ప్రధాన వార్తలు

అదో ప్రమాదకరమైన ప్రాంతం.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్య ప్రాచ్యం(Middle East) నుంచి తమ దేశ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అత్యవసరేతర దౌత్య సిబ్బందితో పాటు ఆయా దేశాల్లో మోహరించిన భద్రతాల బలగాలనూ వెనక్కి రప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారాయాన. ‘‘అదో ప్రమాదకరమైన ప్రాంతం(Middle East Most Dangerous). అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే వచ్చేయాలంటూ ఆదేశాలు పంపించాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలోనే బలగాలను ట్రంప్ వెనక్కి రప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో ‘ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?’ అని అడిగిన ప్రశ్నకు.. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు(Iran Nuclear Weapons) కలిగి ఉండటానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదు’’ అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇరాక్ రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిలో కొంత మందిని అత్యవసరంగా వెనక్కి రావాలని అమెరికా ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే బాగ్దాద్లో మోహరించిన బలగాలనూ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. పెరిగిన ఆయిల్ ధరలు(4 శాతం పెరుగుదల) కారణమై ఉండొచ్చన్న విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. మరోవైపు.. బహ్రయిన్, కువైట్ నుంచి బలగాలను స్వచ్ఛందంగానే వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా భద్రతా విభాగం(State Deparment) ప్రకటించింది. అయితే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చమురు ఉత్పత్తి దేశాలైన ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రయిన్, యూఏఈలలో అమెరికా బలగాలు ఇంతకాలం మోహరించి ఉన్నాయి.

తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనామం
సాక్షి, అమరావతి: ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు.. నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం.. అధికారంలోకి రాగానే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద ఈ మొత్తాన్ని జమ చేస్తాం’ అని ఊరూరా.. ఇంటింటా ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు మాట తప్పింది. ఏకంగా దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టనుంది. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా.. రెండో ఏడాది తూతూ మంత్రంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. రూ.15 వేల స్థానంలో రూ.13 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిసింది. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. అయితే ఈ పథకం అమలు కోసం రూ.8,745 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ లెక్కన ఈ మొత్తం 58 లక్షల మంది విద్యార్థులకే సరిపోతుంది. అంటే దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ రూ.13 వేలను ఒకేసారి ఇస్తారా.. లేక వాయిదాల పద్దతిలో ఇస్తారా.. అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సూపర్ సిక్స్ అమలు చేయక పోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. ప్రజలు ఈ పథకం గురించి ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుండటంతో అరకొరగా అమలు చేయనుందని తెలుస్తోంది. అయితే అంతుబట్టని అంకెల గారడీతో తల్లుల కళ్లకు ప్రభుత్వం గంతలు కట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులున్నట్టు చెబుతోంది. ఈ లెక్కన తీసుకున్నా, తలో రూ.15 వేల చొప్పున రూ.10,090.74 కోట్లకు పైగా అవసరం. కానీ కేటాయింపులు మాత్రం ఆ మేరకు కూడా లేక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. తీరా నగదు జమ చేసే సమయానికి ఇంకెంత మందికి ఎగ్గొడతారోననే అనుమానం వ్యక్తమవుతోంది.గత ఏడాది ఎగ్గొట్టి.. ఈ ఏడాది కోతలు పెట్టి.. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’’ అంటూ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘సూపర్–6’లోనూ పేర్కొన్నారు. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీ ప్రకారం.. ఇప్పుడు చెప్పిన విద్యార్థుల సంఖ్య, నిధుల లెక్క సరిపోవడం లేదు. విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ లెక్కలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం.గతేడాది ఒక్క విద్యార్థికీ ఈ పథకం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈసారి విద్యార్థుల సంఖ్యలో కోత పెట్టి గొప్పలు చెబుతోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలో అమ్మఒడి జమయ్యేది. గతేడాది ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం రావడంతో పథకం ఆగిపోయింది. కానీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. అలాగే, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్నారు. హామీ ప్రకారం రెండేళ్లకు ఒక్కో విద్యార్థికి రూ.30 వేల చొప్పున ఇవ్వాలని తల్లులు డిమాండ్ చేస్తున్నారు.నేడు ‘తల్లికి వందనం’ నిధులు జమసమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయంసాక్షి, అమరావతి: తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచి అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఈ పథకం అమలు, విధివిధానాలపై మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అధికారులతో సీఎం సమీక్షించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారమే తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులను జమచేయాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామన్నారు. పథకాన్ని ఎలా అమలుచేయబోతున్నామనే విషయాన్ని వివరించారు. పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద గురువారం నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

నటి కల్పికపై కేసు నమోదు
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్పై 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్లో బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. బర్త్ డే కేక్ విషయమై ప్రిజం పబ్ నిర్వాహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కల్పికపై వారు కేసు నమోదు చేశారు. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్ కూడా కల్పిక చేశారని ప్రిజం సిబ్బంది తెలిపారు. ఇప్పటికే పబ్ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే.గొడవకు సంబంధించిన పలు వీడియోలను నటి కల్పిక కూడా తన సోషల్మీడియాలో పంచుకుంది. ప్రిజం పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని ఆవేదన చెందింది. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి కూడా చేసినట్లు ఆమె పేర్కొంది. గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపించింది. ప్రస్తుతం ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది.

అనకాపల్లి: ఫార్మా కంపెనీలో విష వాయువు లీక్.. కార్మికులు మృతి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్ అయ్యాయి. ఈ విష వాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని ఎస్ ఎస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయ్యాయి. విష వాయువు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను చంద్రశేఖర్, కుమార్గా గుర్తించారు. విష వాయువు కారణంగా పలువురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో, కంపెనీ యాజమాన్యం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే, ఫార్మా కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు.. పరవాడ ఫార్మా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కేజీహెచ్లో పరామర్శించారు వైఎస్సార్సీపీ నాయకులు బొడ్డేడ ప్రసాద్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పరవాడ ఫార్మా కంపెనీల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా కంపెనీలపై అధికారుల నియంత్రణ కొరవడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. కార్మికులంటే ప్రభుత్వానికి లెక్కలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

WTC Final 2025: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన ట్రివిస్ హెడ్
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2025లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ ఓ మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్లో విఫలమైనా హెడ్ (13 బంతుల్లో 11) ఓ ఘనత సాధించాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మను అధిగమించి, ఆ స్థానానికి చేరాడు.ఐసీసీ ఫైనల్స్లో రోహిత్ 11 ఇన్నింగ్స్ల్లో 322 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్లో పరుగులతో కలుపుకొని హెడ్ 4 ఇన్నింగ్స్ల్లోనే 329 పరుగులు చేశాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రికార్డుల రిరాజు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 11 ఇన్నింగ్స్ల్లో 411 పరుగులు చేశాడు.వాస్తవానికి ఈ మ్యాచ్కు ముందు హెడ్ విరాట్ రికార్డుపైనే కన్నేశాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన రెండో ఇన్నింగ్స్లో అయినా హెడ్కు విరాట్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్లో హెడ్ 83 పరుగులు చేస్తే విరాట్ పేరిట ఉన్న ఈ అల్టైమ్ రికార్డు బద్దలవుతుంది.ఘనమైన రికార్డుట్రవిస్ హెడ్కు ఐసీసీ ఫైనల్స్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో 163, రెండో ఇన్నింగ్స్లో 18 పరుగులు చేశారు. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో 137 పరుగులు చేశాడు. తాజాగా జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో 11 పరుగులు చేశాడు. హెడ్ ఐసీసీ ఫైనల్స్లో చేసిన రెండు సెంచరీలు భారత్నే చేయడం విశేషం. ఈ సైకిల్ డబ్ల్యూటీసీలో భారత్ ఫైనల్స్కు చేరలేదు. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు.ఆసీస్ ఇన్నింగ్స్లో స్మిత్, వెబ్స్టర్, క్యారీతో పాటు లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్ కావడంతో ఆసీస్ పతనం మొదలైంది. ఈ మ్యాచ్తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు.ఖ్వాజాను రబాడ, లబూషేన్ను జన్సెన్ ఔట్ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్ కూడా రబాడకే దక్కింది. స్టీవ్ స్మిత్ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్ను (0) జన్సెన్ ఔట్ చేశారు. వెబ్స్టర్, కమిన్స్ (1), స్టార్క్ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ను (2) హాజిల్వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది.

మస్క్ క్షమాపణలపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్లు మళ్లీ దగ్గరకానున్నరనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ ఇద్దరు స్నేహితులు సోషల్ మీడియాలో పరిస్పరం విమర్శలు చేసుకున్నారు. వీరి వివాదం ఎటువైపునకు దారితీస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే ఇంతలో ఎలాన్ మస్క్ ట్రంప్ను క్షమాపణలు కోరుతూ, ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. ‘న్యూయార్క్ పోస్ట్’తో జరిగిన ఫోన్ ఇంటర్వ్యూలో మస్క్ క్షమాపణలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. తన భాషలో కఠినమైన పదాలు ఉన్నప్పటికీ, తనకు కఠినమైన భావాలు లేవని ట్రంప్ అన్నారు. మస్క్ తనను క్షమాపణలు కోరడం చాలా బాగుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. బడ్జెట్ బిల్లుపై మస్క్ పలు విమర్శలు చేశారని, అందుకు అతనిని నిందించనని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కొంత నిరాశకు గురయ్యానని కూడా అన్నారు.ట్రంప్కు మాజీ సహాయకుడు ఎలోన్ మస్క్ గత వారంలో ట్రంప్పై విమర్శలు గుప్పిస్తూ, సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో వీరి మధ్య వైరం పెరిగింది. ఆ తరువాత ట్రంప్ తన రాజకీయ విజయంలో మస్క్ పాత్రను తక్కువ చేస్తూ స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా 2024 ఎన్నికల్లో ట్రంప్ తన మద్దతు కారణంగానే విజయం సాధించారని మస్క్ పేర్కొన్నారు. తాజాగా మస్క్ తాను గతంలో ట్రంప్పై ఆరోపణలు చేస్తూ, చేసిన పోస్టులలో కొన్నింటిని తొలగించి క్షమాపణలు కోరారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్తో ప్రైవేట్గా మాట్లాడిన తర్వాత మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను క్షమాపణలు కోరారు. సోమవారం మస్క్ వ్యక్తిగతంగా ట్రంప్ను కలిసినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో ట్రంప్.. ఎలాన్ మస్క్ క్షమాపణలను అంగీకరించారని సమాచారం. అయితే వారి మునుపటి సంబంధాలను పునరుద్ధరించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయలేదని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం

హసీనా ఎఫెక్ట్.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్ అసహనం
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్ను అంగీకరించలేదని యూనస్ చెప్పుకొచ్చారు. షేక్ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ యూనస్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్..‘హసీనాకు భారత్లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్ హసీనా.. యూనస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు.

మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం
దేశంలోనే అగ్రగామి బ్యాంక్ ఎస్బీఐ కస్టమర్కు మెరుగైన సేవలను అందించడంపై దృష్టి సారించింది. ఇందుకు వీలుగా బ్యాంక్ శాఖల స్థాయిలో 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించుకున్నట్టు ప్రకటించింది. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టినట్టు తెలిపింది. పరిశ్రమలోనే దీన్నొక పెద్ద నియామక ప్రక్రియగా పేర్కొంది.ఇదీ చదవండి: జియో బ్లాక్రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతిఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాథమిక స్థాయి పరీక్షల అనంతరం ఏప్రిల్ నెలలో ప్రధాన పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. పారదర్శక విధానంలో చివరికి 13,455 అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మందిని బ్యాంక్ నియమించుకోనుండగా.. ఇందులో 13,500 మంది క్లరికల్ ఉద్యోగులు అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. 3,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు కాగా, మిగిలిన వారు స్థానిక అధికారులుగా పేర్కొన్నారు.

భారత్కు కొత్త టెన్షన్!.. పాక్కు అండగా అమెరికా భారీ ప్లాన్?
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా.. మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే.. అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్, ఖొరాసన్కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్తోపాటు పాకిస్తాన్తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి."Pakistan has been a phenomenal counter-terrorism partner for America," argues General Michael Kurilla pic.twitter.com/VOzTy8vVli— Shashank Mattoo (@MattooShashank) June 11, 2025కాగా, పహల్గాం ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది."Ties with India cannot cost ties with Pakistan" General Michael Kurilla commander of United States Central Command.Seems the news about Indian Missiles ripping US’s Fissile materials and Nuclear Warhead at Nur Khan Air Base is proving to be True. pic.twitter.com/Ffp7lVdltS— BRADDY (@braddy_Codie05) June 11, 2025అమెరికా భారీ స్కెచ్..ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్ వాషింగ్టన్కు చేరుకుంటారని సీఎన్-న్యూస్ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ను కోరనుంది. అయితే, అమెరికా ఆర్మీ డేకు పాక్ ఛీఫ్ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశమేంటనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే, దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ వేసిందని చెబుతున్నారు. దీంతో పాటుగా చైనా, పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను కూడా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం..
గౌహతి: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి అదృశ్యం వెనుకనున్న రహస్యాన్ని పోలీసులు ఛేదించారు.త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచెర్రా మార్కెట్లో ఐస్క్రీమ్ ఫ్రీజర్లో దాచిన ట్రాలీ బ్యాగ్లో ఒక యువకుని మృతదేహం లభ్యమయ్యింది. మేఘాలయలో చోటుచేసుకున్న ‘హనీమూన్ హత్య’ దరిమిలా ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న సరిఫుల్ ఇస్లాం(20) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ యువకుడు, దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్స్టోరీ ఈ హత్యకు దారితీసిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.ప్రాథమిక దర్యాప్తులో తొలుత ఆ మహిళకు, ఆమె బంధువు అయిన దిబాకర్ సాహా మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తేలింది. సరిఫుల్ ఇస్లాం హత్య కేసులో ఆ డాక్టర్, అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. జూన్ 8న సాయంత్రం డాక్టర్ దిబాకర్ సాహా.. సరిఫుల్ను సౌత్ ఇంద్రానగర్ కబర్ఖలా ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అక్కడి జోయ్దీప్ దాస్(20) ఇంటిలో బహుమతి ఇస్తానని చెప్పాడు. అతని మాట మేరకు సరిఫుల్ అక్కడకు రాగానే దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్(21) నబనితా దాస్(25) అతనిపై దాడి చేశారు. అతన్ని గొంతు నరికి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేశారని పోలీసులు తెలిపారు.మర్నాటి ఉదయం దిబాకర్తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్, దేబికా సాహాలు గండచెర్రా నుండి అగర్తలాకు మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్ను తీసుకెళ్లారు. తరువాత శవాన్ని గండచెర్రా మార్కెట్లోని వారి దుకాణంలోగల ఐస్ క్రీం ఫ్రీజర్లో దాచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, వారి మొబైల్ మెసేజ్ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’
బన్నీ సినిమా.. ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించబోతున్న అట్లీ!
మీరిచ్చిన గూగుల్ మ్యాప్లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
ఏపీలో ఐదు రోజులు వానలే.. ఈ జిల్లాలకు అతి భారీ వర్షసూచన
ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
కాళేశ్వరం ఈఈకి 200 కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం, డైమండ్స్..
అదో ప్రమాదకరమైన ప్రాంతం.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
నటి కల్పికపై కేసు నమోదు
హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి..
గోపిచంద్ బర్త్డే స్పెషల్.. కొత్త సినిమా గ్లింప్స్ చూశారా?
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
అక్కడ 11 ఏళ్ల తర్వాత 'దేవర'.. సతీమణితో మంచు మనోజ్ సందడి (ఫోటోలు)
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
ప్రపంచం మన మాట వినట్లేదేం?
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్ కపుల్ కేసులో షాకింగ్ ట్విస్ట్
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సమ్మర్ జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న బన్నీ భార్య (ఫొటోలు)
సాక్షి కార్టూన్ 11-06-2025
Sakshi Cartoon: పొన్లెండి! ఒక రాష్ట్రంలోనే అన్నారు!
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
సీఎం శాఖలు సీనియర్లకు!
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బన్నీ సినిమా.. ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించబోతున్న అట్లీ!
మీరిచ్చిన గూగుల్ మ్యాప్లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
ఏపీలో ఐదు రోజులు వానలే.. ఈ జిల్లాలకు అతి భారీ వర్షసూచన
ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
కాళేశ్వరం ఈఈకి 200 కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం, డైమండ్స్..
అదో ప్రమాదకరమైన ప్రాంతం.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
నటి కల్పికపై కేసు నమోదు
హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి..
గోపిచంద్ బర్త్డే స్పెషల్.. కొత్త సినిమా గ్లింప్స్ చూశారా?
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
ప్రపంచం మన మాట వినట్లేదేం?
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్ కపుల్ కేసులో షాకింగ్ ట్విస్ట్
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సాక్షి కార్టూన్ 11-06-2025
Sakshi Cartoon: పొన్లెండి! ఒక రాష్ట్రంలోనే అన్నారు!
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
సీఎం శాఖలు సీనియర్లకు!
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
సినిమా

బర్త్డే పార్టీపై స్పందించిన సింగర్ మంగ్లీ.. డీసీపీ కామెంట్స్
గాయని మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకు ఇచ్చిన పార్టీ రచ్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి ఇచ్చిన పార్టీలో డ్రగ్స్, గంజాయి ఉపయోగించారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని సోషల్మీడియాలో ఆ వార్తలు వైరల్ అయ్యాయి. తను ఏర్పాటు చేసిన విందులో తన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారని అక్కడ ఎలాంటి డ్రగ్స్, విదేశీ మద్యం సరఫరా చేయలేదని ఆమె ఒక వీడియోతో వివరణ ఇచ్చారు. పోలీసులు కూడా దానిని ధ్రువీకరించారు.మంగ్లీ ఇచ్చిన పార్టీలో మద్యం, డీజే వినియోగం కోసం అనుమతి తీసుకోలేదని చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఇలా చెప్పారు. 'మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ మొదలైంది. త్రిపుర రిసార్ట్ నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయని మా ఎస్వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడ మద్యం వినియోగిస్తున్నారని కూడా తెలిసింది. దీంతో సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు 10 మంది మహిళలతో పాటు 12మంది పురుషులు ఉన్నారు. పార్టీలో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాము. అయితే, జిల్లెలగూడకు చెందిన వ్యాపారి కొసనం దామోదర్రెడ్డికి గంజాయి పాజిటివ్గా వచ్చింది. మిగిలిన వారిలో ఎవరికీ రిపోర్ట్లో పాజిటివ్ రాలేదు. కానీ, అతను కూడా మంగ్లీ ఇచ్చిన పార్టీలో గంజాయ్ తీసుకోలేదని, అంతకుముందే మరోచోట తీసుకున్నట్లు తెలిసింది.' అని డీసీపీ తెలిపారు. పోలీసులు చేసిన సోదాల్లో విదేశీ మద్యం కానీ, ఇతర మత్తు పదార్థాలు కానీ లభించలేదని చేవెళ్ల ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ కూడా పేర్కొన్నారు.వివరణ ఇచ్చిన మంగ్లీతన పుట్టినరోజు నాడు జరిగిన అంశంపై సింగర్ మంగ్లీ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ' పుట్టినరోజు వేడుకలు నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి చేసుకున్నాను. అయితే, మద్యం బాటిల్స్, డిజే సౌండ్స్కి అనుమతి తీసుకోవాలి అనే అవగాహన నాకు లేదు. తెలియక తప్పు జరిగింది. అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదు. డ్రగ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకొని వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తాము. దయచేసి నాపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దు.' అని ఆమె చెప్పారు.

రిస్క్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. పొరపాటు జరిగితే అంతే
పాన్ ఇండియన్ కథానాయకిగా పేరుగాంచిన నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal). అయితే ఈ ఉత్తరాది భామ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించే పాపులర్ అయ్యారన్నది గమనార్హం. మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించినా, ఆ తరువాత మగధీర, చందమామ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక తమిళంలోనూ అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఈ అమ్మడు ఉమెన్స్ సెంట్రిక్ పాత్రలను ఒకటి రెండు చిత్రాల్లో చేసినా, అవి క్లిక్ కాలేదు. కాగా ఈమె 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా పుట్టాడు. ఇకపోతే వివాహానంతరం కాజల్ అగ్వరాల్కు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అలాగే ఇటీవల కాజల్ అగర్వాల్ నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–3 చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అలాగే నటుడు విష్ణు మంచు ప్రధానపాత్రను పోషించి, నిర్మించిన భారీ మైథిలాజికల్ కథా చిత్రం కన్నప్పలో పార్వతీదేవిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. కాగా ఇప్పుడు ఈమెకు కొత్త అవకాశాలేమీ లేవు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తూ బిజీగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ అగర్వాల్ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె మళ్లీ ఫ్రైమ్ టైమ్లోకి రావడానికి స్వీయ దర్శకత్వంలో కథానాయకిగా నటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని హిందీలో కమర్శియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను ఎంజాయ్ చేస్తూ, ఇతర వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయకుండా రిస్క్తో కూడిన దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్లతారు? అని కొందరు స్నేహితులు కాజల్కు హితవు పలుకుతున్నట్లు సమాచారం. మరి వారి సూచనలను ఈ బ్యూటీ పాటిస్తారా? లేక దర్శకురాలవ్వాలనే తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? అన్న వేచి చూడాలి.

హైదరాబాద్ టు ముస్సోరీ
ముస్సోరీలో ల్యాండ్ అయ్యారు చిరంజీవి. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. వీటీవీ గణేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో వెంకటేశ్, కేథరిన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటరై్టన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్లో జరిగింది. మలి షెడ్యూల్ ముస్సోరీలో ప్రారంభమైందని, పది రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందని బుధవారం మేకర్స్ అధికారికంగా తెలిపి, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, వీటీవీ గణేశ్ పాల్గొనగా కొన్ని కీలక, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించడానికి ΄్లాన్ చేశారు. ‘‘1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ కామెడీ టైమింగ్ను ఈ సినిమాలో మళ్లీ ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలని ఆయన అన్నారు. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. అలాగే ఇప్పుడు తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనని స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో తమ్ముడు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు టిక్కెట్ల పెంపు అంశంపై కామెంట్స్ చేశారు.ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అని.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించామని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు అన్నారు. ఆయన సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని కోరారు.కాగా.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

‘ఫిఫా’ ప్రపంచకప్కు బ్రెజిల్ క్వాలిఫై
సావో పాలో: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్నకు బ్రెజిల్, ఈక్వెడార్, ఆ్రస్టేలియా జట్లు అర్హత సాధించాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో భాగంగా బ్రెజిల్ జట్టు మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్లో 1–0 గోల్ తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. తద్వారా ‘ఫిఫా’ వరల్డ్కప్ బెర్తు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ 2022 ప్రపంచకప్లో క్వార్టర్ఫైనల్లో ఓడింది. మరోవైపు పెరూతో జరిగిన మ్యాచ్ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ఈక్వెడార్ ముందంజ వేసింది. ఇప్పటికే వరల్డ్కప్నకు అర్హత సాధించిన డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, కొలంబియాతో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2026లో మూడు దేశాలు ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్లో 48 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో అర్జెంటీనా 35 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా... ఈక్వెడార్, బ్రెజిల్ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ అమెరికా నుంచి వరల్డ్కప్నకు ఆరు జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. బొలీవియాతో మ్యాచ్లో 0–2తో పరాజయం పాలైన చిలీ జట్టు... వరుసగా మూడోసారి విశ్వ సమరానికి దూరమైంది. మరోవైపు ఆ్రస్టేలియా వరుసగా ఆరో సారి ఫిఫా ప్రపంచకప్ బెర్తు దక్కించుకుంది. 2–1 గోల్స్ తేడాతో సౌదీ అరేబియాపై గెలవడం ద్వారా ఆసీస్ ముందంజ వేసింది.

దేశం కన్నా...లీగ్లే మిన్న?
భారీ షాట్లకు పెట్టింది పేరైన కరీబియన్ వీరుడు నికోలస్ పూరన్ ముప్పై ఏళ్లు రాకముందే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 33 ఏళ్లకే మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్లు మ్యాక్స్వెల్, స్టొయినిస్ వన్డే క్రికెట్కు దూరమయ్యారు. ఈ నలుగురిలో మ్యాక్స్వెల్ తప్ప మిగిలిన ముగ్గురికి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు. మరికొంత కాలంగా ధాటిగా ఆడగల సత్తా ఉన్నవాళ్లే అయినా... ఇలా అంతర్జాతీయ క్రికెట్కు అర్ధాంతరంగా వీడ్కోలు పలకడం వెనక అసలు మతలబు మాత్రం లీగ్ క్రికెట్కు పెద్దపీట వేసేందుకే అనేది జగమెరిగిన సత్యం!వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో వివాదాల కారణంగా కరీబియన్ ఆటగాళ్లు మొదటి నుంచి విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. జాతీయ జట్టు తరఫున అయితే ఆటతో పాటు బాధ్యత కూడా మోయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా దక్కే మొత్తం కూడా చాలా తక్కువ. మన దేశంలో రంజీ మ్యాచ్ ఆడే ఆటగాడికి దక్కే ఫీజు సైతం అందుకోని అంతర్జాతీయ క్రికెటర్లు బయట ఎందరో ఉన్నారు. దీంతో వారంతా ఫ్రాంచైజీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు నెలల పాటు కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లినట్లు వెళ్లి ఓ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడమో... లేక బ్యాటింగ్లో కొన్ని మెరుపులు మెరిపించడంతోనో పని కానిస్తున్నారు! – సాక్షి క్రీడావిభాగంఅంతర్జాతీయ క్రికెట్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఒక ఆటగాడు తన జీవిత కాలాన్ని వెచ్చించాల్సిందే. అహర్నిశలు కృషి చేస్తే తప్ప ఆ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. కఠోర శ్రమకు కాలం కూడా కలిసొస్తేనే ఫలితాలు సానుకూలంగా వస్తాయి. అలాంటిది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్న తర్వాత ఆటగాళ్లు ఆ విధులకు దూరంగా ఉండటానికి కారణాలు లేకపోలేదు. వెస్టిండీస్ బోర్డు విషయానికి వస్తే... వార్షిక కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజులు, ఆటగాళ్లకు సౌకర్యాలు, బకాయిలు ఇలా సవాలక్ష కారణాలతో ఆ దేశంలోని నాణ్యమైన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడేందుకు విముఖత చూపుతున్నారు. క్రిస్ గేల్ నుంచి మొదలుకొని కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డారెన్ స్యామీ, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, హెట్మైర్, నికోలస్ పూరన్ ఇలా వెస్టిండీస్ స్టార్ ఆటగాళ్లంతా లీగ్లతోనే విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఏమూల లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో ప్రముఖంగా కనిపించే ప్లేయర్లు కరీబియన్లే అనడంలో సందేహం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రమాదకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరన్ 2016లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడాడు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో వెస్టిండీస్ తరఫున 61 వన్డేలాడిన అతడు 1983 పరుగులు చేశాడు. 106 టి20 మ్యాచ్ల్లో 2275 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడగల సామర్థ్యం... ఎలాంటి స్థితిలో అయినా భారీ షాట్లు కొట్టగల నైపుణ్యం అతడికి మంచి ‘ఫినిషర్’అనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే కెరీర్ ఆరంభం నుంచి కేవలం వన్డే, టి20లపైనే దృష్టి పెట్టిన పూరన్... సుదీర్ఘ ఫార్మాట్ జోలికి పోలేదు. 2023లో చివరి వన్డే మ్యాచ్ ఆడిన అతడు... గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్పై ఆఖరి టి20 మ్యాచ్ ఆడాడు. విండీస్ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించిన పూరన్... 29 ఏళ్లకే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం వెనక ఫ్రాంచైజీ క్రికెట్లో చేసుకున్న ఒప్పందాలు కీలకపాత్ర పోషించాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పూరన్... వివిధ లీగ్ల్లో ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ చార్జర్స్, ట్రిన్బాగో నైట్రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, డెక్కన్ గ్లాడియేటర్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, ఖుల్నా టైటాన్స్, ముల్తాన్ సుల్తాన్స్ ఇలా లెక్కకు మిక్కిలి ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు గతేడాది పొట్టి ఫార్మాట్లో 170 సిక్స్లు బాది నయా రికార్డు సృష్టించిన పూరన్... ఐపీఎల్ 18వ సీజన్లో 40 సిక్స్లు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. క్లాసెన్ ఇదే దారిలో...ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లతో రికార్డులు తిరగరాయడంలో కీలకపాత్ర పోషించిన దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ కూడా ఇటీవల మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 33 ఏళ్ల క్లాసెన్ దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టి20లు ఆడాడు. వన్డేల్లో 2141 పరుగులు చేసిన క్లాసెన్... పొట్టి ఫార్మాట్లో 1000 పరుగులు చేశాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల తెగువ... భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్ల లయ దెబ్బతీయగల నేర్పు అతడి సొంతం. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడంతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్పై మరింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లాసెన్ ప్రకటించినా... దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో డిమాండ్ ఉన్నప్పుడే మరింత డబ్బు చేసుకోవాలనే అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడనేది సుస్పష్టం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ధాటిగా ఆడగల మేటి బ్యాటర్ అయిన క్లాసెన్కు విశ్వవ్యాప్తంగా లీగ్ల్లో మంచి గిరాకీ ఉంది. వీళ్లు కూడా... గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... తాజాగా టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు కేవలం వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కుర్రాళ్లకు అవకాశం కల్పించేందుకే అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన ఈ జోడీ... ఐపీఎల్లో మాత్రం అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన కోహ్లి... బెంగళూరు తొలిసారి చాంపియన్గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.ఇక ‘హిట్మ్యాన్’రోహిత్ ఇచ్చిన ఆరంభాలతోనే ముంబై జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరగలిగింది. ఈ ఇద్దరూ మరి కొన్నేళ్లు ఐపీఎల్లో కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది. మార్టిన్ గప్టిల్, దిముత్ కరుణరత్నే, తమీమ్ ఇక్బాల్, మహ్ముదుల్లా ఇలా వివిధ దేశాలకు చెందిన పలువురు ప్లేయర్లు ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పినా... వారు లీగ్ల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు.వన్డేలకు మ్యాక్సీ ‘టాటా’...ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఈ మధ్యే వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని టి20లపై ఎక్కువ దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్సీ ప్రకటించినా... దీని వెనుక కూడా లీగ్ల హస్తం ఉంది. ఐపీఎల్లో ఒకదశలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడైన ఈ ఆసీస్ ఆల్రౌండర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో కాస్త వెనుకబడి... పెట్టిన ధరకు న్యాయం చేయలేకపోయిన సందర్భాలే అధికం. ఆసీస్ తరఫున 7 టెస్టుల్లో 339, 149 వన్డేల్లో 3990, 116 టి20ల్లో 2664 పరుగులు చేసిన 36 ఏళ్ల మ్యాక్స్వెల్... ఇకపై కేవలం పొట్టి ఫార్మాట్లో మాత్రమే ఆడనున్నాడు. ఆస్ట్రేలియా పేస్ ఆల్రౌండర్ స్టొయినిస్ కూడా ఈ ఏడాదే వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 18వ సీజన్లో తన మెరుపులతో అభిమానులను అలరించిన స్టొయినిస్... జాతీయ జట్టు తరఫున 71 వన్డేల్లో 1495, 74 టి20ల్లో 1245 పరుగులు చేశాడు. వన్డేల్లో 48, టి20ల్లో 45 వికెట్లు సైతం పడగొట్టాడు. అయితే జాతీయ విధుల కన్నా... లీగ్ క్రికెట్ ద్వారానే ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఈ ఆటగాళ్లంతా ఫ్రాంచైజీ క్రికెట్పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.‘కివీ’ల రూటే సపరేటు!ఇది ఇలా ఉంటే... న్యూజిలాండ్ ఆటగాళ్ల తీరు మరో రకం. జాతీయ జట్టు తరఫున వార్షిక కాంట్రాక్టు తీసుకోవడానికి ఇష్టపడని పలువురు క్రికెటర్లు... ఫ్రాంచైజీలతో జతకట్టేందుకు ‘సై’అంటున్నారు. సెంట్రల్ కాంట్రాక్టు తీసుకుంటే... జాతీయ జట్టుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సి రావడంతో... స్టార్ క్రికెటర్లు సైతం దీనికి దూరమయ్యారు. ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, లూకీ ఫెర్గూసన్ ఉన్నారు. వీరంతా వేర్వేరు దేశాల్లో జరిగే లీగ్ల్లో పాల్గొనేందుకు జాతీయ జట్టుకు దూరమయ్యారు. గతంలో ఐపీఎల్లో కీలకపాత్ర పోషించిన విలియమ్సన్ను ఈసారి వేలంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో అతడు పాకిస్తాన్ క్రికెట్ లీగ్లో ఆడగా... కాన్వే చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు.

మొదటి రోజు పేసర్ల హవా
సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే అసలు సిసలు సమరం రసవత్తరంగా ప్రారంభమైంది. లార్డ్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో పేసర్ల జోరు సాగుతోంది. పచ్చిక పిచ్పై పేసర్ రబాడ విజృంభించినా... ఆసీస్ బ్యాటర్లు కాస్త సంయమనం చూపడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత కంగారూ పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా టాపార్డర్ తడబడింది. రెండో రోజు తొలి సెషన్లో కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ను సఫారీ జట్టు ఎదుర్కోవడంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. లండన్: బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల సహకారం తోడవడంతో... ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను ఆ్రస్టేలియా మెరుగ్గా ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తమ పదునైన పేస్తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పెద్దగా మెరిపించలేకపోయింది. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ తెంబా బవుమా (3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్హామ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2... హాజల్వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. బౌలర్ల హవా సాగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలగా... అందులో సింహభాగం (12 వికెట్లు) పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి. రబాడ పేస్ దాడి.. ఐసీసీ టెస్టు గదను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 20 బంతులాడినా ఖాతా తెరవలేకపోయిన ఉస్మాన్ ఖ్వాజా (0)ను రబాడ పెవిలియన్ బాట పట్టించాడు. అదే ఓవర్లో కామెరూన్ గ్రీన్ (4) కూడా అవుటయ్యాడు. మార్క్రమ్ స్లిప్స్లో చక్కటి క్యాచ్తో గ్రీన్ను సాగనంపగా... క్రీజులో నిలిచేందుకు మొండిగా ప్రయత్నించిన లబుషేన్ (56 బంతుల్లో 17)ను యాన్సెన్ బుట్టలో వేసుకున్నాడు. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో మంచి రికార్డు ఉన్న ట్రావిస్ హెడ్ (11) కీపర్ వెరీన్ పట్టిన ఒంటి చేతి క్యాచ్తో పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆసీస్ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్ తన అనుభవాన్ని చూపించాడు. పేసర్లను కాచుకుంటూ... చెత్త బంతుల్లో పరుగులు రాబట్టాడు. దీంతో ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మార్క్రమ్ బౌలింగ్లో అనవసర షాట్కు అతడు అవుట్ కాగా... కేశవ్ మహరాజ్ బంతిని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అలెక్స్ కేరీ (23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో ధాటిగా ఆడిన వెబ్స్టర్ను కూడా రబాడ వెనక్కి పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్ వేగంగా ముగిసింది. 20 పరుగులకే జట్టు తమ చివరి 5 వికెట్లు కోల్పోయింది. బెంబేలెత్తించిన పేస్ త్రయం... దక్షిణాఫ్రికా పేసర్లు విజృంభించిన పిచ్పై ఆసీస్ పేస్ త్రయం మరింత రెచ్చిపోతుందని ఊహించినట్లే జరిగింది. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్... సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. స్టార్క్ తొలి ఓవర్ చివరి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న మార్క్రమ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా... కాసేపటికి రికెల్టన్ (16) కూడా అతడిని అనుసరించాడు. ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్లు వదిలేసి అవకాశం ఇచ్చినా... దక్షిణాఫ్రికా బ్యాటర్లు వాటిని వినియోగించుకోలేకపోయారు. క్రీజులో అడుగు పెట్టిన తొలి బంతికే సింగిల్ తీసిన ముల్డర్ (44 బంతుల్లో 6) మరో పరుగు చేసేందుకు 39 బంతుల వరకు ఎదురు చూశాడంటే... కంగారూల బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా 31వ బంతికి ఖాతా తెరవగా... స్టబ్స్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 4 దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కగిసో రబాడ నాలుగో స్థానానికి (332 వికెట్లు) చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో అతను అలెన్ డొనాల్డ్ (330)ను అధిగమించగా...టాప్–3లో వరుసగా డేల్ స్టెయిన్ (439, షాన్ పొలాక్ (421), మఖయా ఎన్తిని (390) ఉన్నారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 0; లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 17; గ్రీన్ (సి) మార్క్రమ్ (బి) రబాడ 4; స్మిత్ (సి) యాన్సెన్ (బి) మార్క్రమ్ 66; హెడ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 11; వెబ్స్టర్ (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 72; కేరీ (బి) కేశవ్ 23; కమిన్స్ (బి) రబాడ 1; స్టార్క్ (బి) రబాడ 1; లయన్ (బి) యాన్సెన్ 0; హాజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (56.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–12, 2–16, 3–46, 4–67, 5–146, 6–192, 7–199, 8–210, 9–211, 10–212. బౌలింగ్: రబాడ 15.4–5–51–5; యాన్సెన్ 14–5–49–3; ఇన్గిడి 8–0–45–0; ముల్డర్ 11–3–36–0; కేశవ్ మహరాజ్ 6–0–19–1; మార్క్రమ్ 2–0–5–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి)కమిన్స్ 6; బవుమా (నాటౌట్) 3; స్టబ్స్ (బి) హాజల్వుడ్ 2; బెడింగ్హామ్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 8; మొత్తం (22 ఓవర్లలో 4 వికెట్లకు) 43. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30. బౌలింగ్: స్టార్క్ 7–3–10–2; హాజల్వుడ్ 7–3–10–1; కమిన్స్ 7–3–14–1; లయన్ 1–0–1–0.

భారత్కు మరో పరాజయం
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్ల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు... మూడో మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో కూడా ఓడింది. యూరప్ అంచె పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. గత రెండు మ్యాచ్ల్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో విఫలమైన భారత్... ఈసారి పేలవ డిఫెన్స్తో మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (12వ, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అభిõÙక్ (42వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. అర్జెంటీనా తరఫున మాటియాస్ రే (3వ నిమిషంలో), లూకాస్ మార్టినేజ్ (17వ నిమిషంలో), శాంటియాగో టరాజొనా (34వ నిమిషంలో), లూకాస్ మెండెజ్ (46వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత డిఫెండర్ల తప్పిదంతో ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే కెప్టెన్ మాటియాస్ రే అర్జెంటీనా ఖాతా తెరిచాడు. హర్మన్ప్రీత్ గోల్తో టీమిండియా స్కోరు సమం చేసినా... మన రక్షణ పంక్తి పదే పదే తప్పిదాలకు పాల్పడటంతో అర్జెంటీనా దూకుడు పెంచగలిగింది. ఆఖర్లో పెనాల్టీ కార్నర్ రూపంలో స్కోరు సమం చేసే అవకాశం వచి్చనా... మనవాళ్లు దాన్ని గోల్గా మలచలేకపోయారు. గురువారం మరోసారి అర్జెంటీనాతో భారత్ తలపడనుంది. భారత్కు రెండో విజయంఆంట్వర్ప్ (బెల్జియం): యూరోప్ పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య బెల్జియంపై విజయం సాధించిన భారత అమ్మాయిలు... బుధవారం రెండో మ్యాచ్లో 2–1 గోల్స్ తేడాతో మరో సారి బెల్జియంపై గెలుపొందారు. భారత్ తరఫున లాల్థాట్లుయాంగి (35వ నిమిషంలో), గీతా యాదవ్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. బెల్జియం తరఫున్ వాన్ హెల్మోంట్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. ఈ పర్యటనలో గురువారం భారత్ జట్టు చివరి మ్యాచ్ ఆడనుంది.
బిజినెస్

825 బిలియన్ డాలర్ల ఎగుమతులు
బెర్న్: ప్రపంచ వాణిజ్యం భౌగోళిక రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.. అయినా భారత్ 2025–26లో 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను (రూ.70.12 లక్షల కోట్లు) సాధిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ పోరు, రెడ్సీ సంక్షోభాలను ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన సందర్భాల్లో భారత్ విజేతగా నిలిచినట్టు గుర్తు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ 2024–25లో భారత్ 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసినట్టు చెప్పారు. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం క్షీణతను చవిచూడనుందని మంత్రి చెప్పారు. భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) మాత్రం 2025–26లో ఎగుమతులు 21 శాతం పెరిగి ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు పెరిగిపోయిన తరుణంలో కొనుగోలుదారులు తమ సోర్సింగ్ (ముడి సరుకుల సమీకరణ)ను వైవిధ్యం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండడం వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హన్ తెలిపారు. ఎఫ్ఐఈవో అంచనా మేరకు 2025–26లో వస్తు ఎగుమతులు 12 శాతం పెరిగి 525–535 బిలియన్ డాలర్లుగా ఉండనున్నాయి. 2024–25లో వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల గుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 387 బిలియన్ డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇవి 20 శాతం పెరిగి 465–475 బిలియన్ డాలర్లకు చేరుకోచ్చన్నది ఎఫ్ఐఈవో అంచనా. ఎఫ్టీఏలతో సానుకూలత యూఏఈ, ఆ్రస్టేలియా, ఐరోపా ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు) ఎగుమతుల వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో అంచనా వేస్తోంది. ఇందులో ఈఎఫ్టీఏతో ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాంగ్రెస్ పాలనలో కుదిరిన ఎఫ్టీఏలు దేశీ సంస్థలకు నష్టం చేసినట్టు వాణిజ్య మంత్రి గోయల్ అన్నారు. పోటీ దేశాలైన ఆసియా దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, అవి కూడా సమతుల్యంగా లేనట్టు చెప్పారు. ఆయా దేశాలకు భారత్ మార్కెట్ అవకాశాలు కలి్పంచగా, బదులుగా మనకు మంచి అవకాశాలు దక్కలేదన్నారు. మోదీ సర్కారు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలైన ఆ్రస్టేలియా, యూకే, ఈఎఫ్టీఏ, ఈయూ, యూఏఈ, ఒమన్ తదితర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు.

ఎలక్ట్రిసిటీ ఎఫ్అండ్వోకు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఇకపై నెలవారీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. విద్యుత్ ధరల హెచ్చుతగ్గులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు హెడ్జింగ్ టూల్స్గా వీటిని మార్కెట్ వర్గాలు వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా విద్యుత్ రంగంలో తగిన ధరల సంకేతాలతోపాటు.. పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలు కలగనున్నట్లు తెలియజేసింది. విద్యుదుత్పత్తితోపాటు.. ప్రసారం, పంపిణీ, రిటైల్ తదితర విభాగాలలో పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు వివరించింది. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ఎకోసిస్టమ్ మరింత విస్తరించేందుకు తాజా అనుమతి సహకరించగలదని, ఇందుకు ఇది తొలి అడుగు అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. నియంత్రణ సంస్థల అనుమతులకు అనుగుణంగా త్రైమాసిక, వార్షిక తదితర దీర్ఘకాలిక కాంట్రాక్టులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించినట్లు గత వారం ఎంసీఎక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త యూపీఐ విధానం ఇన్వెస్టర్ల పరిరక్షణ లక్ష్యంగా సెబీ కొత్త యూపీఐ మార్గదర్శకాలను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే అన్ని రిజిస్టర్డ్ ఇంటరీ్మడియరీలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. సెక్యూరిటీల మార్కెట్లో ఆర్థిక లావాదేవీలకు వీలు, వీటి భద్రత లక్ష్యంగా తాజా యూపీఐ మెకనిజంకు తెరతీసినట్లు సెబీ తెలియజేసింది. వెరసి 2025 అక్టోబర్ 1నుంచి యూపీఐ చెల్లింపుల మెకనిజం అమల్లోకి రానున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. ఇటీవల కాలంలో అన్రిజిస్టర్డ్ సంస్థలు ఇన్వెస్టర్లను మోసగించడం ఎక్కువైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు చేపట్టింది. ధృవీకరించిన, భద్రతతోకూడిన చెల్లింపుల చానల్కు తెరతీయడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ కల్పించనున్నట్లు పాండే వివరించారు.

గోల్డ్ ఈటీఎఫ్లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మే నెలలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు రూ.292 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను వెనక్కి తీసుకోగా, మార్చిలోనూ రూ.77 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోవడం గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో తిరిగి ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. మే చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.62,453 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ చివరికి ఇది రూ.61,422 కోట్లుగా ఉంది. ‘‘మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడాన్ని సూచిస్తోంది. బంగారం ధరలు గరిష్టాల్లో స్థిరంగా ఉండడం, అంతర్జాతీయంగా అనిశి్చతులు కొనసాగుతుండడంతో హెడ్జింగ్కు బంగారం మంచి సాధనంగా కనిపిస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మే నెలలో బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించి ఉంటారని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న అవగాహన తమ పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా కలిగి ఉండాలని ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నాని, దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లు పెరిగినట్టు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ తెలిపారు. ‘‘బంగారం అన్నది వినూత్నమైన సాధనం. ఇది డాలర్ డినామినేషన్లో ఉంటుంది. ఈక్విటీలతో సంబంధం లేనిది. ఈక్విటీలకు ప్రతికూల సంబంధం కలిగి ఉంటుంది. కనుక పోర్ట్ఫోలియో హెడ్జింగ్కు ఇదొక చక్కని సాధనం’’అని జోసెఫ్ చెప్పారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.1,980 కోట్లుగా ఉండడం గమనార్హం.అంటే మే నెలలో కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సి ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు గత కొన్నేళ్లలో స్థిరమైన ర్యాలీ చేయడం గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసిందని చెప్పుకోవాలి. ఇక మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల పరిధిలో ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.24 లక్షలు పెరిగాయి. దీంతో మే చివరికి మొత్తం ఫోలియోలు 73.69 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అయ్యే డిజిటల్ బంగారం సాధనం. భౌతిక బంగారం ధరలను ఇవి ప్రతిఫలిస్తుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది.

క్విక్ రెస్టారెంట్లకు ధరల సెగ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం దెబ్బతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) మార్జిన్లపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ మందగించడంతో ముడి సరుకుల ఖర్చులు పెరిగినప్పటికీ క్యూఎస్ఆర్ కంపెనీలు రేట్లను పెంచాలంటే వెనుకాడుతున్నాయి. స్టోర్ల విస్తరణ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, అదే సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. బీఎన్పీ పారిబా రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిస్కౌంట్లను నిర్దిష్ట కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నప్పటికీ సగటు రోజువారీ అమ్మకాలు తగ్గడంతో క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. స్టోర్లను ఎడాపెడా వేగంగా విస్తరించడం, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం తదితర అంశాల వల్ల స్థూల మార్జిన్లపై ప్రభావం పడుతోందని వివరించింది. ఇక, ఫుడ్ డెలివరీ సంస్థల విషయానికొస్తే స్విగ్గీ, జొమాటోలాంటి అగ్రిగేటర్ల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. భారీ స్థాయిలో ఎదిగిన ఈ రెండు సంస్థలు.. క్యూఎస్ఆర్ చెయిన్ల కన్నా చిన్నవైన రెస్టారెంట్లను కస్టమర్లకు మరింత చేరువ చేశాయి. దీంతో లిస్టెడ్ క్యూఎస్ఆర్ కంపెనీలకు మార్కెట్లో పోటీ పెరిగింది. ఇది సరిపోదన్నట్లు ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లు తమ సొంత డార్క్ కిచెన్ బ్రాండ్లను (బిస్ట్రో, స్నాక్ మొదలైనవి) ప్రారంభించి, ప్రత్యేక యాప్ల ద్వారా 10–15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఈ పరిణామాలతో గత నాలుగేళ్లుగా చూస్తే ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు పెరుగుతుండగా, క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని నివేదిక వివరించింది. సామర్థ్యాలు పెంచుకోవాలి.. జూబిలెంట్ ఫుడ్స్లాంటి క్యూఎస్ఆర్ కంపెనీలు ముడి సరుకుల ధరలపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, డిమాండ్ బలహీనంగా ఉండటంతో ధరలను పెంచేందుకు ఇష్టపడటం లేదు. నివేదిక ప్రకారం.. ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్యూఎస్ఆర్ చెయిన్ల అమ్మకాలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. లిస్టెడ్ క్యూఎస్ఆర్ చెయిన్ల మొత్తం అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరగ్గా, 2025 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితమయ్యాయి. అదే ఫుడ్ డెలివరీ సంస్థల స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) 2024 ఆర్థిక సంవత్సరంలో 19 శాతంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 18 శాతంగా నమోదైంది. దేశీ క్యూఎస్ఆర్ మార్కెట్లో పోటీపడాలంటే ప్రస్తుత సంస్థలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవాలంటే వినూత్నమైన విధంగా వేగం, మెనూ, డెలివరీ సామరŠాధ్యలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆదాయ పన్ను రేట్ల సవరణలు, ఇతరత్రా సానుకూల పరిణామాలతో డిమాండ్ మళ్లీ పుంజుకోగలదని క్యూఎస్ఆర్ సంస్థలు ఆశిస్తున్నాయి.
ఫ్యామిలీ

Eruvaka pournami సేద్యం ఓ యజ్ఞం
వేదాన్నిజీవన విధానంగా మార్చుకున్నారు భారతీయులు. పూజలు, హోమాది క్రతువుల్లో మాత్రమే కాదు, వేద ప్రతిపాదిత వృత్తులనే ఉపాధి మార్గాలుగా ఎంచుకున్నారు. వ్యవసాయం కూడా వేదం సూచించినదే! వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ... తొలకరి జల్లులతో నేలతల్లి పులకరించే క్షణాలివి. రుతుపవనాలు బలపడి, వర్షాలు మొద లవుతాయి. దుక్కి దున్ని పొలం పనులను మొదలుపెట్టడానికి ఇది అనువైన సమయం. అంతేకాదు! అందరూ ఒకే సారి పనులు మొదలుపెడితే వ్యవసాయం కూడా క్రమపద్ధతిలోఉంటుంది. అందుకోసమే జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వ్యవ సాయ పనులను మొదలుపెట్టాలని సూచించి ఉంటారు మన పెద్దలు. ఒక రకంగా ఇది వ్యవసాయానికి ఉగాది లాంటిది. పురాణాల్లోనూ వ్యవ సాయదారులకు సంబంధించిన అనేక విషయాలు చర్చించడం గమనించవచ్చు. అగ్ని, వాయు పురాణాల్లో సాగుకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. తొలిసారిగా నాగలిని భూక్షేత్రంలో గుచ్చడానికి ముందు ధరణిపూజ చేయాలని ఋగ్వేదం ఘోషిస్తున్నది. ఆ భూమిపూజ కూడా జ్యేష్ఠపౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే జ్యేష్ఠ పూర్ణిమను ‘ఏరువాక పున్నమి’ పర్వదినంగా కర్షకులు జరుపుకొంటారు. అధర్వ వేదం ఏరువాకను ‘అనడుత్సవం’గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రా లతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు వంటి మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. ఏరువాక పూర్ణిమను ‘సీతాయజ్ఞం’అనే పేరుతో కూడా జరుపుకొంటారు.హిందూ మత విశ్వాసాల ప్రకారం, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజనుచేస్తారు. ఈ సమయంలో తమ పొలాల్లో నాగలితో దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. తెలుగు పండుగల్లో సాహిత్య ఆధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఇది. శ్రీకృష్ణ దేవరాయలకాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నల ప్రస్తావన వచ్చింది. పరాశరుడు రాసిన ‘కృషి పరాశరం’ ప్రామాణిక వ్యవసాయ గ్రంథంగా పేర్కొంటారు. వ్యవసాయ ప్రారంభానికి ముందు నేలను పూజించి, ఆనేల తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండుగైన ఈ ఏరువాకపున్నమిని ఆనందంగా జరుపుకొందాం.– వాడవల్లి శ్రీధర్ (నేడు ఏరువాక పున్నమి)

పిల్లలకు సోషల్ మీడియా పరిమితులు : ఫోన్పై స్మార్ట్చెక్
పద్నాలుగేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా యాప్ల వాడకంపై, పరిమితులు విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆన్లైన్ భద్రతా చట్టాల విషయంలో వివిధ దేశాలు కచ్చితమైన విధానాలనూ అమలు పరుస్తున్నాయి. కానీ, సోషల్ మీడియా మంచి చెడులు పిల్లల విషయంలో ఎప్పుడూ ప్రశ్నార్థకమే. పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, తల్లితండ్రులే తప్పనిసరి జాగ్రత్తలు తీసు కోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు సోషల్ మీడియాలో గడపగల సమయాన్ని పరిమితం చేయడానికి, కఠినమైన ఆన్లైన్ భద్రతాచ ర్యలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయనే వార్తలు కొంత ఊరటనిస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా యాప్ల వాడకంపై రోజుకు రెండు గంటల పరిమితి విధించి, ఇరవై రెండు గంటలపాటు బంద్ విధించాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు నివేదికలూ సూచిస్తున్నాయి.స్మార్ట్ వ్యసనంపై టాక్ షోబీబీసీ నిర్వహించిన సండే విత్ లారా కుయెన్స్బర్గ్ నిర్వహించిన టాక్షోలో పాల్గొన్న యూకే టెక్నాలజీ కార్యదర్శి పీటర్ కైల్ను ‘సోషల్ మీడియా పిల్లల సమయ పరిమితుల గురించి అడిగినప్పుడు, కైల్ స్పందిస్తూ ‘కొన్ని యాప్లు పిల్లలను స్మార్ట్ఫోన్కు అంటిపెట్టుకుని, ఫోన్ వ్యసన పరులయేలా చేస్తున్నాయి. వాటి బారి నుంచి పిల్లలను రక్షించడానికి ఆన్లైన్ భద్రత చట్టాల అమలుకు కృషి జరుగుతోంది’ అన్నారు. ఆన్లైన్లో హానికరమైన కంటెంట్ను చూసి, తన 14 ఏళ్ల కూతురు మోలీ ఆత్మహత్య చేసుకుందని, ఆన్ లైన్ భద్రతా చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, సరైన నియంత్రణ లేకపోవడం, సాంకేతికత దుర్వినియోగం వల్ల ఎక్కువమంది యువత ప్రాణాలు కోల్పోవడాన్ని, ఆరోగ్యాలు దెబ్బ తినడాన్ని చూశాం‘ అని ఇయాన్ రస్సెల్ అనే వ్యక్తి వేదనతో తెలిపారు. దీనికి కైల్ స్పందిస్తూ– ‘పిల్లలు ఆన్లైన్లో ఎదుర్కొంటున్న హాని సునామీని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని చూసి దేశంలోని తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ స్మార్ట్ ఫోన్లకు ప్లాస్టర్లను అతికించలేం. పరిమితులను విధించడం వల్ల మేలు జరగదు. ఆరోగ్యకరమైన ఆన్లైన్ జీవితం ఎలా ఉంటుందో పిల్లలు అర్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలి’ అంటూ అనిత ఈ షోలో తెలిపారు. ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్మనం పరిమితులను ఎంచుకోవచ్చుయాప్స్కి, డిజిటల్ పరికరాలను నియంత్రించేందుకు ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. టిక్టాక్ 2023లో 18 ఏళ్లలోపు వారికి డిఫాల్ట్గా 60 నిమిషాల స్క్రీన్ సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. ఇన్స్టాగ్రామ్ అన్ని వయసుల వినియోగదారులను వారి స్వంత పరిమితిని సెట్ చేసుకోమంటుంది. ఎంత సమయం బ్లాక్ చేయవచ్చో కూడా ఎంచుకోవచ్చు. 2021లో, చైనా ఆన్లైన్ గేమింగ్పై కఠినమైన ఆంక్షలు విధించింది. వారాంతాల్లో, సెలవు దినాల్లో మాత్రమే 18 ఏళ్లలోపు గేమర్స్ను రోజుకు ఒక గంటకు పరిమితం చేసింది. సెలవు దినాల్లో మూడు గంటలకు పెంచింది. యువతపై గేమింగ్ ప్రభావం గురించి తన ఆందోళనలను ఉదహరించి, మరీ ఈ నిబంధనలను విధించింది కేంద్రం. కానీ గత సంవత్సరం డ్రాఫ్ట్ అప్డేట్ ప్రభుత్వ వెబ్సైట్ నుండి అదృశ్యమైంది. ప్రభుత్వాలు అమలు చేయాలనే కఠిన నిబంధనలకన్నా ముందు కౌమారదశలో ఉన్న పిల్లలకు డిజిటల్ సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించడం ముఖ్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చదవండి: 230 -110 కిలోలకు అద్నాన్ సామి :‘ఆపరేషన్కాదు,వాక్యూమ్ క్లీనర్’ తల్లిదండ్రులూ ఇవి అమల్లో పెట్టండిటెక్నాలజీని బ్లాక్ చేయవద్దు. పిల్లలకు సురక్షితంగా సాంకేతికతను ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. పిల్లలకు ఇష్టమైన యాప్లు, సైట్లు గురించి ఆసక్తి చూపుతూనే, వారు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకుంటూ ఉండాలి..పేరెంట్స్ స్మార్ట్ఫోన్ వాడకంలో పరిమితులు నిర్దేశించాలి. ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్ వాడేలా జాగ్రత్తపడాలి.కుటుంబ మీడియా ఒప్పందం అంటే.. ప్రయాణం, భోజనం, పడక సమయాలు వంటి ప్రదేశాలను టెక్నాలజీ ఫ్రీ జోన్లుగా మార్చాలి. ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారం గురించి ఏమాత్రమూ వెల్లడించకూడదు అనే విషయాన్ని బోధించాలి. ఆన్లైన్ లో సమాచారాన్ని ఫిల్టర్ చేయడం, నిజం – అబద్ధం మధ్య తేడా తెలుసుకోవడంలో సహాయపడాలి. ఆరుబయట పచ్చదనం, స్క్రీన్ టైమ్ మధ్య సమతుల్యతను పాటించాలి. వారి శారీరక అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి.14 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా యాప్స్ సైన్ అప్ చేయడంలో సహాయం చేయవద్దు.సోషల్మీడియాలో నమ్మదగిన వనరులను అన్వేషించి, వాటిని అందుబాటులో ఉంచాలి. పిల్లలకు ఇంటర్నెట్ సేఫ్టీచాలా సైట్లు, వెబ్ టూల్స్ 13 ఏళ్ల పై వయసున్న యూజర్ల కోసం ఉంటాయి. ఇవి ఆన్లైన్ కాపీరైట్తో భద్రపరిచి ఉంటాయిఆన్లైన్లో చేస్తున్న వర్క్ గురించి తల్లిదండ్రులకు పిల్లలు చెప్పాలి. తాము చూస్తున్న సైట్లో తప్పుగా ఏమైనా అనిపించినప్పుడు, ఉపయోగించడంలో మెళకువలు తెలియనప్పుడూ టెక్నాలజీ తెలిసిన పెద్దవారిని అడగాలి.ఆన్లైన్లో స్నేహితులను తల్లిదండ్రుల అనుమతి లేకుండా యాడ్ చేయవద్దు. అవతలి వారు చెప్పిన ప్రతిదాన్నీ నమ్మవద్దువ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్గా ఉంచాలి. పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ΄ాస్వర్డ్లు, ప్లానింగ్లు, పుట్టినరోజు.. వంటివి షేర్ చేయవద్దు. ఏది బడితే అది పోస్ట్ చేయకూడదు. అది ఒక్కోసారి భవిష్యత్తుకు ప్రమాదంగా మారవచ్చు.మీరు లేదా మీకు తెలిసినవారు బుల్లీయింగ్కు గురైనట్లయితే వెంటనే ఆ విషయాన్ని పెద్దవాళ్లకు తెలియజేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్,ఎండ్ నౌ ఫౌండేషన్

ముహూర్తానికి డెలివరీ లేట్ చేశారు, పాపకిక కష్టాలేనా? కేసు వేస్తా..!
ఇటీవలే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాకు పాప పుట్టింది. మా ఆవిడ గర్భవతి అయినప్పటినుంచి ఒకే డాక్టరు వద్ద చూపిస్తున్నాము. మా పంతులుగారిని అడిగి కాన్పుకు ముహూర్తం పెట్టుకున్నాము. హాస్పిటల్ వారికి చెప్పగా అలా చేయాలి అంటే ‘ముహూర్తం చార్జెస్’గా 10 వేల రూపాయలు ఎక్కువ కట్టాలి అని చెప్పారు. సరేలే అని అది కూడా కట్టాను. కానీ, డాక్టరు మరొక ఎమర్జన్సీ సర్జరీ ఆలస్యం అవటం వలన మా డెలివరీ ఆలస్యం చేశారు. మరొక ముహూర్తం కోసం ఆ రోజు సర్జరీ కూడా ఆపటం కుదరదు అని చెప్పారు. అందువల్ల మాపాప దుర్ముహూర్తాన పుట్టింది. దుర్ముహూర్తంలో పుట్టటం వలన పాపకి జీవితాంతం కష్టాలే ఉండ వచ్చు. అయితే పరిహారాలు చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది అని అంటున్నారు. వీటంతటికీ కారణం అయిన హాస్పిటల్ మీద, డాక్టరు మీద చర్యలు ఎలా తీసుకోవాలో సలహా ఇవ్వగలరు.- విక్కాంత్, సికింద్రాబాదుబాగుందండి. చాలా బాగుంది. కేసు వేయటానికి కూడా ముహూర్తం పెట్టుకుంటారా? జడ్జిగారిని కూడా మీరు పెట్టుకున్న ముహూర్తానికే జడ్జిమెంట్ ఇమ్మని కూడా చెబుదామా? ఒకవేళ కేసు ఓడిపోతే ముహూర్త వైఫల్యం అంటారా లేక నా సలహా వైఫల్యం అంటారా? లేక ఏకంగా జడ్జీ గారికి గ్రహణం పట్టింది అంటారా? సెంటిమెంట్లు మీ వ్యక్తిగతం. మీ నమ్మకాన్ని మీరు పాటించవచ్చు, కాపాడుకోవచ్చు. అయితే అది చట్టానికి, న్యాయానికి, వ్యక్తిగత స్వేచ్ఛకి వ్యతిరేకంగా ఉండకూడదు! అదేవిధంగా ప్రకృతి విరుద్ధంగా కూడా ఉండకూడదు. ఎవరు ఎప్పుడు జన్మించాలి అనేది దేవునిపై నమ్మకం ఉన్నవారు దైవనిర్ణయంగా భావిస్తే మంచిది. ఆధునిక వైద్యవిధానం - సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మీ నమ్మకాన్ని జోడించి కాన్పు సమయాన్ని నిర్ణయించుకున్నారు. కానీ అదే సమయంలో ఇంకొక మనిషికి సహాయపడుతున్న డాక్టర్ గారిని శిక్షించాలి అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్మీకు ఇచ్చే జవాబు ద్వారా కార్పొరేట్ ఆసుపత్రి వారికి అలాగే ప్రభుత్వాలకి కూడా ఒక సూచన చేయాలి అనుకుంటున్నాను. రాజ్యాంగంలోని 51ఎ(జి) ఒకసారి చదవండి. ప్రభుత్వాలు శాస్త్రీయతను, మానవ విలువలను, తర్కాన్ని పెంపొందించాలి తప్ప మూఢనమ్మకాలను కాదు. వ్యక్తిగత నమ్మకాల కోసం మరొకరి జీవితాలను, హక్కులను కూడా లెక్కచేయను అనే ధోరణిని అరికట్టవలసిన అవసరం ఉంది. అధిక డబ్బు వసూలు చేసి మరీ ఇలాంటి ముహూర్తాలు పెట్టి కాన్పులు చేసే ప్రైవేటు ఆసుపత్రుల దోరణిని నియంత్రించాలి. చదవండి: పిల్లలకు సోషల్ మీడియా పరిమితులు : ఫోన్పై స్మార్ట్చెక్ఇక మీరు అడిగిన విషయానికి వస్తే... మీ కేసులో ముహూర్తానికి 10,000 వసూలు చేసిన ఆసుపత్రి పై దావా వేసినా, కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించినా మీరు కట్టిన డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. మీరు కేసు వేసి హాస్పిటల్ వారిపై ఫైన్ కూడా విధించాలి అని కోరండి. మీ కేసులో డబ్బులు తిరిగి వచ్చినప్పటికీ, మరొకసారి ఇలాంటి మతిలేని పనులు చేయడం మానేస్తారు హాస్పిటల్ వారు! మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్, 1954, పరిధిలోకి ఇలాంటి హాస్పిటళ్లను తీసుకురావాలి.– శ్రీకాంత్ చింతల,హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.

ఇవి కూడా క్లాస్ పుస్తకాలే!
తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోపఠన విధానంపై తాజాగా జి.ఓ తెచ్చింది. దీని ప్రకారం ప్రతి వారం స్కూల్ బుక్స్తో పాటు సాహిత్యం, జి.కె, కళ, క్రీడా పుస్తకాలు చదవాలి. ఇప్పటికే అక్కడ ‘పఠన ఉద్యమం’ పేరుతో ప్రతి క్లాస్లో లైబ్రరీ పెట్టి ఎంచిన 120 పుస్తకాలు ఉంచారు. ఈ సంవత్సరం టాపిక్ వైజ్ చదువు పెట్టి దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బడులలో పిల్లలకు లైబ్రరీలు, పఠన విధానంపై ఇలాంటి అడుగు పడాల్సి ఉంది.స్కూల్లో లైబ్రరీ ఉండటం బ్లాక్బోర్డ్ ఉండటం అంత సహజం. కాని స్కూళ్లలో లైబ్రరీల నిర్వహణ చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. లైబ్రరీ గదులు ఉండవు. ఉన్నా ర్యాక్స్ ఉండవు. ఉన్నా వాటిలో పుస్తకాలుండవు. ఉన్నా విద్యార్థులకు పనికి వచ్చేవి ఉండవు. శాస్త్రీయమైన విధానంతో పిల్లలు చదవడానికి అవసరమైన పుస్తకాలు ప్రతి స్కూల్లోని ప్రతిక్లాసులో విధిగా ఉండాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖలు కృషి చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పని అంతంతమాత్రంగానే సాగుతుండగా తమిళనాట ఉధృతంగా జరుగుతోంది.బడులు తెరిచిన వేళ తమిళనాడు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం 1 నుంచి 8 తరగతుల వారికి పఠన విధానం అకడమిక్ పుస్తకాలు, నాన్ అకడమిక్ పుస్తకాలుగా సాగాలని నిర్ణయించారు. అంటే చదువుకు సంబ«ందించినవి, లోకజ్ఞానాన్ని, సృజనను ఇచ్చే సాహిత్య సంబంధమైనవి సమానంగా చదవాలన్నమాట. ఇందుకుగాను వారానికి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్కు సంబంధించిన పుస్తకాలు క్లాస్రూముల్లో విద్యార్థులు చదవడానికి ఉంచుతారు.ఉదాహరణకు: ఈ వారం మహనీయులు అనే టాపిక్ ఇస్తే చరిత్రలో, స్వాతంత్య్ర పోరాటంలో, తమిళ సంస్కృతిలో గొప్ప గొప్ప పనులు చేసిన వారి గాథలు ఉన్న పుస్తకాలు క్లాసుల్లో ఉంచుతారు. పిల్లల కోసం ప్రతివారం ఎంచదగ్గ టాపిక్కులుగా కథలు, జంతుజాలం, పర్యావరణం, క్రీడలు, సైన్సు తదితరాలను నిర్ణయించారు. క్లాసు పుస్తకాలు చదువుతూనే పై టాపిక్కుల్లోని ఒకోదానిని ఒకోవారం చదవాలన్నమాట. ఇవి కాకుండా కథలు చెప్పడం, కథలు పెద్దగా చదవడం, ఉపన్యాసం, గ్రూప్ డిస్కషన్ వంటి వాటికి సబ్జెక్ట్లతో సమానంగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.క్లాసులోనే లైబ్రరీ2024లో తమిళ ప్రభుత్వం ‘వాసిప్పు ఇయక్కం’ (పఠన ఉద్యమం) పేరుతో పాఠశాల విద్యార్థులు నాన్ అకడెమిక్ పుస్తకాల్లో క్లాసుల్లో చదివేందుకు ప్రతి క్లాసులో లైబ్రరీలు ఏర్పాటుకు నడుం బిగించింది. 1 నుంచి 8 తరగతుల్లో వివిధ కేటగిరీల్లో ప్రత్యేకంగా ఎంచిన 250 పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సంకల్పం. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని బడుల్లో ప్రతి క్లాసులో 120 పుస్తకాలు ఉంచారు. ఇవి మొత్తం కోటీ ముప్పైలక్షల పుస్తకాలు అయ్యాయి. వీటిని వివిధ దశలుగా విభజించారు. అవి:1. దోగాడు: ఈ కేటగిరిలో బొమ్మలు ఎక్కువ ఉండి ఒకటి రెండు వాక్యాల వచనం ఉంటుంది.2. నడు: ఈ కేటగిరిలో బొమ్మలతో పాటు ఒక పారాగ్రాఫ్ అంత టెక్ట్స్ మాత్రమే ఉంటుంది. దోగాడులో, నడులో ఏ పుస్తకమైనా 33 పేజీలకు మించదు. ఎందుకంటే చిన్నపిల్లలకు సౌకర్యంగా ఉండాలి కాబట్టి.3. పరుగు: ఈ దశలో వచనం ఎక్కువగా ఉన్న పుస్తకాలు ఉంటాయి.4. ఎగురు: ఈ దశలు అన్ని రకాల పెద్ద సైజు పుస్తకాలు ఉంటాయి.కథలు రాయించారుఒకవైపు పుస్తకాలు చదివిస్తూనే విద్యార్థుల చేత కథలు రాయించడం కూడా చేస్తున్నారు. రాసిన కథలను విద్యాశాఖకు పంపితే వాటిలో మంచివాటిని ఎంపిక చేసి పుస్తకాలుగా వేస్తామన్నారు. ఈ ప్రతి పాదనకు కూడా వేల మంది విద్యార్థులు స్పందిస్తున్నారు. అలాగే టీచర్లు కూడా రాస్తున్నారు.కావలసిన మార్పుఒకప్పుడు ప్రభుత్వ బడులలో పి.టి. పిరియడ్ అనీ, క్రాఫ్ట్స్ పిరియడ్ అనీ, ఎన్.సి.సి అనీ, రెడ్క్రాస్ అనీ.. ఇలా అనేక పిరియడ్స్ ఉండేవి. కాలక్రమంలో సబ్జెక్ట్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు. అయితే దీనివల్ల విద్యార్థుల్లో వికాసం, సృజన, ఆలోచనా శక్తి, వివేచన పెరగడం లేదని గ్రహించిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పుస్తకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేరళలో, కర్నాటకలో ఈ పని సమర్థంగా జరుగుతుండగా తమిళనాడులో కూడా ఊపందుకుంది.పుస్తకమే స్నేహితుడుపిల్లలు చదువును ప్రేమిస్తారు. నిజమే. కాని చదువును మాత్రమే నేర్పిస్తూ ఉంటే బోర్ ఫీలవుతారు. వారికి కథలు కావాలి. బొమ్మలు కావాలి. అనేకానేక కబుర్లు కావాలి. ఊహను ఇచ్చే ఊసులు కావాలి. వాటిని వినడానికి, చదవడానికి ఇష్టపడి సంగతులను ఆకళింపు చేసుకునే శక్తిని పెంచుకుంటారు. తమిళనాడులోలాగా ప్రతి ప్రభుత్వ బడిలోని ప్రతి క్లాసులో లైబ్రరీని ఏర్పాటు చేసే ఆలోచన తెలుగు రాష్ట్రాల్లో అమలు కావాలని కోరుకుందాం.
ఫొటోలు
అంతర్జాతీయం

OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్తో కవర్ చేశారని సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్ మస్క్.. యూటర్న్ ఇలా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్ట్ల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్’లో రాశారు. I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.— Elon Musk (@elonmusk) June 11, 2025ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్కు ఆగ్రహం కలిగించింది. ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’

కెన్యాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
దోహా: ఖతార్లో నివసిస్తున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది.విహారయాత్రలో భాగంగా 28 మంది ప్రవాసభారతీయుల బృందం ఖతార్ నుంచి కెన్యాకు వెళ్లింది. కెన్యాలోని నయాందారూ కౌంటీలో ఒల్ జొరోరోక్–నకూరూ రోడ్డులో వీళ్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. విషయం తెల్సుకున్న నైరోబీలోని భారత హైకమిషన్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు.మృతదేహాల తరలింపు, క్షతగాత్రులకు సహాయక కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నమయ్యారని దోహాలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. రోడ్డుపై అదుపు తప్పిన పర్యాటకుల బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని ది గల్ప్ టైమ్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. చనిపోయిన ఆరుగురి వివరాలు ఇలా ఉన్నాయి. మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారుగా గుర్తించారు.మావెలిక్కరకు చెందిన గీతా షోజి ఐజాక్ (58), జస్నా కుట్టిక్కట్టుచలిల్ (29), రూహి మెహ్రీ ముహమ్మద్ (18 నెలలు), ఒట్టప్పలంకు చెందిన రియా ఆన్ (41), టైరా రోడ్రిగ్స్ (8)లు గుర్తించారు. రియా భర్త జోయెల్ మరియు ఆమె పెద్ద కుమారుడు రవిస్ (14) గాయాలతో న్యాండరువాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ప్రమాదంలో గాయపడిన ప్రవాసభారతీయులను దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ⚠️ A tragic road accident occurred in central Kenya, where a bus carrying tourists rolled over, resulting in six fatalities and 27 injuries.Location — The accident took place at Gichaka, along the Ol Jororok-Nakuru road in Nyandarua County.Cause — The exact cause of the bus… pic.twitter.com/QsNRk7o5cq— Sir Adam ™ (@AdamMaina_) June 10, 2025

శుభాన్షు అంతరిక్ష ప్రయాణం మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం బుధవారం ఐదవసారి కూడా వాయిదా పడింది. ఫాల్కన్ 9 రాకెట్ రిపేర్ కారణంగా ఈ వాయిదా అనివార్యమయ్యింది. స్పేస్ ఎక్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో తెలియజేసింది.పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ తనిఖీల సమయంలో గుర్తించిన ఎల్ఓ ఎక్స్ లీక్ను రిపేర్ చేసేందుకు స్పేస్ఎక్స్ బృందాలకు అదనపు సమయం అవసరం కానుంది. వీరు ఫాల్కన్ 9 యాక్స్-4 ప్రయోగం నుండి తిరిగి @Space_Station కు బయలుదేరుతున్నారు. మరమ్మత్తు పూర్తయిన తర్వాత తదుపరి ప్రయోగ తేదీని తెలియజేస్తామని స్పేస్ఎక్స్ పేర్కొంది. Standing down from tomorrow’s Falcon 9 launch of Ax-4 to the @Space_Station to allow additional time for SpaceX teams to repair the LOx leak identified during post static fire booster inspections. Once complete – and pending Range availability – we will share a new launch date pic.twitter.com/FwRc8k2Bc0— SpaceX (@SpaceX) June 11, 2025భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ఐదోసారి వాయిదా పడింది. ఈ వాయిదాకు ముందు కూడా ప్రయోగ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం లేని కారణంగా వాయిదా పడిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. భారతదేశ అంతరిక్ష లక్ష్యాలకు ఒక మైలురాయిగా ఈ మిషన్ నిలుస్తుంది. యాక్సియమ్ స్పేస్, నాసా, స్పేస్ఎక్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ల సహకారంలో ఈ ప్రయోగం జరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు.. ప్రియుడి ‘ప్లాన్’తో భర్తను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
జాతీయం

Lalu: అట్లుంటది మరి లాలూతోని!
పాట్నా: తాను చేసే ఏ పనిలోనైనా వైవిధ్యం వెతుక్కునే వ్యక్తి ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనకు తగ్గట్లే ఆయన అభిమాన గణం ఉంటుంది కూడా!. ఇవాళ 78వ పుట్టిరోజు. కార్యకర్తల కోలాహలం.. లాలూ యాదవ్ జిందాబాద్ నినాదాల నడుమ తన నివాసంలో 78 కేజీల లడ్డూను తల్వార్తో కోశారాయన.లాలూ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్జేడీ చీఫ్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తమది రాజకీయేతర సంబంధం కూడా అని పేర్కొన్నారు. Video | RJD chief Lalu Prasad Yadav celebrates 78th birthday at his residence in Patna by cutting a 78-kg laddu cake with a sword. Large number of party workers gathered to extend wishes. pic.twitter.com/1ZIhrQuv9g— NDTV (@ndtv) June 11, 2025VIDEO Source: NDTVమరోవైపు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వైవిధ్యంగా శుభాకాంక్షలు తెలియజేశారు. లాలూ చిత్రాన్ని కౌగిలించుకుని ‘‘రాత్రి చిమ్మచీకట్లు అలుముకున్నాయంటే.. కాసేపట్లో తెల్లవారబోతోందని అర్థం’’ అంటూ ఓ సందేశం ఉంచారు. “अंधेरा जितना गहरा होगा, सुबह उतनी ही नजदीक होगी।” #TejPratapYadav #Bihar #India pic.twitter.com/gAdlvZFtlb— Tej Pratap Yadav (@TejYadav14) June 9, 2025తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ ఓ యువతితో ఉన్న ఓ పోస్ట్ చేసి పెను దుమారం రేపారు. పార్టీ ఆయనపై క్రమశిక్షణా చర్యల కింద ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. అయితే తన అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ ఆయన ఇచ్చుకున్న వివరణలను లాలూ పరిగణనలోకి తీసుకోలేదు.

హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’
న్యూఢిల్లీ: మేఘాలయలో అదృశ్యమైన కొత్త జంట ఉదంతం లెక్కలేన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ చెబుతున్న విషయాలు పోలీసులను సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి. సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యను ముందుగానే ప్లాన్ చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోనమ్ తన భర్తను ఈశాన్య రాష్ట్రానికి తీసుకువెళ్లి అంతమొందించాలని ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు.కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలంటూ..సోనమ్ ముందుగా కామాఖ్య ఆలయాన్ని సందర్శించేందుకు వెళదామని రాజా రఘువంశీని ఒప్పించిదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. రాజాను తొలుత గౌహతికి, తరువాత మేఘాలయకు తీకువెళ్లాలని సోనమ్ ప్లాన్ చేసింది. వివాహం తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత మే 15న సోనమ్ తన పుట్టింటికి వచ్చింది. అక్కడ తన ప్రియుడు రాజ్కు పోన్ చేసి, ‘ప్రణాళిక’ను సిద్ధం చేసిందని పోలీసులు తెలిపారు. ఇండోర్లో మేఘాలయ పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా విచారించినప్పుడు ఈ ఉదంతంలో సోనమ్ ప్రమేయం ఏ మేరకు ఉందనేది వెల్లడయ్యింది.‘అందరినీ ఉరి తీయాలి’నిందితులు విశాల్, ఆనంద్, ఆకాష్లు రాజా రఘువంశీని చంపడంలో విఫలమైతే, తానే ఫోటో తీయాలనే నెపంతో, భర్తను కొండ అంచునకు తీసుకెళ్లి, అక్కడి నుంచి అతనిని తోసేస్తానని సోనమ్ తన ప్రియునితో చెప్పినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమయ్యింది. ఒకవేళ నేరం బయటపడితే సోనమ్, రాజాలు నేపాల్కు పారిపోయేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా రాజా రఘువంశీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుని హత్యలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ ఉరితీయాలన్నారు. వారిలో సోనమ్ కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలోని వారు కూడా ఉన్నారన్నారు. సోనమ్ కుటుంబాన్ని సమాజం నుంచి బహిష్కరించాలని కూడా ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా..

‘హనీమూన్’ కేసు: సోనమ్ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్ల ‘హనీమూన్ కథ’ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది. జూన్ 2న మేఘాలయలోని ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమయ్యాక ఈ కథలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ తమ కుటుంబ వ్యాపార కార్యాలయంలో పనిచేసే రాజ్ కుశ్వాహాతో ఎప్పటి నుంచో ప్రేమలో ఉందని పోలీసుల విచారణలో తేలింది. రాజారఘువంశీ హత్యకు రాజ్ కుశ్వాహాతో పాటు అతని స్నేహితులు ఆకాష్, ఆనంద్, వికాస్లు సోనమ్కు సహకరించారని, ఇందుకు ప్రతిగా సోనమ్ వారికి రూ. 20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. తాజాగా రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు నిర్దోషి అని, సోనమ్ను ‘దీదీ’ (అక్క) అని సంబోధించేవాడని, ఇంటిలో ఆఫీసుకు సంబంధించిన విషయాలు అంతగా మాట్లాడేవాడు కాదని తెలిపింది. సోనమ్ ప్రతీరోజూ ఉదయం అన్నయ్యకు ఫోన్ చేసేదని, ఆఫీసులో చేయాల్సిన పనుల గురించి చెప్పేదని సుహానీ తెలిపింది. తన అన్నయ్య సోనమ్ ఆఫీసులో రెండేళ్లు పనిచేశాడని చెప్పింది. మే 23న మేఘాలయలో రాజా రఘువంశీ హత్యకు గురైనప్పుడు తన సోదరుడు ఇండోర్లోనే ఉన్నాడని ఆమె పేర్కొంది. మే 11న జరిగిన సోనమ్ వివాహానికి తమ కుటుంబం నుండి ఎవరూ హాజరు కాలేదని సుహాని తెలిపింది. సోనమ్ వివాహ నిశ్చితార్థం తరువాత కూడా తన సోదరునిలో ఎటువంటి మార్పు చూడలేదని, అన్నయ్య ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ హత్యలో సోనమ్ దీదీ ప్రమేయం గురించి తనకు తెలియదని సుహానీ తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు
ఎన్ఆర్ఐ

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్

న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం లో “న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ “ ఆధ్వర్యం లో జై తెలంగాణ నినాదాలతో “తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక”లను ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.అసోసియేషన్ అధ్యక్షులు “కోడూరి చంద్రశేఖర్” అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “Dr.మోహన్ కుమార్ సేథి” ముఖ్య అతిధి గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారుఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించడం జరిగిందిప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమం లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు “పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మేకల ప్రసన్న కుమార్ తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి,సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం,జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల,విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ,కిరణ్మయి పద్మ,విశ్వనాథ్ అవిటి,సందీప్ నాగుల,పవనకుమార్ చారుకొండ,సలీం మహమ్మద్,హరీష్ గోపాల్,మనోహర్ కన్నం,కిరణ్ కుమార్ కొమ్ముల,రమేష్ రెడ్డి రామిండ్ల,శ్రీరామ్ విజయ్,శ్రీనివాస్ గాజుల,ప్రమోద్ ఇరుగు,అనిల్ మెరుగు,రమేష్ ఆడెపు,రవి కుమార్ వట్టం,విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరుల తో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.

అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అబుదాబి :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అబు ధాబిలోని ఇండియా ఎంబసీ వేదికగా ఎంతో వైభవంగా నిర్వహించబడింది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ - అబుధాబి ఆధ్వర్యంలో జయప్రదంగా సాగిన ఈ వేడుక తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వేడుకకు ప్రేం చంద్, కాన్సులర్(కౌన్సిలర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గౌరవ అతిథులుగా కుమారి ఆయుషి సుతారియా, సెకండ్ సెక్రటరీ (పాలిటికల్) పాల్గొన్నారు. వీరి సమక్షంలో దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది.తెలంగాణ పిల్లలు భారత మరియు యుఏఈ జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి దేశభక్తిని ప్రతిబింబించారు. అనంతరం తెలంగాణ బాలికలు మరియు మహిళలు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వేడుకకు కొత్త అందాన్ని తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో, ధరావత్ రాజ్కుమార్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం పేరిణి శివ తాండవం, గుస్సాడి నృత్యం, పోతరాజు, మరియు ఇతర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కళారూపాలు, వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సంపదను మధురంగా ప్రతిబింబించాయి.ప్రత్యేకంగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు - పావని, అర్చనా, లక్ష్మి తమ కృషితో తెలంగాణ కళా సంపదను ప్రతిబింబించే చిత్ర ప్రదర్శన వేడుకలకు మరింత ఆకర్షణ గా నిలిచింది. ఎంబసీ ప్రాంగణం తెలంగాణను తలపించేలా అలంకరించబడింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇంతే కాదు, డప్పు కళాకారుల దరువు వేడుక లో మరింత ఉత్తేజం నింపింది. డప్పు కళాకారులు, పోతరాజు కళాకారులు, గుస్సాడీ కళాకారులు మరియు పేరిణి శివ తాండవం కళాకారులు కలిసి చేసిన జుగల్ బంది ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఎంబసీ అధికారులను ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సంబరాలలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల సంఘాల నాయకులను మరియు ఇతర సాంఘిక సేవ సంఘం నాయకులను శాలువా కప్పి మరియు మొమెంటో ప్రధానం చేసి సత్కరించారు. అలాగే కార్యక్రమం లో పాల్గొన్న కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సన్మానించారు.. ఈ వేడుక అబూదాబి లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవలసిన జ్ఞాపకంగా మారింది అని అసోసియేషన్ కార్య నిర్వాహకుడు రాజా శ్రీనివాస రావు తెలియ జేశారు.వేడుకల తదనంతరం కార్యక్రమానికి వచ్చిన అతిదులందరికి, కార్య క్రమ నిర్వాహకులు తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, మరియు భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంతో ఈ వేడుక మరింత వైభవంగా జరిగింది. వేదికను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంబసీ అధికారులకు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను సింగపూర్ ఈస్ట్ కోస్ట్ పార్క్ (ECP)లో మే 31, 2025న ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో సుమారు 200 ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయఆటలను భావి తరాలకు అందించాలని TCSS సభ్యులు.. సంచి దుంకుడు, కచ్చకాయలు, ఇతర వినోద భరిత ఆటలు అంత్యాక్షరి, స్పూన్ మార్బుల్, డం చరాడ్స్ , తంబోలా మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేశారుద. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ మాట్లాడుతూ ఎలాంటి హంగు ఆర్భాటాలు, లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమాలు ఆదర్శప్రాయం, అభినందనీయం అన్నారు.టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ ఫామిలీ డే - 2025 ఇంతలా విజయవంతమయ్యేలా సహకరించి వారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి రమేష్ గడప, రాము బొందుగుల మరియు వెంకటరమణ నంగునూరి, కల్వ లక్ష్మణ్ రాజు మొదలగు వారు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.(చదవండి: అమెరికా అంతటా గులాబీ మయం..!)
క్రైమ్

హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..
ఖిలా వరంగల్: చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రియురాలితో కలిసి జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్.. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సై శ్రీకాంత్, సురేష్లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సవితా రాణి, ఒక కుమార్తె శ్రీనిధి, కుమారుడు గుర్రపు జయంత్ ఉన్నారు. జయంత్ హనుమకొండలోని ఓ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి జల్సాలు చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూస్తున్న అతను రామకృష్ణ.. తన తమ్ముడి (జయంత్కు బాబాయి) మనుమరాలు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్కు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. కానీ, జయంత్ ఇక్కడే ఉన్నాడు. అదేరోజు రాత్రి రామకృష్ణ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండగా.. అందులోని ఆరున్నర తులాల పెద్ద హారం, ఐదున్నర తులాల చిన్నహారం, రెండు తులాల రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్, మొత్తం 16 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా బేగం ఆదేశాలతో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ కేసును చాలెంజ్గా తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఫోర్ట్రోడ్డు జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..గుర్రపు జయంత్ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.అప్పులు తీర్చి.. మిగతా డబ్బులతో జల్సా..జయంత్ బీబీఏ ఫైనలియర్ చదువుతూనే హైదరాబాద్లో ‘స్టార్ట్స్ ఓన్ వీల్స్’ పేరుతో ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కలిసిరాక అప్పులపాలయ్యాడు. జయంత్కు కాలేజీలో ఓ గర్్లఫ్రెండ్ ఉంది. చేసిన అప్పులు తీరాలన్నా.. గర్్లఫ్రెండ్తో జల్సాలు చేయాలన్నా డబ్బు కావాలనుకున్న జయంత్.. తన కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్కు వెళ్లగానే ఇంట్లోని బంగారం ఆభరణాలు దొంగిలించాడు. ఆభరణాల్లో కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడినుంచి 5.645 తులాల బంగారు హారం, 5.471 తులాల కరిగించిన బంగారం.. మొత్తం 11.116 తులాల బంగారం, బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వా«ధీనం పర్చుకున్నారు. 24గంటల్లో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డ్ రఫీలను ఏసీపీ నందిరామ్నాయక్ అభినందించారు.

అత్త సెల్ఫోన్ అమ్మేసి, ఆపై..
మేడ్చల్−మల్కాజిగిరి జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఘట్కేసర్లో బుజ్జి అనే మహిళ నివాసముంటోంది. బుజ్జికి బాబురావు అనే అల్లుడు ఉన్నాడు. ఈ క్రమంలో అత్త వద్ద ఉన్న మొబైల్ను బాబు రావు తీసుకున్నాడు. డబ్బుల కోసమో మరే ఇతర కారణమో తెలియదు కానీ అత్త మొబైల్ను బాబు రావు అమ్మేశాడు. ఆ తరువాత మొబైల్ ఇవ్వాలని కోరగా.. అమ్మేసినట్లు చెప్పాడు బాబురావు. దీంతో మొబైల్ అమ్మడంపై అల్లుడిని నిలదీసింది అత్త బుజ్జి. మొబైల్ను అమ్మాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై అల్లుడు బాబురావు, అత్త బుజ్జి మధ్య గొడవ తలెత్తింది. ఈ విషయాన్ని బాబురావు సీరియస్గా తీసుకున్నాడు. మొబైల్ ఫోన్ కోసం అవమానించారంటూ కోపంతో రగిలిపోయాడు. క్షణికావేశంలో అత్త బుజ్జి గొంతు నులిమాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బుజ్జు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బుజ్జి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ కోసం అత్తను చంపేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య
తొగుట (సిద్ధిపేట జిల్లా): ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బండారుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరటి పర్శరాములు (42) కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైనట్టు గ్రామంలోని కొందరు నాయకులు తెలపడంతో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అందుతాయన్న ఆశతో తెలిసిన వారి వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకుని బేస్మెంట్ వరకు నిర్మించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత మంజూరైన ఇళ్ల జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందంటూ బాధితుడికి నాయకులు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ రవికాంత్రావు తెలిపారు.