ఫ్లిప్కార్ట్తో జతకట్టిన యాపిల్ | Apple Partners Flipkart to Sell iPhone 7, iPhone 7 Plus in India | Sakshi

ఫ్లిప్కార్ట్తో జతకట్టిన యాపిల్

Sep 23 2016 6:28 PM | Updated on Aug 20 2018 2:55 PM

ఫ్లిప్కార్ట్తో జతకట్టిన యాపిల్ - Sakshi

ఫ్లిప్కార్ట్తో జతకట్టిన యాపిల్

టెక్ దిగ్గజం యాపిల్, ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లను భారత్లో విక్రయించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో జతకట్టింది.

టెక్ దిగ్గజం యాపిల్,  ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లను భారత్లో విక్రయించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో జతకట్టింది. ఆన్లైన్లో ఈ ఫోన్ల అందుబాటుని మరింత విస్తరించడానికి ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యాపిల్ ఇండియా ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి ఈ కొత్త ఫోన్లు భారత్లో విడుదల కానున్నాయి.  ఈ భాగస్వామ్యంతో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్లు అధికారిక ధరల ప్రకారం ఆన్లైన్ రిటైలర్లో అందుబాటులో ఉండనున్నాయి.
 
ఈ డీల్తో గతంలో మాదిరిగా థర్డ్ పార్టీ అమ్మకందారులతో కాకుండా యాపిల్ నేరుగా ఈసారి ఫ్లిప్కార్ట్ ద్వారానే ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్7 సిరీస్ ఫోన్లతో పాటు, పాత ఐఫోన్ మోడల్స్ను సైతం ఫ్లిప్కార్ట్లో నమోదుకానున్నాయి. ఈ మాదిరి ఆన్లైన్ సైటుతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా ఐఫోన్ల విక్రయానికి భాగస్వామిగా ఉంటున్న ఇన్ఫిబీమ్ కూడా ఈ ఫోన్లను అందించనుంది. 
 
యాపిల్ ఇప్పటికే భారత్లో ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ ధరలను ప్రకటించింది. ఐఫోన్7 ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.60,000 నుంచి ప్రారంభమవుతుంది. అంతే స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్న ఐఫోన్ 7 ప్లస్ను రూ.72,000కు విక్రయించనుంది. 128 జీబీ, 256 జీబీ ఐఫోన్ 7 వేరియంట్లు రూ.70వేలు, రూ.80వేలుగా కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా 128జీబీ, 256జీబీ ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్ వేరియంట్లు రూ.82వేలు, రూ.92వేలుగా ఉండనున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement