREAKING: A federal judge has BLOCKED the Trump Administration’s illegal move to bar Harvard University from enrolling international students.— Trump Lie Tracker (Commentary) (@MAGALieTracker) May 23, 2025‘ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో పావువంతు వారిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని’ హార్వర్డ్ పేర్కొంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. ఈ మొత్తం సంఖ్య యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 27 శాతానికి సమానం. తమకు వెంటనే ప్రభుత్వ చర్యల నుంచి ఉపశమనం కలిగించాలని హార్వర్డ్ తాజా పిటిషన్లో కోరింది. వర్సిటీ మారాల్సిందే ట్రంప్ సర్కారు నిర్ణయం హార్వర్డ్లో చదువుతున్న 10,158 మంది విదేశీ విద్యార్థులు, స్కాలర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. వీరిలో 788 మంది భారతీయులున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులేమీ ఉండవు. కోర్సుల మధ్యలో ఉన్నవారు మాత్రం ఇతర వర్సిటీల్లోకి మారాల్సిందే. లేదంటే అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన హోదా కోల్పోయి దేశ బహిష్కరణకు గురవుతారని నోయెమ్ స్పష్టం చేశారు.విమర్శల వెల్లువ హార్వర్డ్పై తాజా ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘం (ఎస్ఏఏ)తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు గమ్యంగా కొనసాగాలన్న ఆకాంక్ష అమెరికాకు బహుశా లేనట్టుగా ఉందని చైనా దుయ్యబట్టింది. హార్వర్డ్లో 1,203 మంది చైనా విద్యార్థులున్నారు. భారత విద్యార్థులపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టు మన దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రభావిత విద్యార్థులను చేర్చుకునేందుకు హాంకాంగ్లోని అత్యున్నత వర్సిటీలు ముందుకొచ్చాయి. వారికి అన్నివిధాలా సాయమందిస్తామని ఎస్ఏఏ ప్రకటించింది.

బెంగళూరుకు రైజర్స్ బ్రేక్
లక్నో: ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలపై నీళ్లుచల్లిన రైజర్స్... శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. శుక్రవారం జరిగిన పోరులో సన్రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టగా... అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్లు), హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్లు), విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో భయపెట్టినా... చివర్లో ఒత్తిడి పెంచిన రైజర్స్ ఫలితం రాబట్టింది. సన్రైజర్స్ కెపె్టన్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరంభం నుంచే దంచుడు... ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన సన్రైజర్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రెండో ఓవర్లో హెడ్ ఫోర్తో ఖాతా తెరవగా... భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్లో హెడ్ ఫోర్, అభిషేక్ 4, 6 బాదారు. మూడో ఓవర్లోనూ అభిషేక్ 4, 6 దంచగా... నాలుగో ఓవర్లో ఈ జోడీ 4, 6, 4 కొట్టింది. వీరిద్దరూ మూడు బంతుల వ్యవధిలో అవుట్ కాగా... పవర్ప్లే ముగిసేసరికి రైజర్స్ 71/2తో నిలిచింది. క్లాసెన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... ఇషాన్ కిషన్ నిలకడ కనబర్చాడు. సుయాశ్ శర్మ వేసిన 11వ ఓవర్లో అనికేత్ 6, 4, 6 కొట్టి కాసేపటికే ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి (4) ప్రభావం చూపలేకపోయాడు. అభినవ్ మనోహర్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆఖర్లో బాదే బాధ్యత ఇషాన్ భుజాలకెత్తుకున్నాడు. 28 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న కిషన్... చివర్లో మరింత వేగం పెంచి సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓపెనర్లు మినహా... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు... భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన కోహ్లి, మూడో ఓవర్లో రెండు ఫోర్లు దంచాడు. నాలుగో ఓవర్ వేసిన హర్షల్కు అదే శిక్ష వేశాడు. కోహ్లి 7 ఫోర్లు కొట్టేవరకు ఒక్క బౌండ్రీ బాదలేకపోయిన సాల్ట్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి చాలెంజర్స్ 72/0తో నలిచింది. తొలి వికెట్కు 80 పరుగులు జోడించిన అనంతరం విరాట్ అవుట్ కాగా... పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సాల్ట్ కాసేపటికి వెనుదిరగగా... జితేశ్ శర్మ, రజత్ పాటీదార్ జోరు కొనసాగించారు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 163/3తో నిలిచింది. విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు అవసరమైన దశలో... బెంగళూరు బ్యాటర్లు తడబడటంతో పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సాల్ట్ (బి) ఇన్గిడి 34; హెడ్ (సి) షెఫర్డ్ (బి) భువనేశ్వర్ 17; ఇషాన్ కిషన్ (నాటౌట్) 94; క్లాసెన్ (సి) షెఫర్డ్ (బి) సుయాశ్ 24; అనికేత్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; నితీశ్ రెడ్డి (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 4; అభినవ్ మనోహర్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 12; కమిన్స్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–54, 2–54, 3–102, 4–145, 5–164, 6–188. బౌలింగ్: యశ్ దయాళ్ 3–0–36–0; భువనేశ్వర్ 4–0–43–1; ఇన్గిడి 4–0–51–1; సుయాశ్ శర్మ 3–0–45–1; కృనాల్ పాండ్యా 4–0–38–1; షెఫర్డ్ 2–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిల్ సాల్ట్ (సి) హర్షల్ (బి) కమిన్స్ 62; కోహ్లి (సి) అభిషేక్ (బి) హర్‡్ష దూబే 43; మయాంక్ (సి) ఇషాన్ (బి) నితీశ్ 11; పాటీదార్ (రనౌట్) 18; జితేశ్ శర్మ (సి) అభినవ్ (బి) ఉనాద్కట్ 24; షెఫర్డ్ (సి అండ్ బి) మలింగ 0; కృనాల్ (హిట్ వికెట్) (బి) కమిన్స్ 8; టిమ్ డేవిడ్ (సి) క్లాసెన్ (బి) మలింగ 1; భువనేశ్వర్ (బి) కమిన్స్ 3; యశ్ దయాళ్ (సి) అభిషేక్ (బి) హర్షల్ పటేల్ 3; ఇన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–80, 2–120, 3–129, 4–173, 5–174, 6–174, 7–179, 8–186, 9–187, 10–189.బౌలింగ్: కమిన్స్ 4–0–28–3; ఉనాద్కట్ 4–0–41–1; హర్షల్ పటేల్ 3.5–0–39–1; ఇషాన్ మలింగ 4–0–37–2; హర్‡్ష దూబే 2–0–20–1; నితీశ్ రెడ్డి 2–0–13–1. ఐపీఎల్లో నేడుఢిల్లీ X పంజాబ్వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో

తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం
న్యూఢిల్లీ: తోటి సైనికుని కాపాడబోయిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయిన విషాదరక ఘటన సిక్కిం(Sikkim)లో చోటుచేసుకుంది. తన బృందంలోని సైనికుడొకరు వాగులో పడి కొట్టుకుపోతుండగా చూసిన ఆర్మీ అధికారి అతనిని కాపాడబోయి, నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.వివరాల్లోకి వెళితే గత ఏడాది డిసెంబర్లో నియమితులైన లెఫ్టినెంట్ శశాంక్ తివారీ(23) సిక్కింలోని వ్యూహాత్మక ఆపరేటింగ్ పెట్రోలింగ్కు నాయకత్వం వహిస్తున్నారు. వీరి బృందం కీలక పోస్ట్ వైపు కదులుతుండగా, అగ్నివీర్(Agniveer) స్టీఫెన్ సుబ్బా లాగ్ వంతెనను దాటుతూ, కాలు జారి వాగులో పడిపోయారు. దీనిని గమనించిన లెఫ్టినెంట్ తివారీ నీటిలోకి దూకారు. అతనికి మరో సైనికుడు నాయక్ పుకార్ కటెల్ సాయం అందించారు. వారిద్దరూ అగ్నివీర్ సుబ్బాను రక్షించగలిగారు.అయితే సుబ్బాను రక్షించే ప్రయత్నంలో లెఫ్టినెంట్ తివారీ(Lieutenant Tiwari) బలమైన ప్రవాహానికి కొట్టుకుపోయారు. అతని మృతదేహం 30 నిమిషాల తర్వాత 800 మీటర్ల దిగువన కనిపించింది. తివారీకి తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. కాగా ‘చిన్న వయస్సులోనే ఎంతో తెగువ చూపిన లెఫ్టినెంట్ తివారీకున్న ధైర్యం రాబోయే తరాలకు, సైనికులకు స్ఫూర్తినిస్తుందని భారత సైన్యం పేర్కొంది. ఈ అమరుని మృతదేహం అతని స్వస్థలానికి తరలించే ముందు బెంగ్డుబి మిలిటరీ స్టేషన్లో లెఫ్టినెంట్ జనరల్ జుబిన్ ఎ మిన్వాల్లా పూర్తి సైనిక గౌరవాలు అందించారని సిలిగురికి చెందిన 33 కార్ప్స్ (త్రిశక్తి కార్ప్స్) ‘ఎక్స్’లో పేర్కొంది.ఇది కూడా చదవండి: 43 ఏళ్ల న్యాయపోరాటం.. 104 ఏళ్ల వృద్ధునికి జైలు నుంచి విముక్తి
గంట సేపు సముద్రం చీలుతుంది
మా కేశవుడు అంత పెద్దోడా..
‘కన్నప్ప’ టీమ్కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్
‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
నా బిడ్డలను చూస్తాననుకోలేదు
కవిత లేఖ కలకలం.. కేటీఆర్ కీలక ప్రెస్మీట్
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
Brothers Day: నాన్న తరువాత..
పాక్ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్గా బుమ్రా.. సుదర్శన్కు దక్కని చోటు!.. శార్దూల్కు ఛాన్స్!
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా
అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్కు కవిత సంచలన లేఖ
ఏలూరులో ఘరానా మోసగాడు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
ఒకసారి భారత్కు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాడట సార్! ఓడించినందుకు!
భారత్కు అండగా ఉంటాం
గంట సేపు సముద్రం చీలుతుంది
మా కేశవుడు అంత పెద్దోడా..
‘కన్నప్ప’ టీమ్కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్
‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
నా బిడ్డలను చూస్తాననుకోలేదు
కవిత లేఖ కలకలం.. కేటీఆర్ కీలక ప్రెస్మీట్
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
Brothers Day: నాన్న తరువాత..
పాక్ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్గా బుమ్రా.. సుదర్శన్కు దక్కని చోటు!.. శార్దూల్కు ఛాన్స్!
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్కు కవిత సంచలన లేఖ
ఏలూరులో ఘరానా మోసగాడు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
ఒకసారి భారత్కు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాడట సార్! ఓడించినందుకు!
భారత్కు అండగా ఉంటాం
చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
సినిమా

విక్రమ్ సరసన క్రేజీ హీరోయిన్కు గోల్డెన్ ఛాన్స్
చిత్రపరిశ్రమలో వైవిధ్య భరిత కథాచిత్రాలకు కేరాఫ్ చియాన్ విక్రమ్. ఈయన తాను నటించే ప్రతి చిత్రంలోనూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఇటీవల తంగలాన్, వీర ధీర సూరన్ చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా తాజాగా విక్రమ్ తన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి మడోనా అశ్విన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు మండేలా, మావీరన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రాన్ని శాంతి పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సంస్థ ఇంతకుముందు శివకార్తికేయన్ కథానాయకుడిగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. కాగా తాజాగా విక్రమ్ హీరోగా నిర్మించే చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో విక్రమ్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నటి ప్రియాంక మోహన్, అలాగే శ్రీనిధిశెట్టిలలో ఒకరు నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కాగా తాజాగా లక్కీ కథానాయకి మీనాక్షి చౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కన్నడ బ్యూటీ ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో మంచి రేసింగ్లో ఉన్నారు. ఈమె ఇంతకు ముందు తమిళ్, తెలుగు భాషల్లో దుల్కర్ సల్మాన్కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాగే వెంకటేష్ సరసన నటించిన తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ప్రస్తుతం ఈమె క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. కాగా మరోసారి తమిళంలో విక్రమ్తో జత కట్టడానికి రెడీ అవుతారా? అన్నది వేచి చూడాలి.

'మెగా 157' ప్రారంభం.. ఫస్ట్ సీన్ ఎక్కడంటే
మెగాస్టార్ చిరంజీవి,అనిల్ రావిపూడి తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) ఈరోజు హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభమైంది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి కాన్సెప్ట్తోనే ఈ చిత్రం రానుంది.తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు (మే 23) హైదరాబాద్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ప్రాజెక్ట్పై అనిల్తో పాటు చిరంజీవి కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో, తర్వాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది.ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా ఉన్నారు.

జయం రవి విడాకుల వివాదం.. సింగర్కు హత్య బెదిరింపులు!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Ravi Mohan), సింగర్ కెనీషా(kenishaa) డేటింగ్లో ఉన్నారనే వార్తలు గతకొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా వీరిద్దరు ప్రకటించనప్పటికీ.. జయం రవి తన భార్య ఆర్తికి దూరంగా ఉండడం.. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఇది నిజమనే అంతా అనుకుంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్కి కెనీషాతో కలిసి వెళ్లడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో జయం రవి సతీమణి ఆర్తి సోషల్ మీడియా వేదికగా విడాకులపై స్పందించడం, మూడో వ్యక్తికారణంగానే విడిపోవాల్సి వస్తుందని చెప్పడంతో.. కెనీషానే వీరిద్దరి కాపురంలో చిచ్చు పెట్టిందని కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు కెనీషాను చంపేస్తామంటూ సందేశాలు కూడా పంపుతున్నారట. ఈ విషయాన్ని కెనీషానే సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. తనను బెదిరిస్తూ పంపిన సందేశాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయలేదు. ఏ విషయాన్ని దాచడం లేదు. ఎటూ పారిపోవడం లేదు. నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ఏ విషయాన్ని అయినా నా ముఖంపైనే అడగండి. మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానిజాలు చెప్పడం నాకు కూడా సంతోషమే. ఇప్పుడు నా చుట్ట జరుగుతున్న కొన్ని విషయాలకు నేనే బాధ్యురాలు అని మీకు అనిపిస్తే.. కోర్టుకు అప్పగించండి. అంతేకానీ ఇలా శాపాలు పెడుతూ కామెంట్ చేయడం వల్ల నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా? కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మీరంతా నన్ను నిందిస్తున్నారు. కానీ నిజానిజాలు ఏంటనేది బయటకు వచ్చాక మీరు కూడా ఇలాంటి బాధను అనుభవించాలని నేను కోరుకోవడం లేదు. మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను నిందిస్తున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, త్వరలోనే నిజం బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పటివరకూ నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా బతకనివ్వండి’ అని కెనీషా రాసుకొచ్చింది.

విజయ్ సేతుపతి 'ఏస్' సినిమా రివ్యూ
విజయ్ సేతుపతి నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) థియేటర్స్లోకి వచ్చేసింది. రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రాన్ని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. మే 23న బి. శివ ప్రసాద్ భారీ ఎత్తున తెలుగులో రిలీజ్ చేశారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలుసుకుందాం.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు.అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందలు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు.ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? తనపై నమోదైన నేరాల నుంచి ఎలా బయటపడుతాడు..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? చివరికి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?దర్శకుడు అరుముగకుమార్ కథ చెప్పడంలో ఒక ప్రత్యేకమైన శైలి తీసుకున్నాడు. సినిమాలోని పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోతారు. ప్రేక్షకుల ఊహకు అందేలానే కథనం సాగుతూ ఉన్నా కూడా ఎక్కడా అయితే బోర్ కొట్టదు. విజయ్ సేతుపతి డార్క్ కామెడీ, యోగిబాబు టైమింగ్, రుక్మిణి వసంత్ అందాలు ఆ లోపాల్ని కప్పి పుచ్చేస్తుంటాయి. అలా సినిమాను ఎంగేజింగ్గా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ముఖ్యంగా నెమ్మదిగా సాగే మొదటి అర్ధభాగం కాస్త నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత కథ స్పీడ్ అందుకుంటుంది. ప్రథమార్దం అంతా కథలోని పాత్రలను పరిచయం చేసేందుకే సరిపోతుంది. అసలు కథ మొదలు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే హీరో తన వారి కోసం విలన్ డెన్కు ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి జోరు అందుకుంటుంది. బ్యాంక్లో దొంగిలించిన సొమ్ముతో హీరో ఎలా బయటపడతాడు..? ఆ నేరాల్లోంచి ఎలా తప్పించుకుంటాడు..? అనే పాయింట్లతో సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్ తీసుకెళ్తాడు. క్లైమాక్స్లో హీరో చేత డైరెక్టర్ ఆడించే ఆట, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారంటే..?ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. బోల్ట్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. కేవలం ఆయన మాత్రమే చేయగలడు అనేలా పాత్ర ఉంటుంది. మొదటి సారి డార్క్ కామెడీని ఆయన పండించాడు. ఇక యోగి బాబు అయితే ఫుల్ లెన్త్గా నవ్విస్తాడు. రుక్మిణి వసంత్ ఇందులో తన గ్లామర్తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. దివ్యా పిళ్లైకి ఓ మంచి పాత్ర దక్కింది. అవినాష్ విలనిజం మెప్పిస్తుంది. సాంకేతిక పరంగా కూడా సినిమా బాగుంటుంది. కెమెరామెన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. పాటలకు పెద్దగా కనెక్ట్ కాకున్నప్పటికీ మ్యూజిక్ బాగుంది. శామ్ సీఎస్ ఆర్ఆర్ మెప్పిస్తుంది. కాస్త ఎడిటింగ్లో మార్పులు చేసింటే ఇంకా బాగుండేది. విజయ్ సేతుపతి కోసం సినిమా చూడొచ్చు. ఎక్కడా కూడా ఎవరినీ నిరుత్సాహపరచడు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

నీరజ్ చోప్రాకు రెండో స్థానం
చోర్జో (పోలాండ్): ఈ సీజన్లో తాను పాల్గొన్న రెండో ఈవెంట్లోనూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన జానుస్ కుసోన్స్కీ స్మారక అథ్లెటిక్స్ మీట్లో నీరజ్ చోప్రా చివరిదైన ఆరో ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 27 ఏళ్ల నీరజ్ చివరి ప్రయత్నంలో జావెలిన్ను 84.14 మీటర్ల దూరం విసిరి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈనెల 16న జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లోనూ నీరజ్ రెండో స్థానాన్ని సాధించాడు. దోహా డైమండ్ లీగ్ మీట్లో అగ్రస్థానంలో నిలిచిన జూలియన్ వెబెర్ (జర్మనీ) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. జూలియన్ వెబెర్ జావెలిన్ను 86.12 దూరం విసిరి తొలి స్థానాన్ని పొందగా... రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 83.24 మీటర్లు) మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్ను 81.28 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత మూడు, నాలుగు ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన నీరజ్ ఐదో ప్రయత్నంలో జావెలిన్ను 81.80 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత చివరి ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకొని రెండో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.

14 నెలల తర్వాత...
కౌలాలంపూర్: ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో 32 ఏళ్ల శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 24–22, 17–21, 22–20తో ప్రపంచ 18వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన పోరులో శ్రీకాంత్ కీలకదశలో చెలరేగి తుది ఫలితాన్ని శాసించాడు. నిర్ణాయక మూడో గేమ్లో శ్రీకాంత్ ఒకదశలో 7–11తో వెనుకబడ్డాడు. కానీ సంయమనం కోల్పోకుండా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన శ్రీకాంత్ 14–14తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 16–14తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ అదే జోరును కొనసాగించి 20–17తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే పొపోవ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. కానీ శ్రీకాంత్ మరో అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 2024 మార్చిలో స్విస్ ఓపెన్లో చివరిసారి శ్రీకాంత్ సెమీఫైనల్ చేరుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 14 అంతర్జాతీయ టోర్నీల్లో పోటీపడ్డా క్వార్టర్ ఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేకపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)తో శ్రీకాంత్ తలపడతాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ ద్వయం 22–24, 13–21తో జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.

బెంగళూరుకు రైజర్స్ బ్రేక్
లక్నో: ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలపై నీళ్లుచల్లిన రైజర్స్... శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. శుక్రవారం జరిగిన పోరులో సన్రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టగా... అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్లు), హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్లు), విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో భయపెట్టినా... చివర్లో ఒత్తిడి పెంచిన రైజర్స్ ఫలితం రాబట్టింది. సన్రైజర్స్ కెపె్టన్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరంభం నుంచే దంచుడు... ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన సన్రైజర్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రెండో ఓవర్లో హెడ్ ఫోర్తో ఖాతా తెరవగా... భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్లో హెడ్ ఫోర్, అభిషేక్ 4, 6 బాదారు. మూడో ఓవర్లోనూ అభిషేక్ 4, 6 దంచగా... నాలుగో ఓవర్లో ఈ జోడీ 4, 6, 4 కొట్టింది. వీరిద్దరూ మూడు బంతుల వ్యవధిలో అవుట్ కాగా... పవర్ప్లే ముగిసేసరికి రైజర్స్ 71/2తో నిలిచింది. క్లాసెన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... ఇషాన్ కిషన్ నిలకడ కనబర్చాడు. సుయాశ్ శర్మ వేసిన 11వ ఓవర్లో అనికేత్ 6, 4, 6 కొట్టి కాసేపటికే ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి (4) ప్రభావం చూపలేకపోయాడు. అభినవ్ మనోహర్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆఖర్లో బాదే బాధ్యత ఇషాన్ భుజాలకెత్తుకున్నాడు. 28 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న కిషన్... చివర్లో మరింత వేగం పెంచి సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓపెనర్లు మినహా... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు... భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన కోహ్లి, మూడో ఓవర్లో రెండు ఫోర్లు దంచాడు. నాలుగో ఓవర్ వేసిన హర్షల్కు అదే శిక్ష వేశాడు. కోహ్లి 7 ఫోర్లు కొట్టేవరకు ఒక్క బౌండ్రీ బాదలేకపోయిన సాల్ట్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి చాలెంజర్స్ 72/0తో నలిచింది. తొలి వికెట్కు 80 పరుగులు జోడించిన అనంతరం విరాట్ అవుట్ కాగా... పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సాల్ట్ కాసేపటికి వెనుదిరగగా... జితేశ్ శర్మ, రజత్ పాటీదార్ జోరు కొనసాగించారు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 163/3తో నిలిచింది. విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు అవసరమైన దశలో... బెంగళూరు బ్యాటర్లు తడబడటంతో పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సాల్ట్ (బి) ఇన్గిడి 34; హెడ్ (సి) షెఫర్డ్ (బి) భువనేశ్వర్ 17; ఇషాన్ కిషన్ (నాటౌట్) 94; క్లాసెన్ (సి) షెఫర్డ్ (బి) సుయాశ్ 24; అనికేత్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; నితీశ్ రెడ్డి (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 4; అభినవ్ మనోహర్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 12; కమిన్స్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–54, 2–54, 3–102, 4–145, 5–164, 6–188. బౌలింగ్: యశ్ దయాళ్ 3–0–36–0; భువనేశ్వర్ 4–0–43–1; ఇన్గిడి 4–0–51–1; సుయాశ్ శర్మ 3–0–45–1; కృనాల్ పాండ్యా 4–0–38–1; షెఫర్డ్ 2–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిల్ సాల్ట్ (సి) హర్షల్ (బి) కమిన్స్ 62; కోహ్లి (సి) అభిషేక్ (బి) హర్‡్ష దూబే 43; మయాంక్ (సి) ఇషాన్ (బి) నితీశ్ 11; పాటీదార్ (రనౌట్) 18; జితేశ్ శర్మ (సి) అభినవ్ (బి) ఉనాద్కట్ 24; షెఫర్డ్ (సి అండ్ బి) మలింగ 0; కృనాల్ (హిట్ వికెట్) (బి) కమిన్స్ 8; టిమ్ డేవిడ్ (సి) క్లాసెన్ (బి) మలింగ 1; భువనేశ్వర్ (బి) కమిన్స్ 3; యశ్ దయాళ్ (సి) అభిషేక్ (బి) హర్షల్ పటేల్ 3; ఇన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–80, 2–120, 3–129, 4–173, 5–174, 6–174, 7–179, 8–186, 9–187, 10–189.బౌలింగ్: కమిన్స్ 4–0–28–3; ఉనాద్కట్ 4–0–41–1; హర్షల్ పటేల్ 3.5–0–39–1; ఇషాన్ మలింగ 4–0–37–2; హర్‡్ష దూబే 2–0–20–1; నితీశ్ రెడ్డి 2–0–13–1. ఐపీఎల్లో నేడుఢిల్లీ X పంజాబ్వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో

ఆర్సీబీకి ఝులక్ ఇచ్చిన ఎస్ఆర్హెచ్.. టాప్-2 కష్టమే?
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు సన్రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైందిఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(62), విరాట్ కోహ్లి(43) అద్బుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ రెండు, ఉనద్కట్, దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్దానానికి పడిపోయింది. టాప్-2లో గుజరాత్,పంజాబ్ కొనసాగుతున్నాయి. ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు అభిషేక్ శర్మ(17 బంతుల్లో 34), క్లాసెన్(24), హెడ్(17), అనికేత్ వర్మ(9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్, ఎంగిడీ,భువనేశ్వర్, పాండ్యా తలా వికెట్ సాధించారు.చదవండి: WI vs IRE: వెస్టిండీస్ వీరుడి విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
బిజినెస్

టారిఫ్లు, వలస విధానాల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: టారిఫ్లు, యూఎస్ వలస విధానాలు ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశమున్నట్లు ఐటీ సేవల దిగ్గజం విప్రో తాజాగా అంచనా వేసింది. భారీ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల టారిఫ్లు, వాణిజ్య విధానాలు కంపెనీ ఆదాయం, బిజినెస్లను దెబ్బతీయవచ్చని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, నియంత్రణల వాతావరణం కంపెనీ కార్యకలాపాలకు ప్రస్తావించదగ్గ స్థాయిలో రిస్క్ లను కల్చించే వీలున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఆదాయంలో వృద్ధికి అంతర్జాతీయ మార్కెట్లపై అధికంగా ఆధారపడే ఐటీ సేవల దిగ్గజం విప్రో 2024–25 వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది. అమెరికా, యూరప్ దేశాలలో క్లయింట్లు అధికంగా కలిగిన కంపెనీ కొన్ని రంగాల క్లయింట్ల నుంచి అధికంగా బిజినెస్ లభిస్తుందని పేర్కొంది. అయితే ఆర్థిక మందగమనం, యూఎస్ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రతికూల పరిస్థితులకు కారణంకావచ్చని అభిప్రాయపడింది. కంపెనీ ఆదాయంలో 62 శాతం యూఎస్, 27 శాతం యూరప్ నుంచి లభించే సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 కాగా.. గతేడాది (2024–25)లో రూ. 89,088 కోట్ల ఆదాయం అందుకుంది. నికర లాభం 19 శాతం ఎగసి రూ. 13,135 కోట్లను దాటింది. ఈ ఏడాది (2025–26) క్యూ1(ఏప్రిల్– జూన్)లో త్రైమాసికవారీగా 250.5–255.7 కోట్ల డాలర్ల ఆదాయం అంచనా వేస్తోంది. బీఎస్ఈలో విప్రో షేరు 0.6 శాతం బలపడి రూ. 247 వద్ద ముగిసింది.

ఈవీలకు ‘హైబ్రిడ్’ దన్ను
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలతో హైబ్రిడ్ వాహనాలు పోటీపడటం కాకుండా వాటి విక్రయాలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. ఈ రెండు రకాల కస్టమర్ల సెగ్మెంట్లు వేర్వేరుగా ఉంటున్నాయని పేర్కొంది. భారత్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లే క్రమంలో.. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే హైబ్రిడ్లు, సీఎన్జీలు, బయోఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రాధాన్యం కొనసాగుతుందని వివరించింది. ‘స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎస్హెచ్ఈవీ), బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ) ఒకదాని మార్కెట్ను మరొకటి ఆక్రమించకుండా, వేర్వేరు వర్గాల కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయి. ఎస్హెచ్ఈవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న రాష్ట్రాల్లో బీఈవీల అమ్మకాలు కూడా పటిష్ట వృద్ధిని సాధించాయి. దేశంలోనే అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యే ఉత్తర్ప్రదేశ్లో ఎస్హెచ్ఈవీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచి్చనప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్ఈవీ విక్రయాలకు సరిసమాన స్థాయిలో ఈవీల అమ్మకాల వృద్ధి నమోదైంది. ఎస్హెచ్ఈవీల విక్రయాలు, బీఈవీల అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఈ ధోరణితో తెలుస్తోంది‘ అని నివేదిక వివరించింది. ఎస్హెచ్ఈవీలను ప్రోత్సహిస్తే, ఈవీల విక్రయాలు తగ్గిపోతాయనేది అపోహ మాత్రమేనని తెలిపింది. కొత్త మోడల్స్ రాకతో గత ఆరు నెలల్లో ఈవీల వినియోగం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.మరిన్ని ముఖ్యాంశాలు.. → గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1.9 శాతంగా ఉన్న ఫోర్ వీలర్ ఈవీల విక్రయాలు, ఆఖరు త్రైమాసికంలో 2.5 శాతానికి పెరిగాయి. → మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో (పీవీ) ఎస్హెచ్ఈవీల వాటా 2025 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 2.1 శాతంగా ఉంది. → ధరకు తగ్గ విలువను అందించే విధంగా ఉంటే ఈవీలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు సుముఖంగానే ఉంటున్నారు. విండ్సర్ కస్టమర్లు 7–8 ఏళ్ల తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ వ్యయం గురించి ఆందోళన చెందకుండా ఎంజీ సంస్థ లీజింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టడం, రేంజి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎంఅండ్ఎం తమ బీఈవీల్లో భారీ బ్యాటరీని అందించడం మొదలైనవి సానుకూలాంశాలుగా ఉన్నాయి. → మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్), టయోటా కిర్లోస్కర్ కంపెనీలు ప్రవేశపెట్టిన ఎస్హెచ్ఈవీలు 2023 అలాగే 2024 ఆర్థిక సంవత్సరాల్లో డీజిల్ వేరియంట్ల మార్కెట్ వాటాను ఆక్రమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వేరియంట్లు, హైబ్రిడ్ల వాటా స్థిరంగా నమోదైంది. → కొత్త మోడల్స్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సమీప భవిష్యత్తులో హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు దోహదపడనున్నాయి.

పెరిగిన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఏఎల్) నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 253 కోట్లకు పెరిగింది. అంతక్రితం క్యూ4లో నష్టం రూ. 168 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. రూ. 2,570 కోట్ల నుంచి రూ. 2,977 కోట్లకు చేరింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నష్టం రూ. 829 కోట్ల నుంచి రూ. 817 కోట్లకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయం పనులు మార్చి ఆఖరు నాటికి సుమారు 69 శాతం పూర్తయినట్లు జీఏఎల్ తెలిపింది. నియంత్రణ సంస్థ ఏఈఆర్ఏ కొత్తగా జారీ చేసిన టారిఫ్ ఆర్డరుతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆదాయం, లాభదాయకత మరింత మెరుగుపడతాయని పేర్కొంది. ఈ ఆర్డరు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచి్చంది. దీన్ని గత ఆర్థిక సంవత్సరంలోనే జారీ చేసి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని సంస్థ వివరించింది. జీఏఎల్ లో భాగమైన సంస్థలు హైదరాబాద్, ఢిల్లీ, మోపా (గోవా) విమానా శ్రయాలను నిర్వహిస్తున్నాయి. అటు ఇండొనేషియాలోని మెడాన్ ఎయిర్పోర్ట్, గ్రీస్లోని క్రెటే ఎయిర్పోర్టు కూడా కంపెనీ నిర్వహణలో ఉన్నాయి. శుక్రవారం బీఎస్ఈలో జీఏఎల్ షేరు రెండు శాతం పైగా క్షీణించి రూ. 86.83 వద్ద క్లోజయ్యింది.

కేంద్రానికి బంపర్ బొనాంజా
ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ రికార్డు స్థాయిలో రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2023–24) చెల్లించిన రూ. 2.1 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 27.4 శాతం అధికం. 2022–23లో ప్రభుత్వానికి ఆర్బీఐ రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ‘రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో జరిగిన 616వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో రూ. 2,68,590.07 కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు‘ అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల వేళ రక్షణ శాఖకు కేటాయింపులు భారీగా పెంచాల్సి రావడం, అమెరికా టారిఫ్లపరంగా నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వానికి ఇది సహాయకరంగా ఉండనుంది. ఆర్బీఐ ఏటా తన పెట్టుబడులపై వచ్చే అదనపు రాబడిని, డాలర్ మారకంలో మార్పుల వల్ల వచ్చే ప్రయోజనాలు మొదలైన వాటిని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో బదలాయిస్తుంది. ఈసారి ఇది రూ. 2.5 – రూ. 3 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. తాజా బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే ఆర్బీఐ ప్రకటించిన డివిడెండు సుమారు రూ. 0.4–0.5 లక్షల కోట్లు అధికమని, పన్ను వసూళ్లు లేక డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలను సాధించలేకపోయినా, లేదా లెక్కకు మించి వ్యయాలు ఎదురైనా అధిగమించేందుకు ఇది సహాయపడగలదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. రిస్క్ బఫర్ 7.50 శాతానికి పెంపు.. అంతర్జాతీయ, దేశీ పరిస్థితులు, రిసు్కలు మొదలైన అంశాలను సమావేశంలో సమీక్షించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ పనితీరును కూడా సమీక్షించి వార్షిక నివేదికకు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన కంటింజెంట్ రిస్క్ బఫర్ని (సీఆర్బీ) ఆర్బీఐ బ్యాలెన్స్ షీటులో 7.50 శాతానికి పెంచాలని సెంట్రల్ బోర్డ్ నిర్ణయించింది. 2023–24లో దీన్ని 6.5 శాతానికి పెంచారు.
ఫ్యామిలీ

స్మార్ట్గా ఉండాలంటే..అమీర్ఖాన్లా డైట్ స్ట్రిక్ట్గా ఉండాల్సిందే..!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. పాత్ర కోసం ఏం చేసేందుకైనా వెనుకాడని వ్యక్తిత్వం అమీర్ది. అందుకే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు. ఆయన ఆరు పదుల వయసులోనూ యువ హీరోలకు తీసిపోని విధంగా స్టైలిష్ లుక్ కనిపిస్తుంటాడు. అతని ఫిట్నెస్ బాడీ చూస్తే..అంత ఏజ్ ఉంటుందని అనిపించదు. అంతలా ఎలా మెయింటైన్ చేస్తారనే సందేహం కలగకమానదు. అంతేగాదు డైట్ విషయంలో అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే ఆయనే స్వయంగా డైట్ విషయంలో ఎంతలా కమిట్మెంట్గా ఉంటారో ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆ నిబద్ధత చూసి..షారుఖ్ తన భార్య గౌరి ఇద్దరూ కూడా విస్తుపోయారని అంటూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా.సరిగ్గా దంగల్ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం. అయితే ఆ టైంలోనే షారుఖ్ ఇంటికి ఆపిల్కు చెందిన టిమ్ కుక్ తోపాటు అమెరికా నుంచి నలుగురు ప్రముఖులు వచ్చారు. ఆ నేపథ్యంలో మమ్మల్ని అందరిని విందుకు ఆహ్వానించాడు షారుఖ్. విందు చేయకుండా వెళ్లవద్దని గౌరీ మరీ మరీ చెప్పిందట అమీర్కి. అందుకు అమీర్ కూడా కచ్చితంగా తినే వెళ్తానని అన్నారట. సరిగ్గా అంతా విందుకు కూర్చొన్నప్పుడు..ఆహారం సిద్ధం చేశామని, తినమని చెప్పగా..వెంటనే అమీర్ తన దగ్గర టిఫిన్ బాక్స్ ఉంది వద్దని చెప్పారట. అదేంటి మా ఇంటికి వచ్చి..టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నావా..అని ఆశ్యర్యపోతూ అడిగారట షారుఖ్ దంపతులు. అందుకు అమీర్ మనలో మనకి ఫార్మాలిటీ ఏముంది..ప్రస్తుతం తాను దంగల్ మూవీ కోసం డైట్లో ఉన్నానంటూ..తాను తెచ్చుకున్న బాక్సే తిన్నానని ఒక ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. దీని గురించి షారుక్ని అడిగినా కచ్చితంగా చెబుతాడంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు అమీర్. అలాంటి కమిట్మెంట్ తప్పక ఉండాలి..స్మార్ట్గా ఆరోగ్యంగా ఉండాలంటే..ఏ పార్టీలకి అటెండైనా..మీ బాక్స్ తెచ్చుకుంటే..ఫుడ్పై కంట్రోల్ ఉంటుందట. అనుకున్న విధంగా బరువు అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల అనారోగ్యకరమైన చక్కెరలు, కొవ్వులకు దూరంగా ఉంటామట. అలాగే మన బరువు తగ్గించే లక్ష్యానికి ఆటంకం రాదు అని చెబుతున్నారు నిపుణులు.మైండ్ఫుల్నెస్గా తినడానికి సరైన ఉదాహారణ ఈ విధానమేనని అంటున్నారు. ఇది సమతుల్య జీవనశైలి తోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాడానికి ఉపకరిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా మీరు ఉండాల్సిన ఆకృతిలో బాడీ మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం స్లిమ్గా ఆరోగ్యంగా కనిపించేలా అమీర్ ఖాన్ స్ట్రిట్ డైట్ని ఫాలో అయిపోండి. అమీర్ఖాన్ స్ట్రిక్ట్ డైట్ రూల్స్..! విస్తుపోయిన్ షారుఖ్ దంపతులు..(చదవండి: లైట్ తీస్కో భయ్యా..!)

బనారసీ చీరలో నీతా అంబానీ లుక్ : లగ్జరీ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. దేశంలో ముంబైలో నెలకొల్పిన 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీతా న్యూయార్క్లోని ఐకానిక్ లింకన్ సెంటర్లో 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంతేకాదు స్వయంగా భరతనాట్యం నృత్యకారిణి నీతా అంబానీ ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు.బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ భారతీయత, ష్యాషన్ పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు.వ్యాపారం , ఫ్యాషన్ రంగంలో ఎప్పుడూ ప్రత్యేకమైన శైలే. ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని అందరినీ ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రీ-ఈవెంట్ లుక్లో అచ్చమైన బంగారం, వెండి జరీతో గండభేరుండ మోటిఫ్లతో చేతితో నేసిన ఎరుపు రంగు బనారసి చీరను ధరించారు. దీనికి సింపుల్ జ్యుయల్లరీ ఎంచుకున్నారు. దీనికి జతగా ధరించిన కస్టమ్ హెర్మ్స్ బ్యాగ్ షో మరింత హైలైట్గా నిలిచింది. రాబోయే ఈవెంట్పై పనిచేస్తున్న ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా దీనికి సంబంధించిన ఫోటో, వివరాలను పంచుకున్నారు. ఈ లగ్జరీ బ్యాగ్ను పదేళ్ల క్రితం ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించారట. నీతా అంబానీ ఇప్పటికే తన లుక్తో భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) సెప్టెంబర్ 12 నుండి 14 వరకు న్యూయార్క్లో ఇండియా వీకెండ్NMACC సెప్టెంబర్ 12 నుండి 14, 2025 వరకు న్యూయార్క్లోని లింకన్ సెంటర్లో ఇండియా వీకెండ్ను నిర్వహించనుంది. 2023లో భారతదేశ సంస్కృతి, వారసత్వం, నాటకం, నృత్యం, జానపదాలు, కళలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ మరో అడుగు ముందుకేసిందని నీతా అంబానీ ప్రకటించారు. ప్రపంచ వేడుకగా తొలిసారి న్యూయార్క్లోని ప్రఖ్యాత లింకాన్ సెంటర్లో ఎన్ఎంఏసీసీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు డ్యాన్స్, సంగీతం, ఫ్యాషన్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నామని ఆమె తెలిపారు. ఈ వేడుకలో భారతదేశం, దేశానికి చెందిన 5 వేల ఏళ్లనాటి వైభవాన్ని చాటి చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు నీతా అంబానీ.చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదాగ్రాండ్ స్వాగత్ ఉత్సవంతో ఈవేడుకలు ప్రారంభమవుతాయి. ఇందులో అంబానీ చేనేత ఎంపోరియం, స్వదేశ్ కోసం ఫ్యాషన్ షో కూడా ఉంటుంది. ప్రతి డిజైన్ను మనీష్ మల్హోత్రా క్యూరేట్ చేస్తారు. మరోవైపు, నగరంలో తన రెస్టారెంట్ బంగ్లాను నడుపుతున్న మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, దేశంలోని విభిన్న రుచులతో ప్రత్యేకంగా రూపొందించిన మెనూను అందిస్తారు. ఇంకా శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్ ,రిషబ్ శర్మ వంటి సంగీతకారులు , గాయకులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?

