నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ముంచిన ఐటీ, బ్యాంకు షేర్లు | Stock Market Today April 9 2025 Sensex falls Nifty at | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ముంచిన ఐటీ, బ్యాంకు షేర్లు

Published Wed, Apr 9 2025 3:52 PM | Last Updated on Wed, Apr 9 2025 4:06 PM

Stock Market Today April 9 2025 Sensex falls Nifty at

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి.  బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 379.93 పాయింట్లు (0.51 శాతం) క్షీణించి 73,847.15 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 136.70 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 22,399.15 వద్ద స్థిరపడింది. 

విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.73 శాతం, స్మాల్ క్యాప్ 1.08 శాతం చొప్పున నష్టపోయాయి. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్ 1.11 శాతం నుంచి 2.25 శాతం మధ్య తీవ్ర నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ ప్యాక్ నుంచి 30 షేర్లలో 17 నష్టాల్లో ముగియగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్ 3.4 శాతం వరకు నష్టపోయాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతం నుండి 6 శాతానికి తగ్గించడంతో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాలతో ముగిశాయి. పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితుల మధ్య ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశాన్ని సూచిస్తూ ఆరుగురు సభ్యుల ప్యానెల్ రెపో రేటు తగ్గింపునకు జైకొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement