Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YS Jagan Visits Tobacco Farmers At Podili Full Speech Highlights1
మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్‌ జగన్‌

సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్‌ సీజన్‌లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా హయాం.. రైతులకు స్వర్ణయుగంమా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్‌లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.కూటమి పాలనలో అధ్వానంకూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్‌ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్‌పుట్‌ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్‌ టన్నులు ప్రొక్యూర్‌ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్‌ టన్నులే ప్రొక్యూర్‌ చేశారు. హైగ్రేడ్‌ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్‌ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాం. మార్క్‌ఫెడ్‌ రావడంతో మార్కెట్‌లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్‌ఫెడ్‌ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జగన్‌ హెచ్చరికవ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్‌ హెచ్చరికలు జారీ చేశారు.

After Operation Completed One Month Pak Patch Work For Air Bases2
OP Sindoor: పాక్‌ కవర్‌ డ్రైవ్‌ .. భలే బెడిసి కొట్టిందిగా!

ఆపరేషన్‌ సిందూర్‌ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్‌తో భారత్‌కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్‌ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్‌ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్‌ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్‌బేస్‌లపై దాడులే జరపలేదని పాక్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్‌ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్‌ సిందూర్‌లో మురిద్‌, జాకోబాబాద్‌, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్‌ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్‌బేస్‌లను టార్పలిన్‌(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్‌. ఇండియా టుడే జరిపిన శాటిలైట్‌ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్‌లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్‌ అయ్యేలా చూసుకుంది పాక్‌ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్‌ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్‌తో కవర్‌ చేశారని సోషల్‌మీడియాలో ఆయనొక పోస్ట్‌ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్‌ అభిమానులు.. పర్దే మేన్‌ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్‌ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్‌ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్‌ డాలర్లకు కేటాయించింది. షెహ్‌బాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్‌లో పెంచిన నిధులతో ఆపరేషన్‌ సిందూర్‌లో దెబ్బతిన్న టెర్రర్‌ క్యాంప్‌లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025

: England call up Eddie Jack as cover for Josh Tongue ahead of India Test series3
టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జ‌ట్టులోకి 19 ఏళ్ల యువ సంచ‌ల‌నం

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్ ఆరంభానికి మ‌రో ఎనిమిది రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదిక‌గా జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.భార‌త్‌తో తొలి టెస్టు కోసం 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌల‌ర్ ఎడ్జీ జాక్స్‌కు ఇంగ్లండ్ సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేస‌ర్ జోష్ టాంగ్ గాయ‌ప‌డ‌డంతో ప్రత్యామ్నయంగా జాక్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా-ఎతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనాధికారిక సిరీస్‌లో ఇంగ్లండ్ లయన్స్ తరపున జాక్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాలుగు ఇన్నింగ్స్‌ల‌లో 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌, య‌శ‌స్వి జైశ్వాల్‌ను జాక్స్ ఔట్ చేశాడు. కాగా జాక్స్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రెండు ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు. అవికూడా ఇండియా-ఎపై ఆడిన‌వే.వోక్స్‌పైనే భారం..కాగా తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం చాలా బ‌ల‌హీనంగా క‌న్పిస్తోంది. ఇప్ప‌టికే గాయం కార‌ణంగా మార్క్‌వుడ్‌, ఓలీ స్టోన్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అటిన్కిస‌న్‌, ఆర్చ‌ర్ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొన‌సాగుతోంది.ఇప్పుడు ఈ జాబితాలోకి టంగ్ కూడా చేర‌డం ఇంగ్లీష్ జ‌ట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని క్రిస్ వోక్స్ మోయ‌నున్నాడు. వోక్స్, కార్స్‌, సామ్ కుక్ ఫ్రంట్‌లైన్ సీమ‌ర్ల‌గా ఉన్నారు.భార‌త్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జ‌ట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జాక్‌చదవండి: WTC Final: కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన ట్రవిస్‌ హెడ్‌

Ambati Rambabu Says Lokesh Behind Podili Jagan Convoy Incident4
లోకేష్‌ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి

సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్‌గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్‌ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్‌ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్‌ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్‌ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్‌ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్‌ కాదా? జగన్‌ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు. .. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్‌సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్‌ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్‌సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్‌ మ్యాటర్‌లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్‌కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.... ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్ రేపు(గురువారం, జూన్‌ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు.

CM Revanth Reddy Clarity On Telangana Ministry Allocations5
మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్‌ క్లారిటీ.. హోం మంత్రి ఎవరికి?

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్‌ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్‌ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్‌ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను' అని చెప్పుకొచ్చారు. కిషన్‌ రెడ్డినే ప్రధాన అడ్డంకితెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డినే ప్రధాన అడ్డంకిగా మారార‌ని సీఎం రేవంత్ విమ‌ర్శించారు. 'కిషన్‌రెడ్డి, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే. నేను అధికారంలో ఉ‍న్నంత వరకూ కాంగ్రెస్‌ పార్టీలోకి కేసీఆర్‌ కుటుంబానికి నో ఎంట్రీ. కేసీఆర్‌ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్‌లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్న దంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. ​కేటీఆర్‌ చెప్పినట్టే కిషన్‌రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు భూసేకరణ నేనే క్లియర్ చేశాను. సామాజిక అంతరాలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. నక్సలిజం ఎప్పటికీ అంతం కాదు. ఇప్పుడు కొంత తగ్గినా వివిధ రూపాల్లో మళ్లీ వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 11 శాఖల్లో ఏది.. ఎవరికి?మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌ క్లారిటీ ఇ‍వ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌ వద్ద కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్‌, హోంశాఖ, క్రీడా శాఖతో పాటు 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఏయే శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ, హోంశాఖపై ప్రధానంగా చర్చ నడుస్తోంది.

govt considering reintroducing MDR charges on UPI transactions6
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?

ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రూ.3,000 కంటే ఎక్కువ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్‌)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మర్చంట్ టర్నోవర్‌తో సంబంధం లేకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్‌ను వసూలు చేయాలనేలా చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయం పెరగడంపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తక్కువ పరిమాణంలో యూపీఐ చెల్లింపులకు ప్రస్తుతం ఛార్జీల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ పెద్ద లావాదేవీలపై త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. జనవరి 2020 నుంచి అమలులో ఉన్న జీరో-ఎండీఆర్ విధానానికి బదులుగా రూ.3,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది’ అని కొందరు అధికారులు తెలిపారు.రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 80 శాతంగా ఉంది. కానీ జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు పరిమిత ప్రోత్సాహకాలు ఉన్నాయి. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ లావాదేవీల కోసం పెద్ద వ్యాపారులపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రతిపాదించింది. ప్రస్తుతం రూపే మినహా క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంది.బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) సహా ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండిఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.

Meet this girl Taking Parents To Her US Walmart Office Melts Hearts Online7
అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్‌

పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ సారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.అమెరికాలోని వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్‌మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్‌ రూం, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఇది ఆన్‌లైన్‌లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్‌మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్‌ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్‌ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్‌మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్‌శ్రీ పోస్ట్‌ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. "అబ్బా, ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట​్‌" అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" అ " చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి పిల్లవాడికి అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్‌ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

Anchor Jhansi Stops Sridhar Babu Speech for Sreeleela8
శ్రీలీల కోసం మంత్రి స్పీచ్‌ ఆపేసిన యాంకర్‌ ఝాన్సీ.. వీడియో వైరల్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu)కు చేదు అనుభవం ఎదురైంది. సీత (షి ఈజ్‌ ది హీరో ఆల్వేస్‌ - SITHA) యాప్‌ ఆవిష్కరణ వేడుకలో ఆయన ప్రసంగిస్తుండగా యాంకర్‌ ఝాన్సీ (Anchor Jhansi) మధ్యలోనే అడ్డుకుంది. దీంతో కొన్ని క్షణాలపాటు మంత్రికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సీత యాప్‌ లాంఛ్‌కు అతిథిగా విచ్చేసిన శ్రీలీల కోసం తన ప్రసంగాన్ని ఆపారని అర్థమై ఆయన సైలెంట్‌గా పోడియం నుంచి వెనక్కు జరిగారు.మంత్రి ప్రసంగానికి ఆటంకంఅప్పుడు మైక్‌ అందుకున్న ఝాన్సీ.. మంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్‌ శ్రీలీల (Actress Sreeleela)ను స్టేజీపైకి పిలిచింది. 'షి ఈజ్‌ ది హీరో ఆల్వేస్‌' అనే యాప్‌ లాంఛ్‌ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ఇంట్రో ముగించింది. అలా శ్రీలీల.. స్టేజీ ఎక్కగా మంత్రి ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించాడు.సభామర్యాద పాటించరా?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలీల హీరోయిన్‌ అయినంత మాత్రాన.. మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం అర్థరహితమని, పైగా ఎంతో అనుభవమున్న యాంకర్‌ ఝాన్సీ ఇలా చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. ఒక వక్త ఉపన్యసించేటప్పుడు వారిని ఆటంకపరచడం అవమానించడమే అవుతుంది. సభా మర్యాద పాటించాల్సి ఉంటే బాగుండేది.. అక్కడ శ్రీధర్‌బాబు కాకుండా ఇంకా ఎవరున్నా పరిస్థితి మరోలా ఉండేది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హిరోయిన్ శ్రీ లీల కోసం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని ఆపిన యాంకర్ ఝాన్సీశ్రీధర్ బాబు మెత్తని వాడు కాబట్టి ఒప్పుకున్నాడు అదే ఇగో వున్న ఏ ఇతర మంత్రి అయిన వుంటే పరిస్థితి వేరుగా వుండేది pic.twitter.com/cjpGi2Rd46— Kumar Reddy.Avula (@Kumar991957) June 10, 2025 చదవండి: సుహాసిని ఫోన్‌ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు

SIT Investigation On SIB Ex Chief Prabhakar Rao Over Phone Tapping Case9
‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్‌ చేయమని మీకు ఎవరు చెప్పారు’?

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు (Special Intelligence Branch (SIB) రెండో సారి సిట్‌ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణలో సిట్‌ బృందం ప్రభాకర్‌ రావుపై (T Prabhakar Rao) పలు ప్రశ్నలు సంధించింది. డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. విచారణలో హార్డ్ డిస్క్‌లు ఎందుకు ధ్వంసం చెయ్యాలని ఆదేశించారు?. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు పాత్ర ఎంత మేర ఉంది..? ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ ఎవరు చెయ్యమన్నారని ప్రశ్నించింది. విచారణలో ఫోన్ ట్యాపింగ్‌ సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్‌ ముందుంచింది. దీంతో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు, ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించింది. ఇక సిట్‌ విచారణ మొదటి రోజు నోరు మెదపని ప్రభాకర్‌.. తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందని చెప్పినట్లు సమాచారం.

Regret Some of my Posts Musk Blinks in Fight with Trump10
ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్‌ మస్క్‌.. యూటర్న్‌ ఇలా..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్‌లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్ట్‌ల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్‌’లో రాశారు. I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.— Elon Musk (@elonmusk) June 11, 2025ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్‌కు ఆగ్రహం కలిగించింది. ట్రంప్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్‌ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్‌’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్‌ ‘ప్లాన్‌ బీ’

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement