ప్రధాన వార్తలు

మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా హయాం.. రైతులకు స్వర్ణయుగంమా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.కూటమి పాలనలో అధ్వానంకూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్ టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించాం. మార్క్ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్ఫెడ్ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జగన్ హెచ్చరికవ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్ హెచ్చరికలు జారీ చేశారు.

OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్తో కవర్ చేశారని సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025

టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.భారత్తో తొలి టెస్టు కోసం 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఎడ్జీ జాక్స్కు ఇంగ్లండ్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేసర్ జోష్ టాంగ్ గాయపడడంతో ప్రత్యామ్నయంగా జాక్స్ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా-ఎతో జరిగిన రెండు మ్యాచ్ల అనాధికారిక సిరీస్లో ఇంగ్లండ్ లయన్స్ తరపున జాక్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాలుగు ఇన్నింగ్స్లలో 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ను జాక్స్ ఔట్ చేశాడు. కాగా జాక్స్ తన కెరీర్లో ఇప్పటివరకు కేవలం రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అవికూడా ఇండియా-ఎపై ఆడినవే.వోక్స్పైనే భారం..కాగా తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా మార్క్వుడ్, ఓలీ స్టోన్ ఈ సిరీస్కు దూరం కాగా.. అటిన్కిసన్, ఆర్చర్ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఇప్పుడు ఈ జాబితాలోకి టంగ్ కూడా చేరడం ఇంగ్లీష్ జట్టు మెనెజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని క్రిస్ వోక్స్ మోయనున్నాడు. వోక్స్, కార్స్, సామ్ కుక్ ఫ్రంట్లైన్ సీమర్లగా ఉన్నారు.భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జాక్చదవండి: WTC Final: కోహ్లి ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన ట్రవిస్ హెడ్

లోకేష్ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు. .. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్ మ్యాటర్లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.... ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు(గురువారం, జూన్ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు.

మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ క్లారిటీ.. హోం మంత్రి ఎవరికి?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను' అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకితెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకిగా మారారని సీఎం రేవంత్ విమర్శించారు. 'కిషన్రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. నేను అధికారంలో ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబానికి నో ఎంట్రీ. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్న దంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. కేటీఆర్ చెప్పినట్టే కిషన్రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్కు భూసేకరణ నేనే క్లియర్ చేశాను. సామాజిక అంతరాలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. నక్సలిజం ఎప్పటికీ అంతం కాదు. ఇప్పుడు కొంత తగ్గినా వివిధ రూపాల్లో మళ్లీ వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 11 శాఖల్లో ఏది.. ఎవరికి?మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇవ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్ వద్ద కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖ, క్రీడా శాఖతో పాటు 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఏయే శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ, హోంశాఖపై ప్రధానంగా చర్చ నడుస్తోంది.

యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?
ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రూ.3,000 కంటే ఎక్కువ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మర్చంట్ టర్నోవర్తో సంబంధం లేకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ను వసూలు చేయాలనేలా చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయం పెరగడంపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తక్కువ పరిమాణంలో యూపీఐ చెల్లింపులకు ప్రస్తుతం ఛార్జీల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ పెద్ద లావాదేవీలపై త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. జనవరి 2020 నుంచి అమలులో ఉన్న జీరో-ఎండీఆర్ విధానానికి బదులుగా రూ.3,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది’ అని కొందరు అధికారులు తెలిపారు.రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 80 శాతంగా ఉంది. కానీ జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు పరిమిత ప్రోత్సాహకాలు ఉన్నాయి. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ లావాదేవీల కోసం పెద్ద వ్యాపారులపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రతిపాదించింది. ప్రస్తుతం రూపే మినహా క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంది.బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) సహా ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్లో ఐటీ నోటీసులు!మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండిఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ సారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. "అబ్బా, ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్" అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" అ " చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి పిల్లవాడికి అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్బాబు (Duddilla Sridhar Babu)కు చేదు అనుభవం ఎదురైంది. సీత (షి ఈజ్ ది హీరో ఆల్వేస్ - SITHA) యాప్ ఆవిష్కరణ వేడుకలో ఆయన ప్రసంగిస్తుండగా యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) మధ్యలోనే అడ్డుకుంది. దీంతో కొన్ని క్షణాలపాటు మంత్రికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సీత యాప్ లాంఛ్కు అతిథిగా విచ్చేసిన శ్రీలీల కోసం తన ప్రసంగాన్ని ఆపారని అర్థమై ఆయన సైలెంట్గా పోడియం నుంచి వెనక్కు జరిగారు.మంత్రి ప్రసంగానికి ఆటంకంఅప్పుడు మైక్ అందుకున్న ఝాన్సీ.. మంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్ శ్రీలీల (Actress Sreeleela)ను స్టేజీపైకి పిలిచింది. 'షి ఈజ్ ది హీరో ఆల్వేస్' అనే యాప్ లాంఛ్ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్ప్రెన్యూర్ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ఇంట్రో ముగించింది. అలా శ్రీలీల.. స్టేజీ ఎక్కగా మంత్రి ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించాడు.సభామర్యాద పాటించరా?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలీల హీరోయిన్ అయినంత మాత్రాన.. మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం అర్థరహితమని, పైగా ఎంతో అనుభవమున్న యాంకర్ ఝాన్సీ ఇలా చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. ఒక వక్త ఉపన్యసించేటప్పుడు వారిని ఆటంకపరచడం అవమానించడమే అవుతుంది. సభా మర్యాద పాటించాల్సి ఉంటే బాగుండేది.. అక్కడ శ్రీధర్బాబు కాకుండా ఇంకా ఎవరున్నా పరిస్థితి మరోలా ఉండేది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హిరోయిన్ శ్రీ లీల కోసం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని ఆపిన యాంకర్ ఝాన్సీశ్రీధర్ బాబు మెత్తని వాడు కాబట్టి ఒప్పుకున్నాడు అదే ఇగో వున్న ఏ ఇతర మంత్రి అయిన వుంటే పరిస్థితి వేరుగా వుండేది pic.twitter.com/cjpGi2Rd46— Kumar Reddy.Avula (@Kumar991957) June 10, 2025 చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు

‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్ చేయమని మీకు ఎవరు చెప్పారు’?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్పై ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Special Intelligence Branch (SIB) రెండో సారి సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణలో సిట్ బృందం ప్రభాకర్ రావుపై (T Prabhakar Rao) పలు ప్రశ్నలు సంధించింది. డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. విచారణలో హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చెయ్యాలని ఆదేశించారు?. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు పాత్ర ఎంత మేర ఉంది..? ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ ఎవరు చెయ్యమన్నారని ప్రశ్నించింది. విచారణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్ ముందుంచింది. దీంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించింది. ఇక సిట్ విచారణ మొదటి రోజు నోరు మెదపని ప్రభాకర్.. తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందని చెప్పినట్లు సమాచారం.

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్ మస్క్.. యూటర్న్ ఇలా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్ట్ల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్’లో రాశారు. I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.— Elon Musk (@elonmusk) June 11, 2025ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్కు ఆగ్రహం కలిగించింది. ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’
రొమ్ము క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన ఉపాసనా
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి
నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం
అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’
అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పని సరి’
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
సాక్షి కార్టూన్ 09-06-2025
అక్కడ 11 ఏళ్ల తర్వాత 'దేవర'.. సతీమణితో మంచు మనోజ్ సందడి (ఫోటోలు)
ఎంపీతో క్రికెటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. ప్రముఖుల సందడి (ఫొటోలు)
Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
దారులన్నీ యాదగిరిగుట్టకే..
ప్రపంచం మన మాట వినట్లేదేం?
కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
కొమ్మినేని అరెస్ట్పై వైఎస్ జగన్ స్పందన
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
2 నిమిషాల్లో అమెరికా వీసా.. చెన్నై విద్యార్థి రికార్డ్
చర్చనీయాంశంగా మారిన జానారెడ్డి లేఖ
హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
రొమ్ము క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన ఉపాసనా
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి
నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం
అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’
అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పని సరి’
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
సాక్షి కార్టూన్ 09-06-2025
Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
దారులన్నీ యాదగిరిగుట్టకే..
ప్రపంచం మన మాట వినట్లేదేం?
కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
కొమ్మినేని అరెస్ట్పై వైఎస్ జగన్ స్పందన
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
2 నిమిషాల్లో అమెరికా వీసా.. చెన్నై విద్యార్థి రికార్డ్
చర్చనీయాంశంగా మారిన జానారెడ్డి లేఖ
హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
Sakshi Cartoon: పొన్లెండి! ఒక రాష్ట్రంలోనే అన్నారు!
దుబాయ్ ట్రిప్లో సమంత.. ఆమెతో పాటే అతను కూడా!
సినిమా

శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్బాబు (Duddilla Sridhar Babu)కు చేదు అనుభవం ఎదురైంది. సీత (షి ఈజ్ ది హీరో ఆల్వేస్ - SITHA) యాప్ ఆవిష్కరణ వేడుకలో ఆయన ప్రసంగిస్తుండగా యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) మధ్యలోనే అడ్డుకుంది. దీంతో కొన్ని క్షణాలపాటు మంత్రికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సీత యాప్ లాంఛ్కు అతిథిగా విచ్చేసిన శ్రీలీల కోసం తన ప్రసంగాన్ని ఆపారని అర్థమై ఆయన సైలెంట్గా పోడియం నుంచి వెనక్కు జరిగారు.మంత్రి ప్రసంగానికి ఆటంకంఅప్పుడు మైక్ అందుకున్న ఝాన్సీ.. మంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్ శ్రీలీల (Actress Sreeleela)ను స్టేజీపైకి పిలిచింది. 'షి ఈజ్ ది హీరో ఆల్వేస్' అనే యాప్ లాంఛ్ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్ప్రెన్యూర్ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ఇంట్రో ముగించింది. అలా శ్రీలీల.. స్టేజీ ఎక్కగా మంత్రి ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించాడు.సభామర్యాద పాటించరా?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలీల హీరోయిన్ అయినంత మాత్రాన.. మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం అర్థరహితమని, పైగా ఎంతో అనుభవమున్న యాంకర్ ఝాన్సీ ఇలా చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. ఒక వక్త ఉపన్యసించేటప్పుడు వారిని ఆటంకపరచడం అవమానించడమే అవుతుంది. సభా మర్యాద పాటించాల్సి ఉంటే బాగుండేది.. అక్కడ శ్రీధర్బాబు కాకుండా ఇంకా ఎవరున్నా పరిస్థితి మరోలా ఉండేది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హిరోయిన్ శ్రీ లీల కోసం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని ఆపిన యాంకర్ ఝాన్సీశ్రీధర్ బాబు మెత్తని వాడు కాబట్టి ఒప్పుకున్నాడు అదే ఇగో వున్న ఏ ఇతర మంత్రి అయిన వుంటే పరిస్థితి వేరుగా వుండేది pic.twitter.com/cjpGi2Rd46— Kumar Reddy.Avula (@Kumar991957) June 10, 2025 చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు

స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం నెలకొంది. ఈయన మామ పీఎస్ అబు(92) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయనకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా నలుగురు పిల్లలు ఉన్నారు. మామ చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో శోకసంద్రంలో ఉంది.(ఇదీ చదవండి: హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు)1971 సినిమాలు చేస్తున్న మమ్ముట్టి.. 300కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో మమ్ముట్టి నుంచి భ్రమయుగం, టర్బో, బజుక తదితర మూవీస్ వచ్చాయి.మమ్ముట్టి మామ చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు ఇదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మేనమామ గోపీనాథ్ నాయర్ కూడా తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. తనువు చాలించారు. ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సదరు హీరోల అభిమానులు.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత)

మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్ 10)హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. అలాగే పార్టీకి హాజరైన 48 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్గా తేలిందని పోలీసులు తెలిపారు. సింగర్తో పాటు రిసార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోక్ సాంగ్స్తో ఫేమస్ అయిన మంగ్లీ. ఆ ఫేంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన స్టైల్లో పాటలు ఆలపిస్తూ..తక్కువ సమయంలోనే స్టార్ సింగర్గా ఎదిగింది. బన్నీ, ఎన్టీఆర్, మహేశ్ బాబుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలకు ఆమె పాటలు పాడింది.

సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు
మల్టీ టాస్కింగ్ అన్న పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పార్తీబన్ (R. Parthiban). అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్గా తన ప్రతిభ చాటుకున్నారు. యుగానికి ఒక్కడూ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. తాజాగా ఆయన హీరోయిన్ సుహాసినిపై ప్రశంసలు కురిపించాడు. వర్డిక్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పార్తీబన్ మాట్లాడుతూ.. అందరూ సుహాసిని యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఓరోజు ఫోన్ చేసి..కానీ తన ఆత్మవిశ్వాసం గురించి మీకు చెప్పాలి. ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి పార్తీబన్.. ఈరోజు నాకు 50 ఏళ్లు నిండాయి అని చెప్పింది. అసలు ఏ మహిళ కూడా 28 ఏళ్లు దాటాక తన వయసు చెప్పుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తనకు 50 ఏళ్లు అని నిర్మొహమాటంగా చెప్పిందంటే అది తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. 50 ఏళ్లు వచ్చినా తనెంత అందంగా ఉందో మీరే చూడండి అనడంతో అక్కడే స్టేజీపై ఉన్న సుహాసిని (Suhasini) సరదాగా నవ్వేసింది.సినిమావర్డిక్ట్ సినిమా విషయానికి వస్తే.. పార్తీబన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాసిని కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మి శరత్కుమార్, విద్యుల్లేఖ, ప్రకాశ్ మోహన్దాస్ తదితరులు నటిస్తున్నారు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే విండీస్ విధ్వంసకర యోధుడు నికోలస్ పూరన్కు బంపర్ ఆఫర్ వచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ న్యూయార్క్ పూరన్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్మీడియాలో వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.మా హీరో, మా కెప్టెన్, 29 ఏళ్ల పాకెట్ డైనమైట్, MINY సూపర్ స్టార్ - నికోలస్ పూరన్ కాగ్నిజెంట్ మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్కు ముందు MI న్యూయార్క్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరు. ప్రస్తుతం అతని శక్తుల అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అతని నాయకత్వంలో MINYని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఎంఎల్సీలో రెండు సీజన్లలో కీరన్ పోలార్డ్ ఎంఐ న్యూయార్క్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ప్రస్తుత సీజన్కు పోలార్డ్ అందుబాటులో ఉండే అంశంపై క్లారిటీ లేదు. దీంతో యాజమాన్యం పూరన్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. పోలీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే. ఎంఎల్సీ 2025 రేపటి నుంచి (జూన్ 12) నుంచి జులై 13 వరకు యూఎస్ఏలో జరుగనుంది. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్కు సునీల్ నరైన్, ఎంఐ న్యూయార్క్కు పూరన్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్కు కోరె ఆండర్సన్, సియాటిల్ ఒర్కాస్కు హెన్రిచ్ క్లాసెన్, టెక్సస్ సూపర్ కింగ్స్కు డుప్లెసిస్, వాషింగ్టన్ ఫ్రీడంకు మ్యాక్స్వెల్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.కాగా, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ సభ్యుడిగా ఉన్న పూరన్ ఎంఎల్సీలో ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్లో ఆరంభ సీజన్ నుంచి (2023) పాల్గొంటున్నాడు. ఎంఎల్సీ ఆరంభ ఎడిషన్లో పూరన్ ఎంఐ న్యూయార్క్ను ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ సీజన్లో పూరన్ 8 మ్యాచ్ల్లో 167.24 స్ట్రయిక్రేట్తో 388 పరుగులు చేశాడు. ఫైనల్లో పూరన్ విధ్వంసకర శతకం (55 బంతుల్లో 137 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) చేసి ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చి టైటిల్ను అందించాడు.2025 ఎంఎల్సీ కోసం ఎంఐ న్యూయార్క్ జట్టు..పూరన్ (కెప్టెన్), పోలార్డ్, ఎహసాన్ ఆదిల్, ట్రెంట్ బౌల్ట్, నోష్తుశ్ కెంజిగే, రషీద్ ఖాన్, మోనాంక్ పటేల్, సన్నీ పటేల్, హీత్ రిచర్డ్స్, రుషిల్ ఉగార్కర్, అగ్ని చోప్రా, తజిందర్ సింగ్, కన్వర్జిత్ సింగ్, శరద్ లాంబా, జార్జ్ లిండే, క్వింటన్ డికాక్, మైఖేల్ బ్రేస్వెల్, నవీన్ ఉల్ హాక్, అజ్మతుల్లా ఒమర్జాయ్

పది రోజులు తిరక్కుండానే మరో జట్టును ఫైనల్కు చేర్చిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్కు తాను కెప్టెన్సీ వహించే జట్లను అలవోకగా ఫైనల్కు చేర్చడం అలవాటుగా మారింది. జూన్ 1న ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్స్కు చేర్చిన శ్రేయస్.. పది రోజులు కూడా తిరక్కుండానే మరో జట్టును ఫైనల్కు చేర్చాడు. ముంబై టీ20 లీగ్ 2025లో నిన్న (జూన్ 10) జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రేయస్ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్స్ను మట్టికరిపించి ఫైనల్కు చేరింది.ఏడాది కాలంలో శ్రేయస్ తాను సారథ్యం వహించిన జట్లను ఫైనల్స్కు చేర్చడం ఇది నాలుగో సారి. 2024 ఐపీఎల్తో మొదలైన శ్రేయస్ కెప్టెన్సీ జైత్రయాత్ర ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్ వరకు కొనసాగింది. 2024 ఐపీఎల్లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్.. ఆతర్వాత ముంబైకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్ను ఫైనల్స్కు చేర్చిన శ్రేయస్ తృటిలో టైటిల్ మిస్ కావడంతో రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనే పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ జట్టును 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేర్చాడు.శ్రేయస్ తన జట్లను ఫైనల్స్కు చేర్చిన గత నాలుగు సందర్భాల్లో వ్యక్తిగతంగానూ రాణించాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన సందర్భంలో 15 మ్యాచ్ల్లో 39 సగటున, 146.86 స్ట్రయిక్రేట్తో 2 హాఫ్ సెంచరీల సాయంతో 351 పరుగులు చేశాడు.అనంతరం ముంబైకు ముస్తాక్ అలీ ట్రోఫీ అందించిన సందర్భంలో 188.52 స్ట్రయిక్రేట్తో 345 పరుగులు సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో 175.07 స్ట్రయిక్రేట్తో 604 పరుగులు సాధించాడు. ముంబై టీ20 లీగ్లోకి ఆలస్యంగా అడుగుపెట్టిన శ్రేయస్ ఈ లీగ్లో ఫామ్ను ప్రదర్శించాల్సి ఉంది.చరిత్ర సృష్టించాడుతాజాగా ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్స్కు చేర్చడం ద్వారా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్స్కు చేర్చిన తొలి కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్ తన సారథ్యంలో 2019లో ఢిల్లీని, 2024లో కేకేఆర్ను, 2025లో పంజాబ్ను ఫైనల్స్కు చేర్చాడు.ముంబై టీ20 లీగ్ సెమీఫైనల్ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్లో శ్రేయస్ సారథ్యంలోని సోబో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాస్టర్స్ 130 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రేయస్ జట్టు 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ వ్యక్తిగతంగా రాణించనప్పటికీ (1) తన జట్టును విజయవంతంగా ఫైనల్స్కు చేర్చాడు. రేపు జరుగబోయే ఫైనల్స్లో శ్రేయస్ జట్టు సిద్దేశ్ లాడ్ నేతృత్వంలోని ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. శ్రేయస్ ఈ టైటిల్ను కూడా సాధిస్తే కెప్టెన్గా అతనికి తిరుగే ఉండదు.

ధోని అందుకున్న అత్యుత్తమ పురస్కారాలు ఇవే..!
క్రికెట్కు అందించిన విశేష సేవలకు గానూ టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని ఐసీసీ తాజాగా హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్గా ధోని రికార్డుల్లోకెక్కాడు. ఆటగాడిగా, కెప్టెన్గా ధోని భారత క్రికెట్కు ఎంతో చేశాడు.బ్యాటర్గా 17000కు పైగా పరుగులు, వికెట్ కీపర్గా 824 మందిని ఔట్ చేయడంతో భాగం కావడంతో పాటు టీమిండియాను టీ20 వరల్డ్కప్ (2007), వన్డే వరల్డ్కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) విజేతగా నిలిపాడు. ప్రపంచ క్రికెట్లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ ధోని ఒక్కడే.క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ధోనికి తాజాగా లభించిన ఐసీసీ అత్యున్నత హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలు లభించాయి. పురస్కారాల విషయంలో ధోని ప్రస్తానం ఎంటీవీ యూత్ ఐకాన్తో మొదలైంది. అప్పుడ్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ధోనిని 2006లో ఎంటీవీ యూత్ ఐకాన్ పురస్కారంతో సత్కరించింది. కెరీర్ తొలినాళ్లలో ధోని పొడవాటి జులపాలతో యూత్ను తెగ ఆకర్శించాడు. అప్పట్లో ధోని క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది. ఇందుకే ఎంటీవీ ధోనిని యూత్ ఐకాన్గా నామినేట్ చేసింది.ధోనికి తొలి ప్రతిష్టాత్మక అవార్డు 2008లో లభించింది. అప్పటికే టీమిండియాను టీ20 ఛాంపియన్గా నిలిపిన ధోనికి ఆ ఏడాది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారం లభించింది. భారత ప్రభుత్వం ధోనిని ఈ అవార్డును నామినేట్ చేసింది.అదే ఏడాది (2008) ధోని తొలిసారి ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ మరుసటి ఏడాది కూడా వన్డేల్లో పరుగుల వరద పారించినందుకు గానూ ధోనికి మరోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. 2009లో భారత ప్రభుత్వం ధోనికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2011లో ధోనికి భారత సైన్యంలో లెఫ్ట్నెంట్ కల్నల్ హోదా లభించింది. అదే ఏడాది సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ద ఇయర్, క్యాస్ట్రాల్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు లభించాయి. 2011-2020 దశాబ్దానికి గానూ ధోనికి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డు లభించింది.2018లో ధోని భారత దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. తాజాగా ధోనిని ఐసీసీ తమ అత్యున్నత పురస్కారమైన హాల్ ఆఫ్ ఫేమ్తో సత్కరించింది. ఇవే కాకుండా ధోని కెరీర్లో ఎన్నో ప్రైవేట్ పురస్కారాలు అందుకున్నాడు. 43 ఏళ్ల ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి, ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

రచిన్, బ్రూక్.. కొత్త ఫాబ్ ఫోర్ వీళ్లే..!
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ ఫాబ్ ఫోర్గా (అత్యుత్తమమైన నలుగురు) కీర్తించబడుతున్నారు. అయితే వీరిలో విరాట్ కోహ్లి టెస్ట్లకు, టీ20లకు.. స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫాబ్ ఫోర్కు బీటలు వారినట్లైంది. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణిస్తుంటేనే ఫాబ్ ఫోర్ బిరుదుకు సార్దకత ఉంటుంది. అలాంటిది విరాట్, స్టీవ్ స్మిత్ ఆయా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇకపై వీరిని ఫాబ్ ఫోర్లో సభ్యులుగా పరిగణించలేము. మిగిలిన ఇద్దరిలో రూట్, విలియమ్సన్ కూడా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వీరికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. వీరిద్దరితో పాటు స్టీవ్ స్మిత్ ప్రస్తుతం టెస్ట్ల్లో మాత్రమే యాక్టివ్గా ఉన్నారు.ఫాబ్ ఫోర్కు బీటలు వారిన నేపథ్యంలో కొత్త ఫాబ్ ఫోర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. విశ్లేషకులు, మాజీలు కొత్త ఫాబ్ ఫోర్గా కీర్తించబడేందుకు పలానా ఆటగాళ్లు అర్హులంటూ ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడ కేన్ విలియమ్సన్ కూడా కొత్త ఫాబ్ ఫోర్ను ప్రకటించాడు. సొంత దేశ ఆటగాడు రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు కొత్త ఫాబ్ ఫోర్గా కీర్తించబడే అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్కు కూడా ఫాబ్ ఫోర్లో భాగమయ్యే అర్హతలున్నాయని అన్నాడు. ఈ సందర్భంగా కేన్ టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పాటు టెస్ట్ల్లో రాణిస్తేనే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారని తెలిపాడు. తాను వ్యక్తిగతంగా టెస్ట్ క్రికెట్కు అమితమైన ఆదరణ ఉన్న జమానాలో ఎదిగినందుకు గర్వపడుతున్నానని అన్నాడు. యువ ఆటగాళ్లు టీ20ల మాయలో పడి టెస్ట్ క్రికెట్ను విస్మరించకూడదని సూచించాడు. కేన్ అంచనా వేస్తున్న నయా ఫాబ్ ఫోర్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నారు. అయితే వీరంతా ఇదే ప్రదర్శనను సుదీర్ఘకాలం కొనసాగించగలిగితే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారు. గిల్, బ్రూక్, రచిన్, జైస్వాల్, గ్రీన్ ఆటగాళ్లుగా ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్నారు. వీరి వయసు కూడా చాలా తక్కువ. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ క్రికెటర్గా స్థిరపడేందుకు వీరికి తగినంత సమయం ఉంది. ఇప్పటివకే వీరు కెరీర్లో అత్యుత్తమ దశలను చూశారు.
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?
ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రూ.3,000 కంటే ఎక్కువ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మర్చంట్ టర్నోవర్తో సంబంధం లేకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ను వసూలు చేయాలనేలా చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయం పెరగడంపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తక్కువ పరిమాణంలో యూపీఐ చెల్లింపులకు ప్రస్తుతం ఛార్జీల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ పెద్ద లావాదేవీలపై త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేసే అవకాశం ఉంది. జనవరి 2020 నుంచి అమలులో ఉన్న జీరో-ఎండీఆర్ విధానానికి బదులుగా రూ.3,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది’ అని కొందరు అధికారులు తెలిపారు.రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 80 శాతంగా ఉంది. కానీ జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు పరిమిత ప్రోత్సాహకాలు ఉన్నాయి. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ లావాదేవీల కోసం పెద్ద వ్యాపారులపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రతిపాదించింది. ప్రస్తుతం రూపే మినహా క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంది.బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) సహా ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్లో ఐటీ నోటీసులు!మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండిఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.

ఊరించి.. ఉసూరుమనిపించి! మళ్లీ పెరిగిన పసిడి ధరలు
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,200 (22 క్యారెట్స్), రూ.98,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.750, రూ.820 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.820 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.98,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.750 పెరిగి రూ.90,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.820 పెరిగి రూ.98,550 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. కేజీ వెండి రేటు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉంది. దాంతో కేజీ సిల్వర్ ధర రూ.1,19,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

నాలుగు కంపెనీలు రెడీ
ఇటీవల తిరిగి కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో పలు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్వైపు చూస్తున్నాయి. విభిన్న పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ ఐపీవో ఈ నెల 13న ప్రారంభంకానుండగా.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 4 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా అనుమతి పొందాయి. జాబితాలో కెంట్ ఆర్వో, కరమ్టరా ఇంజినీరింగ్, మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, విద్యా వైర్స్ చేరాయి.వాటర్ ప్యూరిఫయర్ కంపెనీ కెంట్ ఆర్వో సిస్టమ్స్తోపాటు.. ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీ మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, వైండింగ్, కండక్టివిటీ ప్రొడక్టుల కంపెనీ విద్యా వైర్స్, కరమ్టరా ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ నాలుగు సంస్థలు సెబీకి జనవరిలో ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. ఈ నెల 3–6 మధ్య గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రాస్పెక్టస్ల ప్రకారం ఈ సంస్థలు ఉమ్మడిగా కనీసం రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సాయి ఇన్ఫినియం ఈ నెల 4న సెబీ నుంచి ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. కోటి షేర్ల విక్రయంఐపీవోలో భాగంగా కెంట్ ఆర్వో సిస్టమ్స్ కోటి ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కరమ్టరా ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకింద రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,750 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,050 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. రూ. 450 కోట్లపై కన్నుఐపీవోలో ద్వారా మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ రూ. 450 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు అనుగుణంగా ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 120 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మరో రూ. 120 కోట్లు రాజస్తాన్లోని శికార్ యూనిట్ విస్తరణతోపాటు జైపూర్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులకు వినియోగించనుంది. మిగిలిన నిధులలో రూ. 96 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కాగా.. విద్యా వైర్స్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు కోటి షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఏఎల్సీయూలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్లో ఐటీ నోటీసులు!ఓస్వాల్ పంప్స్ @ రూ.584–614సబ్మెర్సిబుల్, మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ షేరుకి రూ. 584–614 ధరల శ్రేణిలో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 13న ప్రారంభమై 17న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 890 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 497 కోట్ల విలువైన మరో 81 లక్షల షేర్లను ప్రమోటర్ వివేక్ గుప్తా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 1,387 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను సొంత అనుబంధ సంస్థ ఓస్వాల్ సోలార్లో పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా హర్యానాలోని కర్ణాల్లో కొత్తగా తయారీ యూనిట్లను ఏర్పాటుతోపాటు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది.

ఎన్ఆర్ఐలకు భారత్లో ఐటీ నోటీసులు!
ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) పన్ను నియమాలు పాటించకపోవడాన్ని గుర్తించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. భారత పన్ను అధికారులు అన్ని ఆర్థిక లావాదేవీలపై నిఘాను గణనీయంగా పెంచారు. అద్దె ఆదాయం నుంచి పాత పొదుపు ఖాతాల వరకు అన్ని అంశాలకు సంబంధించి స్క్రీనింగ్ చేసి పన్ను నోటీసులు జారీ చేస్తున్నారు.నోటీసులకు కొన్ని కారణాలు ఇవి..ఆదాయపు పన్ను శాఖ డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత ట్రాకింగ్ ద్వారా పన్ను దారులను గుర్తిస్తోంది. అందులో భాగంగా ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఎలాంటి సందర్భాల్లో పన్ను నోటీసులు అందుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం.నివేదించని అద్దె ఆదాయం: ఇండియాలో ఆస్తిని కలిగి ఉండి దానిపై అద్దెను ఆదాయం ఇండియన్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంటే మాత్రం చట్ట ప్రకారం పన్ను పరిధిలోకి వస్తారు.పాత పొదుపు ఖాతాలు: పరిమితికి మించి డిపాజిట్లు ఉన్న నిద్రాణమైన ఎన్ఆర్ఓ ఖాతాలుంటే పన్ను అధికారులు పరిశీలిస్తారు.అధిక విలువ కలిగిన లావాదేవీలు: పెద్ద మొత్తంలో రెమిటెన్స్లు, ఆస్తి అమ్మకాలు లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులను తప్పకుండా తెలియజేయాలి. ట్యాక్స్ డిక్లరేషన్లను సరిగ్గా దాఖలు చేయకపోతే చర్యలు తప్పవు.ఇదీ చదవండి: ఎస్పీఎంసీఐఎల్కు త్వరలో నవరత్న హోదా!మూలధన లాభాలు: భారతదేశంలో స్థిరాస్తి లేదా ఈక్విటీలను విక్రయించడం.. ఇక్కడి డబ్బును విదేశాలకు బదిలీ చేసినా పన్నులు వర్తిస్తాయి.వ్యాపార ఆదాయం: దేశీయ ఆధారిత వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఎన్ఆర్ఐలు ఆదాయపు పన్ను నిబంధనలకు కట్టుబడి ఉండాలి.విదేశీ ఆదాయాన్ని బహిర్గతం చేయకపోవడం: భారతీయ పన్ను చట్టాల ప్రకారం కొన్నిసార్లు ఎన్ఆర్ఐలు తమ మొత్తం ఆదాయాన్ని బహిర్గతం చేయవలసి ఉంటుంది. ఇది పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు.
ఫ్యామిలీ

Dusting challenge : 19 ఏళ్ల యువతి బలి, అసలేంటిది, లక్షణాలేంటి?
‘డస్టింగ్’ పేరుతో మరో సోషల్మీడియా భూతం అమాయక యువతీ యువకుల పారిట ప్రాణాంతకంగా మారుతోంది. అమెరికాలో ప్రమాదకరమైన డస్టింగ్ కారణంగా 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటుచేసుకుంది. మృతురాలిని రెన్నా ఓరూర్కేగా గుర్తించారు.ది ఇండిపెండెంట్ ప్రకారం, 19 ఏళ్ల రెన్నా ఓ'రూర్కే (Renna O'Rourke) ఏరోసోల్ వకారణంగా గుండెపోటుకు గురైంది. ఆ తరువాత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అపస్మారక స్థితిలో నాలుగు రోజులు చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి బ్రెయిన్ డెడ్గావైద్యులు ప్రకటించారు. ప్రియుడితో కలిసి రెన్నా తమకు తెలియకుండానే ఏరోసోల్ కీబోర్డ్ క్లీనర్ను ఆర్డర్ చేశారని,రెన్నా తల్లిదండ్రులు చెప్పారు. "ఆమె ఎప్పుడూ, 'నేను ఫేమస్ అవుతాను నాన్నా.. చూడండి. ' అని తరచూ చెప్పేదని అమ్మాయిల తండ్రి ఆరోన్ ఓ'రూర్కే అన్నారు.అసలేంటీ డస్టింగ్ డస్టింగ్ - క్రోమింగ్ లేదా హఫింగ్ అని కూడా పిలుస్తారు - ఈ డస్టింగ్ చాలెంజ్ ఇపుడొక వైరల్ ట్రెండ్. ఈ ఛాలెంజ్లో సరదా, ఆనందం కోసం కీబోర్డ్ క్లీనర్ల వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కుద్వారా పీల్చుతున్నారు. అమెరికా, ట్విటర్లో ట్రెండింగ్గా మారింది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడతారు. గుండె పనిచేయడం మానేసి, ప్రాణాలు పోయే దాకా వస్తుంది. తాము పొందే స్వల్పకాలిక ఆనందం కన్నవాల్లకి తీరని శోకం మిగుల్చుతుందని గమనించలేకపోతున్నారు. .19 ఏళ్ల రెన్నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమని, ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా సందడిగా ఉండేదని తండ్రి గుర్తు చేసుకున్నారు. మరోబిడ్డకు ఇలా కాకూడదనే సదుద్దేశంతో ఓరూర్కే కుటుంబం రెన్నా జ్ఞాపకార్థం, టీనేజర్లు మరియు తల్లిదండ్రులకు 'హఫింగ్' వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. గోఫండ్మీ పేజీని కూడా ప్రారంభించారు. "లోతుగా వెతకండి. వారి గదులను శోధించండి. అలా చేయడం వారి ప్రాణాలను కాపాడుతుంది" అని రెన్నా తల్లి సూచించారు.డస్టింగ్ లేదా క్రోమింగ్లో ఏమి జరుగుతుంది?క్రోమింగ్ చేసేటప్పుడు, ప్రజలు మెటాలిక్ పెయింట్స్ ఇతర ఉత్పత్తులలోని హైడ్రోకార్బన్లను పీల్చడానికి ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, మరణానికి దారి తీస్తుంది. క్రోమింగ్ అనే భావన చాలా సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఉంది.మాదకద్రవ్యాల వినియోగం, ఆరోగ్యంపై జాతీయ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది - ముఖ్యంగా టీనేజర్లు - ప్రతి సంవత్సరం ఇన్హేలెంట్లను ఉపయోగిస్తారు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12 -17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అత్యధికంగా వాడుతున్నారు. అలాగే 2024 మార్చిలో యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో వీడియోలు చూసి విషపూరిత పదార్థాలను పీల్చి మరణించాడు.డస్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏరోసోల్ పెయింట్, పెయింట్ థిన్నర్, ఇంజీన్ ఫ్యూయల్, జిగురు వంటి అనేక గృహోపకరణాలలో హైడ్రోకార్బన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి భారీ మత్తును కలిగిస్తాయి. ఊపిరి ఆడకపోవడం నిద్రలేమి, తలనొప్పి, బద్ధకం, కండరాల బలహీనత, కండరాల నియంత్రణ కోల్పోవడం, వికారం, వాంతులు లాంటి ప్రారంభ లక్షణాలు ముదిరి చివరకు ప్రాణాలను హరిస్తాయి. తీవ్ర లక్షణాలు : ఊపిరాడకపోవడం, గుండె ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరి, కోమా, మూర్ఛలు , ప్రాణాంతక గాయంనిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు బాడీలో ఆక్సిజన్ను పూర్తిగా తొలగిస్తుంది. ఊపిరాడకుండా చేసి మరణానికి గురి చేస్తుంది. క్రోమింగ్ శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కూడా ప్రభావితం చేస్తుంది. పొటాషియం స్థాయిలను తగ్గించేస్తుంది. ఇది గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల బలహీనత, ఇతర హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది.

