275వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan 275th PrajaSankalpaYatra Schedule Released | Sakshi
Sakshi News home page

Sep 30 2018 6:41 PM | Updated on Oct 1 2018 7:48 AM

YS Jagan 275th PrajaSankalpaYatra Schedule Released - Sakshi

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 275వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం జననేత విజయనగరం నియోజకర్గంలోని జొన్నవలస క్రాస్‌ నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వై జంక్షన్‌, మయూరి జంక్షన్‌, రైల్వే స్టేషన్‌ మీదుగా వెంకటలక్ష్మీ జంక్షన్‌ వరకు జననేత పాదయాత్ర సాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మూడు లాంతర్ల సెంటర్‌ మీదుగా కొత్తపేట వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 274వ రోజు ముగిసింది. ఆదివారం బలరాంపురం, కుమరాన్‌, కోరుకోండ, చిన్నపురం జంక్షన్‌, కొరాడపేట, చాకలిపేట మీదుగా జొన్నవలస క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్‌ జగన్‌ నేడు 9.8 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకు జననేత 3055.8 కిలోమీటర్లు నడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement