Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?: వైఎస్ జగన్
తాడేపల్లి: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై ఏపీ పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఎలా ఉల్లంఘిస్తుందో అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ వేదికగా ఆ యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు అపరిమిత అధికారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చి భారత రాజ్యాంగాన్ని బహిరంగంగానే ఉల్లంఘిస్తోంది. చట్ట పరంగా పాలనను సాగించడానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. మానవ హక్కులను వారి రక్షణను గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యధేచ్ఛగా అమలు చేస్తుంది. పోలీసులు చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో సహా ప్రతి పౌరుడి హక్కులను కాలరాస్తున్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులైన జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్లను పోలీసు అధికారులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. నడిరోడ్డుపై కూర్చోపెట్టి పట్టపగలే అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. ఒక సిఐ వారి కాళ్లను తన కాలితో అదిమి పెట్టగా, మరొక అధికారి వారిని కొట్టారు మిగతా పోలీసులు పక్కనే ఉండి ఆ దారుణాన్ని చిత్రీకరించారు. పైగా లాఠీలు విరిగితే కొత్తవి అందించారు. నెల క్రితం ఈ సంఘటన జరిగినా ఈ విషయంపై మాట్లాడటానికి కూడా జనం భయ పడ్డారు. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ మరోసారి తెలిసింది. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం రాష్ట్రంలో జరిగాయి. ఏపీలో ఒక భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులనే అపహాస్యం చేస్తున్నారు. ఈ సంఘటన మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించటమే. ఇది రాజ్యాంగ విలువలపై ప్రత్యక్షంగా జరిగిన దాడి. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్లాలి.అంతేగానీ ఇలా బహిరంగంగా దాడి చేయటానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు. భారత రాజ్యాంగాన్ని బాబు సర్కారు బహిరంగంగానే ఉల్లంఘించి అరాచక పాలన సాగిస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. జరగిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ట్యాగ్ చేశారు వైఎస్ జగన్.The @ncbn-led government in Andhra Pradesh is openly violating the Indian Constitution by allowing police to exercise unchecked power. Rather than upholding the rule of law, the state is being run under a harsh “Red Book Constitution” that disregards the rights and protections… pic.twitter.com/zqvwxWXolJ— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2025 చదవండి: దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ

IPL 2025, LSG VS RCB: విధ్వంసకర శతకం.. పల్టీ కొట్టిన పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొన్న పంత్ ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో పంత్కు ఇది రెండో సెంచరీ. సెంచరీ పూర్తి చేసిన అనంతరం పంత్ ఆనందంతో పల్టీ కొట్టాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోలు సోషల్మీడియాలో వైరవలవుతున్నాయి.Coldest IPL hundred celebration 🥶pic.twitter.com/WDHHIvLVv6— CricTracker (@Cricketracker) May 27, 2025ఎట్టకేలకు పంత్ తనపై పెట్టిన పెట్టుబడికి (రూ. 27 కోట్లు) న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఈ సీజన్లో పంత్ చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్కు ముందు 12 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ చాలా మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్లో పంత్ సెంచరీతో సత్తా చాటాడు.ఇటీవలికాలంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. ఐపీఎల్లో పంత్ చివరిగా 2018 సీజన్లో సెంచరీ చేశాడు. నాడు సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నేటికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా చలామణి అవుతుంది. తాజా శతకంతో పంత్ తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు.ఆర్సీబీతో మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం గుజరాత్, ఆర్సీబీ పోటీలో ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.

ఇక నుంచి భారత్ వస్తువులే కొందాం.. మేకిన్ ఇండియాను సాధిద్దాం: ప్రధాని మోదీ
గాంధీనగర్: మనం మేకిన్ ఇండియాను సాధించాలంటే మన దగ్గర తయారు చేసిన వస్తువులనే కొందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ మార్కెట్ను విపరీతంగా పంచేస్తున్న మనం.. ఇక నుంచి మన మార్కెట్కే పెద్ద పీఠ వేయాలయన్నారు. ఈ రోజు(మంగళవారం) గుజరాత్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తయారు చేసే విదేశీ తరహా వస్తువుల్ని కొనాల్సిన అవసరం లేదనే సంకేతాలిచ్చారు. ఇక నుంచి ఏ వస్తువైనా మేడిన్ ఇండియాది అయితేనే కొందామని దేశ ప్రజలకు విజ్క్షప్తి చేశారు. హెలీ, దీపావళి, గణేష్ చతుర్థి.. ఏ పండుగ అయినా మేడిన్ వస్తువులనే కొందామంటూ ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. ‘ దేశ ప్రజలకు ఇదే నా విన్నపం. ప్రొడక్టులు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కొనండి. మన ఇండియా వస్తువులనే ఇక నుంచి ఎక్కువగా వాడదాం. అవసరం అయితే తప్పితే దిగుమతులుపై పెద్దగా ఆధాపడవద్దు. చైనా ప్రొడక్టులు అస్సలే కొనొద్దు. వస్తువులు కొనేటప్పుడు చైనా డంప్ ను తనిఖీ చేయండి. ఆపరేషన్ సిందూర్ అనేది 140 కోట్ల భారతీయల బాధ్యత’ అని మోదీ స్పష్టం చేశారు.మనం విదేశీ మార్కెట్ను పెంచుతున్నాం.. గ్రహించండిభారత మార్కెట్లను విదేశీ దిగుమతులు ఏ రకంగా ముంచెత్తుతున్న ఉదాహరణలను ఉటంకిస్తూ, దురదృష్టవశాత్తు, గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుండే వస్తున్నాయి, చిన్న కళ్ల గణేష్ విగ్రహాలు కూడా కళ్ళు సరిగ్గా తెరవవు. హోలీ రంగులు కూడా విదేశీ తయారీవే. అవి తక్కువ ధరకే రావడంతో మనం వాటిని కొనేస్తున్నాం.. వారి మార్కెట్ ను ఇక్కడ పెంచుతున్నాం. ఇక్కడ మన కళాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక నుంచి వాటికి దూరంగా ఉండండి. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి’ అని పేర్కొన్నారు.ఇది మీకు టాస్క్..తాను దేశ ప్రజలకు ఒక టాస్క్ ఇస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ‘ ఇక నుంచి ప్రతీ భారతీయుడు చేయాల్సిన టాస్క్ ఒకటి ఉంది. మన రోజువారీ జీవితంలో విదేశీ వస్తువుల్ని ఎన్ని వాడుతున్నాం అనేది లిస్ట్ రాసుకోండి. ఒక భారతీయుడిగా మీకు ఇస్తున్న టాస్క్ ఇది. 24 గంటల్లో విదేశీ వస్తువుల్ని ఎన్ని కొన్నాం అనేది ఒక లిస్ట్ తయారు చేసుకోండి. అయితే ఇక్కడ ఏది విదేశీ వస్తువు అనేది మీరు గ్రహించలేరు. మీరు కొనే హెయిర్ పిన్, దువ్వెన కూడా విదేశీ వస్తువే అనేది గ్రహించండి. ఇంతలా విదేశీ వస్తువులు కొనడానికి మొగ్గుచూపుతున్నాం. మేడిన్ ఇండియా ప్రొడక్టులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్ ను మీరు రక్షించాలనుకుంటే ఇక నుంచి మన వస్తువుల్నే ఎక్కువగా కొందాం. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రతీ పౌరుడు ఇది చేయాలి. భారత్ మరింత ఎదగాలంటే ఇది తప్పనిసరి. పాకిస్తాన్ కుట్రకు బదులిచ్చిన ఆపరేషన్ సిందూర్ అనేది మన బలగాల బాధ్యతే కాదు. 140 కోట్ల దేశ ప్రజల బాధ్యత అనేది గుర్తుంచుకోండి’ అని మోదీ పేర్కొన్నారు.

కవిత కొత్త పార్టీ ప్రకటన అప్పుడే.. చేరబోయేది ఎవరంటే
సాక్షి,హైదరాబాద్: ‘మై డియర్ డాడీ అంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. తండ్రి కేసీఆర్కు రాసిన ఆరు పేజీల లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించింది. అయితే, ఆ లేఖ బీఆర్ఎస్తో పాటు, ఆ పార్టీ కీలక నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో నాటి నుంచి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ కీలక నేతల గురించి, అంతర్గత వ్యవహారాల గురించి ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని ఒకరు? కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మరొకరు బహిరంగ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇదే తరహా సంచలన వ్యాఖ్యలు చేశారు.జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కవిత సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయనున్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న తరుణంలో కొత్త పార్టీ పేరుతో కేసీఆర్ కుటుంబం డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వారి కుటుంబంలో ఎవరికి ఎవరు నచ్చకపోయినా కవిత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు రఘునందన్ రావు. కేసీఆర్కు కవిత లేఖఇటీవల కేసీఆర్కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన సమయంలో రఘునందన్ రావు కవిత, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీ నా , ఆస్తుల పంచాయతీ నా? కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమని తెలుస్తోంది. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త పార్టీ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్కు సంబంధించిన పత్రిక, టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సీఎం ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఇటీవలే బీఆర్ఎస్ సిద్ధాంత కర్త, పునాది అని చెప్పుకునే వ్యక్తి హరీష్తో కొత్త పార్టీ పెట్టించాలని అన్నారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నం సాగుతున్నది. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఆపడం ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఏకంగా కవిత కొత్త పార్టీ పెట్టడమే కాదు, అందులో చేరబోయే నేతల గురించి ప్రస్తావిస్తూ రఘునందన్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఒకే ఇంట్లో షెహన్షా, బాద్షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్గా షారుక్ ఖాన్
ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్స్టార్ 'షారుక్ ఖాన్'ను కందేరే ప్రీమియం లైఫ్స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్కు, మరోవైపు ఆధునికత, డిజైన్పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్కు షారుక్ ఖాన్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్గా 75కి పైగా రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్షా (బచ్చన్) మరియు బాద్షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

ఆదాయానికి మించి ఆస్తులు.. పోలీసుల అదుపులో ఇన్స్టా క్వీన్
చండీఘడ్: మహీంద్రా థార్. రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ బైక్. కోట్ల విలువ చేసే రెండు ప్లాట్లు. రెండు ఐఫోన్లు. రోలెక్స్ వాచీ.. కోట్లు విలువ చేసే ఆస్తులు ఎవరివో తెలుసా? పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేసిన ఇన్స్టా క్వీన్ ఆమెందీప్ కౌర్వి. గత నెలలో పంజాబ్ పోలీస్ శాఖ ఆమెందీప్ కౌర్ని విధుల నుంచి తొలగించింది. పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ దేశ సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపారనే ఆధారాలతో సస్పెండ్ చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని నిజం చేస్తూ పోలీస్ శాఖ వేటు వేయడంతో కానిస్టేబుల్గా ఉన్న సమయంలో భారీ ఎత్తున డబ్బులు సంపాదించింది.ప్రభుత్వ ఉద్యోగం పోవడంతో సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఇన్ స్టా గ్రామ్ క్వీన్గా పేరు సంపాదించింది. అయితే, ఈ క్రమంలో పంజాబ్ విజిలెన్స్ బ్యూరో ఆమెను అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బథిండాలో జరిగిన విచారణ ఆధారంగా అవినీతి కేసు నమోదైంది.ఈ ఏప్రిల్ నెలలో మాదక ద్రవ్యాల కేసులో ఆమెందీప్ కౌర్పై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో జైలు పాలయ్యారు. అయినప్పటికీ, ఆమె మే 2 న బథిండా కోర్టు నుంచి బెయిల్పై విడుదల అయ్యారు. తాజాగా, విచారణలో పంజాబ్ పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేలా ఆమెందీప్ కౌర్కు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఆస్తులు మొత్తం రూ. 1.35 కోట్లగా ఉన్నాయి. వాటిని ఎన్డీపీసీ యాక్ట్ కింద సీజ్ చేశారు. ఈ ఆస్తులు రెండు ప్లాట్లు, మహీంద్రా థార్, రోలెక్స్ వాచీ, మూడు ఫోన్లు ఉన్నాయి.సీజ్ చేసిన ఆస్తులు లెక్కిస్తేవిరాట్ గ్రీన్, బథిండా (217 చదరపు యార్డులు): రూ.99,00,000డ్రీమ్ సిటీ, బథిండా (120.83 చదరపు యార్డులు): రూ.18,12,000థార్ కార్: రూ.14,00,000రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్: రూ.1,70,000ఐఫోన్ 13 ప్రో మాక్స్: రూ.45,000ఐఫోన్ ఎస్ఈ: రూ.9,000వివో ఫోన్: రూ.2,000బ్యాంక్ బ్యాలెన్స్ (SBI): రూ. 1,01,588.53రోలెక్స్ వాచీ: ధర తెలియాల్సి ఉంది. విచారణ సందర్భంగా 2018 నుంచి 2025 వరకు ఆమె సంపాదించిన ఆస్తుల గురించి ఆరా తీశారు. ఆమె తీసుకున్న జీతం, బ్యాంకు అకౌంట్లు, ఆమెకు ఉన్న అప్పులను అధికారులు పరిశీలించారు.విచారణలో ఆమె ఖర్చులు తన ఆదాయాన్ని దాటినట్టు తేలింది. ఇన్స్టా క్వీన్ అనే పేరు దక్కించుకున్న ఆమె ఇన్స్టా గ్రామ్లో ఖరీదైన వస్తువులతో వీడియోలను పోస్ట్ చేసింది. వాటి ఆధారంగా ఆమె ఆదాయంపై అధికారుల కన్ను పడింది. ఆమెందీప్ కౌర్ 2018 నుండి 2024 మధ్య మొత్తం రూ.1.08 కోట్ల ఆదాయం సంపాదించింది. కానీ ఆమె ఖర్చులు రూ. 1.39 కోట్లు పైగా ఉన్నాయి. అంటే రూ.31.27 లక్షలు ఆమె ఆదాయానికి మించిన ఖర్చు చేశాయి. 28.85 శాతం ఆమె చట్టబద్ధమైన ఆదాయానికి మించి ఉంది. మే 26న జరిపిన విచారణ ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ బ్యూరో అధికారులు ఆమెను అదపులోకి తీసుకున్నారు.

12 టీబీ డాటా డిలీట్ చేసి.. ఐఎస్ఐ ఏజెంట్లతో ముచ్చట్లు
పాకిస్తాన్కు గూఢచర్యం చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో.. తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పాక్ నిఘా సంస్థ.. కరడుగట్టిన ఐఎస్ఐ(Inter-Services Intelligence) అధికారులతో ఆమె నేరుగా పరిచయాలు కలిగి ఉందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) ఏమాత్రం భయం లేకుండా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరి తర్వాత మరొకరితో మాట్లాడింది కూడా. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఐఎస్ఐలో వాళ్లు ఏం పని చేసేవాళ్లో కనుగొనే పనిలో దర్యాప్తు అధికారులు తలమునకలయ్యారు. అంతకు ముందు..జ్యోతి వ్యక్తిగత డివైజ్లను(ఫోన్లు, ల్యాప్ట్యాప్) పోలీసులు సీజ్ చేశారు. ఆ డివైజ్ల్లో భారీగా మెసేజ్లు, డాటా డిలీట్ అయినట్లు గుర్తించారు. ఆ డిలీట్ డాటానే సుమారు 12 టీబీ(12 terabyte) దాకా ఉండొచ్చని తెలుస్తోంది. అందులోని సమాచారం ఈ కేసుకు ఉపకరించే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరిట భారత సైన్యం పాక్ భూభాగంతో పాటు పీవోకేలో వైమానిక దాడులు జరిపింది. ఆపై వారానికి(మే 15వ తేదీన ) యూట్యూబ్లో ట్రావెల్ వ్లోగింగ్ చానెల్ నడిపించే జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్కు గూఢచర్యం జరిపి ఉంటుందనే అనుమానిస్తున్నారు. పాక్, చైనాలో పర్యటనలతో పాటు పాక్లో జరిగిన హైప్రొఫైల్ ఈవెంట్లకు ఆమె హాజరు కావడం, కేవలం 4 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆమె విచ్చలవిడిగా అక్కడ ఖర్చులు చేయడం, అలాగే గన్మెన్లతో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందిందన్న విషయం వెలుగులోకి రావడంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికి.. అఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై హర్యానా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాక్లో ఆమె అసలు వీఐపీ ట్రీట్మెంట్ ఎందుకు పొందింది? ఎలా పొందగలిగింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. డిలీట్ చేసిన డాటాలో గనుక కీలక సమాచారం ఉన్నట్లయితే ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. ఆమె ఆర్థిక లావాదేవీలపై విచారణ కోసం పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విదేశీ భార్యల మోజు వద్దు!

మరో వివాదంలో గుడ్ బ్యాడ్ అగ్లీ.. లీగల్ యాక్షన్ తీసుకుంటానన్న స్టార్ హీరో తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా ఈ మూవీపై మరో వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో మూడు పాటలను ఉపయోగించడంపై నటుడు ధనుశ్ తండ్రి, చిత్రనిర్మాత కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన చిత్రాల్లోని మూడు పాటలు - పంజు మిట్థై, ఓథా రూబా థారెన్, తూటువలై ఇలై అరాచి లాంటి పాటలు వినియోగించారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారని ఆయన విమర్శించారు.కస్తూరి రాజా మాట్లాడుతూ.. 'ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్య తీసుకుంటా' అని తెలిపారు.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్)ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్..కాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓథా రూబా థారెన్ పాటను ఉపయోగించారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా తన మూడు పాటలను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపారు. రూ. కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కోరారు. మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించినప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. మేము సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతి తీసుకున్నామని తెలిపారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలా వరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు.

రూ.5.5 లక్షల నుంచి.. ఏడాదికే రూ.45 లక్షలు: టెకీ ట్వీట్
సాధారణంగా ఉద్యోగంలో చేరితే.. ప్రతిఏటా 10 శాతం లేదా 20 శాతం శాలరీ హైక్ ఉంటుంది. కొన్ని కంపెనీలలో హైక్ అనేమాట చాలా అరుదుగా వినిపిస్తుంది. కానీ ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక ఏడాదిలోనే కనీవినీ ఎరుగని ఆఫర్ పొందినట్లు. తన జీతం కూడా దాదాపు 10 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ క్కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీకి చెందిన ఒక యువ సాఫ్ట్వేర్ డెవలపర్ తన కెరీర్ ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే తన జీతం.. రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు చేరిందని పేర్కొన్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేష్ అనే టెక్నీషియన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తాను ఐబీఎంలో రూ. 5.5 లక్షల సీటీసీకి ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ. 45 లక్షల ఆఫర్ ఉందని చెప్పాడు. నాలాంటి మధ్యతరగతి వ్యక్తికి, ఇది ఇప్పటికీ ఒక కల అని చెప్పుకొచ్చాడు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కొందరు అతన్ని ప్రశంసించారు, మరొకొందరు తమ అనుమానాలను వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఏఐ పరిస్థితి ఇంతే!.. ఉద్యోగులకు భయమేలకెరీర్ ప్రారంభంలో జీతం కంటే నైపుణ్యాలపై ద్రుష్టి పెట్టాలి. అలాంటప్పుడే మీకు మంచి ప్యాకేజీ లభిస్తుంది. ప్రారంభంలో తక్కువ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరినా దిగులు పడొద్దు, ఎందుకంటే మీ నైపుణ్యాలను పెంచుకుంటూ పోతే తప్పకుండా మంచి ఆఫర్స్ వస్తాయని టెకీ పేర్కొన్నాడు.Never mentioned it but tbh, I still sometimes think I am still in a dream, bcoz I started my full time career last year at IBM with just a CTC of 5.5 LPA, and now having an offer of over 45 LPA CTC in hand within an year, for a middle class guy like me, it's still a dream❤️.— Devesh (@theywayshhh) May 26, 2025

థియేటర్లకు పవన్ మళ్లీ వార్నింగ్
విజయవాడ: కూటమి ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్.. థియేటర్లు తమ బంద్ నిర్ణయాన్ని విరమించినా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ మేరకు థియేటర్లకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్.సినిమా హాళ్లలో ధరలపై విచారణ జరపాలంటూ ఆదేశించారు ఈ మేరకు మంత్రి దుర్గేష్ తో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. సినిమాహాళ్ల బంద్ నిర్ణయంపై సైతం విచారణ జరిపించాలని ఆదేశించారు. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ ధరలపై విచారణకు ఆదేశించారు.తన శాఖకు సంబంధం లేకపోయినా విచారణకు ఆదేశించడం గమనార్హం. దీనిలో భాగంగా పవన్ కల్యాణ్ కార్యాలయం మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో సినిమా టికెట్ల ధరల పెంపునకు రావొద్దని హెచ్చరించింది. ఒకవేళ టికెట్ల ధరలు పెంచాలంటే ఫిలిం చాంబర్ ద్వారా రావాలని ఆదేశాల్లో పేర్కొంది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని ఆదేశాల్లో డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.మల్టీఫ్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర ఫిలిం డెవలప్ మెంట్ పాలసీ తేవాలని నిర్ణయించారు. గతంలో సినిమా రంగంపై ప్రభుత్వం జోక్యం ఏంటంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వరుస పెట్టి ఇండస్ట్రీని వేధింపులకు గురి చేయడం చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీని లొంగదీసుకుని విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఏంటనే విమర్శ వినిపిస్తోంది. గతంలో టికెట్ల ధరలను నియంత్రించిన సందర్భంలో సైతం అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. ఇలా పవన్ ద్వంద్వ వైఖరి ఏమిటనే విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు. అప్పుడు ఆ రకంగా ఊగిపోయారు.. ఇప్పుడు ఈ రకంగా లొంగదీసుకోవాలని చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు.. పోలీసుల అదుపులో ఇన్స్టా క్వీన్
'కన్నప్ప మూవీపై పెద్ద కుట్ర'.. నిర్మాణ సంస్థ సంచలన లేఖ!
జర్మన్ బ్రాండ్తో చేతులు కలిపిన నీరజ్ చోప్రా
మత్స్యరూపం.. శుభ సంకల్పం
LSG VS RCB: అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ మార్ష్
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?: వైఎస్ జగన్
ఆల్ ఇన్ వన్ ప్లాన్: రూ.279 రీఛార్జ్తో ప్రయోజనాలెన్నో..
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
రజినీకాంత్ కూలీ.. పారితోషికం ఏకంగా అన్ని కోట్లా?
ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకిన పాక్ ప్లేయర్
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
పారిపోండ్రోయ్..!!
భర్త, పిల్లలు వద్దు.. సురేశ్ కావాలని కాళహస్తిలో..
రేవ్ పార్టీ.. 20 మంది అమ్మాయిలు అరెస్టు..!
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
427 మంది రోహింగ్యాల జల సమాధి
భారత్తో మనుగడకే ప్రమాదం
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
వద్దుసార్! ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తోనే ఊపిరాడటం లేదు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
మీ పనే బాగుంది సార్! ముందు యుద్ధాలకు ఉసిగొల్పి.. తర్వాత కాల్పుల విరమణ అని భలే బిల్డప్ ఇస్తున్నారు!!
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
అంబాసిడర్ 2.0: దశాబ్దం తరువాత..
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఆదాయానికి మించి ఆస్తులు.. పోలీసుల అదుపులో ఇన్స్టా క్వీన్
'కన్నప్ప మూవీపై పెద్ద కుట్ర'.. నిర్మాణ సంస్థ సంచలన లేఖ!
జర్మన్ బ్రాండ్తో చేతులు కలిపిన నీరజ్ చోప్రా
మత్స్యరూపం.. శుభ సంకల్పం
LSG VS RCB: అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ మార్ష్
చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?: వైఎస్ జగన్
ఆల్ ఇన్ వన్ ప్లాన్: రూ.279 రీఛార్జ్తో ప్రయోజనాలెన్నో..
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
రజినీకాంత్ కూలీ.. పారితోషికం ఏకంగా అన్ని కోట్లా?
ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకిన పాక్ ప్లేయర్
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
పారిపోండ్రోయ్..!!
భర్త, పిల్లలు వద్దు.. సురేశ్ కావాలని కాళహస్తిలో..
రేవ్ పార్టీ.. 20 మంది అమ్మాయిలు అరెస్టు..!
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
427 మంది రోహింగ్యాల జల సమాధి
భారత్తో మనుగడకే ప్రమాదం
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
వద్దుసార్! ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తోనే ఊపిరాడటం లేదు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
మీ పనే బాగుంది సార్! ముందు యుద్ధాలకు ఉసిగొల్పి.. తర్వాత కాల్పుల విరమణ అని భలే బిల్డప్ ఇస్తున్నారు!!
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
అంబాసిడర్ 2.0: దశాబ్దం తరువాత..
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఆర్టీసీలో ఇక ఔట్సోర్సింగ్ కండక్టర్లు
సినిమా

'నేను మరొకరిలా ఉండేందుకు రాలేదు'.. ఐశ్వర్యతో పోలికపై మండిపడ్డ ఊర్వశి భామ!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. విభిన్నమైన డ్రెస్సులతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఫోటోలకు పోజులిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది ముద్దుగుమ్మ. అయితే ఈ ఫెస్టివల్లో ఊర్వశి తీరుపై విమర్శలొచ్చాయి. తన ఫోటో షూట్ కోసం మెట్లను బ్లాక్ చేశారంటూ సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. కానీ అలాంటిదేం జరగలేదని.. తాను ముందే అనుమతి తీసుకున్నానని తెలిపింది ఊర్వశి రౌతేలా.అంతేకాకుండా ఈ కాన్స్ ఫెస్టివల్కు హాజరైన ఐశ్వర్య రాయ్తో కొందరు పోల్చడంతో ఊర్వశి మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఐశ్వర్య ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో మాత్రమే కనిపించింది. కాన్స్లో గుర్తింపు పొందిన ఐశ్వర్యతో పోల్చడం ఎవరికైనా గౌరవప్రదమైన విషయం అయినప్పటికీ.. నెటిజన్స్ కామెంట్ చేయడంపై ఊర్వశి స్పందించింది. ఈ మేరకు ఇన్స్టా స్టోరీస్లో క్లారిటీగా రాసుకొచ్చింది.ఊర్వశి తన ఇన్స్టాలో రాస్తూ.. "నేను నా సొంత చరిష్మాతో ఐశ్వర్య రాయ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే డార్లింగ్ ఐశ్వర్య ఓ ఐకానిక్. కానీ నేను మరొకరిలా నకిలీగా ఉండటానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నేను ఒక బ్లూ ప్రింట్. కాన్స్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా నిలబడటానికే వచ్చా. నా లుక్, నా స్టైల్, నా విశ్వాసం మీకు అసౌకర్యంగా అనిపిస్తే గట్టిగా ఓ శ్వాస తీసుకోండి. నేను అందరికీ నచ్చే వ్యక్తిని కాదు. నేను ఎల్లప్పుడు బాణసంచా, షాంపైన్ లాగా ఉంటా. నాపై ఎన్ని విమర్శలొచ్చినా ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటా. ఎందుకంటే ఎవరూ మీలాగా చేయరు.' అని రాసుకొచ్చింది.

నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా తీయడం మాటేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా ఈ సినిమా కాస్త సైడ్ అయింది. కానీ మరో నెలలో రిలీజ్ పెట్టుకుని, ఇప్పుడు హార్ట్ డిస్క్ దొంగతనం జరగడంతో సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.దొంగతనానికి గురైన హార్డ్ డిస్క్లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు సీజీ వర్క్స్కి సంబంధించిన దాదాపు 90 నిమిషాల కంటెంట్ ఇందులో ఉందని అంటున్నారు. అసలు ఇంత ముఖ్యమైన హార్డ్ డిస్క్ని ముంబై నుంచి కొరియర్ లో పంపడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాయం కావడం, దీంతో మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఇప్పుడు ఈ విషయాలపై స్వయంగా మంచు విష్ణు స్పందించాడు. మొత్తంగా కాకుండా సింపుల్గా ఒక్క ఫొటో పోస్ట్ చేశాడు. అందులో..'జటాజూఠదారీ నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?' అని ట్వీట్ చేశాడు. అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇవన్నీ చూస్తుంటే సినిమా వాయిదా పడటం గ్యారంటీ అనిపిస్తుంది.ఈ సంగతి అలా ఉంచితే 'కన్నప్ప' ఓటీటీ డీల్ కూడా ఇంకా సెట్ కాలేదని, అంతా చూస్తుంటే జూన్ 27న చెప్పిన తేదీకి థియేటర్ విడుదల కావడం కష్టమేమో అనిపిస్తుంది. మూవీ టీమ్ మాత్రం చెప్పిన డేట్కి రావడం పక్కా అని అంటున్నారు. మరి నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి ఇక?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్)#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025

స్టార్ హీరో ఇంట్లోకి ప్రవేశించిన మహిళ.. చివరికి ఏమైందంటే?
బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో గుర్తు తెలియని మహిళ ప్రవేశించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో ఇంటికి వచ్చిన ఆమె పనిమనిషితో ఆదిత్య రాయ్ కపూర్ను కలిసేందుకు వచ్చానని తెలిపింది. ఆయన కోసం బహుమతులు కూడా తీసుకొచ్చానని చెప్పింది. దీంతో ఆమెను ఇంట్లోకి అనుమతించారు. కానీ ఆ సమయంలో ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేరని సమాచారం.ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంట్లోకి మహిళ వచ్చిన విషయాన్ని ఆ తర్వాత హీరోకు సిబ్బంది తెలియజేశారు. దీంతో ఆదిత్య రాయ్ కపూర్ వెంటనే హౌసింగ్ సొసైటీ అధికారులను సంప్రదించగా.. వారు ఖర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 47 ఏళ్ల గజాలా సిద్ధిక్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.అయితే ఈ కేసు దర్యాప్తులో ఇది సిద్ధిక్కు ఇలా చేయడం మొదటి సారి కాదని తెలిసింది. గత వారంలో ఆమె సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దుబాయ్ నివాసిగా చెప్పుకునే గజాలా సిద్ధిక్.. ఆదిత్య రాయ్ కపూర్ను కలవడానికి ముంబైకి వచ్చానని పోలీసులతో చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన బాలీవుడ్ ప్రముఖులను సంప్రదించడానికి ఆమె పదే పదే ప్రయత్నించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
గత నెలలో థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఓవర్సీస్ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంక్ రాబరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన సినిమా 'చౌర్యపాఠం'. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 24న థియేటర్లలోకి వచ్చింది. కానీ వచ్చినంత వేగంగానే మాయమైపోయింది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం దాదాపు 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరమ్ లాంటి స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలతో పాటు 'అజ్ఞాతవాసి' అనే కన్నడ థ్రిల్లర్ మూవీ చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. మూవీ లవర్స్కి అయితే ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లిస్టులోకే 'చౌర్యపాఠం' కూడా వచ్చి చేరింది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హెచ్సీఏ పాత్ర.. విచారణలో సంచలన విషయాలు
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పాత్రపై విజిలెన్స్ విచారణ పూర్తయ్యింది. ప్రాథమిక నివేదికను విజిలెన్స్ ప్రభుత్వానికి పంపింది. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. టికెట్ల విషయంలో హెచ్సీఏ అధ్యక్షుడు సన్రైజర్స్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పది శాతం టికెట్లు ఉచితంగా ఇస్తున్నా.. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్సీఏ కార్యదర్శి ఒత్తిడి చేసినట్లు రుజువైంది. విజిలెన్స్ తమ నివేదికలో హెచ్సీఏపై చర్యలకు సిఫార్సు చేసింది.కాగా, అదనపు టికెట్ల కోసం హెచ్సీఏ ఒత్తిడి తెస్తుందని సన్రైజర్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదని సన్రైజర్స్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశాడు. వ్యక్తిగతంగా తనకు మరో పది శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సన్రైజర్స్ మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. సన్రైజర్స్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ల సందర్భంగా జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురి చేశాడు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేయించాడు.

IPL 2025: రోహిత్ చాలా అనాసక్తిగా ఆడుతున్నాడు.. భారత మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్లో అతను 13 మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ ఈ సీజన్లో ఓ మోస్తరుగా రాణిస్తున్నా విమర్శకులు అతన్ని టార్గెట్ చేస్తున్నారు.రోహిత్ ప్రదర్శనలు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు పెద్దగా ఉపయోగపడలేదని అంటున్నారు. హిట్మ్యాన్ చాలా నిర్లక్ష్యంగా, అనాసక్తిగా ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. తాజాగా హిట్మ్యాన్ వ్యతిరేకులతో భారత మాజీ బౌలర్ అతుల్ వాసన్ కూడా గళం కలిపాడు.ఈ సీజన్లో రోహిత్ ప్రదర్శనలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడా జీవితంలో అన్ని సాధించాక రోహిత్ చాలా అనాసక్తిగా కనిపిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. రోహిత్లో ప్రేరణ కొరవడిందని అన్నాడు. ప్రేరణ కోసం అతను లక్ష్యాలను సెట్ చేసుకోవాలని సూచించాడు.వాసన్ వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నప్పటికీ అతని అభిప్రాయంతో ఏకీభవించాల్సిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయినప్పటి నుంచి రోహిత్లో ఏదో తెలినీ తేడా కనిపిస్తుంది. మునుపటిలా అతను జట్టు కోసం ఆడటం లేదు. చాలా నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ సీజన్లోనూ అదే జరిగుతుంది. ఒకటి, రెండు మ్యాచ్లు మినహా రోహిత్ శ్రద్దగా ఆడింది లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతూ జట్టు జయాపజయాల పట్ల పట్టీపట్టనట్లున్నాడు. టీమ్లో అతని ఇన్వాల్మెంట్ ఎక్కడా కనిపించడం లేదు. ఎవరి కోసమో అడుతున్నా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో అతని బాండింగ్ మొదటి నుంచే మిస్ అయినట్లు కనిపిస్తుంది. రోహిత్ అభిమానులు పైకి ఏమీ చెప్పలేకపోతున్నా అసలు విషయం వారికి బాగా తెలుసు. తమ ఆరాధ్య ఆటగాడు వంద శాతం కమిట్మెంట్తో ఆడటం లేదని లోలోపల వారూ మదనపడుతున్నారు.సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, రికెల్టన్ ప్రతిభ, బౌలర్ల కష్టంతో ముంబై ఇండియన్స్ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు నెగ్గుకొస్తుందన్న ఆశలు లేవు. అదే రోహిత్ వంద శాతం కమిట్మెంట్తో ఆడితే ఫలితం అనుకూలంగా రావచ్చు.

ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరే..?
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్లు (పంజాబ్, గుజరాత్, ఆర్సీబీ, ముంబై) ఇదివరకే ఖరారయ్యాయి. క్వాలిఫయర్-1 (పంజాబ్), ఎలిమినేటర్ (ముంబై) మ్యాచ్ల్లో కూడా ఒక్కో బెర్త్ ఖరారైంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన జట్లు (సీఎస్కే, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, లక్నో, ఢిల్లీ) తదుపరి సీజన్లో మరింత బలంగా తిరిగి రావాలని ఆశిస్తున్నాయి. కొన్ని జట్లు తదుపరి సీజన్లో ఎవరిని వదిలించుకోవాలో, ఎవరిని అట్టిపెట్టుకోవాలో అన్నదానిపై ఇప్పటికే ఓ అంచనా కలిగి ఉన్నాయి.ఆటగాళ్ల రిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే వెటరన్ ఆటగాళ్ల ప్రస్తావన వస్తుంది. కొందరు వెటరన్లు లీగ్ ప్రారంభం నుంచి ఆడుతూ ఇంకా కొనసాగుతున్నారు. వీరిలో కొందరకి ఈ సీజన్ ఆఖరిదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే ఆటగాళ్ల ప్రస్తావన వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ధోని. 44 ఏళ్ల ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమైనా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ధోనికి ఈ సీజన్ ఆఖరిదని చాలామంది అంటున్నారు. ధోని ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ.. రిటైర్ కానని కూడా ఖరాఖండిగా చెప్పలేదు. ధోని ఈ సీజన్లో ఆటగాడిగా, కెప్టెన్గా దారుణంగా విఫలమయ్యాడు. అతడిపై వయోభారం స్పష్టంగా కనిపిస్తుంది.ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. 39 ఏళ్ల అశ్విన్ను ఈ సీజన్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే యాష్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. కుర్ర విధ్వంసకర బ్యాటర్ల ముందు అతని మాయాజాలం పని చేయలేదు. జట్టు నుంచి స్వతహాగా వైదొలగాలని సొంత జట్టు అభిమానులే కోరుకున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెప్పడం గ్యారెంటీ అని తెలుస్తుంది.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో స్టార్ క్రికెటర్ ఫాప్ డుప్లెసిస్. ఫాఫ్ను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ మోస్తరు ధరకే సొంతం చేసుకుంది. వయసు మీద పడటంతో ఫాఫ్ మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు. అందుకే అతన్ని ఆర్సీబీ వదిలించుకుంది. 40 ఏళ్ల ఫాఫ్ కుర్ర బ్యాటర్లతో పోటీపడి గతంలోలా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. వాస్తవానికి ఆర్సీబీ వదిలించుకున్నప్పుడే అతని పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ ఏదో ప్రణాళికతో అతన్ని దక్కించుకుంది. తీరా అది కూడా ఫ్లాప్ అయ్యింది.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ. త్వరలో 38లో అడుగుపెట్టనున్న మొయిన్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెబుతాడని టాక్ నడుస్తుంది. ఈ సీజన్లో మొయిన్ను కేకేఆర్ నామమాత్రపు ధరకు సొంతం చేసుకుంది. మొయిన్ ఫ్రాంచైజీ నమ్మకానికి వంద శాతం న్యాయం చేయలేకపోయినా, పర్వాలేదనిపించాడు. మొయిన్ విదేశీ లీగ్లపై దృష్టి పెట్టేందుకు తనకు పెద్దగా డిమాండ్ లేని ఐపీఎల్ను వదిలేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.పైన పేర్కొన్న ఆటగాళ్లే కాకుండా విజయ్ శంకర్ (సీఎస్కే), మోహిత్ శర్మ (ఢిల్లీ), అజింక్య రహానే (కేకేఆర్) కూడా ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు గుడ్బై చెప్పవచ్చని టాక్ నడుస్తుంది.

వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (మే 26) జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.రాణించిన హీథర్ నైట్స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ హీథర్ నైట్ అజేయ అర్ద సెంచరీతో (66) రాణించడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో నాట్ సీవర్ బ్రంట్ 37, ఆమీ జోన్స్ 22,అలైస్ క్యాప్సీ 4, సోఫియా డంక్లీ 3, ఎమ్ ఆర్లాట్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, జైదా జేమ్స్, క్లాక్స్ట్న్ తలో వికెట్ పడగొట్టారు.హేలీ పోరాటం వృధా145 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. ఆ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ (71) ఒంటరిపోరాటం చేసినా గెలవలేకపోయింది. విండీస్ ఇన్నింగ్స్లో మాథ్యూస్తో పాటు గ్రిమ్మండ్ (15), గజ్నబి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు లారెన్ బెల్, ఆర్లాట్, చార్లోట్ డీన్, లిన్సే స్మిత్ తలో రెండు వికెట్లు పడగొట్టి విండీస్ను కట్టడి చేశారు.30 నుంచి ప్రారంభంకాగా, మూడు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ నిన్నటితో ముగియగా.. మే 30 (డెర్బీ), జూన్ 4 (లీసెస్టర్), 7 తేదీల్లో (టాంటన్) మూడు వన్డేలు జరుగనున్నాయి.
బిజినెస్

నెలకు రూ.10వేలుతో ₹1.6 కోట్లు
1994లో ప్రారంభమైన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్ (ABSLAMC) సంస్థకు ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ & సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్ వంటివి ప్రమోటర్లు, ప్రధాన వాటాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఏబీఎస్ఎల్ఏఎంసీ, ఇండియన్ ట్రస్ట్స్ యాక్ట్ 1882 ప్రకారం నమోదైన.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్కు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా సేవలు అందిస్తోంది.ఇటీవల నిర్వహించిన 'వెల్త్ క్రియేషన్ స్టడీ' ప్రకారం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ద్వారా నెలవారీగా రూ.10,000 చొప్పున 25 సంవత్సరాల పాటు కొనసాగించిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా రూ.1.6 కోట్లకు పైగా విలువను సాధించింది. ఈ కాలంలో ఫండ్ 11.7 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటును నమోదు చేసినట్లు ఈ అధ్యయనం సూచించింది.పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్ అవకాశాలను, తక్కువ స్థాయిలో ఉన్న అస్థిరతతో అన్వేషించాలనుకునే పెట్టుబడిదారులకు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఈ ఫండ్ మార్కెట్ మదింపుల ఆధారంగా ఈక్విటీ, స్థిర ఆదాయ పెట్టుబడుల మోతాదును డైనమిక్గా సమతుల్యం చేస్తుంది. ఈ ఫండ్లోని డైనమిక్ అసెట్ అలోకేషన్ మోడల్ అధిక విలువల వద్ద ఈక్విటీ ఎక్స్పోజర్ను స్వయంచాలకంగా తగ్గించడంతో పాటు, రాబడుల్లో అస్థిరతను తగ్గించడంలో సహాయపడుతుంది.చారిత్రాత్మకంగా పరిశీలించినట్లయితే.. విస్తృత మార్కెట్లతో పోల్చినపుడు ఈ ఫండ్ తక్కువ డ్రాడౌన్లు (నష్టాల తీవ్రత) కలిగి ఉండి, వేగంగా పునరుద్ధరణను సాధించింది. ఈ ఫండ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే.. నష్టాల నుంచి స్థిరమైన రక్షణ కల్పించడం. 2015 తర్వాత, ఈ ఫండ్ సగటు 52 శాతం నికర ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ, నిఫ్టీ రాబడిలో 80 శాతం వరకు సంపాదించడంలో విజయం సాధించింది.ఫండ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్ ఎండీ & సీఈఓ ఎ. బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ.. ''ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేయడం అనేది.. కేవలం ఒక పనితీరు ఆధారిత మైలురాయి మాత్రమే కాదు, ఇది మా పెట్టుబడిదారుల శాశ్వతమైన విశ్వాసానికి, అలాగే మా బృందం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. మార్కెట్ స్థితిగతుల ఆధారంగా ఈక్విటీ, స్థిర ఆదాయ ఎక్స్పోజర్ను డైనమిక్గా సర్దుబాటు చేయడం ద్వారా తక్కువ అస్థిరతతో సహేతుకమైన రాబడులు అందించడమే ఈ ఫండ్ యొక్క లక్ష్యం అని అన్నారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?ఇది పెట్టుబడిదారులకు ఆత్మవిశ్వాసంతో కూడిన పెట్టుబడి అనుభూతిని కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండ్, నాణ్యమైన, సమతుల్య పోర్ట్ఫోలియో నిర్వహణకు కట్టుబడి, ఆల్ఫా సృష్టి లక్ష్యంతో వివిధ రంగాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ తమ పెట్టుబడిదారులకు అత్యుత్తమ పెట్టుబడి అనుభవం అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. మార్కెట్ మార్గసూచకాలు ఎలాంటి దశలో ఉన్నా.. బుల్ అయినా బేర్ అయినా.. మాపై విశ్వాసం కొనసాగించిన ప్రతీ ఒక్క పెట్టుబడిదారునికి మరియు వ్యాపార భాగస్వామికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బాలసుబ్రమణియన్ అన్నారుఈ ఫండ్ను హరీష్ కృష్ణన్, లవ్లీష్ సోలంకి, మోహిత్ శర్మ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. 2025 ఏప్రిల్ 30 నాటికి, ఈ ఫండ్కి రూ.7,500 కోట్లకు పైగా ఆస్తులు నిర్వహణలో ఉన్నాయి.

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 591.52 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో.. 81,584.94 వద్ద, నిఫ్టీ 174.95 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 24,826.20 వద్ద నిలిచాయి.నూపూర్ రీసైక్లర్స్, బోరానా వీవ్స్ లిమిటెడ్, శ్రీరామ్ ప్రాపర్టీస్, క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్, కామ్లిన్ ఫైన్ సైన్సెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్, ట్రాక్సన్ టెక్నాలజీస్, బజాజ్ హెల్త్కేర్, పార్శ్వనాథ్ డెవలపర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

ఏఐ పరిస్థితి ఇంతే!.. ఉద్యోగులకు భయమేల
గత కొంతకాలంగా ఉద్యోగులను భయపెడుతున్న ఒకే ఒక అంశం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని, ప్రపంచంలోని చాలా దేశాల్లో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుందని.. కొందరు నిపుణులు కూడా వెల్లడించారు. ఇందులో ఏ మాత్రం నిజం ఉంది?, నిజంగానే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?, నివేదికలు ఏం చెబుతున్నాయనే.. విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఏఐ దాదాపు అన్ని రంగాల్లోనూ.. సంచనలం సృష్టించింది. దీంతో చాలామంది భయపడ్డారు. అయితే ప్రస్తుతం కొన్ని నివేదికలు మాత్రం ఊహించినదానికి భిన్నంగా ఉన్నాయని, ఉద్యోగాలు ఎక్కడికీ పోవని చెబుతున్నాయి. అమెరికా డేటా.. ఏఐ ఉన్నప్పటికీ ఏడాదిలో ఇంటర్ప్రిటేషన్, ట్రాన్స్లేషన్కి సంబంధించిన ఉద్యోగాలు ఏడు శాతం పెరిగాయని చెబుతోంది. మనుషులను ఏఐ రీప్లేస్ చేస్తుందని చెప్పిన కంపెనీలు కూడా.. ఇప్పుడు మనిషి అవసరం ఖచ్చితంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.సగటు ఉద్యోగులతో పోలిస్తే.. ఫ్రెషర్లు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అమెరికా డేటా వెల్లడించింది. ఏఐ రాకముందు కూడా ఫ్రెషర్స్ ఈ పరిస్థితులనే ఎదుర్కొన్నారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకున్నవారికి తప్పకుండా ఉద్యోగాలు లభించకుండా ఉండే అవకాశం లేదు.చాలా కంపెనీలు ఏఐలను ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు చేసే పనుల్లో ఉపయోగిస్తున్నాయి. మొత్తం మీద అమెరికాలో ఉద్యోగులు లభించని ఫ్రెషర్స్ కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఉన్నారు. యూఎస్ఏలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా ప్రెషర్స్ పరిస్థితి ఇలాగే ఉంది. పరిస్థితులను చూస్తుంటే.. నిరుద్యోగులు పెరగడానికి లేదా ఉద్యోగాలు లభించకపోవడానికి కేవలం ఏఐ మాత్రమే కారణం చెప్పడానికి ఆస్కారం లేదు.బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో ఏఐ ఉన్నప్పటికీ.. ఉద్యోగుల జీతాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే.. ఉద్యోగులను తొలగించాలనే ఉద్దేశ్యం దాదాపు కంపెనీలకు లేదు, అంతే కాకుండా వారికి మంచి జీతాలను ఇవ్వడానికి కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.దిగ్గజ కంపెనీలన్నీ.. ప్రతి ఆపరేషన్లోనూ ఏఐలను తీసుకొస్తామని చెబుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యమైన పనులకు మాత్రం ఏఐలను ఉపయోగించడం లేదు. అమెరికాలో కేవలం 10 శాతం కంపెనీలు మాత్రమే ఏఐలను గూడ్స్ అండ్ సర్వీస్ కోసం విరివిగా వాడుతున్నారని తెలుస్తోంది.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిఒకవేళ కంపెనీలు ఏఐలను తీసుకున్నప్పటికీ.. ఉద్యోగులను వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏఐ మనిషిని రీప్లేస్ చేయదు, మనిషితో కలిసి పనిచేస్తుంది, పని వేగంగా జరగడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఏఐ వల్ల ఉద్యోగాలు భారీగా పోతాయనేది కేవలం ఓ అపోహ మాత్రమే. ప్రస్తుతానికి ఉద్యోగులు నిశ్చితంగా ఉండవచ్చు, అయితే.. మారుతున్న ప్రపంచంలో మనగలగాలి అంటే.. టెక్నాలజీలో ,ముందుండాలన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.

పేరుకు టాప్ కంపెనీ.. 3,000 మందికి లేఆఫ్స్?
స్వీడన్కు చెందిన వోల్వో కార్స్ ఖర్చు ఆదా ప్రణాళికలో భాగంగా సుమారు 3,000 ఆఫీస్ ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ పెరుగుతున్న ఖర్చులు, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బలహీనమైన డిమాండ్, వాణిజ్య అనిశ్చితిని ఎదుర్కొంటున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో సంస్థ లేఆఫ్స్కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.కంపెనీ మాజీ సీఈఓ హకన్ శామ్యూల్సన్ తిరిగి వోల్వోకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన కొన్ని వారాల్లోనే ఈమేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ చేసే దాదాపు 18 బిలియన్ స్వీడిష్ క్రౌన్లు (సుమారు 1.9 బిలియన్ డాలర్లు) తగ్గించే ప్రణాళికలను సీఈఓ ఏప్రిల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 40 శాతం వాటా కలిగిన వైట్ కాలర్ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇవ్వడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తున్నట్లు పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు యూరప్లో 29,000 మంది, ఆసియాలో 10,000 మంది, అమెరికాలో 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన లేఆఫ్స్ రీసెర్చ్, హ్యూమన్ రిసోర్సెస్, కమ్యూనికేషన్ వంటి వివిధ విభాగాల్లో ఉంటాయని శామ్యూల్సన్ తెలిపారు. వోల్వో కార్ కొత్త ఫైనాన్స్ చీఫ్ ఫ్రెడ్రిక్ హాన్సన్ మాట్లాడుతూ.. ఈ లేఆఫ్స్ వల్ల వ్యాపారం తాత్కాలికంగా ప్రభావితం చెందినా భవిష్యత్తులో మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఉద్యోగ తొలగింపులు ఎక్కువగా స్వీడన్లోని గోథెన్ బర్గ్లో ఉంటాయని చెప్పారు. ఇదీ చదవండి: ముఖేశ్ భాయ్ ట్రేడింగ్ చేశారా..?వోల్వో కార్స్ ప్రకారం.. దాదాపు 15% కార్యాలయ ఉద్యోగులను తొలగించనున్నారు. ఈ చర్య వల్ల కంపెనీపై 1.5 బిలియన్ క్రౌన్ల భారం పడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఇది దాని నిర్మాణాన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.
ఫ్యామిలీ

సీఈవోగా గృహిణి..! ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో..
మధ్యతరగతిలో పెరిగిన ఆమె పార్ట్ టైం జాబ్లు చేసి మరీ అమెరికా చదువుని పూర్తి చేసింది. చిన్నా.. చితక స్టోర్ల నుంచి ఆభరణాల స్టోర్ వరకు ప్రతిదాంట్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ..తన కాబోయే భర్తను కలుసుకుంది. అతడు కూడా ఆమెలానే రెస్టారెంట్ అంతస్తులు శుభ్రం చేసే హౌస్ కీపింగ్ స్థాయి నుంచి ఓ కంపెనీని స్థాపించే రేంజ్కి ఎదిగిన వ్యక్తి. ఇద్దరి కష్టపడేతత్వం, అభిరుచులు ఒక్కటై..స్నేహితులుగా, ఆ తర్వాత జంటగా మారారు. అలా ఇరువురు మంచి వ్యాపారవేత్తలుగా మారినా..గృహిణిగా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడక తన కాళ్లపై తాను నిలబడేందుకే మక్కువ చూపించింది. అలా ఆమె అనతికాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుని..అత్యంత లగ్జరీయస్ భవంతిలో నివాసం ఉండే స్థాయికి చేరుకున్నారామె. ఇప్పటికీ తనకు భర్త సంపాదనపై ఆధారపడి బతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదని చెబుతోంది. మరీ అంతలా సక్సెస్ని అందుకున్న ఆ గృహిణి ఎవరంటే..విలాసాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆ గృహిణే దుబాయ్కి చెందిన అనితా సురానీ. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె, అమెరికాలో చదువుకు కొనసాగించడానికి ఎన్నో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేది. ఒక కన్వీనియన్స్ స్టోర్ నుంచి జ్యువెలరీ స్టోర్ వరకు..ఇలా ప్రతి చిన్న పార్ట్ టైం ఉద్యోగాన్ని వదులుకోకుండా ఆహర్నిశలు కష్టపడి అమెరికా చదువుని విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలో అనిత తన ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన వ్యాపారం చేసే యత్నంలో ఉండగా..తన కాబోయే భర్త వ్యాపార భాగస్వామి మోయిజ్ ఖోజాను కలిసింది. మోయిజ్ కూడా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. అతడు కూడా ఒకప్పుడు రెస్టారెంట్ అంతస్తులను శుభ్రం చేసి, విజయవంతమైన టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. అతనితో కలిసి అనిత టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించింది. వ్యాపారభాగస్వాములుగా ఉన్న ఇద్దరు జీవిత భాగస్వాములయ్యారు. తమ వ్యవస్థాపక ప్రయాణం ఒక అమెరికన్ మాల్లోని ఒక చిన్న సెల్ ఫోన్ కియోస్క్తో ప్రారంభమైందని చెబుతోంది అనిత. అలా అలా విస్తరించి ఇవాళ దాదాపు 100కు పైగా దుకాణాలతో రిటైల్ సామ్రాజ్యంగా విస్తరించిందని తెలిపింది. ఇక మోయిజ్ ఈ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా..అనిత తన ఇంటీరియర్ డిజైన్ పట్ల ఉన్న ఆసక్తితో అటువైపుగా తన వ్యాపారాన్ని నిర్మించాలనుకుంది. అందుకోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక అనుభవజ్ఞుడైన సహోద్యోగితో భాగస్వామ్యం కుదుర్చుకుని..దుబాయ్లో జేనా ఇంటీరియర్స్ను ప్రారంభించింది. చూస్తుండగానే అతి కొద్దికాలంలో అనిత డిజైన్ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. జస్ట్ ఇద్దరు వ్యక్తుల నుంచి ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఇంటీరియర్ డిజైనర్లతో సహా 40 మందికి పైగా ఉద్యోగులకు విస్తరించింది. అయితే తన సక్సెస్కి ప్రేరణ తన కుమార్తె జెనా అని అంటోంది. జీవితాన్ని సమతుల్యం చేసుకునేలా ఎలా మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలో తన కూతురు చూపించాలనేదే తన ధ్యేయమని, అందుకోసమే ఓటమిని దరిదాపుల్లోకి రాకుండా కష్టపడతానని చెబుతోంది. అందుకోసమే తన కంపెనీకి కూడా తన కూతుర జెనా పేరుని పెట్టానని చెబుతున్నారామె. అనితా జెనా బోటిక్ కంపనీని కూడా నిర్వహిస్తోంది. ఇందులో అంతా మహిళా ఉద్యోగులే పనిచేస్తారని చెబుతోంది. లగ్జరీ భవంతి..ఆమె దుబాయ్ ఇల్లు అత్యంత లగ్జరీయస్గా..రెండు కళ్లు సరిపోవేమో..! అన్నంత అందంగా ఉంటుందట. ఆమె ఇంటి సీలింగ్ 24-క్యారెట్ల బంగారంతో చేసి ఉంటుందట. ఆమె ఆఫీస్ కూడా అంతే అందంగా లగ్జరీయస్ ఉంటుందట. అయితే అనిత తన వ్యాపారానికి నిధులు సమకూర్చుకోవడానికి కుటుంబ సంపదపై అస్సలు ఆధారపడదట. ఎందుకంటే తన భర్త స్పష్టమైన ఆర్థిక సరిహద్దులను నిర్దేశించారట, అందుకనుగుణంగానే నడుచుకుంటానంటోంది. తన ఆఫీస్ పెట్టుబడిని తిరిగి చెల్లించడమే గాక ఉద్యోగుల జీతాలను కూడా తానే భరిస్తానంటోంది. ఆ ఒత్తిడే ఆమెను మరింత కష్టపడి పనిచేసేలా చేసి, కంపెనీ అభివృద్ధి దోహదపడుతుందని చెబుతోంది. అంతేకాదండోయ్ అనిత డబ్బుని ఆర్చించేలా కష్టపడి పరిచేస్తా..అలాగే సంపాదించినదంతా ఖర్చు పెట్లేందుకు వెనకడుగు వేయను అని తేల్చి చెబుతోంది. పైగా అందులో ఉన్న సంతృప్తే 'వేరేలెవెల్' అని చెబుతోంది అనిత.(చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!)

స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు
నాణ్యమైన విద్య దేశ అభివృద్ధికి బాటలు వేస్తుంది. "పఢేగా ఇండియా తభీ తో బడేగా ఇండియా" అన్నట్టు 136 కోట్లకు పైగా జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశంలో విద్య ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గతంలో అనేకమంది సంఘ సంస్కర్తలు, పాలకులు నాణ్యమైన విద్యకోసం సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యాలయాల కోసం, గ్రామీణభారతంలో విద్యాభివృద్ధికోసం ఎన్నో గుప్త దానాలు చేశారు. తాజాగా రాజస్థాన్లోని శిశోద అనే గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు వార్తల్లో నిలిచారు. గ్రామీణ పిల్లలకు తమ గ్రామంలో ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.రాజస్థాన్ సోదరుల దాతృత్వంరాజస్థాన్కు చెందిన సోదరులు మేఘరాజ్-అజిత్ నగరాలకు పరిమితమైన ఉత్తమ విద్యను తమ గ్రామంలోని విద్యార్థులకు కూడా అందాలని కలగన్నారు. ఈ లక్ష్యంతోనే తమ గ్రామంలోని స్కూలు అభివృద్ధికోసం ఏకంగా 15 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. కంకుబాయి-సోహన్లాల్ ధకాడ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ను అత్యాధునికంగా తయారు చేశారు. ఆధునిక ప్రయోగశాలలు , సకల హంగులతో తరగతి గదులు, భారతదేశంలోని టాప్ ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా తీర్చిదిద్దారు. View this post on Instagram A post shared by startupsmedia (@startups_media)తమ గ్రామంలో పిల్లలకు ‘అందరికీ విద్య హక్కు’ నినాదానికి అనుగుణంగా చక్కటి వాతావరణాన్ని సృష్టించారు. విద్య అనేది కేవలం ధనవంతులకే కాదు.. అందరికీ అని చాటి చెప్పారు. ప్రతి పిల్లవాడు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడని , రాజస్థాన్ను గర్వించదగిన రాష్ట్రంగా మలుస్తున్నారని వీరు నమ్ముతున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవ వేడుకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. పలువురి నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: చెఫ్ల వైట్ క్యాప్ వెనుక రహస్యం? వీటికీ ర్యాంకులుంటాయా?వీరి చొరవ కారణంగా రాజస్థాన్లోని శిషోడా గ్రామంలో ఉన్న కంకుబాయి-సోహన్లాల్ ధకాడ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ఇపుడు ఆధునిక మూడు అంతస్తుల క్యాంపస్లో 40 స్మార్ట్ తరగతి గదులతో అలరారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ టూల్స్తో పాటు, విశాలమైన ఆట స్థలంకూడా ఉంది. ప్రతి తల్లిదండ్రులు విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని మేఘరాజ్, అజిత్ తెలిపారు. తరగతి గదుల వెలుపల కూడా విద్యాబోధన జరిగేలా పుస్తకాలు, పచ్చదనంతో కూడిన చక్కటి లైబ్రరీతో తీర్చిదిద్దామని తెలిపారు.దీనిపై గ్రామస్తులు సంతోషాన్ని వెలిబుచ్చారు. "ఇప్పుడిక మా పిల్లలను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఇలాంటి పాఠశాల గురించి కలలో కూడా ఊహించలేదు." అంటూ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. మేఘరాజ్ - అజిత్ సోదరులు ఈ స్కూల్లోనే చదువుకున్నారు. అందుకే తమకు విద్యను ప్రసాదించిన గ్రామానికి ఏదైనా గొప్పగా ఇవ్వాలని భావించి, స్థానికి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేశారు.

గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!
గురుకులంలో గురువుగారు శిష్యులకు ‘చాణక్య నీతి’ పాఠం చెప్తున్నారు. ‘తృణం బ్రహ్మవిదః స్వర్గం,/ తృణం శూరస్య జీవితం,/ జితాక్షస్య తృణం నారీ,/ నిరీహస్య తృణం జగత్’ – అన్న శ్లోకం చదివారు. ‘బ్రహ్మవేత్తకు స్వర్గ సుఖాదులు తృణప్రాయం. శూరుడికి ప్రాణాలు లెక్కలోనివి కావు. జితేంద్రియుడికి అందాల అప్సరసయినా గడ్డిపరక పాటిగా కనిపిస్తుంది. కోరికలు లేని విరాగికి ఈ జగత్తే ఒక గడ్డిపోచతో సమానం’ అని అర్థం చెప్పారు.‘గురుదేవా! ఈ ప్రపంచంలో అన్నిటికంటే నిరర్థకమైనది గడ్డిపోచ అన్న అర్థం ఈ శ్లోకంలో కనిపిస్తున్నది కదా?’ అని అడిగాడొక కొంటె శిష్యుడు.‘పిచ్చితండ్రీ! అలాంటి అర్థాలనే పెడర్థాలు అంటారు. తృణం నిరర్థకం కాదు. బ్రహ్మవేత్తకూ, విరాగికీ దాని వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. అంతవరకే! ఆ మాటకొస్తే గడ్డిపోచకు యతీంద్రుడి వల్ల ప్రయోజనం లేదు. అంతమాత్రాన ఆయన నిరర్థకుడవు తాడా? మాట వరసకు చెప్పిన మాటకు పెడర్థాలు తీయకూడదు.తృణం వల్ల చాలా ప్రయోజనం ఉంది. దాని ఆయుష్షు స్వల్ప కాలం. ఆ స్వల్పకాలం పొడుగునా అది తన ముగ్ధమైన అందాన్ని ప్రదర్శిస్తూ చూపరులకు కనువిందు చేస్తుంది. అవకాశముంటే, ఒక బుజ్జి పువ్వు కూడా పూసి, లోకాన్ని మురిపిస్తుంది. ఆఖరికి, ఏ గోమాతకో ఆహారంగా తనను తాను సమర్పించుకొని, ధన్యమౌతుంది. గడ్డిపరక తేలికయిన పదార్థమే కానీ, తేలిక చేయవలసిన పదార్థం కాదు. సృష్టిలో ఏ పదార్థమూ నిష్ప్రయోజనం కాదు. ప్రయోజనం అనేది వాడుకొనే వారిని బట్టి కూడా ఉంటుంది.మరొక విశేషం గమనించు. గడ్డిపోచను ఆవు ఆహారంగా తీసుకొంటే, ఆ ఆహారం ఆవు శరీరంలో పవిత్రమైన గోక్షీరంగా పరిణమించగలదు. అవునా? గోక్షీరాన్ని పాముకు ఆహారంగా పోస్తే, ఆ ఆహారం పాముశరీరంలో భయంకరమైన విషంగా మారుతున్నది. అలాంటప్పుడు, గంగి గోవు పాలు ఘనమైనవనీ, పచ్చగడ్డి పనికిమాలినదనీ భావించటం భావ్యంగా ఉంటుందా?ఈ సృష్టిలో ప్రతి పదార్థమూ ప్రత్యేకమే, విశేషమే! ప్రతి ప్రక్రియా ఈశ్వర విలాసమే. ఈశ్వర విలాసం మనకు పూర్తిగా ఎప్పటికీ అర్థం కాదు. కారణం, అందుకు మనకున్న గ్రహణశక్తి సరిపోదు. తన మేధ పరిమితి ఏమిటో తెలియని అమాయకుడు మాత్రమే తనకు అన్నీ తెలుసుననీ,తను సర్వమూ తెలుసుకోగలననీ మిడిసి పడుతుంటాడు. అందుకేఅలాంటి వారి జ్ఞానాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు. అది సంపూర్ణ జ్ఞానం కాదు. సర్వజ్ఞత్వ లక్షణం కలవాడు సాంబమూర్తి ఒక్కడే!’ అని గురువు సమాధానం చెప్పారు.– ఎం. మారుతి శాస్త్రి

World Marketing Day: ఆన్లైన్ షాపింగ్ మంచిదేనా..?
స్కూటీపై కూర్చున్న ఇతను పవన్. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంత్నగర్కు చెందిన పవన్ బీకాం చదివాడు. సిరిసిల్లలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. నిత్యం 35 నుంచి 40 పార్సిళ్లు డోర్ డెలివరీ చేస్తుంటాడు. కంపెనీ స్కూటీపైనే వస్తువులు ఇంటింటికీ అందిస్తూ నెలకు రూ.12,500 జీతం పొందుతున్నాడు. షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఆన్లైన్ షాపింగ్ డెలివరీబాయ్స్కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్ మెషిన్లా మారిన నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై మంగళవారం ప్రపంచ మార్కెటింగ్ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్కు చెందిన రమేశ్ గతంలో కూరగాయల మార్కెట్కు నడిచి వెళ్లి కూరగాయలు, ఇతర వస్తువులు కొని తెచ్చేవాడు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులను పలకరిస్తూ బేరం చేసి మరీ కొనేవాడు. కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రైవేటు హోం డెలివరీ ఏజెన్సీలు రావడంతో ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాడు. ఎక్కువ సేపు కదలకుండా ఉండడంతో శారీరక శ్రమ కరువైంది. ఇప్పుడు రమేశ్కు సయాటిక సమస్య వచ్చింది.జగిత్యాలకు చెందిన నవీన్, అనిత దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఉరుకులు.. పరుగుల జీవితం. ఇలాంటి పని ఒత్తిడిలో షాపింగ్కు వెళ్లి వస్తువులు కొనే సమయం, తీరికలేక ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంట్లోకి, పిల్లలకు ఏ సామగ్రి అవసరమున్నా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. ఫలితంగా శారీరక శ్రమ తగ్గింది. ఈ మధ్య నవీన్ తీవ్రంగా అలసిపోవడంతో డాక్టర్ వద్దకు వెళ్తే షుగర్ వచ్చిందని నిర్ధారించారు.ఒక చేతిలో కిరాణ సామగ్రి, మరో చేతిలో సెల్ఫోన్లో మాట్లాడుతున్న ఇతను అంబ దాస్. సిరిసిల్లకు చెందిన అంబదాస్ డిగ్రీ వరకు చదివి ఓ ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. సిరిసిల్ల పట్టణంలో ఎవరు కిరాణ సామగ్రి, ఇతర వస్తువులు ఆర్డర్ చేసినా ఇంటి వరకు వెళ్లి డోర్ డెలివరీ చేశాడు. ఇలా పనిచేస్తూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. మంచినూనె.. వాటర్ విులన్.. టీషర్ట్.. చెప్పులు.. మందులు.. బిర్యానీ.. ఇలా ఏది కొనాలన్నా సెల్ఫోన్ ఉంటే చాలు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే నిమిషాల్లో డెలివరీ చేస్తారు. ఆన్లైన్ వ్యాపారం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఇరుగు పొరుగు.. కుటుంబ సభ్యులతో బజారుకు వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేవారు. దుకాణాలకు వెళ్లడం ద్వారా వ్యాపారులు, వినియోగదారుల మధ్య అనుబంధం పెరిగేది. నేడు ఆ పరిస్థితులు లేవు. చాలామంది అడుగు తీసి బయట వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డ నేటి జనం ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే మధుమేహం.. రక్తపోటు.. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. విస్తరిస్తున్న వ్యాపారంఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు మేజర్ గ్రామాల్లోనూ ఆన్లైన్ వ్యాపారం విస్తరిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు వ్యాపారాన్ని గల్లీ వరకు విస్తరించేశాయి. డోర్ డెలివరీ విధానంతో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు అన్నీ ఇంటికే అందిస్తామని వ్యాపారం ప్రారంభించి విస్తరిస్తున్నారు. ఇలా వ్యాపారాభివృది్ధతోపాటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో ఆన్లైన్ సేవల్లో మూడు వేల మంది డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. కనీస శ్రమ లేక ఆరోగ్య సమస్యలుమనిషి సగటున నిత్యం 6వేల అడుగులు వేయాలని వైద్యులు చెబుతున్నారు. కనీస శారీరక శ్రమ లేక అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. నిత్యం నడకతో జీవితాన్ని ప్రారంభించే వారు ఒక్క శాతం ఉంటే.. అసలు శారీరక శ్రమ లేకుండానే జీవించే వారు 99 శాతం మంది ఉన్నారు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మనకు తెలియకుండానే జబ్బులతో జీవిస్తూ.. ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో వైద్యవ్యాపారం ఇప్పటికే చాలా వరకు విస్తరించింది. దీనికి కనీస శ్రమ లేక పోవడంతో ప్రధాన కారణం.కొత్తగా ప్రారంభించాంసిరిసిల్లలో కొత్తగా ‘వీఆర్ విత్ యూ’ పేరుతో ఆన్లైన్ డెలివరీ సర్వీసులను ప్రారంభించాం. బిజీ లైఫ్లో ఉన్న వారికి ఏది కావాలన్నా 15 నిమిషాల్లో ఇంటికి చేర్చుతున్నాం. – గాజుల రాకేశ్, సుభాష్నగర్, సిరిసిల్లరోజూ 35 డెలివరీలు నేను ఈ మధ్యే డెలివరీ బాయ్గా చేరాను. ఇప్పుడు రోజూ 35 డెలివరీలు ఇస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోని అన్ని ప్రాంతాలతోపాటు శివారు గ్రామాల వరకు వెళ్తుంటాను. ఆన్లైన్ ఆర్డర్లు చాలా పెరిగాయి. నాలాగే అనేక మంది ఉపాధి పొందుతున్నారు. – సంగెం తరుణ్, డెలివరీ బాయ్, సిరిసిల్ల టైం లేకే ఆర్డర్లుమార్కెట్కు వెళ్లి తెచ్చుకునే టైం లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆర్డర్లే ఎక్కువ. సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వేగం పెరిగింది. ఆన్లైన్ వ్యాపారం పెరిగింది. సమయం ఆదా అవుతుంది. బయటకు వెళ్లి వచ్చే టైంలో ఇంకో పని చేసుకోవచ్చు. ఆర్డర్ 15 నిమిషాల్లో ఇంటికే చేరుతుంది. ఇలాంటి సౌకర్యం ఉండగా షాపింగ్కు బయటకు ఎవరూ వెళ్తారు. – మామిడాల శ్యాం, సిరిసిల్లశారీరక శ్రమ ఉండాలి నిత్యం శారీరక శ్రమ ఉంటేనే ఉల్లాసంగా ఉంటారు. ఎలాంటి వ్యాయామం లేకుండా చాలామంది గడిపేస్తున్నారు. షుగర్ పెరగడానికి శారీరకశ్రమ లేకపోవడమే కారణం. మారిన జీవన శైలి కూడా కారణం. నిత్యం కొంత దూరమైన వాకింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావు. – డాక్టర్ వంగ మురళీకృష్ణ, ఎండీ ఫిజీషియన్, సిరిసిల్ల (చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఇదెక్కడి విడ్డూరం.. ఇలా కూడా పరువు పొగొట్టుకుంటారా?
హుర్రే.. ఆపరేషన్ సింధూర్కి కౌంటర్గా ఆపరేషన్ భున్యన్తో భారత్పై విజయం సాధించాం అంటూ పాక్ చేస్తున్న వేడుకలు, వరుస ప్రకటనలు నవ్వులు పూయిస్తున్నాయి. ఒకదానికి తర్వాత మరొకటి తప్పుడు ప్రచారాలతో పరువు పొగొట్టుకుంటోంది ఆ దేశం. తాజాగా..ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్(Asim Munir) చేసిన పని.. విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఆపరేషన్ భున్యాన్ సక్సెస్ పేరిట ఆయనో డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, సెనేట్ చైర్మన్ యూసుఫ్ రజా గిలానీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. ఆపరేషన్ భున్యన్(Operation Bunyan) విక్టరీకి గుర్తుగా ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్కు ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఓ పెయింటింగ్ బహుకరించారు. కానీ.. అందులో ఉన్న తప్పును కొందరు టక్కున పట్టేశారు. నాలుగేళ్ల కిందట చైనా జరిపిన మిలిటరీ ఆపరేషన్ తాలుకా చిత్రమది. ఆ చిత్రాన్ని ముందూ వెనుక చూడకుండా ఆపరేషన్ భున్యాన్ చిత్రమంటూ అదీ ఆర్మీ చీఫ్ ప్రధాని బహుకరించడం విడ్డూరంగా పేర్కొంటున్నారు కొందరు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీరంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయితే.. ఆపరేషన్ భున్యన్ ఉన్ మర్సూస్తో తామూ భారత్పై దాడులు జరిపి ఘన విజయం సాధించామని పాక్ ప్రకటించుకుంటూ వస్తోంది. కానీ, అంతర్జాతీయ సమాజానికి తగిన ఆధారాలు మాత్రం చూపించకపోయింది. వరుసగా.. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో పాక్ పరువు మళ్లీ మళ్లీ పోగొట్టుకుంటూ వస్తోంది. భారత్పై విజయం అంటున్నారు కదా.. దానికి తగిన ఆధారం ఒక్కటైనా చూపించలేని స్థితిలో పాక్ ఉందంటూ పలువురు జోకులు పేలుస్తున్నారు.ఇదీ చదవండి: నన్ను ఆపేస్తే నీ సంబంధం బయటపెడతా!

పాక్లో జ్యోతి మల్హోత్రాకు వీఐపీ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో నిఘా సంస్థలు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)ను అరెస్టు చేసిన దరిమిలా ఆమెకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్లోని లాహోర్లోని అనార్కలి బజార్లో జ్యోతి మల్హోత్రా నడుచుకుంటూ వెళుతుండగా, ఆమెకు ఏకే-47 పట్టుకున్న ఆరుగురు సాయుధులు కాపలాగా ఉండటానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఈ వీడియో మరిన్ని ఊహాగానాలకు ఊతమిస్తోంది. పాకిస్తాన్ భద్రతా సిబ్బంది(Pakistani security personnel)గా భావిస్తున్న ఆరుగురు ఆమెకు కాపలా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీడియోను పరిశీలనగా చూస్తే వారు ఆమెకు వీఐపీ తరహాలో భద్రతను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ కూడా షాక్కు గురయ్యారు. సాధారణ యూట్యూబర్కు ఇంత భారీ భద్రత కల్పించడాన్ని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు.కల్లమ్ అబ్రాడ్ అనే ఛానల్ నడుపుతున్న స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ గత మార్చిలో పాకిస్తాన్ను సందర్శించారు. లాహోర్(Lahore)లోని అనార్కలి బజార్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఒక వీడియోను చిత్రీకరించారు. అందులో కొందరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని ‘నో ఫియర్’ అనే లేబుల్ కలిగిన జాకెట్లు ధరించి కనిపిస్తున్నారు. కొద్దిసేపటికి జ్యోతి మల్హోత్రా ఫ్రేమ్లో కంటెంట్ను చిత్రీకరిస్తూ కనిపిస్తుంది. కల్లమ్ తనను తాను పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఆమె పాకిస్తాన్లో మొదటిసారి పర్యటిస్తున్నారా? అని అడుగుతుంది. దానికి అతను అతను "లేదు.. ఇది ఐదోసారి’ అని సమాధానం ఇస్తాడు.ఆ తర్వాత జ్యోతి అతనితో భారతదేశాన్ని సందర్శించారా? అని ఆరా తీస్తూ, తాను భారతదేశం నుండి వచ్చినట్లు పరిచయం చేసుకుంటుంది. కల్లమ్ పాకిస్తాన్ ఆతిథ్యం గురించి ఆమెను అడగగా ఇక్కడి ఆతిథ్యం చాలా బాగుందని సమాధానం ఇస్తుంది. జ్యోతితో పాటు నడుస్తుండగా సాయుధ వ్యక్తులు అనుసరిస్తుండటాన్ని కల్లమ్ గ్రహిస్తాడు. తరువాత వీడియోలో అతను ‘ఆమె అంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఎందుకు ఉందో నాకు తెలియడంలేదు. ఆమె రక్షణకు అన్ని తుపాకుల అవసరం ఏమిటి? ఆమె చుట్టూ ఆరుగురు గన్మెన్లున్నారు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఫుటేజ్లో జ్యోతి మల్హోత్రాతో పాటు పలువురు పర్యాటకులు కూడా కనిపిస్తారు. ఈ వీడియో జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది కూడా చదవండి: COVID-19: వెయ్యిదాటిన కేసులు.. దేశమంతటా అప్రమత్తం

దూసుకొచ్చిన డ్రోన్లు.. పుతిన్పై హత్యాయత్నం?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)పై హత్యాయత్నం జరిగిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!. పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల దాడి జరిగిందని.. అయితే ఆ ప్రయత్నాన్ని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆ దేశ సైన్యాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.రష్యా న్యూస్ ఏజెన్సీ ఆర్బీసీ కథనం ప్రకారం రష్యా ఎయిర్ డిఫెన్స్ యూనిట్ కమాండర్ యూరీ డాష్కిన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మే 20-22 తేదీల మధ్య ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో(Ukraine Drone Attacks) రష్యాపై దాడికి తెగబడింది. అయితే రష్యా వైమానిక దళం ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో 1,170 డ్రోన్లను నాశనం చేసింది... మే 20వ తేదీన కురుస్క్(Kursk)లో దాడి జరగ్గా.. 46 డ్రోన్లను రష్యా సైన్యం నాశనం చేసింది. అయితే అదే తేదీన పుతిన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆయన హెలికాఫ్టర్ ప్రయాణిస్తున్న మార్గంలోకి హఠాత్తుగా డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే సకాలంలో వాటిని వైమానిక బలగాలు నేలకూల్చాయి. ఆపై అధ్యక్షుడి ప్రయాణం కొనసాగింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోంది’’ అని యూరీ డాష్కిన్ వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.మరోవైపు.. ఈ పరిణామం ఉక్రెయిన్ డ్రోన్ల సామర్థ్యంపై రష్యాకు ఆందోళన కలిగిస్తోందన్న చర్చ నడుస్తోంది. అయితే అసలు ఇది పుతిన్పై జరిపిన హత్యాయత్నమేనా? లేక ఉక్రెయిన్ ఆడుతున్న మైండ్ గేమా? అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. కౌంటర్గా రష్యా ఉక్రెయిన్పై ప్రతిదాడికి దిగింది. శనివారం రాత్రి రాజధాని కీవ్ నగరంతో పాటు పలు చోట్ల డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. అయితే రష్యా దాడులపై అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండడం ఏమాత్రం సరికాదని, ఇది పుతిన్ను మరింత రెచ్చిపోయేలా చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రత్యేక రాయబారి కీత్ కెల్లోగ్ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. ఇదీ చదవండి: పుతిన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు, ఏమన్నారంటే..

Paper Airplane Day: నూతన ఆవిష్కరణలకు నాంది
బాల్యంలో పేపర్తో ఎయిర్ప్లేన్ తయారు చేసి, ఆనందంతో చిందులు వేస్తూ, ఆడుకోని వారు ఎవరూ ఉండరు. గాలిలో ఎరురుతున్న విమానాన్ని అద్బుతంగా చూసే చిన్నారులు దాని నమూనాను తయారు చేయడంలోనూ పోటీ పడుతుంటారు. పేపర్ ప్లేన్(Paper plane)లను తయారు చేసి, పోటీలు పడుతూ విసురుకుంటారు. ఇలాంటి పేపర్ ప్లేన్లకు ఒక ప్రత్యేకమైన రోజు ఉందనే సంగతి మీకు తెలుసా? ఈ రోజు(మే 26) నేషనల్ పేపర్ ఎయిర్ప్లేన్ డే. అందుకే ఈ రోజుకున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం.నేషనల్ పేపర్ ఎయిర్ప్లేన్ డే(National Paper Airplane Day) ప్రతి ఏటా మే 26న జరుపుకుంటారు. ఈ రోజు కాగితంతో తయారు చేసిన విమాన బొమ్మలను ఎగురవేస్తుంటారు. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు, విమాన శాస్త్రం గురించి తెలుసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశంగా నేషనల్ పేపర్ ఎయిర్ప్లేన్ డేను నిర్వహిస్తుంటారు. కాగితపు విమానాల చరిత్ర ఎంతో పురాతనమైనది. రెండు వేల ఏళ్ల క్రితం చైనాలో కాగితంతో చేసిన విమానాల ఆవిష్కరణ మొదలయ్యింది.చైనాలో క్రీ.పూ. 105లో కాగితంతో విమానాన్ని తయారు చేశారని చెబుతుంటారు. జపాన్లో కాగితం మడత పెట్టే కళ అయిన ఒరిగామి కాగితపు విమానాల తయారీకి ప్రేరణగా నిలిచిందని అంటారు. 19వ శతాబ్దంలో కాగితం విమానాలు శాస్త్రీయ పరిశోధనలకు ఉపయుక్తమయ్యాయి. రైట్ సోదరులు (విల్బర్, ఆర్విల్ రైట్) తమ విమాన రూపకల్పనలను పరీక్షించేందుకు కాగితం నమూనాలను ఉపయోగించారు. ఇది 1903లో ఇది వారి చారిత్రాత్మక విమానం తయారీకి దారితీసింది. కాగితం విమానాలు కేవలం బొమ్మలుగానే కాకుండా, విమాన శాస్త్రంలో ఆవిష్కరణలకు ఒక సాధనంగానూ సేవలందించాయి.నేషనల్ పేపర్ ఎయిర్ప్లేన్ డే నాడు పలు దేశాల్లో పోటీలు(Competitions), అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2012లో జో అయూబ్ అనే వ్యక్తి రూపొందించిన కాగితం విమానం 226 అడుగుల 10 అంగుళాల (69.14 మీటర్లు) దూరం ఎగిరి రికార్డును సృష్టించింది. తాకువో తోడా అనే వ్యక్తి 27.9 సెకన్ల పాటు గాలిలో పేపర్ విమానాన్ని ఎగురవేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. నాసా లాంటి సంస్థలు కాగితం విమాన డిజైన్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాయి. మీరు కూడా ఈ రోజు చక్కని కాగితపు విమానాలను తయారు చేసి, గాలిలో ఎగువేసి ఆనందించండి. ఇది కూడా చదవండి: Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు
జాతీయం

ఐఎండీ అలర్ట్.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో ఐదు రోజులపాటు రెడ్అలర్ట్ అమల్లోనే ఉంటుందని అధికారులు ప్రకటించారు. మంగళూరు సిటీలో చాలా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. దక్షిణ కన్నడ జిల్లాలో కొండప్రాంతాల్లో స్వల్పస్థాయిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.రెడ్ అలర్ట్ రాష్ట్రాలు: మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకఆరెంజ్ అలర్ట్ రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలుతెలంగాణ: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలుదక్షిణమధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మర్నాడే అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ, ఇంకొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

మాజీ ఉపముఖ్యమంత్రికి రెండో సంతానం.. లాలూ ఇంట్లో సంబరాలు
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ఇంటిలో సంబరాల వాతావారణం నెలకొంది. ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్కు రెండవ సంతానం కలిగింది. ఈ విషయాన్ని తేజస్వి స్వయంగా తెలియజేశారు. తనకు రెండవ సంతానంగా మగబిడ్డ జన్మనిచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తేజస్వి తమ నవజాత శిశువు తొలి ఫోటోను కూడా పంచుకున్నారు. Good Morning! The wait is finally over! So grateful, blessed and pleased to announce the arrival of our little boy. Jai Hanuman! pic.twitter.com/iPHkgAkZ2g— Tejashwi Yadav (@yadavtejashwi) May 27, 2025తేజస్వి యాదవ్ తన ఎక్స్ పోస్ట్లో ‘గుడ్ మార్నింగ్.. మా నిరీక్షణ చివరకు ముగిసింది. మా చిన్న కుమారుని రాకను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జై హనుమాన్’ అని పేర్కొన్నారు. 2023 నవరాత్రులలో తేజస్వి దంపతులకు తొలికుమారుడు జన్మించాడు. తేజస్వి యాదవ్(Tejaswi Yadav) 2021లో తన స్నేహితురాలు రాచెల్ గోడిన్హోను(రాజశ్రీ) వివాహం చేసుకున్నారు. వీరి వివాహం హిందూ ఆచారాల ప్రకారం.. కొద్దిమంది అతిథుల మధ్య జరిగింది. రాజశ్రీ, తేజస్వి యాదవ్లు న్యూఢిల్లీలోని ఆర్కే పురంలో గల డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.ఇది కూడా చదవండి: ‘జగన్నాథ్’ పేరుపై హక్కులెవరివి?

కుటుంబాన్ని చిదిమేసిన రూ 20 కోట్ల అప్పు
పంచకుల: హర్యానాలోని పంచకుల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్(Dehradun)కు చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని వెల్లడయ్యింది. కుటుంబ యజమాని ప్రవీణ్ మిట్టల్పై దాదాపు రూ. 20 కోట్ల అప్పుల భారం ఉన్నట్లు సమాచారం. ప్రవీణ్ రాసిన సూసైడ్ లేఖలో తమ బంధువు సందీప్ అగర్వాల్ ద్వారా తమ అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు.ప్రవీణ్ మిట్టల్ స్వస్థలం హిసార్లోని బార్వాలా. అయితే గత రెండేళ్లుగా ఆయన పంచకులలోని సాకేత్రి ప్రాంతంలో నివసిస్తూ, టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మిట్టల్ హిమాచల్ ప్రదేశ్లోని స్క్రాప్ ఫ్యాక్టరీని నిర్వహించారు. అప్పులు పెరగడంతో బ్యాంకు ఆ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. తాజాగా మిట్టల్ కుటుంబ సభ్యులంతా బాగేశ్వర్ ధామ్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ వారు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తన కారు వెనుక ఉత్తరాఖండ్ నంబర్ ప్లేట్(Uttarakhand number plate) ఉన్న కారు నిలిపి ఉండటాన్ని గమనించి, లోనికి చూడగా, ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆ సమయంలో కారులో నుంచి దుర్వాసన వస్తోంది. అప్పుడు ఆ వ్యక్తి కారులోని ప్రవీణ్ మిట్టల్తో ఏం జరిగిందని అడిగాడు. దీనికి మిట్లల్ సమాధానమిస్తూ తమ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని, ఐదు నిమిషాల్లో తాను కూడా చనిపోతానని, తాము భారీగా అప్పుల్లో కూరుకుపోయామని చెప్పాడని ఆ వ్యక్తి మీడియాకు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు కుటుంబ సభ్యులందరినీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారంతా మృతిచెందారని వైద్యులు తెలిపారు. అంబులెన్స్ సమయానికి వచ్చి ఉంటే ప్రవీణ్ మిట్టల్ను రక్షించి ఉండేవాడినని కారును గమనించిన వ్యక్తి తెలిపాడు.అనుమానాస్పద స్థితిలో..పంచకులలోని సెక్టార్ 27లోని ఒక ఇంటి వెలుపల రోడ్డుపై ఆపి నిలిపివుంచిన కారులో ఏడుగురి మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా కుటుంబంలోని ఏడుగురు సభ్యులు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటిపెద్ద, డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్ (42), అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడు మృతదేహాలను పంచకులలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, డీసీపీ (శాంతిభద్రతలు) అమిత్ దహియా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, మరింత విశ్లేషణ కోసం ఆధారాలను సేకరించింది. పంచకుల డీఎస్పీ హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ తమ ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని, మృతదేహాలు లభ్యమైన కారును పూర్తిగా స్కాన్ చేస్తున్నామని అన్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్ఆర్పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.
ఎన్ఆర్ఐ

న్యూజెర్సీలో విజయవంతంగా 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్
అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA), యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్ ( USCA), యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ (USAF) ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన 29 వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్తో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. సుమారు 30 రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ‘మాట’ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగొని, సహా వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, గౌరవ సలహాదారులు రఘు రామ్ వీరమల్లు, USCF వాలంటీర్ చరణ్ ఖజానా అండ్ టీం, USCA అధ్యక్షులు అతుల్ భావే, షకీల్, తదితరులు ఈ పోటీలు విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మే1న కిక్ ఆఫ్ ఈవెంట్ తో ఘనంగా ప్రారంబమైన పోటీలు మే4 న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిసాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్ట మొదటి సారి జూనియర్స్ కేటగిరీలో క్యారమ్స్ పోటీలు నిర్వహించటం విశేషం.మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్ పోటీల్లో 60కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్లో ఎంతో ఉత్సహంగా పాల్గొన్నాయి. రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో ఢోల్ ఎఫెక్ట్ బాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సింగల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టూ పోటా-పోటీగా జరిగింది. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది. సింగర్స్ అనిత కృష్ణ, సిజి ఆనంద్ తమ గ్రాతంతో ఆడియన్స్ని మైమరపించారు.మే4న గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఇటీవల భారత్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి.. గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్ పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇక జూనియర్స్ US నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్కి అనుహ్య స్పందన వచ్చింది. USCA అధ్యక్షులు అతుల్ భావే, USCA మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్ కామెంటేటర్లుగా వ్యవరించారు. ఇక ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు అందజేశారు. గెలిచిన విజేతలకు అందరికీ కలిపి 10 వేల వంద డాలర్ల నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలే లో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్ని అలరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచే, సింగర్ అంజన సౌమ్య తమ గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజన సౌమ్య జోడి.. పలు సూపర్ హిట్ సాంగ్స్తో హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్ని నిర్వహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడిల్సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డా. ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి ముస్సాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్ గా మాట, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, రియల్ టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించిన యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్ఫ్యూజన్, సాషా రియాల్టీ, 9i సోలుషన్స్ని నిర్వహకులు అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ యూత్ శ్రీచరణ్ ఖజానా అండ్ టీమ్ని కొనియాడుతూ, సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవ్వటంలో కీలక పాత్ర పోషించిన స్పోర్ట్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్టెక్ సర్వీసెస్ CEO, మాట హానరీ అడ్వైసర్ రఘురామ్ వీరలమల్లుని ఘనంగా సన్మానించి, సత్కరించారు. మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి, USCA ప్రెసిడెంట్ అతుల్ భావే.. విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాట టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనటం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వహకులను పలువురు అభినందించారు.(చదవండి: అమెరికాలో ఎన్ఆర్ఐలే మా టార్గెట్)

అమెరికాలో నల్గొండ విద్యార్థిని కన్నుమూత
ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన మరో భారతీయ విద్యార్థి కన్నుమూసింది. ఇటీవలి కాలంలోఅమెరికాలో భారత విద్యార్థుల మృతుల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం మరింత విషాదం. తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన యువతి మృతి చెందింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్) చదువుతోంది. అనారోగ్యంతో మృతి చెందడం విషాదాన్ని నింపింది.అలబామా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేసిన ప్రియాంక అక్కడే పార్ట్ టైం వర్క్ చేస్తోంది. బ్రెయిన్ డెడ్ (మెదడు మృతి) స్థితికి చేరుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించి ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన వైద్యులు తెలిపారు. స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గమనించి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్

అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్(6), శివాన్‡్ష(3) ఉన్నారు. మహేందర్ ప్రస్తుతం గల్ఫ్లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచి్చన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు. అమ్మా.. లేమ్మా.. గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్లో ఉన్న మహేందర్కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముక్క శంకర్ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్ఆర్పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.

మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల క్యాబ్పై ఆగంతకుల దాడి
బంజారాహిల్స్(హైదరాబాద్): మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకెళుతున్న క్యాబ్ను ముగ్గురు ఆగంతకులు మద్యం మత్తులో దారికాసి అడ్డగించి బెదిరించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో ఉంటున్న నలుగురు యువతులు కోకాపేటలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు విధులు ముగించుకుని సంస్థ కేటాయించిన క్యాబ్లో ఇంటికి బయలుదేరారు. రోడ్డు నెంబర్–12 మీదుగా వీరు వెళ్తున్న కారును మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అడ్డగించి కారు అద్దాలను పగులగొట్టారు. కారు తాళాలు లాక్కున్నారు. తాము క్రిమినల్స్మని, అటాక్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం పోలీసులకు చెబితే అంతుచూస్తామని హెచ్చరించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితులు నేరుగా బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య
మియాపూర్(హైదరాబాద్): కుటుంబ సమస్యలతో పాటు ప్రేమ విఫలమై ఓ డ్యాన్స్ మాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కైలాసపూరికి చెందిన సాగర్ కుమార్ (17) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచి్చన అతను మియాపూర్లోని గ్లోకుల్ ప్లాట్స్ని డెలయిట్ డాన్స్ స్టూడియోలో డ్యాన్స్ మాస్టర్గా పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 25న రాత్రి స్టూడియో మూసివేసిన తర్వాత స్టూడియో యజమాని పరమేష్ అతడికి ఫోన్ చేసి స్టూడియో డోర్లను లాక్ చేయాలని సూచించాడు. సోమవారం మధ్యాహ్నం యజమాని పరమేష్ స్టూడియోకు వెళ్లి చూడగా సాగర్ కుమార్ ఓ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాగర్ కుమార్ స్టూడియోకు వచి్చనప్పటి నుంచి బాధపడుతూ ఉండేవాడని పది రోజుల క్రితం స్టూడియో యజమాని వంగాల పరమేష్ ఈ విషయమై అతడిని ప్రశి్నంచగా కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఓ అమ్మాయిని ప్రేమించి విఫలమైనట్లు తెలిపాడన్నారు. స్టూడియో యజమాని పరమేష్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.