హోమ్లీ పెట్ ఉంటే ఒత్తిడి సెట్.. ఇంట్రస్టింగ్ సర్వే
ఈ ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక శాతం మంది నగరవాసులు ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో మానవులకు మానసిక ప్రశాంతత ఒక విలాసంగా మారుతోంది. ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువులే మిత్రులుగా ఎంతో సహాయ పడుతున్నాయి. ఈ విషయం ఇటీవల మార్స్ పెట్కేర్, మెడిటేషన్ యాప్ కామ్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. 20 దేశాల్లో 31 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో భారత్కు చెందిన వెయ్యి మంది పెంపుడు జంతువుల యజమానుల అభిప్రాయాలు విశేషంగా వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం – సాక్షి, సిటీబ్యూరో పెంపుడు జంతువుల కారణంగా భారతీయుల్లో 92 శాతం మంది తమ స్క్రీన్ టైమ్ తగ్గిందని చెబుతుండగా, 93 శాతం మంది రోజువారీ పనుల మధ్య బ్రేక్ తీసుకోడానికి పెంపుడు జంతువులే ప్రేరణగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే, 82 శాతం మంది పెంపుడు జంతువులతో మాట్లాడటం ద్వారా రిలాక్సేషన్ పొందుతున్నామని, ఒంటరి తనానికి దూరం అవుతున్నామని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా భాగస్వామ్యమైంది. సర్వే విశేషాలివే.. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 79 శాతం మంది భారతీయులు నిద్ర బాగా పడుతోందని చెబుతుండగా, అదే అమెరికాలో ఇది కేవలం 55 శాతం మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు, 88 శాతం మంది ఆలోచనల్లో ఆవేశం తగ్గిందని, 76 శాతం మంది ఆ క్షణాలను ఆస్వాదించే పరిస్థితుల్లో ఉన్నామని వెల్లడించారు. ఈ డేటా కేవలం గణాంకాలుగా కాకుండా, మానవుల మానసిక శ్రేయస్సులో పెంపుడు జంతువుల ప్రభావాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ సందర్భంగా మార్స్ పెట్కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ మూర్తి చెప్పినట్లు, ‘పెంపుడు జంతువులు కేవలం మనిషికి ఆనందం కలిగించడమే కాక, మెదడుకు విశ్రాంతినిచ్చే సహచరులుగా నిలుస్తున్నాయి.’ కామ్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ గ్రెగ్ జస్టిస్ మాట్లాడుతూ.. ‘పెంపుడు జంతువులు మెడిటేషన్ లాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. మానవ సంబంధాల్లో మానవ–జంతు అనుబంధం ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది’ అన్నారు. పెంపుడు జంతువులకు అనుకూలంగా హైదరాబాద్లోని మార్స్ కార్యాలయంపెంపుడు జంతువులతో మానసిక ప్రశాంతతఈ సర్వే ద్వారా మార్స్, కామ్ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్ యాప్లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్ మెడిటేషన్లు, మైండ్ఫుల్నెస్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తోంది. హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. ‘మాయా’, ‘మైలో’ వంటి పెట్ అసోసియేట్స్తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు, ఆరోగ్యంగా బతకడానికీ, హాయిగా ఉండడానికీ ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి.. చదవండి: టూరిస్టులకూ నో : మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరం ఇదే..!ఈ సర్వే ద్వారా మార్స్, కామ్ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్ యాప్లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్ మెడిటేషన్లు, మైండ్ఫుల్నెస్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తోంది. హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. ‘మాయా’, ‘మైలో’ వంటి పెట్ అసోసియేట్స్తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు, ఆరోగ్యంగా బతకడానికీ, హాయిగా ఉండడానికీ ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి.. ఇదీ చదవండి: Beauty Tips: బ్లాక్ హెడ్స్కు చెక్, ముఖాన్ని మెరిపించే స్క్రబ్స్

Bonalu ఉత్సవాల రాజు.. పోతరాజు
బోనాలు.. పోతురాజులు.. ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం. శతాబ్దాలుగా బోనాలు, పోతురాజుల పేర్లు ఒకదానికొకటి పోటీపడుతూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎల్లమ్మ అమ్మవారి ఆలయాల ముందు పోతురాజుల విన్యాసాలు కళ్లప్పగించి చూడాల్సిందే. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనే బోనాల ఊరేగింపుకు పోతురాజుల విన్యాసాలు హైలెట్గా నిలుస్తాయి. ఒళ్లు గగుర్పొడిచే వీరి విన్యాసాలు బోనాల ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి గీంకారాలతో ఆ ప్రాంతంలో నిశబ్దం ఆవహిస్తుంది. చూసేవారంతా భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ముఖ్యంగా పోతురాజు నిమ్మకాయలతో చేసే విన్యాసం చూడ ముచ్చటగా అనిపిస్తుంది. రెండు చేతుల్లో కోరడాలతో సై..సై అని చప్పుడు చేస్తూ పోతురాజుల వీరంగం భలే ఆకట్టు కుంటుంది.– గోల్కొండ పోతురాజుల ప్రత్యేక ఆకర్షణ.. పోతురాజు వేషంలో తయారవడమే ఒక ప్రత్యేక కళ. బోనాలలో పోతురాజులది ప్రత్యేక ఆకర్షణ. శరీరం మొత్తం వివిధ రకాల రంగులు, కాళ్లకు గల్లు గల్లు మనే గజ్జెలతో పోతురాజులు ఆకట్టుకుంటారు. మెడలో మాలలు, రెండు చేతుల్లో కోరడాలతో, నాలుక బయటకు తీస్తే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. కాగా గోల్కొండ కోట బోనాలలో గత దశాబ్ద కాలంగా పోతురాజుగా ప్రజలను ఆకట్టుకుంటున్నాడు తల్వార్ శివ. పోతురాజు వేషంలో స్థానిక ప్రజల అభిమానాన్ని పొందాడు. అమ్మమీద భక్తితోనే బోనాల ఉరేగింపులో పోతురాజు వేషం వేస్తున్నానని తల్వార్ శివ అంటున్నాడు. ఒక్క రోజు వేషానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఊరేగింపులో విన్యాసాలు చేస్తుంటే ప్రజలు తమను ఆదరిస్తారని, ఇది తమకు ఎంతో గర్వంగా అనిపిస్తుందని అంటున్నారు.

నడుము చుట్టూ నలుపా? అబ్బాయిలూ ఈ చిట్కాలు మీకు కూడా!
బాగా బిగుతుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల శారీరంగా అసౌకర్యంతో పాటు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. టైట్ జీన్స్ వల్ల మహిళలు, పురుషుల్లో సమస్యలు తప్పవు. అలాగే టైట్గా ఉండే బ్రాలు, ప్యాంటీలువల్ల ఆయా ప్రదేశాల్లో ర్యాషెస్ రావడంతోపాటు నల్లని మచ్చలు ఏర్పడతాయి. చర్మ వ్యాధులకు దారి తీస్తాయి. మరి ఇలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? ఎలాంటి చిట్కాలు పాటించాలి?పురుషుల్లో నడుము చుట్టూ బెల్టు పెట్టుకునే చోట లేదా మహిళల్లోనైతే వారు లోపలి లంగా లేదా సెల్వార్ నాడా కట్టుకునే చోట నల్లగా మచ్చపడే అవకాశం ఉంది. అందుకే మరీ గట్టిగా లాగిగానీ లేదా మరింతగా బిగించిగానీ కట్టకపోవడం మంచిది. ఇక్కడ మరీ బిగుతుగా కాకుండా మరీ వదులుగా కాకుండా తగినంత సౌకర్యంగా ఉండేలా బెల్ట్/నాడా కట్టుకోవడం మంచిది. నలుపు పోవడానికి చిన్న చిట్కాలు... ∙మనం చేసే పని (వృత్తి)లో భాగంగా మరీ ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి ఉండటమూ / కూర్చొని ఉండటం సరికాదు. ప్రతి గంటకు ఒకసారి కనీసం 5-10 నిమిషాల΄ పాటైనా అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. దీనివల్ల అన్ని భాగాల్లో లాగే నడుము ప్రాంతంలో కూడా రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. దీనివల్ల నలుపు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ ఫైబర్ వల్ల శరీరానికి మంచి బిగువు వస్తుంది. ఇలా బిగువుగా ఉండే వారిలో చర్మం మంచి మిలమిలలతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇటు మహిళలైనా, అటు పురుషులైనా పడుకునే సమయంలో కాళ్ల కింద తలగడ పెట్టుకుని, అవి పడక నుంచి 10 అంగుళాల పైన ఉండేలా జాగ్రత్త తీసుకుంటే నడుము చుట్టూ ఉన్న నల్ల మరకల నివారణకు తోడ్పడటమే కాకుండా, గుండెకూ తగినంత రక్తప్రసరణ సులువుగా అవుతుంటుంది. బిగుతైన దుస్తులను ధరించడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను, చర్మవ్యాధులను తగ్గించడం చాలా సులభం. కేవలం వాటికి బదులు మంచి గాలి ఆడేందుకు వీలుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అయితే ఇలాంటి టైట్ ఫిటింగ్ ఫ్యాషన్ను వదులుకోడానికి ఇష్టపడని యువత ఒక జాగ్రత్తను పాటించడం మంచిది. అదేమిటంటే... మరీ ఎక్కువ బిగుతైన దుస్తులకు బదులుగా ఒంటికి నప్పేలా ఉండటంతో పాటు, హానికరం కానంత మేరకు మాత్రమే.నివారణ...బిగుతైన దుస్తులను ధరించడం మంచిది. ఇక అండర్గార్మెంట్స్, సాక్స్ విషయానికి వస్తే... చర్మానికి అంటుకుపోయేంత బిగువుగా కాకుండా, కాస్తంత గాలి ఆడేందుకు వీలుగా ఉండేవి వాడటం మేలు. ఇక్కడ నైలాన్ వంటి వాటికి బదులుగా కాటన్వి ఎంపిక చేసుకోవడం చాలావరకు మేలు చేసే అంశం.
ఫొటోలు
అంతర్జాతీయం

#Axiom4: శుభాంషు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా
యాక్సియమ్ స్పేస్ సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ISS)కి చేపట్టిన నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ఈ నెల 10న సాయంత్రం 5.52 గంటలకు (భారత కాలమానం ప్రకారం) నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ప్రతికూల వాతావరణంతో రెండు రోజులు వాయిదా వేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ యాత్ర కోసం చేపట్టనున్న నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర భారత్కు చెందిన కెప్టెన్ శుభాంశు శుక్లాను(shubhanshu shukla) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కావాల్సి ఉంది. వాస్తవానికి యాక్సియం-4 మిషన్ కోసం వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సింది. అయితే, దాన్ని తొలుత ఈ నెల 8కి, అనంతరం 10కి మార్చారు. తాజాగా మరోసారి వాయిదా పడింది.Launch Of Axiom-4 Mission To ISS Postponed To June 11 Due To Bad Weather#Axiom4 #ShubhanshuShuklahttps://t.co/wsEgLTMx4R— NewsMobile (@NewsMobileIndia) June 9, 2025తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 11వ తేదీన ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్లో ఈ మిషన్ ప్రారంభం కానుంది. 28 గంటల ప్రయాణానంతరం ఐఎస్ఎస్ చేరుకుని, అక్కడ 14 రోజులు గడుపుతారు. శుభాంశు శుక్లా (భారతదేశం), పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) ఈ యాత్రలో పాల్గొంటారు. యాక్సియమ్ స్పేస్ (Axiom Space) ద్వారా చేపట్టబడిన ఈ మిషన్, "ఏఎక్స్-4" (AX-4) అని పిలుస్తారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం ఇస్రో తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) మన వ్యోమగామి పంపించడం విశేషం. ఐఎస్ఎస్లో శుక్లా చేపట్టబోయే ప్రయోగాలు గగన్యాన్కు ఎంతో ఉపకరిస్తాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది. ఇక.. 1984లో రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్ ద్వారా రోదసీ యానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కావడం గమనార్హం.

ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ
కొలరాడో: మృత్యువు అనేది ఒక అంతుచిక్కని రహస్యం. జననం ఆవలి మరణంలో ఏముందో తెలుసుకోవాలని మనిషి కొన్ని వేల ఏళ్ల తరబడి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే పలు ఊహాగానాలు పుట్టుకువస్తున్నాయి. అయితే వీటికి స్పష్టమైన ఆధారాలు ఉండటం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ ‘స్ఫృహ’కు ఆవతలివైపు ఏముందో చూశానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.కొలరాడోకి చెందిన బ్రియానా లాఫెర్టీ(33) తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పింది. ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిముషాల తరువాత ఆమె లేచి కూర్చుని, తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు ‘సిద్ధంగా ఉన్నారా’? అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపారు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. ‘మరణం ఒక భ్రమ? ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది. అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయని నేను గ్రహించాను. ఇది ఒక వరం’ అని లాఫెర్టీ ‘ది మిర్రర్’కు చెప్పారు.ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో నేను అకస్మాత్తుగా నా భౌతిక శరీరం నుండి విడిపోయాను. నేను అప్పటి నా మానవ స్వభావాన్ని చూడలేదు. గుర్తుంచుకోలేదు. నేను పూర్తి నిశ్చలంగా ఉన్నాను. సజీవంగా, అవగాహనతో, గతంలో కంటే అధిక ప్రశాంతతను అనుభూతి చెందాను. ఎటువంటి నొప్పీలేదు. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉంది. ఆ సమయంలో మన భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నాను. అక్కడ మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవి బేషరతు ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయి. అక్కడ సమయం అనేది లేదు. అయినప్పటికీ అంతా పరిపూర్ణంగా ఉంది’ అని లాఫెర్టీ తెలిపారు.నిజానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు సంక్లిష్టమైనవి. వాటిని వివరించడం కష్టం అని అంటుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మానవ మెదడు మరణం అంచుకు చేరినప్పడు, జీవితంలో ముఖ్య ఘట్టాలను గుర్తుచేసుకుంటుంది. ఇటీవల కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో జీవులన్నీ జీవితాంతం తమ చుట్టూ ఒక కాంతిని వెదజల్లుతాయని, అయితే ఆ జీవి చనిపోయినప్పుడు ఆ కాంతి అదృశ్యమవుతుందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: రాజ్తో సంబంధం.. రాజాతో పెళ్లి?.. ‘హనీమూన్ జంట’కథలో అసలు నిజం

11న ఇమ్రాన్ ఖాన్ విడుదల?
హైదరాబాద్: అల్–ఖాదిర్ ట్రస్ట్ కేసులో బెయిల్ లభిస్తే జూన్ 11వ తేదీన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యే వీలుందని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గోహర్ అలీఖాన్ ప్రకటించారు. దాదాపు రూ.2,200 కోట్ల అల్–ఖాదిర్ యూనివర్సిటీ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీలకు పడిన శిక్షలను రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇస్లామాబాద్ హైకోర్టు జూన్ 11న నిర్ణయం తీసుకోనుందని అలీఖాన్ ఆదివారం చెప్పారు. పదవి కోల్పోయాక 72 ఏళ్ల ఇమ్రాన్ 2023 ఆగస్ట్ నుంచి రావల్పిండి నగరంలోని అడియాలా జైలులో గడుపుతున్నారు.

గ్రెటా థన్బర్గ్కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్ అడ్డగింత
గాజా: యుద్ధంతో మరుభూమిగా మారుతున్న గాజాపై ఇజ్రాయెల్ మరోమారు తన ప్రతాపాన్ని చూపింది. స్వీడిష్ పర్యావరణ కార్యకర్త, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో ఉద్యమాన్ని ఉద్యమాన్ని నడుపుతున్న గ్రెటా థన్బర్గ్తో పాటు పలువురిని గాజా స్ట్రిప్కు తీసుకువెళుతున్న మానవతా నౌక(హ్యూమానిటేరియన్ షిప్)ను ఇజ్రాయెల్ కమాండోలు అడ్డుకున్నారు.ఈ నౌకలో పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి (ఎఫ్ఎప్సీ)కి చెందిన కార్యకర్తలలో పాటు యూరోపియన్ పార్లమెంట్ (ఎంఈపీ) సభ్యురాలు రిమా హసన్ కూడా ఉన్నారు. తాజాగా లైఫ్ జాకెట్లు ధరించి, చేతులు పైకెత్తి కూర్చున్న కొందరి ఫోటోను ఇజ్రాయెట్ పోస్ట్ చేసింది. ఫ్రీడమ్ ఫ్లోటిల్లా సిబ్బందిని ఇజ్రాయెల్ సైన్యం అంతర్జాతీయ జలాల్లో తెల్లవారుజామున అరెస్టు చేసిందని ఇజ్రాయెల్ పేర్కొంది. మానవతావాద సమూహాల కూటమి(ఎఫ్ఎప్సీ)టెలిగ్రామ్ యాప్లో మాడ్లీన్తో సంబంధం కోల్పోయామని, ప్రయాణికులను ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయని పేర్కొంది. The crew was arrested in international waters. pic.twitter.com/ydjA9yZHSC— Rima Hassan (@RimaHas) June 9, 2025శుక్రవారం సిసిలీ నుంచి బయలుదేరిన ఈ నౌక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు నుంచి గాజాపై ఇజ్రాయెల్ నావికా దిగ్బంధనను సవాలు చేస్తూ వస్తోంది. అలాగే బాధితులకు సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఎఫ్ఎప్సీ తెలిపింది. తాజాగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నౌకను సెలబ్రిటీల సెల్ఫీ నౌకగా పేర్కొంది. అది ఇజ్రాయెల్ తీరానికి సురక్షితంగా చేరుకుంటుందని, ఓడలో ప్రయాణిస్తున్న కార్యకర్తలు ప్రచారం పొందడానికి, మీడియాను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించింది.గడచిన రెండు వారాల్లో 1,200కు పైగా సహాయ ట్రక్కులు ఇజ్రాయెల్ నుండి గాజాలోకి ప్రవేశించాయని, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ గాజాలోని పౌరులకు దాదాపు 11 మిలియన్ల ఆహారాన్ని పంపిణీ చేసిందని ఇజ్రాయెల్ ఒక పోస్టులో పేర్కొంది. మాడ్లీన్ గాజాకు చేరుకోకుండా, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదేశించిన దరిమిలా ఈ ఓడను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. గాజాలోని హమాస్ ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా నిరోధించడానికే ఇటువంటి చర్యలు చేపడుతున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇది సహాయం కాదని, ప్రచార స్టంట్ అని, వారి వద్ద 100 పౌండ్ల కంటే తక్కువ విలువచేసే సహాయక సామగ్రి ఉందని, ప్రతిరోజూ గాజాకు పంపిణీ అవుతున్న దాని కన్నా ఇది చాలా తక్కువ మొత్తం అని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి గై నిర్ మీడియాకు తెలిపారు.అయితే ఇజ్రాయెల్ చేపట్టిన ఈ సముద్ర దిగ్బంధం చట్టవిరుద్ధమని ఎఫ్ఎప్సీ పేర్కొంది.గాజాకు చేరుకునేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునే హక్కు ఇజ్రాయెల్కు లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్ఎప్సీ నౌక కాన్సైన్స్ గత మేలో మొదటిసారి గాజాకు చేరుకోవడానికి ప్రయత్నించింది. అయితే మాల్టా తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై డ్రోన్ దాడి జరగడంతో ప్రయాణం రద్దయ్యింది.ఇది కూడా చదవండి: హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
జాతీయం

‘డిప్యూటీ స్పీకర్ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్ చేశారు.‘లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్ అధికారి. సంప్రదాయంగా లోక్సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారని... లోక్సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.మొదటి లోక్సభ నుంచి పదహారవ లోక్సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు.

అమ్ములపొదిలోకి తేజస్ 2.0
పాకిస్తాన్తో ఉద్రిక్తలు తారస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాటవం మరింత బలోపేతం కానుంది. తేలికరకం యుద్ధ విమానం తేజస్ తాలూకు అత్యాధునిక ఎంకే1–ఏ వేరియంట్ ఈ నెలాఖరుకల్లా ఎయిర్ఫోర్స్ అమ్ములపొదిలోకి చేరనుంది. దశలవారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎల్రక్టానికలీ స్కాన్డ్ అరే) రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ.ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలకు తీసిపోని సామర్థ్యం తేజస్ ఎంకే1–ఏ సొంతమైనట్టు జెరూసలేం పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గతేడాదే అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తదితరాల్లో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న మిగ్–21, జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలుంటాయి. ఇవీ ప్రత్యేకతలు ⇒ తేజస్ ఎంకే1–ఏలో అమర్చిన అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు చెందిన ఎల్టా సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ⇒ తేజస్లో అమర్చిన అధునాతన ఎల్రక్టానికల్ యుద్ధతంత్ర వ్యవస్థను కూడా ఎల్టాయే సరఫరా చేసింది. ⇒ ఇజ్రాయెల్కే చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ రూపొందించిన అత్యాధునిక హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఘర్షణల వేళ పైలట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ⇒ ఏఈఎస్ఏ వ్యవస్థ తదితరాలన్నింటినీ మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేశారు. ⇒ తేజస్ ఎంకే1–ఏకు ఇజ్రాయెల్ సమకూర్చిన పలు సాంకేతిక హంగులు ఆ దేశానికే చెందిన పలు యుద్ధవిమానాల్లో కూడా లేకపోవడం విశేషం. ⇒ రఫేల్ యుద్ధ విమానాల్లోని రాడార్ గైడెడ్ డెర్బీ క్షిపణులను తేజస్ఎంకే1–ఏకు అమర్చనున్నారు. ఫలితంగా దాని యుద్ధపాటవం ఎన్నో రెట్లు పెరగనుంది. ⇒ తేజస్ తాలూకు భావి వెర్షన్లు మరింత అధునాతనమైన కానార్డ్ వింగ్స్, ఎల్రక్టానిక్ తదితర వ్యవస్థలు, మరింత మెరుగైన రేంజ్ వంటివాటిని సంతరించుకోనున్నట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ⇒ తేజస్ మూడో వెర్షన్లను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిత్యం శ్రమిస్తోంది. ⇒ ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థల సరఫరా కాంట్రాక్టుల కోసం ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్, అమెరికా ఆయుధ కంపెనీలు పోటీపడుతున్నాయి.

‘జాతీయ భద్రతా సలహా మండలి’సభ్యుడిగా సతీశ్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ జి.సతీశ్ రెడ్డిని జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ‘జాతీయ భద్రతా సలహా మండలి’లో సభ్యుడిగా మంగళవారం నుంచి రెండేళ్ల పాటు, అంటే 2027 జూన్ 9వ తేదీ వరకు సతీశ్రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయ డిప్యూటీ సెక్రటరీ పుష్పేందర్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని మహిమలూరులో 1963 జూలై 1న జన్మించిన సతీశ్ రెడ్డి 1986లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు.ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో అనంతపురం జేఎన్టీయూ నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు.పరిశోధనా సంస్థ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా పనిచేశారు. ఈ కాలంలో ఐఆర్ సీకర్స్, ఇంటిగ్రేటెడ్ ఏవి యానిక్స్ మాడ్యూల్స్, ఇతర వినూత్న వ్యవస్థల అభి వృద్ధిని పర్య వేక్షించారు. 2015 లో రక్షణ మంత్రి సాంకేతిక సలహా దా రుగా నియమి తులయ్యారు.2018 ఆగస్టు లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్ ఆర్గనై జేషన్ (డీఆర్ డీవో) 13వ చైర్మన్గా నియమితులయ్యారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల అభివృద్ధి డైరెక్టర్ జనరల్గా ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ను పర్యవేక్షించారు. నాగ్, క్యూఆర్ఎస్ఏఎం, రుద్రమ్, దీర్ఘశ్రేణి గైడెడ్ బాంబ్ల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. విజయవంతమైన పృథ్వీ డిఫెన్స్ వెహికిల్ తొలి పరీక్షను పర్యవేక్షించారు. 2018 నుంచి 2022 డీఆర్డీవో చైర్మన్గా సేవలందించారు.

అఖిలపక్ష బృందాలకు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, పాక్ ఉగ్రవాద విష సంస్కృతిని ప్రపంచదేశాల ఎదుట ప్రభావవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్ష బృందాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. 50 మందికిపైగా సభ్యులతో ఏడు బృందాలుగా బయల్దేరి అత్యంతప్రధానమైన దేశాల్లో పర్యటించి పాక్ వైఖరిపై దునుమాడి తిరిగొచ్చిన అఖిలపక్ష సభ్యులను ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో 7, లోక్కళ్యాణ్మార్గ్లోని తన అధికార నివాసంలో కలిశారు. వారి విదేశీ పర్యటన వివరాలను స్వయంగా అడిగి తెల్సుకున్నారు.అంతర్జాతీయ వేదికపై భారత దృఢవైఖరిని, పాక్ దుష్టనీతిని అత్యంత ప్రభావవంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు, విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘ ఉగ్రవాదాన్ని అంతంచేసి శాంతిస్థాపనకు భారత్చేస్తున్న కృషిని, భారత్పై పాక్ చిమ్ముతున్న ఉగ్రవిషాన్ని ప్రపంచదేశాలకు తెలియజేప్పేందుకు పర్యటనకు వెళ్లివచ్చిన అఖిలపక్ష బృందాలతో భేటీ అయ్యా. భారత వాణిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నాం’’ అని తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు.రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా(బీజేపీ), శశిథరూర్(కాంగ్రెస్), కనిమొళి(డీఎంకే), శ్రీకాంత్ శిందే(శివసేన), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), సుప్రియా సూలే (ఎన్సీపీ–ఎస్పీ)ల సారథ్యంలోని ఏడు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు 33 దేశాల రాజధాని నగరాలు, యురోపియన్ యూనియన్లో పర్యటించడం తెల్సిందే. భేటీలు సత్ఫలితాలనిచ్చాయి: శశిథరూర్ అమెరికాతోపాటు మరో నాలుగు దేశాల పర్యటనకు సారథ్యంవహించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అంతకుముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ భేటీ అద్భుతమైన సత్ఫలితాల నిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఎంపీలను పంపి భారత ఐక్యతను ప్రభుత్వం చాటింది. అందుకు తగ్గట్లే భేటీలన్నీ ఫలవంతమయ్యాయి. మా లక్ష్యం నెరవేరింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఎందుకు ఉగ్ర, పాక్ స్థావరాలపై దాడిచేసిందో బలంగా వినిపించాం. ఆయాదేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉన్నతాధికారులు, మీడియా సైతం భారత్కు మద్దతు పలికారు’’ అని శశిథరూర్ అన్నారు.‘‘ ఉగ్రవాదం విషయంలో భారత దేశ ఐక్యతను చాటడంతోపాటు భారత వాణిని ప్రపంచదేశాలకు బలంగా వినిపించే లక్ష్యంతో ఈ బృందాలు 30కిపైగా దేశాల్లో పర్యటించాయి’’ అని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలచేసింది. ఇప్పటికే ఈ బృందాల కృషిని భారత విదేశాంగ శాఖ పొగిడింది. ఇప్పటికే ఈ బృందాలతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విడివిడిగా భేటీ అయ్యారు. అమెరికా, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఒక్కో బృందం పర్యటించింది.
ఎన్ఆర్ఐ

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్

న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం లో “న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ “ ఆధ్వర్యం లో జై తెలంగాణ నినాదాలతో “తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక”లను ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.అసోసియేషన్ అధ్యక్షులు “కోడూరి చంద్రశేఖర్” అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “Dr.మోహన్ కుమార్ సేథి” ముఖ్య అతిధి గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారుఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించడం జరిగిందిప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమం లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు “పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మేకల ప్రసన్న కుమార్ తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి,సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం,జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల,విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ,కిరణ్మయి పద్మ,విశ్వనాథ్ అవిటి,సందీప్ నాగుల,పవనకుమార్ చారుకొండ,సలీం మహమ్మద్,హరీష్ గోపాల్,మనోహర్ కన్నం,కిరణ్ కుమార్ కొమ్ముల,రమేష్ రెడ్డి రామిండ్ల,శ్రీరామ్ విజయ్,శ్రీనివాస్ గాజుల,ప్రమోద్ ఇరుగు,అనిల్ మెరుగు,రమేష్ ఆడెపు,రవి కుమార్ వట్టం,విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరుల తో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.

అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అబుదాబి :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అబు ధాబిలోని ఇండియా ఎంబసీ వేదికగా ఎంతో వైభవంగా నిర్వహించబడింది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ - అబుధాబి ఆధ్వర్యంలో జయప్రదంగా సాగిన ఈ వేడుక తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వేడుకకు ప్రేం చంద్, కాన్సులర్(కౌన్సిలర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గౌరవ అతిథులుగా కుమారి ఆయుషి సుతారియా, సెకండ్ సెక్రటరీ (పాలిటికల్) పాల్గొన్నారు. వీరి సమక్షంలో దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది.తెలంగాణ పిల్లలు భారత మరియు యుఏఈ జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి దేశభక్తిని ప్రతిబింబించారు. అనంతరం తెలంగాణ బాలికలు మరియు మహిళలు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వేడుకకు కొత్త అందాన్ని తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో, ధరావత్ రాజ్కుమార్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం పేరిణి శివ తాండవం, గుస్సాడి నృత్యం, పోతరాజు, మరియు ఇతర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కళారూపాలు, వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సంపదను మధురంగా ప్రతిబింబించాయి.ప్రత్యేకంగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు - పావని, అర్చనా, లక్ష్మి తమ కృషితో తెలంగాణ కళా సంపదను ప్రతిబింబించే చిత్ర ప్రదర్శన వేడుకలకు మరింత ఆకర్షణ గా నిలిచింది. ఎంబసీ ప్రాంగణం తెలంగాణను తలపించేలా అలంకరించబడింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇంతే కాదు, డప్పు కళాకారుల దరువు వేడుక లో మరింత ఉత్తేజం నింపింది. డప్పు కళాకారులు, పోతరాజు కళాకారులు, గుస్సాడీ కళాకారులు మరియు పేరిణి శివ తాండవం కళాకారులు కలిసి చేసిన జుగల్ బంది ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఎంబసీ అధికారులను ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సంబరాలలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల సంఘాల నాయకులను మరియు ఇతర సాంఘిక సేవ సంఘం నాయకులను శాలువా కప్పి మరియు మొమెంటో ప్రధానం చేసి సత్కరించారు. అలాగే కార్యక్రమం లో పాల్గొన్న కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సన్మానించారు.. ఈ వేడుక అబూదాబి లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవలసిన జ్ఞాపకంగా మారింది అని అసోసియేషన్ కార్య నిర్వాహకుడు రాజా శ్రీనివాస రావు తెలియ జేశారు.వేడుకల తదనంతరం కార్యక్రమానికి వచ్చిన అతిదులందరికి, కార్య క్రమ నిర్వాహకులు తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, మరియు భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంతో ఈ వేడుక మరింత వైభవంగా జరిగింది. వేదికను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంబసీ అధికారులకు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను సింగపూర్ ఈస్ట్ కోస్ట్ పార్క్ (ECP)లో మే 31, 2025న ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో సుమారు 200 ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయఆటలను భావి తరాలకు అందించాలని TCSS సభ్యులు.. సంచి దుంకుడు, కచ్చకాయలు, ఇతర వినోద భరిత ఆటలు అంత్యాక్షరి, స్పూన్ మార్బుల్, డం చరాడ్స్ , తంబోలా మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేశారుద. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ మాట్లాడుతూ ఎలాంటి హంగు ఆర్భాటాలు, లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమాలు ఆదర్శప్రాయం, అభినందనీయం అన్నారు.టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ ఫామిలీ డే - 2025 ఇంతలా విజయవంతమయ్యేలా సహకరించి వారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి రమేష్ గడప, రాము బొందుగుల మరియు వెంకటరమణ నంగునూరి, కల్వ లక్ష్మణ్ రాజు మొదలగు వారు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.(చదవండి: అమెరికా అంతటా గులాబీ మయం..!)
క్రైమ్

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య
తొగుట (సిద్ధిపేట జిల్లా): ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బండారుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరటి పర్శరాములు (42) కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైనట్టు గ్రామంలోని కొందరు నాయకులు తెలపడంతో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అందుతాయన్న ఆశతో తెలిసిన వారి వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకుని బేస్మెంట్ వరకు నిర్మించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత మంజూరైన ఇళ్ల జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందంటూ బాధితుడికి నాయకులు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ రవికాంత్రావు తెలిపారు.

నాన్నా.. వదిలిపెట్టు, భయమేస్తోంది!
అనుమానం పెనుభూతమైంది. క్షణికావేశంలో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం.. మొత్తం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య వివాహేతర సంబంధంలో ఉందన్న అనుమానంతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ భర్త.. కొన్ని గంటల్లోనే నలుగురు కొడుకులతో కలిసి పట్టాలపై శవమై కనిపించాడు. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫరిదాబాద్కు చెందిన మనోజ్ మాహట్టో(45) భార్య ప్రియతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఆ భర్త తన నలుగురు పిల్లలు పవన్(10), కరు(9), మురళి(5), చోటు (3)లను తీసుకుని బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నాం దాకా సమీపంలోని ఓ పార్క్లో సేదతీరాడు. పిల్లలకు చిప్స్, కూల్డ్రింక్స్ కొనిచ్చి సరదాగా గడిపాడు. ఆపై వాళ్లను తీసుకుని సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. భుజాలపై చెరోవైపు.. చెరోకరిని, మిగతా ఇద్దరిని రెండు వైపులా చేతులు పట్టుకుని పట్టాలపై నడిపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో ఆ పిల్లలకు అప్పటిదాకా అర్థం కావడంలేదు. మరికాసేపట్లో భల్లాబ్గఢ్ స్టేషన్కు గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సి ఉంది. స్టేషన్ మరో కిలోమీటర్ దూరం ఉందనగా.. పట్టాలపై నలుగురు పిల్లలతో మనోజ్ నిల్చున్నాడు. అయితే పట్టాలపై పిల్లలతో వ్యక్తి నిల్చున్న విషయం గమనించిన లోకో పైలట్ హారన్ కొడుతూ రైలును ఆపే ప్రయత్నం చేశాడు. అయినా మనోజ్లో చలనం లేదు. రైలు దగ్గరగా వస్తుండడంతో భయంతో ఆ పిల్లలు రోదించ సాగారు. తమను వదిలిపెట్టమని పవన్, కరులు గింజుకుంటున్నారు. అయినా ఆ తండ్రి చలించలేదు. వాళ్లను బలంగా అదిమి పట్టుకున్నాడు. చివరకు రైలు వచ్చి ఢీ కొట్టడంతో ఆ ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఆపై కాస్త దూరంలో రైలు ఆగడంతో.. లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు వచ్చి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మనోజ్ జేబులో సూసైడ్ నోట్ లభించగా.. అందులో తన భార్యే కారణమని రాసి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

భార్యతో విసుగు చెంది భర్త ఆత్మహత్య
బనశంకరి(కర్ణాటక): పదే పదే ఇల్లు వదిలిపెట్టి వెళుతున్న భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కేపీ అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గోవర్ధన్, ప్రియా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రియా అప్పుడప్పుడు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లేది. నెల క్రితం కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గోవర్ధన్ కుటుంబం మూడో అంతస్తులో ఉంటుంది. గోవర్ధన్ తల్లి కింది అంతస్తులో ఉంటుంది. 8వ తేదీ రాత్రి తల్లి గోవర్దన్ కు భోజనం అందించి వచ్చింది. భోజనం కూడా చేయకుండా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కొడుకు బయటకు రాలేదని తల్లి వెళ్లిచూడగా ఉరికి వేలాడుతూ ఉన్నాడు. కేపీ.అగ్రహార పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
బోయినపల్లి (కరీంనగర్): భార్య వివాహేతర సంబంధంతో అవమానంగా భావించిన ఓ భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగింది. తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది.వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. కాగా అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చాడు. ఈ క్రమంలో కావేరి ‘నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్తోనే ఉంటా’అని భర్తతో తేల్చిచెప్పింది.దీంతో మనస్తాపం చెందిన హరీశ్ మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆదేశాలతో బావిలోని నీటిని మోటార్లతో తోడేయగా, హరీశ్ మృతదేహం లభ్యమైంది. హరీశ్ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కావేరి, రక్షణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు.