Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Kakani Govardhan Reddy Arrest Updates1
కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందుకు కాకాణి.. 144 సెక్షన్‌ అమలు..

కాకాణి అరెస్ట్‌ అప్‌డేట్స్‌..కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందుకు కాకాణి..కాసేపట్లో నెల్లూరు డీటీసీ నుంచి వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికాకాణిని హాజరుపరుచనున్న పోలీసులు.వెంకటగిరి మెజిస్ట్రేట్ ఆవరణలో 144 సెక్షన్ విధింపు. కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి..వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి.చెముడు గుంటలోని డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లిన పోలీసులువైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ పాలన పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరాయి. ప్రశ్నించే వారే ఉండకూడదని టార్గెట్‌ చేస్తూ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు.👉పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డీడీ బాలాజీ నాయక్‌ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్‌ 3 పీడీపీపీఎ, సెక్షన్‌ 3 అండ్‌ 5 ఆఫ్‌ ఈఎస్‌ యాక్ట్‌ అండ్‌ సెక్షన్‌ 21(1), 21(4) ఆఫ్‌ ఎంఎండీఆర్‌ యాక్ట్‌ కింద పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.👉ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్‌ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్‌లు జత చేశారు.👉కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్‌ రోడ్డులోని కాకాణి గృహానికి చేరుకున్నారు.

Is Chhattisgarh Police Intentionally Troubles Nambala Family2
Nambala: నంబాల మృతదేహాన్ని అప్పగించరా?

సాక్షి, ఛత్తీస్‌ఘడ్‌: మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారా?. కావాలనే మృత దేహం అప్పగింతకు జాప్యం చేస్తున్నారా?. అసలు మృతదేహాన్ని అప్పగిస్తారా? లేదా?. ఆయన కుటుంబ సభ్యులు కోర్టు ఆర్డర్‌తో వెళ్లినా కూడా పోలీసులు తాత్సారం చేస్తుండడంపై ఇప్పుడు విమర్శలు వినవస్తున్నాయి.ఛత్తీస్‌ఘడ్‌(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈనెల 21 న జరిగిన ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు తో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే..ఆయన మృతదేహాన్ని(Nambala Dead Body) అప్పగించాలని ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయినా కూడా మృతదేహాల అప్పగింత విషయంలో ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం ఆ రాష్ట్రానికి చెందిన మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించడం గమనార్హం.మరోవైపు.. కేశవరావు కుటుంబ సభ్యులను పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తమ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు ఆర్డర్ ఉన్నా అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగి ఆరు రోజులు కావడం.. మృత దేహం కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నందున సత్వరమే నంబాల మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు(Chhattisgarh Police) ఇదే రీతిలో వ్యవహరిస్తే ఆందోళన చేపతామని హెచ్చరిస్తున్నారు.నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో.. మృతదేహాన్ని ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజును కడసారి చూపు చూసేందుకు లేకుండా చేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

USA Donlad Trump Serious On Russia Putin3
పుతిన్‌కు పిచ్చి పట్టింది.. రష్యాకు ట్రంప్‌ వార్నింగ్‌

వాషింగ్టన్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌, రష్యా మధ్య కాల్పుల విరమణకు సంబంధించి మంతనాలు జరుగుతున్న వేళ పుతిన్‌ సైన్యం దాడులు చేయడంతో మండిపడ్డారు. పుతిన్‌ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తపరిచారు.ట్రంప్‌ తాజాగా ట్విట్టర్‌లోని ట్రుత్‌ వేదికగా స్పందిస్తూ..‘రష్యా అధ్యక్షుడు పుతిన్ నాకు చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ, ఇప్పుడు పుతిన్‌ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు. ఉక్రెయిన్‌పై ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. నగరాలపై దాడి చేస్తున్నాడు. అన్యాయంగా ప్రజలను చంపుతున్నాడు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు.Donald Trump Truth Social 05.25.25 08:46 PM ESTI’ve always had a very good relationship with Vladimir Putin of Russia, but something has happened to him. He has gone absolutely CRAZY! He is needlessly killing a lot of people, and I’m not just talking about soldiers. Missiles…— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 26, 2025పుతిన్‌.. ఉక్రెయిన్‌లోని ఒక భాగాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ఉక్రెయిన్‌ను కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బహుశా అది నిజమే కావచ్చు.. కానీ అలా చేస్తే, అది రష్యా పతనానికి దారి తీస్తుంది. అధ్యక్షుడు జెలెన్స్కీ తను మాట్లాడే విధానం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలను సృష్టిస్తుంది. అతడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో రష్యా 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం, వారు 45 క్షిపణులను కూల్చివేసి 266 డ్రోన్లను ధ్వంసం చేశారు. అనేక నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. కీవ్‌తో సహా 30 కి పైగా నగరాలు, గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.

SRH Should Play in IPL 2025 Final But Didnt Work Out: Pat Cummins4
ఫైనల్‌ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025) సీజన్‌ను అద్భుత విజయంతో ముగించామని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు విధ్వంసకర ఆటతో విరుచుకుపడుతుంటే తనకు కూడా కాస్త భయం వేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తమ జట్టులో అద్బుత ఆటగాళ్లు ఉన్నారని.. ఫైనల్‌ చేరే సత్తా ఉన్నా ఈసారి ఆ పని చేయలేకపోయామని పేర్కొన్నాడు.రేసు నుంచి నిష్క్రమించిన తర్వాతకాగా గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌.. ఈసారి మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై వీరబాదుడు మినహా ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత మాత్రం కమిన్స్‌ బృందం వింటేజ్‌ బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది.ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో గెలిచిన రైజర్స్‌.. తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో రహానే సేనపై 110 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్లలో అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 32) రాణించగా.. ట్రవిస్‌ హెడ్‌ (40 బంతుల్లో 76) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.𝙃𝙚𝙖𝙙𝙞𝙣𝙜 towards a 𝙆𝙡𝙖𝙨𝙨𝙮 show 🍿#SRH cruising along at the moment ⛵Updates ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/AMKTayK7PS— IndianPremierLeague (@IPL) May 25, 2025క్లాసెన్‌కు పూనకాలు ఇక హెన్రిచ్‌ క్లాసెన్‌ పూనకం వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 37 బంతుల్లో శతక్కొట్టిన క్లాసెన్‌.. ఐపీఎల్‌లో మూడో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 105 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది సన్‌రైజర్స్‌.Sky is not the limit when he's batting! 🫡🎥 Glimpse of the 𝙃𝙚𝙞𝙣𝙧𝙞𝙘𝙝 𝙆𝙡𝙖𝙖𝙨𝙚𝙣 𝙨𝙝𝙤𝙬 en route his mind-blowing 105*(39) 🚀Scorecard ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/WaOSR90wrg— IndianPremierLeague (@IPL) May 25, 2025లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ను 18.4 ఓవర్లలోనే ఆలౌట్‌ చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల విజృంభణతో రహానే సేన 168 పరుగులకే కుప్పకూలింది. ఇలా సమిష్టి ప్రదర్శనతో జట్టు రాణించడం పట్ల రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సంతోషం వ్యక్తం చేశాడు.‘‘అద్భుతమైన ముగింపు. ఈ సీజన్‌లో గత కొన్ని మ్యాచ్‌లలో మేము సూపర్‌గా ఆడాము. మా వాళ్ల బ్యాటింగ్‌ భయంకరంగానే ఉందని చెప్పవచ్చు (నవ్వులు). మా ఆటగాళ్ల సమర్థత దృష్ట్యా నిజానికి ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు ఇంత చెత్తగా ఆడాల్సింది కాదు.ఫైనల్‌ చేరాల్సిన జట్టుఫైనల్‌కు చేర్చగల సత్తా ఉన్న ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. కానీ ఈసారి మేము ఫైనల్‌ చేరలేకపోయాం. ఢిల్లీ వికెట్‌ మీద మా వాళ్లు అదరగొట్టారు. ఈసారి మా జట్టు బాగానే ఉంది. అయితే, కొంత మంది గాయాల వల్ల స్వదేశానికి వెళ్లిపోయారు. జట్టులోని 20 మంది ఆటగాళ్ల సేవలను మేము ఉపయోగించుకున్నాము’’ అని కమిన్స్‌ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ పద్నాలుగింట ఆరు గెలిచి.. ఏడు ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో 13 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఆరోస్థానంలో ఉంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే గనుక ఏడో స్థానానికి పడిపోతుంది.చదవండి: IPL: రిటైర్మెంట్‌పై ధోని కీల‌క వ్యాఖ్య‌లు

Pak PM Shehbaz Sharif thanks To Turkey Erdogan5
తుర్కియే అధ్యక్షుడితో పాక్‌ ప్రధాని భేటీ.. భారత్‌ గురించి చర్చ?

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో పాకస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌తో యుద్ధం సమయంలో పాకిస్తాన్‌ ఆయుధపరంగా మద్దతు ఇచ్చినట్టు ఎర్డోగన్‌కు షరీఫ్‌ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్‌, తుర్కియే మధ్య స్నేహం చిరకాలం ఉండాలని కోరుకున్నారు.తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక చర్చలు జరిపారు. అనంతరం, షరీఫ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఇస్తాంబుల్‌లో నా ప్రియమైన సోదరుడు అధ్యక్షుడు ఎర్డోగన్‌ను కలిసే గౌరవం నాకు లభించింది. ఇటీవలి పాకిస్తాన్-భారత్ ప్రతిష్టంభనలో పాకిస్తాన్‌కు ఆయన దృఢంగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్ని వేళలా ఎర్డోగన్‌ మాకు అండగా నిలిచారు. పాకిస్తాన్‌, తుర్కియే మధ్య స్నేహం చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను.ఈ చర్చలో ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో రెండు దేశాల మధ్య బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించాం. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, రవాణా, రక్షణ రంగాలలో పురోగతులే లక్ష్యంగా పెట్టుకున్నాం. నిఘా భాగస్వామ్యం, ఉగ్రవాద వ్యతిరేకత వంటి రంగాలలో సహకారంపై చర్చించాం. ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రెండు దేశాలు కలిసి పనిచేయడం కొనసాగించాలని అనుకుంటున్నాం అని తెలిపారు.Had the honor of meeting my dear brother President Reccep Tayipp Erdogan in Istanbul this evening. Thanked him for his resolute support to Pakistan in the recent Pakistan India standoff which resulted in Pakistan's overwhelming victory Alhamdolillah!Conveyed the sentiments of… pic.twitter.com/EEYxZdIf7g— Shehbaz Sharif (@CMShehbaz) May 25, 2025మరోవైపు, పాక్‌ ప్రధాని షరీఫ్‌తో చర్చలపై ఎర్డోగన్‌ స్పందిస్తూ..‘రెండు దేశాల మధ్య సోదరభావం, గౌరవం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇస్లామాబాద్‌కు మా పూర్తి మద్దతు కొనసాగుతుంది. తుర్కియే, పాకిస్తాన్ మధ్య ప్రతి రంగంలో చారిత్రక, మానవ, రాజకీయ సంబంధాలున్నాయి. వీటిని బలోపేతం చేయాలనేదే మా సంకల్పం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి. భారత్‌-తుర్కియే మధ్య విభేదాలు నెలకొన్న వేళ.. ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు సాయం చేసిన తుర్కియేపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ ఉత్పత్తులను నిషేధించాలంటూ ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం మార్మోగుతోంది.

Italy moschino couture Shirt Price In Trending6
రండి బాబు రండి.. ఇంకు మరకల చొక్కా 80,000 మాత్రమే..

పిచ్చి వెధవా.. తెల్లని చొక్కా వేసి బడికి పంపిస్తే మొత్తం ఇంకు మరకలు చేసుకోస్తావా.. బుద్ధి లేదా.. నేను ఇప్పుడు వీటిని ఎలా వదలగొట్టాలి.. ఎన్ని రిన్ సబ్బులు ఎన్ని సర్ఫ్ ప్యాకెట్లు వాడాలో.. ఇప్పుడు మీ నాన్నకు తెలిస్తే ఏమంటాడో.. మళ్ళీ కొత్త చొక్కా కొనాలంటే మాటలా.. తింగరి సన్నాసి అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు అని అమ్మ కొట్టిన రోజులు గుర్తున్నాయా?. బాబూ.. మా అబ్బాయి చొక్కా నిండా ఇంకు మరకలు పడ్డాయి దీన్ని కాస్త వదిలించియేలా గట్టిగా రేవు పెట్టావయ్యా అని చెప్పిన రోజులూ ఉన్నాయి. ఆమ్మో.. ఈ దరిద్రపు పెన్ను మళ్ళీ ఇంకు కక్కేసింది.. దీన్ని నిక్కర్ జేబులో పెట్టుకోకుండా అనవసరంగా తెల్ల చొక్కా జేబులో పెట్టాను.. ఇది మొత్తం షర్ట్ ను ఖరాబ్ చేసింది. ఇంటికెళ్తే అమ్మ ఏం తిడుతుందేమో ఏమిటో అని భయపడిన రోజులున్నాయి అయితే అప్పుడు మరక అన్నదే ఇప్పుడు మురిపెం అయింది. అదికూడా కాస్ట్లీ వ్యవహారం అయింది. మామూళోళ్ళకు దక్కని స్థాయి.ఒకనాడు ప్యాంట్‌కు ఎక్కడైనా కన్నం పడితే .. లేదా ఏ ముళ్లకంపకో.. ఏదైనా ఫెన్సింగ్‌కు గానీ తగులుకుని చినిగిపోతే అయ్యో అనే వాళ్ళం. దాన్ని మళ్ళా టైలర్ దగ్గరకు తీసుకెళ్లి రఫ్ చేయించేవాళ్ళు. కానీ, నేడు ఇప్పుడు జీన్స్‌లో చిరుగుల జీన్స్ (TORN JEANS) పేరిట అధిక ధరలకు కొంటున్నారు.. ఇదేంటి కుర్రోడా అంటే ఇదే ట్రేండింగ్ అంటున్నారు నేటి యూత్. అదే విధంగా ఇప్పుడు చొక్కాల్లో కూడా సరికొత్త మోడల్ వచ్చింది. ఇటలీ దేశానికీ చెందిన moschino couture అనే దుస్తుల కంపెనీ ఏకంగా ఇంకు మరకల చొక్కాను రూపొందించింది. men light blue pen ink leak pocket shirt పేరిట మార్కెట్లోకి దించిన ఈ చొక్కా జేబుల వద్ద సరిగ్గా ఇంకు మరక ఉండేలా డిజైన్ చేశారు.అలా మరక పడిన చొక్కాను సదరు సంస్థ బాగా చవగ్గా అమ్ముతోంది లెండి.. అంటే ఒక్కోటి రూ.80 వేలు మాత్రమే.. చూసారా. ఒకనాడు అయ్యో ఇదేంటి ఇలా అయిపొయింది చొక్కా అనుకునేది ఇప్పుడు మురిపెం అయింది. ఇంకుమరకల చొక్కా ధర చూసి గుండె గుభేల్ మన్నదా.. ఐతే సింపుల్.. ఓ మామూలు తెల్ల షర్ట్ కొనేద్దాం.. మనమే ఇంకు మరక వేసుకుందాం.. ఐదారొందల్లో కొత్త ఫ్యాషన్లోకి మారినట్లు సంబరపడిపోదాం.. -సిమ్మాదిరప్పన్న.

Gaza doctor in ICU his 9 of 10 Children Killed in Israeli Airstrikes7
Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు

గాజా: గాజాలో చోటుచేసుకున్న మరో విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రెండురోజుల ‍క్రితం గాజాపై ఇ‍జ్రాయెల్‌ జరిపిన సైనికదాడిలో తన తొమ్మిది మంది సంతానాన్ని కోల్పోయిన వైద్యుడు ప్రస్తుతం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌(Intensive care)(ఐసీయూ) చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు.గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే వైద్యుడు తన 10 మంది పిల్లలతో పాటు ఖాన్ యూనిస్‌లోని తన ఇంట్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన ఒక చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుగున్నాడు. ఇదే దాడిలో గాయపడిన డాక్టర్‌ హమ్ది అల్-నజ్జర్ ప్రస్తుతం దక్షిణ గాజాలోని సమీపంలోని నాజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా మాట్లాడుతూ డాక్టర్‌ నజ్జర్‌కు ఉదరం, ఛాతీలో అవుతున్న రక్తస్రావాన్ని నియంత్రించేందుకు రెండు ఆపరేషన్లు జరిగాయని, అతని తలకు కూడా తీవ్రగాయం అయ్యిదని తెలిపారు.ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) శుక్రవారం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి చేసినట్లు ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుండి పౌరులను తరలించిందని పేర్కొంది. కాగా నజ్జర్ భార్య కూడా వైద్యురాలు. అయితే ఆమె దాడి సమయంలో ఇంటిలో లేరు. విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి చేరుకుని విగత జీవులుగా పడివున్న తన పిల్లలను చూసి షాకయ్యారు. తరువాత తేరుకున్న ఆమె యుద్ధంలో గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్స అందిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతం ఈ యుద్ధం మొదలయ్యింది. తరువాత ఇజ్రాయెల్‌ హమాస్‌ను నిర్మూలించడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేస్తూ వస్తోంది. ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే..

Chiranjeevi Small Interruption On Mega157 Project8
అనిల్‌ రావిపూడి స్పీడ్‌కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?

సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమా ప్రకటన నుంచే అదిరిపోయే ప్రమోషన్స్‌లతో ప్రేక్షకుల అభిరుచిని పట్టేస్తాడు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్‌లో పాల్గొని, నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటారు. అలాంటి మ్యాజిక్‌ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్‌ అయ్యేలా చేశాడు. అయితే, తాజాగా ఆయన మెగాస్టార్‌ చిరంజీవితో (MEGA157) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌ విషయంలో అనిల్‌ దూకుడుతో అదరగొడుతున్నాడు. అయితే, దానికి కాస్త బ్రేక్‌ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టమని సూచించారట.అనిల్‌ రావిపూడి స్పీడ్‌కు చిరు బ్రేకులు వేయడం వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర( Vishwambhara) త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ, ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి లేదని చెప్పవచ్చు. అనిల్‌ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్‌ వల్ల విశ్వంభర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా157 ప్రాజెక్ట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్‌ ఆపై సినిమా షూటింగ్‌ ప్రారంభ సమయంలో చిరు కళ్ళమీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం.. ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాయి. కానీ, విశ్వంభరపై అలాంటి జోష్‌ కనిపించడం లేదు. అందుకే అనిల్‌ను కాస్త బ్రేక్‌ తీసుకోవాలని చిరు సూచించారట.విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్‌ చయలేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్‌ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్‌ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రమోషన్స్‌ విషయంలో స్పీడ్‌ పెంచితేనే మార్కెట్‌ పెరిగే ఛాన్స్‌ ఉంటుంది. రీసెంట్‌గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఒక బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ, అందులో ఉన్న సారాంశం ఎంటి..? దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్‌లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జులైలో విడుదల కావచ్చు అనే టాక్‌ అయితే వస్తుంది.

No annual fee cashback Axis Bank super money credit card9
కొత్త క్రెడిట్‌ కార్డు.. యూపీఐ పేమెంట్లపై క్యాష్‌బ్యాక్‌

ముంబై: యాక్సిస్‌ బ్యాంక్‌ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్‌ ఫస్ట్‌ యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ‘సూపర్‌.మనీ’ భాగస్వామ్యంతో కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును విడుదల చేసింది. ‘యాక్సిస్‌ బ్యాంక్‌ సూపర్‌.మనీ రూపే క్రెడిట్‌ కార్డ్‌’ అన్నది రూపే నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. యూపీఐ చెల్లింపులకు, పీవోఎస్‌ టెర్మినళ్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఏటీఎంలలో దీన్ని వినియోగించుకోవచ్చని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. కార్డు దారులు సూపర్‌.మనీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. దీని సాయంతో స్కాన్‌ చేసి చెల్లింపులు చేస్తే 3 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇతర విభాగాల్లో ఈ కార్డుతో చేసే వ్యయాలపై ఒక శాతం క్యాష్‌ బ్యాంక్‌ లభిస్తుంది. ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా జీవితకాలం ఉచిత సదుపాయంతో ఈ కార్డు లభిస్తుందని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

Cosmo Tech reports significant growth in  Hyderabad10
కాస్మో'టెక్‌' సిటీ..మేకప్‌ రంగానికి పెరుగుతున్న ఆదరణ..

హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ఫ్యాషన్, సినిమా, టెలివిజన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల పెరుగుదలతో మేకప్‌ రంగం కూడా భారీగా విస్తరిస్తోంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరచాలనే ఆవశ్యకత, సోషల్‌ మీడియా ప్రభావం, వివిధ వేదికలపై కనిపించే అవకాశం పెరిగినకొద్దీ మేకప్‌ సర్వీస్‌కు డిమాండ్‌ అధికమవుతోంది. ఒక కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లకే పరిమితమైన మేకప్‌ ఇప్పుడు సినిమాలు, యాడ్స్, మోడలింగ్, థియేటర్, ఫ్యాషన్‌ షోలు, ఫొటోషూట్లు, వర్క్‌ ప్రెజెంటేషన్‌లు, డిజిటల్‌ క్రియేటివిటీ లాంటి అనేక రంగాల్లో సౌందర్య సాధనాల అవసరాన్ని గుర్తుచేస్తోంది.. మేకప్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ఎంచుకునే వారికి నగరంలో అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. నగరంలో జరిగే వివాహ వేడుకలు, సినిమా షూటింగులు, సోషల్‌ మీడియా షూట్స్, బ్రాండ్‌ ప్రమోషన్స్‌ వంటివి మేకప్‌ ఆరి్టస్టులకు రెగ్యులర్‌ పని కల్పిస్తున్నాయి. ఇందులో కొంతమంది సెలబ్రిటీ మేకప్‌ ఆరి్టస్టులుగా ఎదుగుతుంటే, మరికొందరు ఫ్రీలాన్సర్లుగా, స్వతంత్ర సెలూన్లు లేదా స్టూడియోస్‌ స్థాపిస్తూ సొంత బ్రాండ్‌ ఇమేజ్‌ సృష్టించుకుంటున్నారు. తమ సొంత బ్రాండ్‌ డెవలప్‌ చేస్తూ కొంత మంది బ్యూటీషియన్లు సోషల్‌ సెలబ్రిటీలుగా మారుతున్నారు. డిజిటల్‌ మీడియాలో మేకప్‌ ట్యుటోరియల్స్, ట్రెండ్‌ లుక్స్, సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ప్రభావంతో యువత ఈ రంగంలో భవిష్యత్తును మెరుగుపరుచుకుంటోంది. డిజిటల్‌ పోర్ట్‌ఫోలియో, బ్రాండ్‌ భాగస్వామ్యాలతో ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. నిబద్దతతో శిక్షణ, సృజనాత్మకత, అప్డేటెడ్‌ ట్రెండ్స్‌కి అనుగుణంగా మెళకువలు పెంచుకుంటే, ఈ రంగంలో విజయానికి ఎలాంటి అవరోధాలు ఉండవు.వెలుగులు నింపే వెడ్డింగ్‌.. ఇది అత్యధిక డిమాండ్‌ ఉన్న విభాగం. వధూవరులకు ప్రీ–వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్‌ వెడ్డింగ్‌ లుక్స్‌ కోసం ప్రత్యేక మేకప్‌ అవసరం. వెడ్డింగ్‌ మేకప్‌ అనేది మేకప్‌ రంగంలో అత్యంత డిమాండ్‌ ఉన్న విభాగం. ప్రతి వధువు తన వివాహం రోజున గ్లోవింగ్, ఫొటోజెనిక్‌ లుక్‌ను కోరుకుంటుంది. ఇది కేవలం మేకప్‌ మాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మేకప్‌ చేయాల్సి ఉంటుంది. వెడ్డింగ్‌ మేకప్‌లో ప్రధానంగా ఫొటోషూట్ల కోసం లైట్, నేచురల్‌ లుక్స్‌తో ప్రీ–వెడ్డింగ్‌ మేకప్, సంప్రదాయ, గ్లామరస్‌ లుక్‌ కోసం హెవీ ఫౌండేషన్, కాంటూరింగ్, ఐ మేకప్, హెయిర్‌ స్టైలింగ్‌తో వెడ్డింగ్‌ డే మేకప్, ఫ్యూజన్‌ స్టైల్, స్మోకీ ఐస్‌తో ఆధునిక, ట్రెండీ రిసెప్షన్‌/పోస్ట్‌ వెడ్డింగ్‌ మేకప్‌ వంటివి ఉన్నాయి.సినిమాటిక్‌ లుక్‌ కోసం.. నటీనటుల స్క్రీన్‌ ప్రెజెన్స్‌కి మేకప్‌ కీలకం. ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి పని చేసే మేకప్‌ ఆరి్టస్టులు ఉంటారు. సినిమా, టీవీ రంగాల్లో మేకప్‌ అనేది కేవలం అందాన్ని కాకుండా, పాత్ర స్వభావాన్ని, వయసును, కాలప్రమాణాన్ని ప్రదర్శించే ఓ సాధనం. ఈ విభాగంలో బేసిక్‌ స్క్రీన్‌ మేకప్, పీరియడ్‌ డ్రామా మేకప్, గాయాలు, వృద్ధాప్య మేకప్, ఫాంటసీ పాత్రలు కోసం ఉపయోగించే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ మేకప్‌ వంటి విధానాలుంటాయి. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్, ఫిల్మ్‌ నగర్‌ ప్రాంతాల్లో సినిమాటిక్‌ మేకప్‌ ఆరి్టస్టులకు మంచి డిమాండ్‌ ఉంది. కొన్ని సంస్థలు ఈ రంగంలో స్పెషలైజ్డ్‌ ట్రైనింగ్‌ కూడా అందిస్తున్నాయి.కార్పొరేట్, గ్లామర్‌ ఈవెంట్స్‌ప్రొఫెషనల్‌ లుక్స్‌ అవసరం అయ్యే ఈవెంట్స్‌లో కూడా మేకప్‌ సర్వీసులు ఆశ్రయిస్తున్నారు. నేటి కార్పొరేట్‌ ప్రపంచంలో ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కీలకం. మహిళలే కాకుండా, పురుషులు కూడా గ్లామర్, కాని్ఫడెన్స్‌ కోసం మేకప్‌ సేవలు ఆశ్రయిస్తున్నారు. ఇందులో తక్కువ మేకప్‌తో చక్కటి స్కిన్‌ టోన్, క్లీన్‌అప్, గ్లో ఫినిష్, నేచురల్‌ లుక్, ఈవెంట్‌ స్పెసిఫిక్‌ మేకప్, మ్యాట్‌ ఫినిష్, లాంగ్‌ లాస్టింగ్‌ లుక్స్‌ వంటి మేకప్‌లు ఉన్నాయి. ఇవన్నీ టైమ్‌ మేనేజ్‌మెంట్, కస్టమైజేషన్‌ మీద ఆధారపడి ఉంటాయి. కొంతమంది బిజినెస్‌ కస్టమర్లకు రెగ్యులర్‌ మేకప్‌ సపోర్ట్‌ కూడా అవసరం అవుతోంది.శిక్షణలో టాప్‌..మేకప్‌ శిక్షణ అందించే అనేక ప్రైవేట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు నగరంలో ఉన్నాయి. వీఎల్‌సీసీ, లాక్మే అకాడమీ, నేచురల్‌ టఐనింగ్‌ అకాడమీ, జావీద్‌ హబీబ్‌ అకాడమీ, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ వంటి సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. ఈ సంస్థలు ప్రాథమిక స్థాయి నుంచి ప్రొఫెషనల్‌ కోర్సులు వరకూ అందిస్తున్నాయి. కొన్నింటిలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఉన్నాయి. ఇవి పరిశ్రమ అనుభవాన్ని ఇచ్చే మార్గంగా నిలుస్తున్నాయి. అనేక ఏళ్లుగా మేకప్‌ రంగంలో మహిళలు ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, ఇటీవల పురుషులు కూడా ఈ రంగంలో సత్తా చాటుతున్నారు. ప్రత్యేకంగా సినిమా, ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో పురుష మేకప్‌ ఆరి్టస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారు. లింగపరమైన పరిమితులు లేకుండా, టాలెంట్‌కు గౌరవం దక్కే రంగంగా మేకప్‌ రంగం రూపుదిద్దుకుంటోంది. (చదవండి: బ్యూటీకి కేరాఫ్‌గా భాగ్యనగరం..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement