Top Stories
ప్రధాన వార్తలు

‘స్కాంస్టార్ బాబు’.. హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. అనంతరం, ‘స్కాంస్టార్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైఎస్ జగన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్లో జత చేసినట్టు తెలిపారు.In today’s press meet, I addressed key issues impacting our state and people:Facts on Liquor Case – Uncovered a deep web of lies and cooked-up stories with complete factual data.Red Book Files – Exposed vendetta politics and misuse of power to silence opposition.Targeted… pic.twitter.com/b0cXzjvc7w— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025

తిరుమలలో ఘోర అపచారం, ఇంకెన్ని దారుణాలు చూడాలో?
తిరుమల: తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్(Namaz) చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత వరుసగా అపచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.మద్యం సేవించడం, ఎగ్ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.

బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా?
ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వస్తున్నాయి.బంగ్లాదేశ్లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్ తెలిపారు. ఈ విషయంపై యూనస్తో మాట్లాడుతానని వెల్లడించారు. అలాగే.. దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.Will Muhammad Yunus resign as caretaker to the interim government in Bangladesh? This BBC Bangla report quotes National Citizen Party leader Nahid Islam as saying Yunus is thinking of retirement. pic.twitter.com/GIsP3WqiaI— Deep Halder (@deepscribble) May 22, 2025యూనస్ను సవాళ్లు.. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది. ఇక, గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం, జరిగిన చర్చల తర్వాత.. సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్, హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. ‘బ్లడీ కారిడార్’మరోవైపు.. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెలుసుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’ అని పరిశీలకులు అంటున్నారు.వకారుజ్జమాన్ ఏమన్నారు? రఖైన్ కారిడార్ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.

మద్యం ముడుపుల డాన్ బాబే: వైఎస్ జగన్
ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా(ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు.ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో బాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్లిచ్చారు. ‘‘మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే బలమైన కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ నియమ, నిబంధనలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు?’’‘‘చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తాం. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయ్యే రోజు సందర్భంగా సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం’’-మీడియాతో వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి పాల్పడి ఆ కేసులో బెయిల్పై ఉన్న సీఎం చంద్రబాబు ఆ కేసు దర్యాప్తును నీరుగారుస్తూ గత ప్రభుత్వ పారదర్శక మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. 2019–24 మధ్య అసలు మద్యం స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. భేతాళ కథలు సృష్టించి.. జరగని స్కామ్ను జరిగినట్లు చిత్రీకరించి.. ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి లొంగదీసుకున్న వ్యక్తులతో తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని.. వాటి ఆధారంగా సంబంధం లేని వ్యక్తులపై తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి ఒక్క ఫైలైనా సీఎంవోకు వచ్చినట్లుగానీ.. సంతకం చేసినట్లుగానీ చూపించగలరా? అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎవరికైనా లాభాలు వచ్చేలా చేస్తే లంచాలు ఇస్తారేమోగానీ.. పన్నులు బాదేసి, పర్మిట్లు రద్దు చేసి, వారి లాభాలు తగ్గించి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచితే ఎవరైనా లంచాలు ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజమైన మద్యం స్కామ్స్టర్ చంద్రబాబేనని పునరుద్ఘాటించారు. 2014–19 మధ్య చంద్రబాబు మద్యం కుంభకోణానికి పాల్పడి సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారని.. ఆ కేసులో ఆయన బెయిల్పై ఉన్నారని గుర్తు చేశారు. ఆ కేసును నీరుగార్చడానికే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అప్పుడు మద్యం కుంభకోణానికి పాల్పడి దోపిడీ చేసిన తరహాలోనే ఇప్పుడూ దోచేస్తున్నారని.. దాన్ని సమర్థించుకోవడానికే 2019–24 మధ్య జరగని మద్యం స్కామ్ జరిగినట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు పెట్టి.. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) తీర్పు, 2014–15 మధ్య కేబినెట్ ఆమోదం లేకుండా.. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు మూడు చోట్ల సంతకం చేసిన నోట్ ఫైలు.. 2014–19 మధ్య మద్యం అమ్మకాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం లాంటి వాటిని సాక్ష్యాధారాలతో సహా ఎండగడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ దుర్నీతిని కడిగి పారేశారు. చంద్రబాబు మోసాలను నిలదీస్తూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తూ.. రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై గళమెత్తుతూ జూన్ 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా ప్రజలతో కలసి, ప్రజల కోసం సామాజికవేత్తలు, యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. పాలనలో ఘోర వైఫల్యం..ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే నెలకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) రకరకాల పనులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల పూర్తి కావస్తున్నా కూడా చంద్రబాబు ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసంగా మారాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయి ఏడాది దాటింది. రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఇంకా మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించిన 143 హామీల అమలు ఊసే లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ప్రజలకు ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్లిచ్చారు.లిక్కర్ స్కామ్.. ఫ్యాబ్రికేషన్..ఇలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ను బయటకు తెచ్చారు. వ్యవస్థలను నాశనం చేయడంతోపాటు ప్రశ్నించే గొంతులను నొక్కడానికి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా లిక్కర్ స్కామ్ అంటూ రాజకీయ కక్షకు దిగారు. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది? ప్రతి ఒక్కరూ ఆలోచించమని కోరుతున్నా. మీ మనస్సాక్షిని అడగండి. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యం ఎక్కువ అమ్మి, అమ్మకాలు పెంచి, దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక పన్నులు పెరిగి, అమ్మకాలు తగ్గిపోతే డిస్టిలరీలు లంచాలు ఇస్తాయా?రెండు ప్రభుత్వాలు.. మద్యం విక్రయాలుఒకసారి రెండు ప్రభుత్వాల హయాంలో మద్యం అమ్మకాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే.. టీడీపీ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే.. మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ హయాంలో కంటే మద్యం అమ్మకాలు తగ్గాయి. అయినా ఆదాయం ఎందుకు పెరిగిందంటే.. పన్నులు వేశాం. ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడుపోతే మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.2014–19 మధ్య మద్యంలో అవినీతి.. చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నట్లుగానే కొన్ని డిస్టిలరీలకు మాత్రమే మేలు చేసేలా ప్రైవేటు లిక్కర్ షాప్ల నుంచి ఇండెంట్ పెట్టించడం ద్వారా 2014–19 మధ్య కేవలం ఐదు డిస్టిలరీలే రాష్ట్రంలో 69 శాతం మద్యాన్ని సరఫరా చేశాయి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతి ఇచ్చారు. మిగిలిన ఆరు వేర్వేరు ప్రభుత్వాల్లో అనుమతి పొందాయి. అంతేకాదు.. మద్యం సేకరణకు ఆ 20 డిస్టిలరీలను లిస్ట్ చేసింది (ఎంప్యానల్) కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మేం కొత్తగా ఏ డిస్టిలరీనీ చేర్చలేదు. కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. మా విధానం సహేతుకమని సీసీఐ తీర్పు.. చంద్రబాబు అండ్ కో కంపెనీలు మా ప్రభుత్వ మద్యం విధానంపై 2022లో కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేశాయి. ఆ పిటిషన్లో ఉన్న అంశాలన్నీ టీడీపీ వాళ్లు అప్పుడూ, ఇప్పుడూ చేస్తున్న అభియోగాలే. అందుకే అందరూ జాగ్రత్తగా చూడాలని కోరుతున్నా. ఆ అభియోగాలు ఏమిటంటే.. కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టేశారని, సప్లయ్ ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆరోపించారు. సీసీఐ ఆ అభియోగాలన్నింటిపై సుదీర్ఘ విచారణ చేపట్టి సంబంధిత రికార్డులు, సప్లయ్ ఆర్డర్లన్నింటినీ పరిశీలించి 2022 సెప్టెంబర్ 19న చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని, మా ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని, అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పు ఇచ్చింది. సీసీఐ ఇచ్చిన తీర్పులో పేరాగ్రాఫ్ 85, 90, 95, 96, 97, 98, 101లో మొత్తం వివరాలు ఉన్నాయి. సీసీఐ జడ్జిమెంట్ కాపీలు పబ్లిక్ డొమైన్లో ఉంచుతాం. ఏం విలువ ఉంటుంది? చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్ల టర్మ్ ఉండగానే చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు పదవికి రాజీనామా చేశాడు. వైఎస్సార్సీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేదు.. మళ్లీ రాజ్యసభకు తన అభ్యరి్థని పంపించే అవకాశం ఉండదని, కూటమికి మేలు జరుగుతుందని తెలిసి కూడా ప్రలోభాలకు గురై రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్స్కు ఏం విలువ ఉంటుంది? ⇒ మరో నిందితుడిగా చెబుతున్న రాజ్ కేసిరెడ్డికి బెవరేజెస్ కార్యకలాపాలతో ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్న ఆయన ఒక వ్యాపారస్తుడు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అనేక మందిలో ఒకరు. అదీ రెండేళ్లు మాత్రమే. అది కూడా కోవిడ్ సమయంలో. ఇక విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. ఆయనకు ప్రస్తుత టీడీపీ విజయవాడ ఎంపీతో సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే టీడీపీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని, సులభంగా ప్రలోభ పెట్టవచ్చని తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా మారుస్తామన్నారు. అయితే అబద్ధం చెప్పకపోవడం వల్ల నిందితుడిగా చేర్చారని ఆయన స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇలా చేయదల్చుకుంటే ఎవరి మీదనైనా భేతాళ విక్రమార్క కథలు అల్లేసి ఏమైనా చెప్పించవచ్చు. బెవరేజెస్ కార్పొరేషన్, లిక్కర్తో ఎంపీ మిథున్రెడ్డికి ఏం సంబంధం? వాళ్ల నాన్న కనీసం ఈ శాఖ మంత్రి కూడా కాదు. అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి పి.కృష్ణమోహన్రెడ్డికి ఈ కేసుతో ఏం సంబంధం? మద్యానికి సంబంధించి ఒక్క ఫైలు అయినా సీఎంవోకు వచ్చినట్లు, ఒక్క సంతకం అయినా చూపించగలరా? అని సవాల్ విసురుతున్నా చంద్రబాబుకు. ధనుంజయరెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవారు కాదు. మల్టీ నేషనల్ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ.. బాలాజీ గోవిందప్ప మల్టీ నేషనల్ కంపెనీ వికాట్లో హోల్టైమ్ డైరెక్టర్. 12 దేశాల్లో వాళ్లకు కార్యకలాపాలు ఉన్నాయి. ఆయన అసలు ఏపీలోనే ఉండరు. వికాట్ యూరప్ టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. చంద్రబాబు, ఈనాడు రాతలు, మాటలు చూస్తే.. ఆయనేదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కబెట్టేవారని రాసుకొచ్చారు. నా పనులు చక్కబెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు చాలామంది నాకున్నారు. అసలు వికాట్ అనేది నా కంపెనీనే కాదు. రిలయన్స్లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీలు నాకు ఉంటాయి. దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు. దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వాళ్లతో చేయిస్తా. నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నాది కాని కంపెనీలో డైరెక్టర్లు, బిజీగా ఉండేవాళ్లు నాకెందుకు పని చేస్తారు? ఒక మల్టీ నేషనల్ కంపెనీని అప్రతిష్ట పాలు చేస్తూ తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు, కేసులు.. వాస్తవాలు ఇలా ఉంటే అక్రమ కేసులో భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి చంద్రబాబు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న సత్యప్రసాద్ ఒక సాధారణ సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి. సూపరింటెండెంట్లు పదుల సంఖ్యలో ఉంటారు. అనూష ఔట్ సోర్సింగ్లో పని చేసిన క్లరికల్ ఉద్యోగి. వాళ్లను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తోందని హైకోర్టులో మూడు సార్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఆయన్ను బెదిరించి, భయపెట్టి, లొంగదీసుకుని అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాక కేంద్ర సర్వీస్కు వెళ్లిపోవడానికి ఎన్ఓసీ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్స్కు ఏం విలువ ఉంటుంది? అసలు లంచాలు ఎప్పుడిస్తారు..?మద్యాన్ని ప్రభుత్వమే స్వయంగా అమ్మితే లంచాలు ఇస్తారా? షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్లు, బెల్టు షాపులను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? లేకప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ వ్యాపారం అప్పజెప్పి అడ్డగోలుగా రోజంతా అమ్మి లాభాలు గడిస్తే, డిస్టిలరీలకు ఎక్కువ ఆదాయం వస్తే లంచాలు ఇస్తారా? ఆలోచించండి. పేరుకు లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించినా తమకు కావాల్సిన వారికే షాపులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరైనా షాపులు దక్కించుకుంటే నిస్సిగ్గుగా 30 శాతం వాటా తీసుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. రోజంతా యథేచ్ఛగా అమ్ముతున్నారు. చివరకు డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. బెల్టుషాప్ల నిర్వహణకు వేలంపాట పాడుతున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. అలా వస్తున్న ఆదాయాన్ని పంచుకుంటున్నారు. అంతే కాకుండా ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటే ప్రైవేటు షాపుల ప్రైవేటు సైన్యంతో ఆ డిస్టిలరీ ఉత్పత్తులకు ఇండెంట్ వేయిస్తారు. ఆ విధంగా ఆ కంపెనీకి మేలు చేస్తున్నారు. ఇది మా హయాంలో జరిగిందా? ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మారా? మరి లంచాలు ఎవరికి ఇస్తారు? ప్రైవేటు షాపుల చేత, వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీకి ఎక్కువ ఆర్డర్ ఇస్తే లంచాలు ఇస్తారా? లేక మా హయాంలో మాదిరిగా ప్రతి బాటిల్పై క్యూఆర్ కోడ్ పెట్టి దాన్ని అమ్మేటప్పుడు స్కాన్ చేసి ఆటోమేటిక్గా అప్లోడ్ చేసే విధానం అమలు చేశాం. ఆ డిమాండ్ మేరకు ఆయా డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చాం. అలా చేస్తే లంచాలు ఇస్తారా?స్కామ్స్టర్ చంద్రబాబేమద్యంలో అసలు స్కామ్స్టర్ ఎవరంటే చంద్రబాబే. 2014–2019 మధ్య చేసిన లిక్కర్ స్కామ్లో చంద్రబాబు బెయిల్పై లేరా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు చేసిన స్కామ్ మీరే చూడండి.. ⇒ రాష్ట్రంలో 4,380 లిక్కర్షాపుల కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియను రిగ్గింగ్ చేశారు. తన ఎమ్మెల్యేలు, మంత్రులు, బినామీలు, తన మనుషులు రిగ్గింగ్ చేసి షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటిని ఒక సిండికేట్ మాఫియాగా తయారు చేశారు. వీటికి పక్కనే ఇల్లీగల్గా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసి ఏకంగా 43 వేల బెల్ట్షాపులు నడిపారు. ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్ షాపుల సిండికేట్ ఏర్పాటు చేసుకుని తనకు కావాల్సిన డిస్టిలరీలకు మేలు చేసే వి«ధంగా ఆర్డర్స్ చేశారు. తనకు కావాల్సిన కంపెనీలతో ఇండెంట్ ఇప్పించారు. 2015– 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఐదు కంపెనీలకే 69 శాతం ఆర్డర్స్ దక్కాయి. ⇒ కొన్ని బ్రాండ్లకు కృతిమ డిమాండ్లు సృష్టించారు. 2014 నవంబర్లో జీవో 993 ప్రకారం ఏర్పాటైన కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ డిస్టిలరీల కెపాసిటీకి మించి ఉత్పత్తికి చంద్రబాబు ప్రత్యేకంగా సిఫార్సు చేశారు. తరువాత 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి ప్రైవేటు వైన్షాప్లు, బార్లకు లబ్ధి చేకూర్చారు. అందుకోసం 2015 డిసెంబర్ 11న జీవోను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నోట్ఫైల్లో స్వయంగా చంద్రబాబే సంతకం చేశారు. క్యాబినెట్ అనుమతి లేకుండా మూడుసార్లు చంద్రబాబు సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతూ చంద్రబాబు సంతకం చేసిన ఫైల్ను కాగ్ కూడా తప్పుబట్టింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబుపై బలమైన కేసు నమోదైంది. చంద్రబాబు ఆ కేసులో ఇప్పుడు బెయిల్పై ఉన్నారు. దాన్ని కప్పి పుచ్చుకుంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. తన ట్రేడ్ మార్క్ పాలసీ ప్రకారం స్కామ్లు చేస్తూ వైఎస్సార్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూశామా? ఇప్పడు చంద్రబాబు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి? ఈ బ్రాండ్ల ఫొటోలు ఎప్పుడన్నా చూశారా? సుమో.. కేరళా మాల్ట్ ఎప్పుడన్నా చూశారా? షార్ట్ విస్కీ ఎప్పుడన్నా చూశారా? బెంగళూరు విస్కీ.. బెంగళూరు బ్రాందీ.. రాయల్ ల్యాన్సర్ విస్కీ.. ఓల్డ్ క్లబ్.. గుడ్ ఫ్రెండ్స్ అంట.. ఎప్పుడూ చూడని బ్రాండ్లు కాదా ఇవి? ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నారు? ఇవన్నీ ప్రైవేటు మాఫియా చేత.. తన ప్రైవేటు షాపులు.. తనకు కావాల్సిన డిస్టిలరీస్కు మేలు చేసేందుకు.. ఇండెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఊరూ పేరూ లేని బ్రాండ్లు కావాలని ఎవరన్నా అడుగుతారా? ధరలు తగ్గిస్తానని చెప్పి..చంద్రబాబు తానొస్తే ధరలు తగ్గిస్తానన్నాడు.. తగ్గించింది లేదు కానీ షాపులు తన మాఫియా చేతుల్లో పెట్టిన తర్వాత.. ప్రాసెస్ అంతా పూర్తయ్యాక వారికిచ్చే కమీషన్ పెంచాడు. ఇది స్కాం కాదా? ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. విలేకరులు గ్రామాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేయండి. ఇది స్కాం కాదా? రూ.99కే లిక్కర్ ఇస్తానని క్వాలిటీ గతంలో కంటే ఒక లెవల్ తగ్గించి అమ్ముతున్నారు. ఆ చీపెస్ట్ చీప్ లిక్కర్ కూడా పొరుగు రాష్ట్రాల్లో రూ.10 తక్కువ. అన్నీ పబ్లిక్ డొమైన్లో..చంద్రబాబు హయాంలో లిక్కర్లో దోపిడీకి సంబంధించి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం. వైఎస్సార్ సీపీ హ్యాష్ ట్యాగ్.. వైఎస్సార్ సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లో 22 పేజీల డాక్యుమెంట్ పెడతాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. డౌన్ లోడ్ చేసుకోండి. మద్యం అక్రమాలు, రెడ్ బుక్ మీద కూడా ఇంగ్లిష్, తెలుగు వెర్షన్ కాపీలు పెడతాం. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వంచంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది.అధికారులకు వేధింపులుటీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్లు డీజీ ర్యాంకు అధికారి.. పీఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ఐపీఎస్, సీనియర్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ కాంతిరాణా టాటా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి ఐపీఎస్ లు, ఐపీఎస్ అధికారి పి.జాషువా వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్ అధికారి విజయ్పాల్ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, నావ్యక్తి గత ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తాం. మచ్చలేని అధికారులు.. ధనుంజయరెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్. రిటైర్డ్ ఐఏఎస్. పాపం ఆయన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న కుమార్తెకు ఇటీవలే పెండ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప తన కుమార్తె పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును తీసుకొచ్చి జైల్లో పెట్టారు. సునీల్ కుమార్ డీజీ స్థాయి దళిత ఐపీఎస్ అధికారి. ఆయన్ను సస్పెండ్ చేసి హరాస్ చేస్తున్నారు. సంజయ్ అడిషనల్ డీజీ, దళిత ఆఫీసర్. ఆయన్ను సస్పెండ్ చేసి కేసులు పెట్టారు. విజయ్ పాల్ను తప్పుడు కేసులతో అరెస్టు చేశారు. కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ సీనియర్ ఐపీఎస్లు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఐపీఎస్ అధికారి జాషువాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. రఘురామిరెడ్డి ఐజీ, ఐపీఎస్. రిషాంత్ రెడ్డి ఎస్పీ, ఐపీఎస్. వీరికి పోస్టింగులు లేవు. దాదాపు 199 మంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీకి దీన్ని వెల్లడించింది. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అందుకే ఐఏఎస్లే కాదు, ఐపీఎస్లు కూడా మీటింగ్ పెట్టుకోవాలి.నిప్పు రవ్వలు‘‘మా హయాంలో రెండేళ్లు కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చినా రాష్ట్రాన్ని గొప్పగా సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపాం. అదే చంద్రబాబు ఏడాది పాలన.. కాగ్ నివేదిక గమనిస్తే.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్రేట్ కనిపిస్తోంది. ఇదే సమయంలో దేశంలో 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా చంద్రబాబు, ఆయన గజదొంగల ముఠా జేబులోకి వెళ్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పులు చేశారు. చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. 436 గనులను తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు. ఆ అప్పు కోసం చట్ట విరుద్ధంగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పిస్తున్నారు. అది నేరం..’’ పారిశ్రామికవేత్తలకు బెదిరింపులుఇప్పటికే సజ్జన్ జిందాల్ను బెదరగొట్టారు. జత్వానీ గిత్వానీ అని చెప్పి అధికారులను అరెస్టు చేశారు. ఆంధ్ర అంటే నమస్కారం పెట్టి వ్యాపారం చేయొద్దని సజ్జన్ జిందాల్ చెబుతున్నాడు. అరబిందో వాళ్లు ఇప్పటికే చంద్రబాబుకి నమస్కారం పెడుతున్నారు. షిప్, సీజ్ అంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. చివరకు షిప్, బియ్యం పోయాయి. ఇప్పుడు వికాట్ మల్టీ నేషనల్ కంపెనీపై పడ్డారు. వీళ్ల ఎమ్మెల్యేలు, మంత్రుల పుణ్యమా అని కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ నమస్కారం పెడుతోంది. ఇలా పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్నారు.

వారిద్దరి ఆట అద్భుతం.. మరింత మెరుగుపడాలి: పంత్
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్కు చెక్ పెట్టింది. గుజరాత్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు.మ్యాచ్ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మేము మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. టోర్నమెంట్లో మాకు ప్లేఆఫ్స్కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్లో కొన్ని తప్పిదాలు చేశాం. మరికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్ అంశం. ప్లేఆఫ్లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.ఈ మ్యాచ్లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్ఎస్జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ (56 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 5×6), మార్క్రమ్ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్స్కోరర్. ఎల్ఎస్జీ బౌలర్లలో ఒరూర్క్ (3/27), ఆయుష్ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్ల్లో గుజరాత్కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్ (21) ఇన్నింగ్స్ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

ట్రంప్ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్’లో నో అడ్మిషన్
వాషింగ్టన్ డీసీ: ట్రంప్ పరిపాలనా విభాగం విదేశీ విద్యార్థులకు పిడుగుపాటు లాంటి వార్త వినిపించింది. ఇకపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం(Harvard University)లో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విశ్వవిద్యాలయంపై కొనసాగించిన దర్యాప్తు దరిమిలా ట్రంప్ పరిపాలనా విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ పంపారు.క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ఈ వివరాలను తెలియజేస్తూ వర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోగలగడం అనేది హక్కు కాదని, అది ప్రత్యేక అవకాశం అని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి ముందే హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ను తిరిగి పొందే అవకాశాన్ని వర్శిటీ కోరుకుంటే 72 గంటల్లోపు అందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలన విభాగం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుత విద్యార్థులను ఇతర విద్యాసంస్థలకు బదిలీ చేయవలసి వస్తుందని, లేదా వారి చట్టపరమైన హోదాను కోల్పోయేలా చేస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం(Department of Homeland Security తెలిపింది.దీనిపై స్పందించిన విశ్వవిద్యాలయం ఇది ట్రంప్ ప్రతీకార చర్య అని, ఈ నిర్ణయం విశ్వవిద్యాలయానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధమని, 140కిపైగా దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. కాగా గత ఏప్రిల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ను ఒక జోక్గా అభివర్ణించారు. హార్వర్డ్ను ఇకపై మంచి అభ్యాస ప్రదేశంగా కూడా పరిగణించలేమని, దానిని ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల జాబితాలో ఒకటిగా పరిగణించకూడదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకుంది. ఇది అక్కడి మొత్తం విద్యార్థులలో27 శాతం. ప్రస్తుతం భారతదేశానికి చెందిన 788 మంది విద్యార్థులు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. ఇది కూడా చదవండి: జ్యోతి పోలీస్ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు

డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్లో ‘బాయ్కాట్ భైరవం’
‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండిటిని మిక్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ కొంతమంది సినిమా స్టేజ్పై రాజకీయాలు మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. వారి సొంత అభిప్రాయాన్ని స్టేజ్పై వెల్లడించి.. చేజేతులా సినిమాను చంపేసుకుంటున్నారు. తాజాగా బైరవం(Bhairavam Movie) సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కూడా అదే చేశాడు. ఆయన నోటి దురుసు కారణంగా ఇప్పుడు బాయ్కాట్ భైరవం(#BoycottBhairavam) అనే హ్యాష్ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్గా మారింది. ఒకవైపు వైఎస్సార్సీసీ ఫ్యాన్స్..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. అసలేం జరిగింది?ఆ డైలాగ్ అవసరమా?మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కారణాలేంటో తెలీదు గానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యం చిత్రబృందం వరుస ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ని ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించింది. అయితే ఆ స్టేజ్పై దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి.‘ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేశాడు. దీంతో వైఎస్సార్సీసీ శ్రేణులు విజయ్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. భైరవం సినిమాను బహిష్కరించాలంటూ ‘బాయ్కాట్ భైరవం’ అనే హ్యాష్ట్యాగ్ని ట్విటర్లో వైరల్ చేస్తున్నారు. విజయ్ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్పై మండిపడుతున్నారు. దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విజయ్ పెట్టిన ఒక పోస్టే.No apology will make up for these filthy acts. Unanimously #BoycottBhairavam and TFI should call for a ban on this director, #VijayKanakamedala. Anyone who books a ticket for this film isn’t just insulting the stars, they’re disrespecting the entire art of cinema. pic.twitter.com/ynpUYmF9Gd— At Theatres (@attheatres) May 22, 2025కొంపముంచిన ‘ఛా’విజయ్ కనకమేడల ఫేస్బుక్లో 2011లో చిరంజీవి, రామ్ చరణ్లపై ఒక పోస్ట్ పెట్టాడు. హిందీలో అమితాబ్, అభిషేక్ కలిసి నటించిన ‘పా’ సినిమా పోస్టర్ని మార్పింగ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్కి ‘ఛా’ అనే టైటిల్ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడిదే మెగాఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి కారణం అయింది. చిరంజీవి, రామ్ చరణ్లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు.హ్యాక్ అయిందా? అదేలా?సోషల్ మీడియాలో బాయికాట్ భైరవం ట్యాగ్ ట్రెండ్ కావడంలో విజయ్ కనకమేడల దీనిపై రియాక్ట్ అయ్యాడు. ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని, హ్యాక్ అయిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మెగాఫ్యాన్స్ మాత్రం హ్యాకింగ్ అనేది పచ్చి అబద్దం అని, 2011లో నువ్వ ఎవరో కూడా తెలియదు.. నీ అకౌంట్ని ఎలా హ్యాక్ చేస్తారు? ఒకవేళ చేసినా 14 ఏళ్లుగా నీ ఫేస్బుక్ని చెక్ చేసుకోలేదా? అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దర్శకుడి నోటి దురుసు కారణంగా సినిమాకు ఎంతోకొంత నష్టం అయితే జరిగినట్లే.Mr. అతి @DirVijayK మాట పొదుపు గా ఉండాలి , చేతలకి అదుపు ఉండాలి 🤬🤬#BoycottBHAIRAVAM pic.twitter.com/1YFBJmPBQv— Aravind Reddy (@AravindOnAir) May 23, 2025 నమస్కారం అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025#Hacked #Tollywood #director #BoycottBHAIRAVAM #dengey #megadogs #mogga pic.twitter.com/NPM4jtyhQl— 𝔾𝕙𝕠𝕤𝕥ℝ𝕚𝕕𝕖𝕣🐉 (@yashwanthpotter) May 23, 2025

భారత్ టార్గెట్.. పాకిస్తాన్కు అండగా చైనా మరో ప్లాన్
ఇస్లామాబాద్: భారత్కు వ్యతిరేకంగా మరోసారి దాయాది పాకిస్తాన్, డ్రాగన్ చైనా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నాయి. భారత్ దాడులకు కుదేలైన పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ అందించేందుకు చైనా మళ్లీ ముందుకు వచ్చింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్టు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.వివరాల ప్రకారం.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్తాన్కు చుక్కలు కనిపించాయి. పాకిస్తాన్లోని రావల్పిండి, లాహోర్, సియాల్ కోట్తో సహా 11 వైమానిక స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితమైన దాడులు జరిపింది. దీంతో, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు సాయం చేసేందుకు చైనా మరోసారి ముందుకు వచ్చింది. పాకిస్తాన్కి శాటిలైట్ కవరేజ్ పెంచడం, పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇవ్వడం, భారత కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడమే లక్ష్యంగా చైనా ఈ సాయాన్ని అందిస్తోంది. రియల్ టైమ్ కో-ఆర్డినేషన్, నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 5G కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాయి. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్తాన్ తన శాటిలైట్ సేవల్ని పాకిస్తాన్ సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ సాయం అందినప్పటికీ భారత్ దాడులను తప్పించుకోలేకపోయింది. పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే చైనా నిర్మిత జెట్లు, క్షిపణి వ్యవస్థలను భారత స్వదేశీ ఆయుధాలు ఉపయోగించి ధ్వంసం చేసింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాల కదలికల్ని, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ ఏకంగా 10 శాటిలైట్స్ని మోహరించింది. S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా మోహరించింది. దీంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది.

హద్దులన్నీ దాటుతోంది
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ వేసిన పిటిషన్ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తిట్లతో తలంటు డీఎంకే సర్కార్, టాస్మాక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్ సిబల్ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్ 23వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. ‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్ఐఆర్లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్ కోర్టులో వాదించింది. ‘‘2021లో చివరిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్ఎస్ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలో డీఎంకే సర్కార్ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్ఎస్ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి.

భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్లో వేడుకలు
న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు..వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకల నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్ స్వాగత్’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్అతిథులు బాలీవుడ్ నృత్య వర్క్షాప్ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది.ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, శాస్త్రీయ సంగీతకారుడు రిషబ్ శర్మ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఎడ్డీ స్టెర్నోతో మార్నింగ్ యోగా, క్రికెట్ థీమ్ ప్యానెల్స్, షియామక్ దావర్ నేతృత్వంలో బాలీవుడ్ డ్యాన్స్ వర్క్షాప్లు ఉంటాయి. ‘సంస్కృతి మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు.
రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఉగ్రవాదంపై పోరుకు పర్యాయపదం ‘సింధూర్’: ఎంపీ బన్సూరి
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
లైట్ తీస్కో భయ్యా..!
డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్లో ‘బాయ్కాట్ భైరవం’
పిల్లలూ..ఈ సమ్మర్ ఈ సినిమాలు చూస్తున్నారా..?
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్లో వేడుకలు
‘స్కాంస్టార్ బాబు’.. హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉద్యోగిపై దాడి..
World Turtle Day: తోటి తాబేలు పక్కనున్నా..
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్గా బుమ్రా.. సుదర్శన్కు దక్కని చోటు!.. శార్దూల్కు ఛాన్స్!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా
దుబాయ్లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఉగ్రవాదంపై పోరుకు పర్యాయపదం ‘సింధూర్’: ఎంపీ బన్సూరి
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
లైట్ తీస్కో భయ్యా..!
డైరెక్టర్ నోటి దురుసు.. ట్రెండింగ్లో ‘బాయ్కాట్ భైరవం’
పిల్లలూ..ఈ సమ్మర్ ఈ సినిమాలు చూస్తున్నారా..?
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్లో వేడుకలు
‘స్కాంస్టార్ బాబు’.. హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉద్యోగిపై దాడి..
World Turtle Day: తోటి తాబేలు పక్కనున్నా..
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్గా బుమ్రా.. సుదర్శన్కు దక్కని చోటు!.. శార్దూల్కు ఛాన్స్!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా
దుబాయ్లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
సినిమా

విశ్వంభర బుక్లో ఏముంది?
‘విశ్వంభర’ బుక్లో ఏముంది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు నిర్మాత విక్రమ్ రెడ్డి. చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. టాప్ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిపోస్ట్ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘విశ్వంభర’ సినిమాకు చెందిన బుక్ను రిలీజ్ చేశారు ఈ చిత్రనిర్మాత విక్రమ్ రెడ్డి. అలాగే కాన్స్లోని భారత పెవిలియన్లో ‘విశ్వంభర’ సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు, వీఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారం గురించిన పలు విశేషాలను ఆయన తెలిపారు. కీరవాణిగారు అద్భుతమైన మ్యాజిక్, ఆర్ఆర్ అందించారని, ఛోటా కె. నాయుడు విజువల్స్ అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో..భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ ‘కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ టైటిల్ రోల్లో నటించనున్న ఈ బయోపిక్కు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, టీ– సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు.‘కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ సినిమాను ప్రకటించిన తర్వాత, ఈ సినిమాను గురించి కాన్స్లోని భారత్ పెవిలియన్లో ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడారు. ‘‘ఏపీజే అబ్దుల్ కలాంగారి జీవితం ప్రపంచవ్యాప్త యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన బయోపిక్ను తెరకెక్కడం బాధ్యతతో కూడిన సవాల్లాంటింది’’ అని పేర్కొన్నారు ఓం రౌత్. ‘‘ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నందుకు గౌరవంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు అభిషేక్ అగర్వాల్.సోనమ్.. ఓ హాట్ టాపిక్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది బొమ్మ ఉన్న నెక్లెస్ను ధరించి, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరై చర్చనీయాంశమయ్యారు రాజస్థాన్ నటి–మోడల్ రుచి గుజ్జర్. ఈ విషయాన్ని మరవక ముందే ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ సోనమ్ చబ్రా ధరించిన కాస్ట్యూమ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చర్చనీయాంశమైంది. సోనమ్ చబ్రా డ్రెస్పై భారతదేశంపై జరిగిన ఉగ్రదాడుల (ఇటీవల జరిగిన పహల్గాం, గతంలో జరిగిన ఉరి, పుల్వామా..’) పేర్లు ఉన్నాయి.అలాగే ఐశ్వర్యా రాయ్ 22వ సారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఐశ్వర్యా రాయ్ నుదుట సిందూర్ హైలైట్ అయ్యేలా ఉంది. ‘ఆపరేషన్ సిందూర్’ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇలా ఐశ్వర్యా రాయ్ సిందూరం ధరించారనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఇంకా భారతీయ నటి అదితీరావ్ హైదరీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై నడిచారు.

లేట్గా వచ్చినా లేటెస్ట్గా...
హీరోకి గాయం... షూటింగ్కి బ్రేక్ ఆర్టిస్ట్ డేట్స్ సర్దుబాటు కాలేదు... షూటింగ్ లేట్ సినిమాకి అనుకున్న థియేటర్లు అమరలేదు... రిలీజ్ పోస్ట్పోన్ ఒక సినిమా మేలు కోరి ఇంకో సినిమా వెనక్కి తగ్గితే... విడుదల వాయిదా... కారణం ఏదైనా కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి థియేటర్లకు రావు. వాయిదా పడుతుంటాయి. ఇలాంటప్పుడే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా అని రజనీకాంత్ ‘బాషా’లో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంటుంది. అలా లేట్ అయిన సినిమాలన్నీ లేటెస్ట్గా వస్తాయని ఊహించవచ్చు. ఇక... విడుదల వాయిదా పడిన చిత్రాల గురించి తెలుసుకుందాం. తనయుడి కోసం... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలుపోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ సపై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్ని కూడా శరవేగంగా జరిపారు.చిరంజీవి ఎలాగైనా సంక్రాంతి బరిలో దిగుతారని అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినిమా అభిమానులు అనుకున్నారు. కట్ చేస్తే... తనయుడు రామ్చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదల వాయిదా వేశాం’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే మే 9న ఈ సినిమా విడుదలకానుందనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండటంతో ఆ తేదీకి రిలీజ్ కాలేదు. కాగా జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం 2002 జూలై 24న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ పరంగానూ ఆ డేట్ కలిసొచ్చే అవకాశం ఉండటంతో చిత్రయూనిట్ జూలై 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. ఏదిఏమైనా కొత్త విడుదల తేదీపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండక తప్పదు. రాజా సాబ్ వచ్చేదెప్పుడు?రాజా సాబ్ రాక కోసం అటు ప్రభాస్ అభిమానులు ఇటు సగటు సినిమా ప్రేమికులు వేచి చూస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు.అది కూడా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడినప్పటికీ కొత్త విడుదల ఎప్పుడు? అన్నది మాత్రం చిత్రబృందం ఇప్పటివరకూ ప్రకటించ లేదు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని టాక్.చారిత్రక యోధుడు వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి వారు ఇతర ముఖ్య పాత్రలుపోషించారు. చారి్రతక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్ సపై ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా, 2025లోనూ రెండు స్లారు రిలీజ్ వాయిదా పడింది.ఈ ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన యూనిట్.. ఆ తేదీకి వాయిదా వేసి, మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీకి కూడా విడుదల కాలేదు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నందున మే 9 నుంచి జూన్ 12కి విడుదలను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈసారి ఎలాగైనా ఈ తేదీకే రిలీజ్ చేసేందుకు ప్రమోషన్స్ని కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.మాస్ ఎంటర్టైనర్వెండితెరపై తనదైన శైలిలో మాస్ జాతరని ప్రేక్షకులకు చూపించనున్నారు రవితేజ. అయితే ఆ సమయం ఎప్పుడు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. (మనదే ఇదంతా అనేది ట్యాగ్లైన్). భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ‘మాస్ జాతర’ అనే టైటిల్ను ఖరారు చేయడంతో పాటు 2025 మే 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే ఈ నెల 9న విడుదల కాలేదు.రిలీజ్ని వాయిదా వేసిన చిత్రబృందం కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించ లేదు. దీంతో రవితేజ అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రవితేజ భుజానికి గాయం కావడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. ఈ కారణంగా చిత్రీకరణ ఆలస్యం అయింది. అయితే మేజర్ టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ శ్రీలీల కూడా ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్. అయితే జూలైలో ‘మాస్ జాతర’ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల జరిగిన ఓ ప్రెస్మీట్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చె΄్పారు. ఆయన విడుదల తేదీ ప్రకటించనప్పటికీ జూలై 18న రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. భక్తి పరవశంవిష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర కీలక పాత్రలుపోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు మేకర్స్.అయితే వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం వల్ల రిలీజ్ని జూన్ 27కి వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త రిలీజ్ డేట్కి సంబంధించినపోస్టర్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విడుదల చేయించింది యూనిట్. మహాశివుడికి వీర భక్తుడైన కన్నప్ప కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ద్వారా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా, తనయుడు అవ్రామ్ భక్త వెండితెరపై ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగానే కాదు.. అమెరికాలోనూ విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మంచు విష్ణు అండ్ టీమ్. పీరియాడికల్ నేపథ్యంలో... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.ఈ సినిమాను తొలుత ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల కాలేదు. ఆ తర్వాత మే 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ డేట్ కూడా జూలై 4కి వాయిదా పడింది. ‘‘కింగ్డమ్’ని ముందుగా అనుకున్నట్టు మే 30న రిలీజ్ చేయాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు (ఆపరేషన్ సిందూర్) జరిగాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్స్ స, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, వాయిదా నిర్ణయం తీసుకున్నాం. సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ ఏ టైటిల్ పెట్టాలి? అన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం’’ అని ఆయన తెలిపారు. అక్కా తమ్ముడి అనుబంధం నితిన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయికలుగా నటించారు. నటి లయ కీలక పాత్ర చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే ఆ తేదీకి వాయిదా పడిన ఈ సినిమాని జూలై 4న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రయూనిట్. అక్క– తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న కథతో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. ఇందులో క్రీడా నేపథ్య అంశాలు కూడా ఉంటాయని, ఆర్చరీ ఆటగాడిగా నితిన్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సలో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ వాయిదా పడి, చివరికి జూలై 4కి రాబోతోంది. అదే తేదీకి విడుదలకు సిద్ధమైన నితిన్ ‘తమ్ముడు’ మరోసారి వాయిదా పడుతుందా? లేక విడుదలవుతుందా? అనేది వేచి చూడాల్సిందే. పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు జరిగాయి.. మరికొన్ని జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్

మన దేశానికి వచ్చేస్తున్న యూనివర్సల్ స్టూడియోస్, ఆ ప్రాంతం ఇక సరికొత్త సినిమా క్యాపిటల్, ఎక్కడంటే?
హాలీవుడ్ సినిమాలతో బాగా అనుబంధం ఉన్నవారికి యూనివర్సల్ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నది యూనివర్సల్ స్టూడియోలోనే. ప్రపంచ సినీరంగానికి యూనివర్సల్ స్టూడియో అనేది ఒక డ్రీమ్ మేకింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలనుకున్న ప్రతీ టెక్నీషియన్ కల యూనివర్సల్ స్టూడియో. ఈ నేపధ్యంలో భారతీయ సినిమా రంగానికి సినీ అభిమానులకు చెప్పుకోదగ్గ శుభవార్త ఏమిటంటే, మన దగ్గర త్వరలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. అవును...నిజం...భారతదేశం త్వరలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ను స్వాగతించబోతోంది. ఈ ప్రపంచ వినోద దిగ్గజం త్వరలో ప్రపంచ స్థాయి థీమ్పార్క్తో సహా భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. త్వరలోనే సినీ రూపకర్తల కల సాకారం కానుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో యూనివర్సల్ స్టూడియోస్ పార్క్ ఉన్న కొన్ని దేశాలలో ఒకటిగా అవతరించనుంది. ప్రస్తుతం ఈ థీమ్ పార్క్ యునైటెడ్ స్టేట్స్, జపాన్, సింగపూర్, చైనా దేశాల్లో మాత్రమే ఉంది.అందుతున్న సమాచారం ప్రకారం, భారతదేశంలో యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్ త్వరలో హర్యానాలోని ద్వారక ఎక్స్ప్రెస్వే సమీపంలో ఢిల్లీ నుంచి కొంచెం దూరంలో నెలకొల్పనున్నారు. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం, ఈ పార్క్ గురుగ్రామ్ రూపురేఖల్ని మార్చేయనున్న ప్రాజెక్ట్ కానుంది. హర్యానా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (హెచ్ఎస్ ఐఐడిసి) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి, ఇప్పటికే సైట్ చుట్టూ మౌలిక సదుపాయాల ప్రణాళికల అమలు కూడా ప్రారంభించింది. ఇది రాబోయే 3 మిలియన్ చదరపు అడుగుల మాల్ లోపల అభివృద్ధి చేయబడిన ఇండోర్ థీమ్ పార్క్ అవుతుంది. మీడియా నివేదికల ప్రకారం, వినోద ఉద్యానవనాన్ని నిర్మించడానికి భారతి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఇక్కడ 300,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంటుందని తెలుస్తోంది. భారతదేశంలో ప్రారంభమవుతున్న ఈ అత్యంత భారీ పార్క్లో ఒసాకా హాలీవుడ్లో ఉన్నట్లుగా థీమ్ , రైడ్లు, షోలు కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ ఆకర్షణలు ఉంటాయి. మన దేశానికి యూనివర్సల్ స్టూడియోస్ రాక ఉపాధి రంగానికి కూడా ఊతమిచ్చే శుభవార్త అనే చెప్పాలి. ఈ పార్క్ అనేక రకాల ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. దీని చుట్టుపక్కల ప్రాంతంలో హోటళ్ళు, రవాణా సేవలు షాపింగ్ కేంద్రాలు తదితర వాణిజ్య కార్యకలాపాలు ముమ్మరం అవుతాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం సరికొత్త సినిమా క్యాపిటల్గా అవతరించినా ఆశ్చర్యం లేదు. గురుగ్రామ్లోని ఈ స్థలం అటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో మార్గాలు ఇటు మరి కొన్ని ప్రధాన రహదారులకు సులభమైన కనెక్టివిటీని అందిస్తుంది. నిజానికి యూనివర్సల్ స్టూడియోస్ భారతదేశంలో తన తొలి అడుగు వేసేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఇదీ ఒక కారణమే.

అబ్దుల్ కలామ్ బయోపిక్లో ధనుష్.. పోస్టర్ విడుదల
జాతీయ అవార్డు గ్రహీత, మల్టీ టాలెంటెడ్ ధనుష్ మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్లో నటించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి ‘కలాం’ అనే టైటిల్తో పాటు "ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అనే ట్యాగ్లైన్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు.ఈ భారీ ప్రాజెక్ట్ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లతో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, నిర్మిస్తున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆవిష్కరించిన ‘కలాం’ సినిమా టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. డాక్టర్ కలాం సిల్హౌట్తో పాటు, ఒక మిస్సైల్ చిత్రం ఆవిష్కరణాత్మకంగా రూపొందించబడింది, ఇది ఆయన భారత మిస్సైల్ టెక్నాలజీకి చేసిన కృషిని సూచిస్తుంది.భారతీయ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరిగా గుర్తింపు పొందిన ధనుష్, డాక్టర్ కలాం పాత్రను పోషించేందుకు చాలా ఫిజికల్ బాడీ ట్రాన్స్ ఫర్ మిషన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించినా ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటించబడనున్నాయి. ఈ చిత్రం డాక్టర్ కలాం జీవితాన్ని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప సినిమాగా రూపొందనుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది. హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది.

క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: తొలి రౌండ్లో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై రాణించిన భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్.ప్రణయ్, ఆయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్లకు పరాజయం ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్లో ప్రేరణ అల్వేకర్–మృణ్మయి దేశ్పాండేలకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రేరణ–మృణ్మయి జంట 9–21, 14–21తో సూ యిన్ హుయ్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా–ధ్రువ్ కపిల జోడీ 21–17, 18–21, 21–15తో ఫ్రాన్స్కు చెందినలీ పాలెర్మో–జులియెన్ మైమో జంటపై గెలిచింది. శ్రీకాంత్ వరుస గేముల్లో... పురుషుల సింగిల్స్లో ఒక్క శ్రీకాంత్ మాత్రమే ముందంజ వేశాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంక్ ప్లేయర్ శ్రీకాంత్ 23–21, 21–17తో తనకన్నా మెరుగైన 33వ ర్యాంకర్ ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ రెండు గేములు గెలిచేందుకు శ్రీకాంత్ 59 నిమిషాలు పాటు చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్కు చెందిన తొమా పొపొవ్తో తలపడతాడు. మిగతా పురుషుల సింగిల్ పోటీల్లో సతీశ్ కరుణాకరన్ 14–21, 16–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆశించిన స్థాయి ఆటతీరు కనబరచలేకపోయిన ప్రణయ్ 9–21, 18–21తో వరుస గేముల్లో యుషి తనక (జపాన్) చేతిలో కంగుతినగా... ఆయుశ్ శెట్టి 13–21, 17–21తో తొమ పొపొవ్ ధాటికి నిలువలేకపోయాడు.

LSG Vs GT: గుజరాత్కు లక్నో షాక్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ప్లేఆఫ్స్కు చేరిన గుజరాత్ టైటాన్స్ తదుపరి లక్ష్యం టాప్–2లో చేరడం. ఈ ప్రయత్నానికి లక్నో సూపర్జెయింట్స్ అడ్డొచ్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్పై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117; 10 ఫోర్లు, 8 సిక్స్లు) శతక్కొట్టగా, నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగాడు. అనంతరం గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓడింది. షారుఖ్ ఖాన్ (29 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు), రూథర్ఫర్డ్ (22 బంతుల్లో 38; 1 ఫోర్, 3 సిక్స్లు) మాత్రమే రాణించారు. క్యాన్సర్ అవగాహన–ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సీజన్ తరహాలోనే ఈ సారి కూడా ఒక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ లావెండర్ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. ఓపెనింగ్ ధాటితో... ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ జోడీ లక్నోకు శుభారంభం ఇచ్చింది. గుజరాత్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడటంతో 5.3 ఓవర్లో లక్నో స్కోరు ఫిఫ్టీ దాటింది. మరోవైపు నుంచి మార్క్రమ్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా షాట్లతో పరుగుల వేగం పెంచాడు. ఈ క్రమంలో మార్ష్ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ మార్క్రమ్ను కిషోర్ అవుట్ చేసి 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. రషీద్ఖాన్పై మార్ష్ పిడుగల్లే చెలరేగాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 4, 4, 1లతో ఏకంగా 25 పరుగుల్ని రాబట్టాడు. మార్ష్ సెంచరీ, పూరన్ ఫిఫ్టీ మార్‡్షతో పాటు వన్డౌన్ బ్యాటర్ పూరన్ కూడా ధాటిగా ఆడటంతో ప్రతీ ఓవర్కు 10 పైచిలుకు రన్రేట్తో పరుగులు వచ్చాయి. మార్ష్ 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాసేపటికే పూరన్ కూడా 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో లక్నో 17.4 ఓవర్లలో 200 మార్క్ దాటింది. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడేక్రమంలో మార్ష్ అవుట్కాగా... రెండో వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పూరన్తో పంత్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్లు) అజేయంగా నిలిచాడు. షారుఖ్ పోరాడినా... కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆరంభం నుంచే దంచేందుకు దిగిన టాపార్డర్ బ్యాటర్లు అంతే వేగంగా వికెట్లు పారేసుకున్నారు. సాయి సుదర్శన్ (21; 4 ఫోర్లు), శుబ్మన్ గిల్ (20 బంతుల్లో 35; 7 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) నిష్క్రమించడంతో లక్నో శిబిరం సంబరం చేసుకుంది. కానీ రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్లు ధనాధన్ షోకు శ్రీకారం చుట్టడంతో లక్నో గుండెల్లో గుబులు రేగింది. చెరోవైపు నుంచి రూథర్ఫొర్డ్, షారుఖ్లు సిక్స్లు, ఫోర్లతో విజృంభించారు. అంతే... 16 ఓవర్లు గడిచేసరికి స్కోరు 182/3కి చేరింది. 24 బంతుల్లో 54 పరుగుల సమీకరణం గుజరాత్ను ఆశల పల్లకిలో ఉంచింది. రూథర్ఫొర్డ్, షారుఖ్ నాలుగో వికెట్కు 40 బంతుల్లో 86 పరుగులు జోడించారు. అయితే 17వ ఓవర్లో రూథర్ఫర్డ్, తెవాటియా (2), మరుసటి ఓవర్లో అర్షద్ ఖాన్ (1) అవుట్ కావడంతో లక్నో కు ఊరట లభించింది. 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న షారుఖ్ ఖాన్ పోరాటం సరిపోలేదు. స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) షారుక్ (బి) సాయి కిషోర్ 36; మార్ష్ (సి) రూథర్ఫొర్డ్ (బి) అర్షద్ 117; పూరన్ నాటౌట్ 56; రిషభ్ పంత్ నాటౌట్ 16; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–91, 2–212. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 3–0–36–1, రబడ 4–0–45–0, ప్రసి«ద్కృష్ణ 4–0–44–0, సాయి కిషోర్ 3–0–34–1, రషీద్ ఖాన్ 2–0–36–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) రూర్కే 21; గిల్ (సి) సమద్ (బి) అవేశ్ 35; బట్లర్ (బి) ఆకాశ్ సింగ్ 33; రూథర్ఫర్డ్ (సి)సబ్–బిష్ణోయ్ (బి) రూర్కే 38; షారుఖ్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) అవేశ్ 57; తెవాటియా (సి) హిమ్మత్ (బి) రూర్కే 2; అర్షద్ (సి) రూర్కే (బి) షాబాజ్ 1; రషీద్ ఖాన్ నాటౌట్ 4; రబడా (బి) బదోని 2; సాయి కిషోర్ (బి) బదోని 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–46, 2–85, 3–96, 4–182, 5–186, 6–193, 7–197, 8–200, 9–202. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3.1–0–29–1, ఆకాశ్దీప్ 4–0–49–0, రూర్కే 4–0–27–3, అవేశ్ఖాన్ 3.5–0–51–2, షాబాజ్ 4–0–41–1, బదొని 1–0–4–2. ఐపీఎల్లో నేడుబెంగళూరు X హైదరాబాద్వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో

చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో మ్యాచ్లు పరంగా అత్యంతవేగంగా 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న బ్యాటర్గా రూట్ చరిత్ర సృష్టించాడు. నాటింగ్హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో టెస్టులో 28 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద రూట్ ఈ ఫీట్ సాధించాడు.ఈ రేర్ ఫీట్ను రూట్ కేవలం 153 మ్యాచ్లలో నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ పేరిట ఉండేది. కల్లిస్ 159 మ్యాచ్ల్లో ఈ రికార్డును సాధించాడు. తాజా మ్యాచ్తో కల్లిస్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. కల్లిస్తో పాటు దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్(160), రికీ పాంటింగ్(162), సచిన్ టెండూల్కర్(163)ను అధిగమించాడు.అయితే మ్యాచ్ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో సచిన్(266) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రూట్(279 మ్యాచ్లు) ఐదో స్ధానంలో ఉన్నారు. ఇక టెస్టుల్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ క్రికెటర్ కూడా జో రూట్నే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రీజులో పోప్(169), బ్రూక్(9) ఉన్నారు. అంతకుముందు డకెట్(140), క్రాలీ(124) సెంచరీలు సాధించారు
బిజినెస్

బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ తయారీ కంపెనీ కేటీఎమ్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు వీలుగా సొంత అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ ద్వారా ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న కేటీఎమ్కు డెట్ ఫండింగ్ ప్యాకేజీ ద్వారా 80 కోట్ల యూరోలు(సుమారు రూ. 7,765 కోట్లు) అందించనుంది. వెరసి కేటీఎమ్లో మైనారిటీ వాటాదారు స్థాయినుంచి మెజారిటీ (యాజమాన్య) సంస్థగా అవతరించనున్నట్లు బజాజ్ ఆటో తాజాగా వివరించింది. సంయుక్త డెవలప్మెంట్ పథకంలో భాగంగా కేటీఎమ్ బిజినెస్ను పట్టాలెక్కించనున్నట్లు తెలియజేసింది. అభివృద్ధి, తయారీ, అమ్మకాలు చేపట్టడం ద్వారా భారత్సహా 80 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. డెట్ ఫండింగ్ ప్యాకేజీలో భాగంగా ఆ్రస్టియన్ కోర్టు ఆదేశాల ప్రకారం రుణదాతలకు తగినస్థాయిలో చెల్లింపులతోపాటు కంపెనీ కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు అందించనున్నట్లు వివరించింది. ఇప్పటికే 20 కోట్ల యూరోలు విడుదల చేయగా.. మిగిలిన 60 కోట్ల యూరోలను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ కేటీఎమ్, హస్వానా, గస్గస్ పేరుతో సుప్రసిద్ధ మోటార్సైకిళ్ల బ్రాండ్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కేటీఎమ్ ఏజీ హోల్డింగ్ సంస్థ పీరర్ మొబిలిటీ ఏజీ(పీఎంఏజీ)కాగా.. తాజా లావాదేవీకి ముందు పీఎంఏజీ/కేటీఎమ్లో బజాజ్ ఆటో 37.5 శాతం వాటాను కలిగి ఉంది. బీఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 0.5 శాతం బలపడి రూ. 8,734 వద్ద ముగిసింది.

ఓఎన్జీసీ లాభం నేలచూపు
ముంబై: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 35% క్షీణించి రూ. 6,448 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 9,869 కోట్లు ఆర్జించింది. ముడిచమురు ఉత్పత్తి, రిఫైనరీలకు విక్రయంపై ఒక్కో బ్యారల్కు 73.72 డాలర్ల చొప్పున లభించినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో 80.81 డాలర్లు చొప్పున అందుకుంది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 34,982 కోట్లను తాకింది. ఈ కాలంలో యథాతథంగా 4.7 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. సహజవాయు ఉత్పత్తి సైతం 4.951 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నుంచి 4.893 బీసీఎంకు స్వల్పంగా మందగించింది. పూర్తి ఏడాదికి చూస్తే...మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఓఎన్జీసీ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 35,610 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం యథాతథంగా రూ. 1.37 లక్షల కోట్లకు చేరింది. చమురు ధరలు 5 శాతం తక్కువగా బ్యారల్కు 76.9 డాలర్లు చొప్పున లభించాయి. గ్యాస్ విక్రయాలపై ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లు చొప్పున అందుకుంది. స్టాండెలోన్ చమురు ఉత్పత్తి 18.558 ఎంటీకి చేరగా.. సహజవాయు ఉత్పత్తి 19.654 బీసీఎంగా నమోదైంది. గత 35ఏళ్లలోనే అత్యధికంగా 578 బావులలో తవ్వకాలు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. 2023– 24లో 544 బావులలో తవ్వకాలు సాగించింది. ఈ కాలంలో మొత్తం రూ. 62,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో 3% నష్టంతో రూ. 242 వద్ద ముగిసింది.

నైపుణ్యాలు, ఉద్యోగ పురోగతికే ప్రాధాన్యం
ముంబై: కంపెనీల కార్యకలాపాల్లో ఆటోమేషన్, జెనరేటివ్ ఏఐ వినియోగం విస్తరిస్తుండడంతో.. జెనరేషనల్ జెడ్, మిలీనియల్స్ తరగతి యువత నైపుణ్యాలు పెంచుకునేందుకు, ఉద్యోగంలో పురోగతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ నిర్ణయాల్లో పురోగతి, అభ్యాసనా అవకాశాలకే తమ ప్రాధాన్యమని డెలాయిట్ సర్వేలో వారు చెప్పారు. జెన్ జెడ్, మిలీనియల్స్లో 85 శాతం మంది ప్రతి వారం చివర్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు, పనిచేస్తూనే నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు డెలాయిట్ ఇండియా చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరి రంగన్ తెలిపారు. కాకపోతే వీరికి తగినంత మార్గదర్శకత్వం లభించడం లేదని డెలాయిట్ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ మేనేజర్ల నుంచి మార్గదర్శనం కోరుకుంటుంటే.. అది కొందరికే లభిస్తున్నట్టు తెలిపింది. 505 మంది జెనరేషన్ జెడ్, 304 మిలీనియల్స్ అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా డెలాయిట్ తెలుసుకుంది. 1981–1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్గా, 1997–2012 మధ్యకాలంలో జని్మంచిన వారిని జెనరేషన్ జెడ్ కింద పరిగణిస్తుంటారు. పట్టాలు కాదు.. అనుభవానికే పెద్ద పీట వేగంగా మార్పులకు గురవుతున్న ఉద్యోగ మార్కెట్లో సంప్రదాయ డిగ్రీ అర్హతల కంటే.. అనుభవానికే అగ్ర తాంబూలం లభిస్తున్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. దీంతో సంప్రదాయ విద్యా వ్యవస్థ నాణ్యతపై సందేహాలు లేవనెత్తింది. 94 శాతం జెన్ జెడ్, 97 శాతం మిలీనియల్స్ సిద్ధాంతాల కంటే అనుభవానికే విలువ ఎక్కువని చెప్పారు. ఉన్నత విద్యపై 52 శాతం జెన్ జెడ్, 45 శాతం మిలీనియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్య వ్యయాలపై 36 శాతం జెన్ జెడ్, 40 శాతం మిలీనియల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన, ఒత్తిడి విషయంలో ఉద్యోగం కారణమవుతున్నట్టు 36 శాతానికి పైనే చెప్పారు. ఉద్యోగుల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి.. ‘‘ఉద్యోగుల సంతోషం, శ్రేయస్సు విషయంలో సంస్థలు తమ విధానాలను తిరిగి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. భౌతిక, మానసిక, ఆర్థిక శ్రయస్సు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నాయకత్వం స్థాయిలో వీటిని పరిష్కరించాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది.

బెంగళూరులో శాప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఆర్లాండో: జర్మన్ ఐటీ దిగ్గజం శాప్ కొత్తగా బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని(సీవోఈ) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులో సుమారు 15,000 సీటింగ్ సామర్థ్యంతో దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. బెంగళూరులోని దేవనహళ్ళిలో 41 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానుంది. 1998 నుంచి భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న శాప్ ల్యాబ్స్ ఇండియాలో ప్రస్తుతం హైదరాబాద్ సహా అయిదు నగరాల్లో 14,000 మంది సిబ్బంది ఉన్నారు. జర్మనీ వెలుపల కంపెనీకి అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రం ఉన్నది భారత్లోనే. తమకు అతి పెద్ద డెవలప్మెంట్ సెంటర్స్లో భారత్ కూడా ఒకటని శాప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ముహమ్మద్ ఆలం తెలిపారు. ఆటోమొబైల్, హెల్త్కేర్, రిటైల్ సహా వివిధ వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నట్లు వివరించారు. భారతీయ కంపెనీలు వేగవంతంగా కృత్రిమ మేథని (ఏఐ) అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు.
ఫ్యామిలీ

మూగ జీవే..కానీ ఎంత అద్బుతంగా వీడ్కోలు చెప్పింది..!
విశ్వాసానికి పేరుగాంచిన కుక్కలు మనుషులతో ఎంతో అద్భుతంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయో తెలిసిందే. తమ యజామాని పట్ల ఎంతలా విధేయతతో ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి మన మాటలు అర్థం కాకపోయినా..మనకేం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి. మూగజీవే అయినా..ఎంత అందంగా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదహారణే ఈ అగ్నిమాపక స్టేషన్లో జరిగిన ఘటనే. ఇది తన అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్ అవ్వుతుంటే..అది కూడా ఎంత అద్భుతంగా వీడ్కోలు చెప్పిందో చూస్తే..ఆశ్యర్యంగా అనిపిస్తుంది. ఈ ఘటన కేరళ అగ్నిమాపకదళ స్టేషన్లో చోటు చేసుకుంది. ఆ స్టేషన్లోని అగ్నిమాపక అధికారి షాజు పదవీవిరమణ చేస్తున్నరోజు కావడంతో..తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు చక్కగా వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అదే స్టేషన్లో ఉండే రాజు అనే కుక్కకూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడ్కోలు చెబుతోంది. నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా..అది నిశబ్దంగా వీడ్కోలు చెప్పే తీరు అమోఘం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: 'టాకింగ్ ట్రీ'..ఈ టెక్నాలజీతో నేరుగా మొక్కతో మాట్లాడేయొచ్చు..!)

ఎథ్నిక్ వేర్కు పెరుగుతున్న ఆదరణ, భారీ సేల్స్
స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్కార్ట్ (Flipkart) ఫ్యాషన్ విభాగంలో ఎథ్నిక్ వేర్ (Ethnic Wear) కేటగిరీలో భారీ సేల్స్ను సాధించింది. ఒక్క ఏడాదిలో 60 లక్షలమంది కొనుగోదారులను తనఖాతాలో వేసుకుంది. అలాగే 90 శాతం రిపీటెడ్ కస్టమర్లు ఉన్నారని ఫిప్కార్ట్ ప్రకటించింది. టైర్ 2 , టైర్ 3 నగరాల నుండి బలమైన డిమాండ్ ఉందని తెలిపింది. సాంప్రదాయ దుస్తుల కొనుగోలుదారుల్లో 25–35 వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం మొత్తం దుకాణదారుల పరిమాణంలో 55 శాతం తమదే అని తెలిపింది. వాటా కలిగి ఉంది.ఇది తమ కస్టమర్విశ్వాసం, విధేయతను నిదర్శనమని, అలాగే ఈ పెరుగుదల డిజిటల్ స్వీకరణను మాత్రమే కాకుండా యువ భారతీయ వినియోగదారులలో అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ప్రాధాన్యతలను కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొంది.బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, పాట్నా, లక్నో, చెన్నై, పూణే, ముంబై , గౌహతి వంటి నగరాలు కీలకమైన డిమాండ్ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. మహిళల విభాగంలో 65శాతం కొనుగోళ్లు మహిళా దుకాణదారులుండగా, అయితే పురుషుల స్తులలో, 88శాతం లావాదేవీలు పురుషులే షాపింగ్ చేస్తున్నారు. భారతీయ దుస్తుల మార్కెట్లోని ప్రస్తుత ఫ్యాషన్ అనేది ప్రస్తుత పోకడలతో సాంప్రదాయ డిజైన్ల కలయిక, ఫ్యాషన్ వినియోగదారులను ఆకర్షించే ఇండో-వెస్ట్రన్ దుస్తులు మిళితంగా ఉన్నాయని ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ గుప్తా తెలిపారు.ఎథ్నిక్ వేర్ విభాగంలో, ముఖ్యంగా చీరలు , కుర్తాలలో గణనీయమైన వృద్ధిని చూస్తున్నామన్నారు. గత సంవత్సరం స్టైల్ ట్రెండ్స్ పరంగా, కుర్తాలు 42 శాతం డిమాండ్తో ముందంజలో ఉన్నాయి, ఆ తర్వాత చీరలు 24 శాతం , కుర్తీలు 18 శాతం పెరిగాయి. నిర్దిష్ట శైలులు విపరీతమైన వృద్ధిని సాధించాయి: గత సంవత్సరంతో పోలిస్తే మే 2025లో అనార్కలి సూట్లు 45రెట్టు, చికంకారి కుర్తాలు 40రెట్లు, రెడీ-టు-వేర్ చీరలు 3రెట్లు పెరిగాయి. బ్లాక్ చీరలు లాంగ్ ఫ్రాక్ల కోసం ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఈద్, దీపావళి , రక్షాబంధన్ సమయాల్లో కుర్తా సెట్లు గరిష్ట స్థాయికి చేరుకుంటుండగా, దుర్గా పూజ, ఓనం , పొంగల్ సమయాల్లో చీరలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది.ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదాఇటీవలి నివేదికల ప్రకారం, 2024 నాటికి, భారతీయ ఎథ్నిక్ వేర్ మార్కెట్ విలువ సుమారు 197.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2033 నాటికి 558.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఆన్లైన్ షాపింగ్వృద్ధి ఈ గ్రోత్కు దోహదం చేస్తోంది. చదవండి: ఇవాళ ఏ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలబ్బా? ఇపుడిదే ట్రెండ్!

బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! ఆరోగ్యానికి మంచిదేనా?
ఇటీవల హెల్దీగా ఉందాం అనే నినాదం ప్రజల్లో బాగా వళ్తోంది. అందురూ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకే ఇష్టపడుతున్నారు. పైగా తమ శరీరానికి సరిపోయే డైట్ని ఫాలోఅయ్యి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడొక కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీబిల్డర్ తనపైన అధిక ప్రోటీన్ ఫుడ్ ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం అని రోజుకి 30 గుడ్లు చొప్పున నెలకు 900 గుడ్లు తింటే త్వరితగతిన కండరాలు ఏర్పడి బాడీబిల్డర్గా మారడానికి తోడ్పడుతుందో లేదా తెలుసుకోవాలని తనమీదే స్వయంగా ప్రయోగం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే..యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీ బిల్డర్ జోసెఫ్ ఎవెరెట్ ప్రముఖ బాడీబిల్డింగ్ లెజెండ్ విన్స్ గిరోండా చెప్పే 900 ఎగ్స్ డైట్ని పరీక్షించాలనుకున్నాడు. గిరోండా తాను రోజు 30 గుడ్డు తింటానని, అదే తన కండల తిరిగిన దేహం రహస్యమని చెబుతుంటారు. అది ఎంతవరకు నిజం అని తెలుసకునేందుకు ఈ యూట్యూబర్ తనమీద ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం రోజుకి 30కి పైగా గుడ్లను డైట్లో తీసుకునేవాడు. అతను గుడ్డు తెల్లసొన ఆమ్లెట్లు, పచ్చసొన స్మూతీలు ఆహారంతో చేర్చుకునేవాడు. వాటితో పాటు రైస్, మాంసం, పెరుగు, పండ్లు, తేనె తదితరాలు తీసుకున్నాడు. ఈ ఆహారం తోపాటు వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన అన్ని వ్యాయామాలు చేశాడు. ఆ తర్వాత తన బాడీలో జరిగిన మార్పులపై వైద్య పరీక్షలు జరిపించగా..మంచికొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం తోపాటు, రక్తంలో చెడు కొలస్ట్రాల్కి సంబంధించి గణనీయమైన మార్పులు కనిపించాయి.ఈ డైట్ మంచిదేనా..? ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా ఇలాంటి డైట్తో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే అధిక కొలస్ట్రాల్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందన్నారు. ఇది గుడ్డు జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. అంతేగాదు అధికంగా గుడ్లు తీసుకోవడం వల్ల.. కొంతమంది వ్యక్తుల్లో పొట్ట ఉబ్బరం, గ్యాస్, విరేచనలు వంటి జీర్ణ సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. అంతేగాదు ఇలా గుడ్లు అధికంగా తీసుకుంటే పోష అసమతుల్యత వస్తుందన్నారు. అలాగే పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తీసుకుంటే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కండరాల పెరుగుదల కోసం గుడ్డు అధికంగా తీసుకోవాల్సిందేనా..గుడ్డు కండరాల పెరుగుదలకు ఉపయోగపడినప్పటికీ..అధికంగా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని తేల్చి చెప్పారు. గుడ్డులోని పచ్చసొన కండరాల ప్రోటీన్ సంశ్లేషణను సమర్థవంతంగా పెంచుతుందన్నారు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఇతర వాటిలో కంటే ఎక్కువ. పైగా దీన్ని ఉడకించి తింటేనే సులభంగా అరుగుతుంది లేదంటే శరీరం దాన్ని అరిగించుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. చెప్పాలంటే సోయా లేదా గోధుమలు, పాలు తదితరాల కంటే గుడ్డులో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కువ కాబట్టి దీన్ని తగు మోతాదులో తీసుకుంటే కండరాల పెరుగుదలకు, బాడీ బిల్డింగ్కి ఉపయోగపడుతుందని తెలిపారు. అంతకు మించి అంటే..మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స)

ఇవాళ ఏ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలబ్బా? ఇపుడిదే ట్రెండ్!
నగరం కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు. విభిన్న రుచుల సంగమం. శతాబ్దాలుగా బిర్యానీ పరిమళాలతో పేరుగాంచిన మన నగరం, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ సంస్కృతిలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. బిర్యానీ, హలీం వంటి క్లాసిక్ వంటకాలు ఎప్పటికీ చిరపరిచితమైనవే అయినా, ఇప్పుడు కొత్త తరహా ఫ్యూజన్ ఫుడ్, ఇంటర్నేషనల్ వంటకాలతో నగర వీధులు ఘుమఘుమలకు వేదికలుగా మారిపోయాయి. ఫుడ్ అంటే కేవలం తినేది కాదు.. ఇప్పుడు అది అనుభవించే జీవనశైలి భాగంగా మారింది. దీనికి ఫుడ్ బ్లాగింగ్ మరింత ప్రాచుర్యాన్ని కలి్పస్తోంది. విదేశీ ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్టూర్లో భాగంగా నగరంలో సందడి చేస్తున్నారు. వారి వీడియోలు విశ్వవ్యాప్తంగా వైరల్గా మారుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోలైఫ్స్టైల్ ఫుడ్కి కొత్త నిర్వచనం.. ఇప్పుడు ఫుడ్ తినడం కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఫ్రెండ్స్తో రాత్రివేళ స్ట్రీట్ టూర్కు వెళ్లడం, కొత్త స్టాల్ కనుగొనడం, అందులో ప్రత్యేకమైన ఐటెం రుచి చూసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇవన్నీ ఒక లైఫ్స్టైల్గా మారిపోయాయి. ‘నేడు ఏ స్ట్రీట్ ఐటెం ట్రై చేయాలి?’ అనే ప్రశ్న, ప్రతీ ఫుడ్ లవర్ డైలీ రొటీన్లో భాగం అయ్యింది. ఇప్పటి యువత కేవలం రెస్టారెంట్లకే పరిమితం కాలేదు. వీధుల్లో అందుబాటులో ఉన్న కొత్త రుచుల కోసం క్యూ కడుతున్నారు. చిన్న చిన్న బండ్లపై కనిపించే పైనాపిల్ డోసా, బబీ బాట్స్, ఫైర్ పానీపూరీ, ఐస్ మలై టిండి వంటి ప్రయోగాత్మక ఐటెమ్స్ ఇప్పుడు హాట్ ట్రెండ్స్. సికింద్రాబాద్ మటన్ కీమా దోసా, హిమాయత్నగర్ తిబ్బటన్ మోమోస్, గచ్చిబౌలి కొరియన్ స్ట్రీట్ఫుడ్ – ఇవన్నీ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదాఫుడ్ బ్లాగింగ్ ట్రెండ్.. ఈ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది ఫుడ్ బ్లాగింగ్. యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వేదికలపై హైదరాబాదీ యువత ఫుడ్ రీల్స్, రివ్యూలతో వైరల్ కంటెంట్ సృష్టిస్తున్నారు. బండి వద్ద కూర్చొని తినే ఒక చిన్న వీడియో లక్షల వ్యూస్ను తెచ్చిపెడుతోంది. ఫుడ్ బ్లాగర్ల ప్రసారం వల్ల చిన్న స్టాల్స్కు కూడా అంతర్జాతీయ గుర్తింపు రావడం విశేషం. ‘‘అవి కేవలం బండ్లు కావు, అవి డ్రీమ్ టేస్టీ హబ్స్‘గా మారుతున్నాయి. ఎక్కడికైనా కొత్తగా ఓ వెరైటీ వంటకం కనిపిస్తే క్యూ కడుతున్నారు. ఇలా బ్లాగర్ల దృష్టిలో పడితే చిన్న ఫుడ్ స్టాల్స్కు కూడా గుర్తింపు వస్తోంది.హైదరాబాదీ ఫుడ్ అదుర్స్.. ఈమధ్య యూఎస్ఏకి చెందిన క్రిష్ లూయిస్ ఫుడ్ టూర్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడి స్పైసీ ఫుడ్, స్వీట్లు, పరోటా, చికెన్–65, రోడ్సైడ్ మిర్చి తనకు ఎంతో నచ్చాయంటూ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల కొంతమంది విదేశీ ఫుడ్ వ్లాగర్లు హైదరాబాద్కు వచ్చి ఇక్కడి వీధి వంటకాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న చిన్న పానీపూరీ బండ్ల దగ్గర నిలబడి, ‘ది బెస్ట్ థింగ్ ఐ ఎవర్ ఈట్!’ అంటూ ఇంగ్లిష్లో చెప్పే మాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యాయి. వీధి వంటల అద్భుత రుచితో ఇక్కడి ఆతిథ్యం, సరదా వాతావరణం వాళ్లను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో విదేశీయుల కళ్లలో కూడా నగరం ఒక ఫుడ్ డెస్టినేషన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఫుడ్ వ్లాగర్లు హైదరాబాదీ స్ట్రీట్ ఫుడ్ను మరింతగా ప్రచారం చేస్తున్నారు. ‘ఇంత అతంటిక్ ఫుడ్ వీధుల్లో దొరుకుతుందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీఫుడ్ క్రియేటివిటీతో.. హైదరాబాద్ ఇప్పుడు కేవలం చారిత్రక కట్టడాల నగరమే కాదు. ఇది రుచుల పండుగలా మారింది. స్ట్రీట్ఫుడ్ ద్వారా స్థానికులు తమ క్రియేటివిటీని చూపిస్తూ, జీవనశైలిని కొత్త కోణంలో నిర్వచిస్తున్నారు. ఫుడ్ బ్లాగర్లు, ఫుడ్ ప్రియులు, ప్రయాణికులు అందరూ కలిసి ఈ నగరాన్ని ఒక రుచుల ప్రయాణ కేంద్రంగా మార్చేశారు.
ఫొటోలు
అంతర్జాతీయం

దక్షిణ కాలిఫోర్నియా.. ఇళ్లపైకి దూసుకెళ్లిన విమానం
శాన్డియాగో: దక్షిణ కాలిఫోర్నియాలో జనావాసాల్లోకి ఓ చిన్నపాటి విమానం దూసుకెళ్లింది. దీంతో 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్ల కూడా దెబ్బతిన్నాయి. భారీ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మృతుల వివరాలపై ఇప్పటి వరకు శాన్డియాగో పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా విమానం.. ఇళ్లలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. The Cessna 550 plane crashed in San Diego's Murphy Canyon neighbourhood around 3.47am during a period of dense fog.A huge fireball erupted after the crash, setting multiple homes and cars ablaze. At least 15 properties have been affected.https://t.co/QAxenqSOWk via @MailOnline pic.twitter.com/jN4dr6T4Es— Tamra M McDougall (@TamraMcDougall) May 22, 2025

ఉంగరంతో ప్రపోజ్ చేద్దామనుకున్నాడు, ఈలోపే..
చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.యారోన్, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!యారోన్, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయాలని యారోన్ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచెయిల్ లెయిటర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్జిగూజ్గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్

హమాస్ నేత ముహమ్మద్ సిన్వార్ హతం?
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) సంచలన ప్రకటన చేశారు. హమాస్ నేత ముహమ్మద్ సిన్వార్ను తమ సైన్యం చంపివుండవచ్చని పేర్కొన్నారు. జెరూసలేంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు .. గాజాలో 20 మంది బందీలు బతికే ఉన్నారని, 38 మంది వరకూ మరణించి ఉంటారని, అక్కడ చిక్కుకున్న బందీలను త్వరలోనే తీసుకువస్తామని ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు హామీ ఇచ్చారు.గాజాలో తమ సైనిక లక్ష్యాల కోసం నిర్మాణాత్మక ప్రణాళిక కొనసాగుతున్నదని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే తాము పదివేల మంది ఉగ్రవాదులను తదముట్టించామని, హమాస్ నేతలు డీఫ్, హనియే, యాహ్యా సిన్వార్, మొహమ్మద్ సిన్వార్ నాయకులను అంతమొందించామని నెతన్యాహు చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.ఇజ్రాయెల్(Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో సైనిక కార్యకలాపాలను విస్తరించడాన్ని యూకే, ఫ్రాన్స్, కెనడాలు తప్పుపట్టాయి. కాగా హమాస్పై సంపూర్ణ విజయం సాధించడానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఇది అనాగరికతపై నాగరికతా యుద్ధమని, దీనిలో పూర్తి విజయం సాధించే వరకు ఇజ్రాయెల్ న్యాయపరమైన మార్గాల ద్వారా తనను తాను రక్షించుకుంటూనే ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు. పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడి, 1,200 మంది అమాయకులను హత్య చేసి, 250 మందికి పైగా అమాయకులను గాజాలో బంధించిన నేపధ్యంలో ఈ యుద్ధం ప్రారంభమైందని నెతన్యాహు గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

వాషింగ్టన్లో ఉగ్రదాడి!.. ట్రంప్ ఆగ్రహం
అమెరికలో దౌత్య పరమైన విషాదం నెలకొంది. ఓ ఆగంతకుడు జరిపిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ(Israel Embassy Staff) సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లను హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చారు.స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని యూదుల మ్యూజియం(Jewish Museum) వద్ద ఈ ఘోరం జరిగింది. మ్యూజియంలో ఓ ఉత్సవం జరుగుతుండగా.. ఎంబసీ స్టాఫ్తో పాటు పలువురు హాజరయ్యారు. అంతలో.. అత్యంత సమీపం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనలో సిబ్బంది ఇద్దరు మరణించారు. కాల్పులకు పాల్పడ్డ దుండగుడు పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ‘‘ ఫ్రీ పాలస్తీనా.. ఫ్రీ పాలస్తీనా(Free Palestine) ’’ అంటూ జెండా కప్పేసుకుని అక్కడే కూర్చుని నినాదాలు చేశాడు. దీంతో ఉగ్రదాడి కోణంలోనే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణతో.. గాజాలో తీవ్ర దాడులు(Gaza War) జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతుండటంతో పాలస్తీనీయులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ పరిణామాల వేళ.. కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. “These horrible D.C. killings, based obviously on antisemitism, must end, NOW! Hatred and Radicalism have no place in the USA. Condolences to the families of the victims. So sad that such things as this can happen! God Bless You ALL!” —President Donald J. Trump pic.twitter.com/Z30bjAQOpZ— The White House (@WhiteHouse) May 22, 2025జెవిష్ మ్యూజియం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అమెరికాలో ద్వేషానికి, ఉగ్రవాదానికి చోటు లేదని.. యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన ఈ తరహా దాడులు, హత్యలు తక్షణమే ఆగాలని హెచ్చరించారాయన. మరోవైపు ఘటనపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇతర దేశాల్లోని ఎంబసీలను మాత్రం అప్రమత్తం చేసినట్లు సమాచారం.
జాతీయం

‘రన్యారావుకు హోంమంత్రి పెళ్లి గిప్ట్ ఇచ్చారు’.. ఈడీ రైడ్స్పై డిప్యూటీ సీఎం డీకే
సాక్షి,బెంగళూరు: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ.పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విద్యాసంస్థలపై దాడులు జరిపారు. అయితే ఈ దాడులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో డీకే శివకుమార్.. జీ పరమేశ్వరను పరామర్శించారు. అనంతరం, డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. పరమేశ్వర.. రన్యారావుకు పెళ్లికి గిప్ట్ ఇచ్చారట. ఇందులో తప్పేముంది. నటికి గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.రన్యారావుది పెళ్లి కార్యక్రమం. ప్రజాజీవితంలో ఉన్నం. విద్యా సంస్థల్ని నడుపుతాం. తెలిసిన వారికి గిప్టులు ఇస్తుంటాం. వాటి ఖరీదు. ఒక్క రూపాయి, పది రూపాయలు, పది లక్షలు, ఐదు లక్షలు ఉండొచ్చు. అలాగే ఆయన (పరమేశ్వర)కూడా రన్యారావు పెళ్లి కానుకగా ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో తప్పేముంది’ అని అన్నారు. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వంటి చర్యల్ని తాము సమర్ధించబోమన్నారు.డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పరమేశ్వర స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయననే అడగండి’అని వ్యాఖ్యానించారు.

యూపీలో విషాదం.. నదిలో మునిగి నలుగురు బాలికలు మృతి
ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగి నలుగురు బాలికలు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఒండ్రు మట్టి కోసం బకులాహి నదిలోకి దిగిన బాలికలు మునిగిపోయారు. మృతులను స్వాతి(13), సంధ్య(11), చాందిని(6), ప్రియాన్షి(7)గా పోలీసులు గుర్తించారు.జిల్లా ప్రధాన కేంద్రం నుంచి 70 కి.మీ దూరంలో ఉన్న కుందా పోలీస్ స్టేషన్ పరిధిలోని చేతిసింగ్ కా పూర్వా గ్రామంలో ఈ సంఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (పశ్చిమ) సంజయ్రాయ్ తెలిపారు. తమ ఇళ్లలో సాంప్రదాయ పద్ధతిలో తమ వంటగది, గోడలకు మట్టిని పూయడానికి బాలికలు నది నుంచి మట్టిని సేకరించడానికి వెళ్లారు.నది ఒడ్డున తవ్వుతుండగా, బాలికలు లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికలను బయటకు తీశారు.. కానీ అప్పటికే ఆ నలుగురూ బాలికలు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.

పాకిస్తాన్కు ప్రధాని మోదీ వార్నింగ్
బికనీర్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రధాన మోదీ హెచ్చరించారు. రాజస్థాన్లోని బికనీర్లో అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్(Pakistan) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అది ఆ దేశ సైన్యం, ఆర్థిక వ్యవస్థ భరించాల్సి వస్తుందన్నారు. పాక్ ఉగ్రవాదం ఎగుమతిని కొనసాగిస్తే, ఆ దేశం ఒక్క రూపాయి కోసం కూడా తడబడే పరిస్థితి వస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారతీయుల రక్తంతో ఆడితే పాకిస్తాన్ దానికి భారీ మొత్తంలో నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు.ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, ఇకపై ఉగ్ర దాడి జరిగినట్లయితే, తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.. ఇందుకు సమయాన్ని, విధానాన్ని, నిబంధనలను భారత సైన్యం స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. అణ్వాయుధాల బెదిరింపులతో భారతదేశం వెనక్కి తగ్గబోదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, ప్రభుత్వాన్నీ వేరు చేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ‘స్టేట్’, ‘నాన్-స్టేట్ యాక్టర్స్’ (గూండాలు) కలసి ఆడే ఆటలు ఇక కొనసాగవన్నారు. 22వ తేదీన జరిగిన పాక్ దాడికి ప్రతిగా 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేశామని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ప్రతీకార దాడి చేస్తే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చూపించామని, ప్రతి భారతీయుడు(Indian) ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలనే సంకల్పంతో ఉన్నారడన్నారు. భారత సైన్యం ప్రజల ఆశీర్వాదంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చిందన్నారు. భారత ప్రభుత్వం మూడు దళాలకూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. పాకిస్తాన్ను మోకాళ్లపై సాగిలపడేలా చేయడానికి భారత సైన్యం చక్రవ్యూహం రచించిందని ప్రధాని మోదీ అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా మే 7న భారత్ ప్రతీకార సైనిక చర్య ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ సమయంలో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద గ్రూపులతో సంబంధమున్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

జ్యోతి పోలీస్ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(YouTuber Jyoti Malhotra) పోలీసు కస్టడీని నాలుగు రోజులు పొడిగించారు. ఆమెను మే 17న హర్యానాలోని హిసార్లో అరెస్టు చేసి, ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. అది ఈరోజు(గురువారం)తో ముగిసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఆమె పోలీసు కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసిన పాకిస్తాన్ సిబ్బందితో ఆమెకు సంబంధాలునున్నాయనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) సమయంలో భారతదేశంలో విద్యుత్ సరఫరా నిలిపివేత(బ్లాక్ అవుట్) కు సంబంధించిన వివరాలతో పాటు పలు సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్తో పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్తో టచ్లో ఉన్నట్లు బలమైన ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయని తెలుస్తోంది.విచారణ అధికారులు జ్యోతి మల్హోత్రాకు చెందిన మూడు మొబైల్ ఫోన్లను, ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం స్వాధీనం చేసుకున్నారు. కాగా జ్యోతి.. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్ మధ్య జరిగిన చాట్ రికార్డులు పోలీసులకు లభ్యంకాలేదని అధికారులు తెలిపారు. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జ్యోతి.. డానిష్తో సంప్రదింపులు జరిపారని అధికారులు నిర్ధారించారు. అలాగే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నానని యూట్యూబర్ జ్యోతి అధికారుల ముందు అంగీకరించారని తెలుస్తోంది. 2023లో జ్యోతి.. పాక్ సందర్శనకు వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్ళినప్పుడు ఆమె డానిష్ను కలిశారని అధికారుల విచారణలో వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఎన్ఆర్ఐ

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్నేత్రాలయ ప్రకటించింది.
క్రైమ్

ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు.

బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు.

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్లైన్గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్హంట్ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి.

45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్వార్ 7వ కాంగ్రెస్లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్గా..పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.