Hanuman Jayanti 2025 భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
రాయదుర్గం: హనుమంతుడి జయంతిని ఆలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జీపీఆర్ఏ క్వార్టర్స్లోని రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి, గచ్చిబౌలోని శివసాయిక్షేత్రంలో ఆంజనేయస్వామికి, ఇందిరానగర్లోని ఇంటర్నేషనల్ శ్రీహనుమాన్ ధామ్ ఆశ్రమ్ ఆలయంలో, మధురానగర్, ఖాజాగూడ, నానక్రాం గూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, గోపన్పల్లి, టెలికామ్నగర్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిõÙకాలు, అర్చనలు, ఆకుపూజ, ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇదిలావుండగా గచ్చిబౌలిలోని శివసాయిక్షేత్రంలో హనుమాన్ హోమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా ఆకుపూజ, వడమాలతో అలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. మియాపూర్లో.. మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణనగర్కాలనీ, మియాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గాందీ, కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గాం«దీ, కార్పొరేటర్ శ్రీకాంత్ను సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆంజనేయస్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల కాలనీల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సుభాష్ చంద్రబోస్నగర్ కాలనీలో.. చందానగర్: హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్నగర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గాంధీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్యాదవ్, సాంబశివారావు, బృందరావు, అంకరావు, సత్యం, రామకృష్ణ, వెంకటేష్, రవి, అప్పలరాజు, ఆలయ కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్శిటీ (Harvard University) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకున్న చర్య దిగ్భ్రాంతికి గురి చేసింది. హార్వర్డ్, ట్రంప్ సర్కార్కు మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే, ఫెడరల్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధికారాన్ని రద్దు చేసిది. హార్వర్డ్ దాని SEVP స్థితిని పునరుద్ధరించాలని భావిస్తే, సంబంధిత పత్రాలను రూపొందించడానికి ఇతర డిమాండ్లను తీర్చడానికి 72 గంటల సమయం ఇచ్చింది. ట్రంప్ తాజా సంచలన నిర్ణయం అనేక మంది విదేశీ విద్యార్థులకు దెబ్బతీయనుంది.ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్శిటీ స్పందించింది.ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) గురువారం ప్రకటించిన ఈ నిర్ణయం, హార్వర్డ్లోని దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రమాదంలో పడేస్తుంది. వీరిలో భారతదేశం నుండి దాదాపు 800 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లుహార్వర్డ్ రికార్డుల ప్రకారం, ప్రతీ సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు మరియు స్కాలర్లు, వివిధ విభాగాలలో నమోదు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం, ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్లో చదువుతున్నారు, వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్-స్థాయి ప్రోగ్రామ్లలో ఉన్నారు. ట్రంప్ పరిపాలన చర్యతో, ఈ విద్యార్థులు ఇప్పుడు అమెరికాలో చట్టబద్ధంగా ఉండాలనుకుంటే మరొక SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దు , బహిష్కరణకు దారి తీయవచ్చు.హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (DHS) హార్వర్డ్పై జరుపుతోన్న విచారణలో భాగంగా తీసుకున్న చర్య అని ప్రకటించింది. ఈ మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను పంపించారు. ఈ లేఖలో, క్యాంపస్లోని విదేశీ విద్యార్థుల గురించి సమాచారం కోసం అమెరికా ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేకంగా, క్యాంపస్లో జరిగిన నిరసనలకు సంబంధించిన క్రమశిక్షణా రికార్డులు, ఆడియోవిజువల్ డాక్యుమెంటేషన్ను విశ్వవిద్యాలయం సమర్పించ లేదని లేఖలో ఆరోపించింది. అలాగే ‘హార్వర్డ్లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నాం. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదు.. అది ఓ అర్హత మాత్రమే” అని తెపారు. అంతేగాక, విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్లు నిధులు సమ కూర్చుకుంటున్నారు, ఇది హక్కు, కాదు’ అనిఆమె పేర్కొన్నారు.మరోవైపు దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ కక్షపూరిత చర్యగా అభివర్ణించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్ట విరుద్ధమైందని వ్యాఖ్యానించింది. 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులకు ఆతిథ్యమిస్తూ ప్రపంచాన్ని వెలుగులో నింపేందుకు చేస్తున్న వారిని మా వర్సిటీలో కొనసాగించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ చర్య చట్టబద్ధమైనదేనా?అమెరికా చట్టాల ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విద్యార్థి వీసాలపై అధికార పరిధిని కలిగి ఉంటుంది. అలాగూ SEVPని పర్యవేక్షిస్తుంది. గతంలో నిష్ణాతులైన అధ్యాపకుల లేకపోవడం లేదా సంస్థను మూసివేయడం వంటి తీవ్రమైన పరిపాలనా లోపాలతో SEVP జాబితా నుండి కొన్నింటిని తొలగించినప్పటికీ, హార్వర్డ్ SEVP సర్టిఫికేషన్ను రద్దు చేయడం లాంటిది ఇంతకుముందెన్నడూ లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.
ఫొటోలు
అంతర్జాతీయం

విదేశీ విద్యార్థులకు కెనడా ఝలక్.. స్టడీ పర్మిట్లలో భారీ తగ్గుదల
న్యూఢిల్లీ: కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు షాక్ తగిలింది. స్టడీ పర్మిట్లలో పోనుపోను భారీగా తగ్గుదల చోటు చేసుకుంది. తాజాగా వెల్లడైన ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (IRCC) గణాంకాలు ఈ వివరాలను తేటతెల్లం చేశాయి.2025 తొలి త్రైమాసికానికిగానూ కేవలం భారతీయ విద్యార్థుల కోసం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ అయ్యాయి. అయితే కిందటి ఏడాది ఇదే సమయంలో 44, 295 పర్మిట్లు జారీ అయ్యాయి. అంటే.. దాదాపు 31 శాతం తగ్గిందన్నమాట.2023 చివరి నుంచి వలసదారుల రాకను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే.. స్టడీ పర్మిట్లను తగ్గిస్తూ వస్తున్నారు. రికార్డు స్థాయిలో వలసల వల్ల కెనడాపై అన్ని రకాలుగా తీవ్ర భారం పడుతోందని అక్కడి లిబరల్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే.. 2028 నాటికల్లా కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులు, విదేశీ ఉద్యోగులు.. విద్యార్థులు కలిపి 5 శాతానికి మించి ఉండకూదంటూ ప్రధాని మార్క్ కార్నీ ఒక ప్రకటన చేశారు.ఇక గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.2023లో.. కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. ఇందులో భారతీయులకు జారీ చేసింది 2, 78,0452024కి వచ్చేసరికి.. మొత్తం 5,16,275 పర్మిట్లు జారీ చేయగా.. అందులో భారతీయుల కోసం జారీ చేసింది 1,88,4652025 నాటికి.. ఈ ఏడాదికిగానూ తొలుత 4,85,000 పర్మిట్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. 4,37,000 పర్మిట్లు మాత్రమే జారీ చేయాలని ఐఆర్సీసీ ఇప్పుడు భావిస్తోంది. ఇందులో భారతీయల పర్మిట్ల సంఖ్యను లక్షకు పరిమితం చేయాలని భావిస్తోందని స్పష్టమవుతోంది. 2026 కల్లా.. ఈ పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గించే యోచనలో ఉంది. మరోవైపు స్టడీ పర్మిట్ల దరఖాస్తుల కోసం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా మారాయి.

ఉగ్రవాదంపై పోరుకు పర్యాయపదం ‘సింధూర్’: ఎంపీ బన్సూరి
అబుదాబి: ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)తో ఉగ్రవాదంపై భారతదేశ దృఢ వైఖరి ప్రపంచం ముందు వ్యక్తమయ్యిందని, భారత్ చేపట్టిన ఈ మిషన్ ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత బలపరిచిందని బీజేపీ మహిళా నేత బన్సూరి స్వరాజ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం సాగిస్తోంది. దీనిలో భాగంగా శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం యూఏఈలో పర్యటిస్తోంది. ఈ బృందంలో భాగస్వామ్యురాలైన బీజేపీ మహిళా నేత బన్సూరి స్వరాజ్ యూఏఈలోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు.తొలుత బన్సూరి.. భారత్- గల్ఫ్ దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం(Terrorism)పై భారతదేశ దృఢమైన వైఖరి గురించి ఆమె మాట్లాడుతూ, భారత సాయుధ దళాల పరాక్రమంతో సాగిన ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు ఉగ్రవాదంపై పోరాటానికి పర్యాయపదంగా మారిందని అన్నారు. ఏప్రిల్ 22న భారతీయుల ఉనికిపై అనాగరిక దాడి జరిగిందని, దానికి భారత్ తగిన సమాధానం ఇచ్చిందని, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించిందని అన్నారు. #WATCH | Abu Dhabi, UAE: BJP MP Bansuri Swaraj says, " Sindoor is now a synonym for justice and power. I salute our Armed Forces for this. I also appreciate the leadership of PM Modi..." pic.twitter.com/4wIAXF4M4b— ANI (@ANI) May 22, 2025పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలసి పోరాడేందుకు బదులు దానిని తీవ్రతరం చేయాలని ప్రయత్నిస్తున్నదని బన్సూరి పేర్కొన్నారు. ఉగ్రదాడిపై ప్రతిస్పందన విషయంలో భారత్ అపారమైన సంయమనం, పరిణతితో వ్యవహరించిందని అన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ తాము సాగిస్తున్న ఈ పర్యటన.. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న తప్పుడు ప్రచారానికి ముగింపు పలుకుతుందని అన్నారు. సత్యాన్ని ఎంత అణచివేసినా, దానిని మటుమాయం చేయలేరని అన్నారు. యూఎఈ(UAE)లో భారత ప్రతినిధి బృందానికి శివసేన ఎంపి శ్రీకాంత్ షిండే నాయకత్వం వహిస్తున్నారు. అఖిలపక్ష ప్రతినిధి బృందంలో ఎంపీలు బన్సూరి స్వరాజ్, ఈటీ మొహమ్మద్ బషీర్, అతుల్ గార్గ్, సస్మిత్ పాత్ర, మనన్ కుమార్ మిశ్రా, బీజేపీ నేత సురేంద్రజీత్ సింగ్ అహ్లువాలియా, మాజీ రాయబారి సుజన్ చినోయ్ తదితరులున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్’లో నో అడ్మిషన్

World Turtle Day: తోటి తాబేలు పక్కనున్నా..
తాబేళ్లు అత్యంత విచిత్రమైన జీవులు. ఇవి ఎక్కువగా నిశ్చలంగా, నిశ్శబ్దంగా కనిపిస్తాయి. ఎంతో ఆకర్షణీయంగానూ ఉంటాయి. తాబేళ్లు ప్రపంచంలోని పురాతన సరీసృపాల సమూహాలలో ఒకటి. ఇవి పాములు, మొసళ్లకన్నా ముందునాటి జీవులు. అలాగే డైనోసార్ల కాలం నుండి ఉన్నాయి. ప్రపంచంలో 300 రకాల తాబేళ్లు ఉండగా, వాటిలో 129 రకాలు అంతరించిపోతున్నాయి. తాబేళ్లు పర్యావరణానికి ఎలా దోహదపడతాయో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీయేటా మే 23న ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని(World Turtle Day) నిర్వహిస్తుంటారు.తాబేళ్లు వాటి సహజ ఆవాసాలలో జీవించడానికి, అభివృద్ధి చెందడానికి సహాయపడే దిశగా అవగాహన కల్పించేందుకు ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1990లో సుసాన్ టెల్లెం, మార్షల్ థాంప్సన్ జంట స్థాపించిన అమెరికన్ తాబేలు రెస్క్యూ (ఏటీఆర్) ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. తాబేళ్ల సంరక్షణకు దోహదపడే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పాఠశాలల్లో తాబేళ్లపై అవగాహన పెంపొందించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.తాబేళ్లు.. వాటిని వేటాడే జంతువుల నుంచి రక్షణ పొందేందుకు బలమైన పెంకులు కలిగిన సరీసృపాలు. ఇంటిగ్రేటెడ్ టాక్సానమిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(Integrated Taxonomic Information System) (ఐటీఐఎస్) తెలిపిన వివరాల ప్రకారం తొలుత టెస్టూడైన్స్ ( చెలోనియా) అనే తాబేలు క్రమం క్రిప్టోడిరా, ప్లూరోడిరా అనే రెండు ఉపక్రమాలుగా విభజితమయ్యింది. ఆపై 13 కుటుంబాలు, 75 జాతులు,300కుపైగా జాతులుగా విభజితయ్యింది. అంటార్కిటికాలో మినహా మిగిలిన ప్రాంతాల్లో తాబేళ్లకు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రతి ఖండంలోనూ తాబేళ్లు కనిపిస్తాయి. ఆగ్నేయ ఉత్తర అమెరికా, దక్షిణాసియాలు పలు తాబేలు జాతులకు నిలయంగా ఉన్నాయి.తాబేళ్లు స్నేహపూర్వక జంతువులు కావు. ఇతర తాబేళ్లు సమీపంలో ఉన్నాఅవి వాటితో కలిసి ఉండవు. అవి ఆహారం కోసం రోజంతా చురుకుగా తిరుగాడుతుంటాయి. తాబేళ్లు విద్యుత్ మోటార్ల మాదిరిగా శబ్దం చేస్తాయి. కొన్ని రకాల తాబేళ్లు కుక్కలలాగా మొరుగుతాయి. దక్షిణ అమెరికాలోని ఎర్రటి పాదాల తాబేలు కోడిలాగా అరుస్తుంది. కాగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్)) పలు తాబేళ్ల జాతులను అంతరించిపోతున్న జాబితాలోకి చేర్చింది. తాబేళ్లు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కూడా చదవండి: ట్రంప్ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్’లో నో అడ్మిషన్

బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా?
ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వస్తున్నాయి.బంగ్లాదేశ్లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్ తెలిపారు. ఈ విషయంపై యూనస్తో మాట్లాడుతానని వెల్లడించారు. అలాగే.. దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.Will Muhammad Yunus resign as caretaker to the interim government in Bangladesh? This BBC Bangla report quotes National Citizen Party leader Nahid Islam as saying Yunus is thinking of retirement. pic.twitter.com/GIsP3WqiaI— Deep Halder (@deepscribble) May 22, 2025యూనస్ను సవాళ్లు.. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది. ఇక, గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం, జరిగిన చర్చల తర్వాత.. సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్, హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. ‘బ్లడీ కారిడార్’మరోవైపు.. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెలుసుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’ అని పరిశీలకులు అంటున్నారు.వకారుజ్జమాన్ ఏమన్నారు? రఖైన్ కారిడార్ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.
జాతీయం

పాక్–ఉగ్రవాదం లంకె.. సిందూర్తో బట్టబయలు: షా
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిగా భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు ఉగ్రమూకలతో అంటకాగుతున్న విషయం మరోసారి బట్టబయలైందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మన బలగాలు పాక్తోపాటు పీవోకేలో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాక ఆ దేశం కొన్ని పౌర, సైనిక లక్ష్యాలపై మాత్రం దాడి చేయగలిగిందన్నారు. అనంతరం, మన ఆర్మీ సరిహద్దుల ఆవల 100 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి పాక్ వైమానిక సామర్యా్ధన్ని తీవ్రంగా దెబ్బతీయగలిగిందని చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

నేను చిప్స్ దొంగిలించలేదమ్మా
కోల్కతా: పాపం 12 ఏళ్ల పసివాడు! చిప్స్ దొంగిలించాడని అభాండం వేయడమే గాక అందరిముందు దండించడాన్ని, తల్లి కూడా తననే తప్పుబట్టడాన్ని తట్టుకోలేకపోయాడు. ఏకంగా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ‘నేను చిప్స్ దొంగిలించలేదమ్మా’ అంటూ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు! ఈ దారుణం పశ్చిమబంగాల్లో పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పన్స్కురాలో జరిగింది. ఏడో తరగతి చదువుతున్న క్రిషేందు దాస్ చిప్స్ ప్యాకెట్ కొనడానికి ఓ దుకాణానికి వెళ్తే ఎవరూ కన్పించలేదు. ‘మామయ్య! చిప్స్ కావాలి’ అని యజమాని శుభాంకర్ దీక్షిత్ను ఎంత పిలిచినా స్పందన రాలేదు. దాంతో ఒక ప్యాకెట్ చిప్స్ తీసుకుని వెనుదిరిగాడు. అప్పుడొచ్చి చూసిన దీక్షిత్ కోపంతో క్రిషేందును దుకాణానికి లాక్కొచ్చి చెంపదెబ్బ కొట్టాడు. అందరి ముందూ గుంజిళ్లు తీయించడమే గాక బాలుని తల్లిని పిలిపించాడు. ఆమె కూడా కొడుకునే తిట్టి చెంపదెబ్బ కొట్టింది. ఎంత పిలిచినా దీక్షిత్ రానందుకే చిప్స్ తీసుకున్నానని, తరువాతైనా డబ్బులు ఇచ్చేవాడినని ఎంత చెప్పినా ఎవరూ విన్లేదు. దాంతో అందరి ముందూ దాస్ క్షమాపణలు చెప్పాడు. అయినా తాను అబద్ధం చెబుతున్నాడని దీక్షిత్ పదేపదే తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోకెళ్లగానే గదిలోకి దూరి గడియ వేసుకున్నాడు. దాంతో తల్లి ఇరుగుపొరుగును పిలిచి తలుపు పగలగొట్టింది. అప్పటికే బాబు నోటి నుంచి నురగలు వస్తున్నాయి. పక్కన సగం తాగిన పురుగుమందుల సీసా, బెంగాలీలో నోట్ కనిపించింది. ‘‘అమ్మా! నేను దొంగను కాదు. దొంగతనం చేయలేదు. చాలాసేపు పిలిచినా మామయ్య (దుకాణదారు) రాలేదు. అందుకే కుర్కురే ప్యాకెట్ తీసుకున్నా. అవంటే నాకెంతో ఇష్టం కదా! ఇవి నా చివరి మాటలు. పురుగుమందు తాగినందుకు క్షమించు’’ అని అందులో రాశాడు.

పాకిస్తాన్ ఆర్థిక దిగ్బంధం!
న్యూఢిల్లీ: ఉగ్రవాద ఉత్పత్తి కర్మాగారంగా మారిపోయిన పాకిస్తాన్ మెడలు వంచాలంటే ఆ దేశానికి అప్పు పుట్టకుండా చేయాలని, ఆర్థికంగా అన్ని వైపులా దిగ్బంధించాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్పైకి ఉసిగొల్పుతున్న దాయాది దేశం ఆర్థికంగా మరింత చితికిపోయేలా చేయడానికి వ్యూహాలు రచిస్తోంది. పాకిస్తాన్ను మళ్లీ గ్రే లిస్టులో చేర్చాలని, కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వకూడదని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తోపాటు ప్రపంచ బ్యాంక్పై ఒత్తిడి పెంచబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మనీ లాండరింగ్ నిరోధక చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందజేస్తున్న పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించాలని కోరనున్నట్లు తెలిపాయి. పాక్ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేరిస్తే ప్రపంచ దేశాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించే అవకాశం ఉండదు. 2018 జూన్లో పాక్ను ఈ జాబితాలో చేర్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడితో 2022 సెప్టెంబర్లో తొలగించారు. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పాకిస్తాన్కు ఒక బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్ గట్టిగా వ్యతిరేకించినా సరే లెక్కచేయకుండా ఈ ప్యాకేజీ అందజేసింది. దీనివెనుక అమెరికాతోపాటు కొన్ని అరబ్ దేశాల ఒత్తిడి పని చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భారత్ తన అసంతృప్తిని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్కు తెలియజేసింది. అంతేకాకుండా ఈ అంశాన్ని జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది. పాకిస్తాన్ ఆర్థికంగా ఎప్పుడో దివాలా తీసింది. విదేశీ రుణాలు, బెయిల్ఔట్ ప్యాకేజీలతోనే బతుకు బండి లాగిస్తోంది. పాకిస్తాన్కు వచ్చే నెలలో 20 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం. ఈ రుణాన్ని నిలిపివేసేలా ప్రపంచ బ్యాంక్ను విజ్ఞప్తి చేయాలని భారత్ నిర్ణయించింది.

‘ఈశాన్యం’లో అసాధారణ అభివృద్ధి
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని రీతిలో అసాధారణ అభివృద్ధి జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. గతంలో బాంబులు, తుపాకులు, ఘర్షణలకు మారుపేరైన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ఈశాన్యంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వైవిధ్యమే ఈశాన్యానికి అతిపెద్ద బలమని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు, వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఇంధనం, సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులకు ఈశాన్య రాష్ట్రాలు గమ్యస్థానంగా మారాయని వెల్లడించారు. దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంలో అస్సాం పాత్ర గణనీయంగా పెరిగిందని ఉద్ఘాటించారు. నార్త్ఈస్ట్ సెమీకండక్టర్ ప్లాంట్ నుంచి అతిత్వరలో మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ రాబోతోందని ప్రకటించారు. ఈశాన్యానికి ఇదొక మైలురాయి కాబోతోందని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవడంపాటు హైటెక్ పారిశ్రామిక ప్రగతిలో ఈశాన్య రాష్ట్రాల స్థానం మరింత పటిష్టం కానుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై కఠిన వైఖరి ఏ ప్రాంతమైనా చక్కటి అభివృద్ధి సాధించాలంటే అక్కడ శాంతిభద్రతలు మెరుగ్గా ఉండడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అశాంతి, హింస కారణంగా గతంలో ఈశాన్య ప్రాంత యువకులు ఎన్నో అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదం, తీవ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి అడ్డుగా నిలిచే హింసాకాండను సహించే ప్రసక్తే లేదన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, గత 11 ఏళ్లలో ఈశాన్యంలో 10 వేల మంది యువకులు ఆయుధాలు వదిలేసి అభివృద్ధిలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. వారంతా హింసను వ్యతిరేకిస్తూ శాంతి, సుస్థిరతను కోరుకుంటున్నారని ప్రశంసించారు.టూరిజం హబ్గా నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతదేశంలో హైడ్రోపవర్, సోలార్ పవర్ రంగాల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇప్పటికే రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఈశాన్యంలో సోలార్ మాడ్యూల్స్, సెల్ప్ తయారీ రంగంలోనూ ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని పెట్టుబడిదారులకు పిలుపు నిచ్చారు. జీవ–ఆర్థిక వ్యవస్థ, వెదురు పరిశ్రమ, తేయాకు ఉత్పత్తి, పెట్రోలియం, క్రీడలు, నైపుణ్యాలకు ఈ ప్రాంతం పర్యాయపదంగా మారిందన్నారు. పర్యావరణ టూరిజానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబ డిదారుల సదస్సులో ఈశాన్య రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులతోపాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అని ల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

Be alert! మెట్రో రైళ్లలో అమ్మాయిల్ని క్లిక్మనిపించి..
క్రైమ్: మనకు తెలియకుండానే మన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. వాళ్లలో కొందరు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తుండడంతో నిందితులను సైతం పట్టుకోగలుగుతున్నారు. ఆ మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలను అసభ్యకరరీతిలో ఫొటోలు తీసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నడిపి ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంగళూరు మెట్రో రైళ్లలో అమ్మాయిలను ఫొటోలు తీసి.. వాటిని ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో బుధవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ఆ పోకిరీపై నజర్ వేశారు. చివరకు.. అతన్ని పట్టుకున్నట్లు బెంగళూరు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. Bangalore Metro Clicks (@metro_chicks) పేరిట నడిపిన ఆ అకౌంట్లో వందల కొద్దీ అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి. ఆ అకౌంట్కు ఐదు వేళ మంది ఫాలోవర్స్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మొత్తం ఫొటోలను తొలగించి.. అకౌంట్ను సైతం తొలగించారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించాల్సి ఉంది. తస్మాత్ జాగ్రత్త.. మీ చుట్టుపక్కలా ఇలాంటి కామాంధులు ఉండొచ్చు! జర జాగ్రత్త!!.

ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర(కర్ణాటక): మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్కు వసంత్, చన్నకేశవ, కమల్తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు.

ఏలూరులో ఘరానా మోసగాడు
ఏలూరు టౌన్: ఏలూరు ప్రాంతానికి చెందిన ఒక ఘరానా మోసగాడు ఏకంగా బెంగుళూరు, హైదరాబాద్ నగరాలతో సహా ఏలూరు పరిసర ప్రాంతాల్లో అనేక మందిని మోసం చేసి భారీగా డబ్బులు కాజేశాడు. బంగారం బిస్కెట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాల్లో ఉద్యోగాలు, తన కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి కోట్ల నగదు కాజేశాడు. ఈ మోసగాడికి పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. పోలీసులు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నగర శివారు వట్లూరు ఇంద్రప్రస్థా కాలనీకి చెందిన సత్తెనపల్లి హరీష్ కుమార్ అలియాస్ రిషి, అలియాస్ రిషికుమార్ చాలా కాలంగా హైదరాబాద్లోని ప్రగతినగర్, మై హోమ్ అపార్ట్మెంట్స్లో ఉంటూ చార్టర్డ్ అకౌంటెంట్, సొంతగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉందని చెబుతూ ఆన్లైన్లో పలువురితో చాటింగ్ చేస్తూ పరిచయం చేసుకున్నాడు. ట్రేడ్ బిజినెస్ లోనూ అపారమైన అనుభవం ఉందని పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించేవాడు. ఈ క్రమంలోనే ఏలూరు శనివారపుపేటకు చెందిన ఓ వ్యాపారి పీ. సాయికుమార్ ఇతనికి పరిచయం కాగా విదేశాల్లో ఉద్యోగాలు, గోల్డ్ బిస్కెట్ల వ్యాపారం ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన సాయికుమార్ ఆన్లైన్ ద్వారా రూ. 1 కోటి నగదు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేయటంతో సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం హరీష్ కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తీగ లాగితే డొంక కదిలిందితీగ లాగితే డొండ కదిలినట్లు హరీష్ చేసిన అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో హరీష్ కుమార్ నల్లజర్లకు చెందిన ఒక ఆక్వా వ్యాపారిని ఆన్లైన్లో పరిచయం చేసుకుని గోల్డ్ బిస్కెట్లు, ట్రేడ్ మార్కెట్లో లాభాలు ఇస్తానని నమ్మించి అతని వద్ద విడతల వారీగా రూ. 50 లక్షలు కాజేశాడు. బాధితుడు ఒత్తిడి చేయటంతో ఏలూరు ఇంద్రప్రస్థా కాలనీలో ఉన్న తన ఇల్లు బాధితుడికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. కానీ ఇల్లు అప్పచెప్పకుండా తన భార్య, తల్లి, మరదలను ఆ ఇంట్లోనే ఉంచుతూ ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి ఇబ్బందులు పెట్టాడు. ఇక ఏలూరు శనివారపుపేటకు చెందిన మరో వ్యాపారి వద్ద రూ.2.50 కోట్లు కాజేశాడు. బెంగుళూరులో శశాంక్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతనికి బంగారు బిస్కెట్లు ఇస్తానని నమ్మబలికి రూ.62 లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగుళూరు సైబర్ క్రైం పోలీసులు ఇటీవలే హరీష్ కుమార్ని అరెస్ట్ చేసి అక్కడ సెంట్రల్ జైల్లో ఉంచారు.అనంతరం హైదరాబాద్లో ఈ మోసగాడి చేతిలో రూ.1 కోటి 85 లక్షలకు మోసపోయిన రెనిల్ కుమార్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బషీరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అతన్ని ఈనెల 4న పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. హరీష్ కుమార్పై తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేయటంతో అరెస్ట్కు రంగం సిద్ధం చేశారు. ఏలూరులోనే మరికొంతమంది బాధితులు మేమూ మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది.

ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ఫిలింనగర్(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. ఇటీవల అర్చిత్ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్ఎస్ సెక్షన్ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు.