ఇంటి గోడ కూలి ఇద్దరి మృతి | 2 ided due to wall collapse | Sakshi
Sakshi News home page

ఇంటి గోడ కూలి ఇద్దరి మృతి

Published Tue, Nov 17 2015 9:46 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మింగారిపల్లెలో ఇంటి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం గ్రామంలో మిద్దె కూలి చంద్రకళ(21) అనే బాలింత మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకుంది. వర్షాలకు ఇంటి గోడ బాగా తడిసినందువల్లే కూలిపోయిందని స్ధానికులు తెలిపారు.  ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చంద్రకళ 15 రోజుల క్రితమ మగబిడ్డకు జన్మనించింది. ఈ ప్రమాదం నుంచి పసికందు క్షేమంగా బయటపడ్డాడు

గోడకూలి చిన్నారి మృతి

రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మింగారిపల్లెలో ఇంటి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. అల్పపీడనం కారణంగా రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు ఇంటి గోడ కూలడంతో అచ్యుత్ అనే బాలుడు మృతి చెందాడు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement