wall collapse
-
ప్రహరీ కూలి ముగ్గురు కూలీల దుర్మరణం
మంచిర్యాల క్రైం: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ముగ్గురు కూలీలు నిర్మాణ పనులు చేస్తూ ప్రహరీ గోడ కూలి దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన వివరాలిలా.. స్థానిక బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో నందిని ఆస్పత్రి నిర్వాహకులు నూతన భవనం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రుద్రపురం గ్రామానికి చెందిన ఏనంక హన్మంత్(35), బాబాపూర్కు చెందిన ఆత్రం శంకర్(40), చింతలమానెపల్లికి చెందిన గోలేం పోషం(50) సెల్లార్లో పనులు చేస్తున్నారు. పనుల్లో భాగంగా పిల్లర్ల మధ్యలో మట్టి, బండలు నింపుతుండగా పక్కనే ఉన్న పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి పోషం, శంకర్, హన్మంత్పై పడడంతో దానికింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. వీరి పక్కనే పనిలో ఉన్న రాములును మరో ఇద్దరు కూలీలు లాగడంతో స్వల్ప గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు, స్థానికులు రెండు గంటలపాటు డ్రిల్లర్, జేసీబీ సాయంతో శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. çమృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాలు డిమండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ రాహుల్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించి ప్రమాద వివరాలు సేకరించారు. -
నిద్రలోనే తెల్లారిన బతుకులు.. ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం
సాక్షి, సూర్యాపేట: నిద్రలోనే ముగ్గురి బతుకులు తెల్లారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బాగా తడిసిన ఇంటి గోడ కూలడంతో వృద్ధ దంపతులతో పాటు కుమారుడు దుర్మరణం చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. శీల రాములు(90), రామక్క (83) దంపతులు తమ చిన్న కుమారుడు, ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీను(38)తో కలిసి చిన్న రేకుల ఇంట్లో జీవిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను భార్య.. పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. కాగా బుధవారం రాత్రి రోజూ మాదిరిగానే శిథిలావస్థకు చేరిన ఆ రేకుల ఇంట్లోనే ఓ గదిలో ముగ్గురు కలిసి ఒకే చోట నిద్రించారు. వర్షాలకు ఇంటి గోడలు బాగా తడవడంతో రాత్రి సమయంలో మధ్య గోడ కూలి వారి మీద పడటంతో ముగ్గురూ నిద్రలోనే విగతజీవులుగా మారారు. గురువారం సాయంత్రం విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ తీసేందుకు ఆ ఇంటికి రాగా ఎప్పుడూ బయట కూర్చునే వృద్ధదంపతులు కనిపించకపోవడం, ఇంటి గడియ లోనికి వేసి ఉన్నా ఎవరూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికులతో కలిసి గోడల మట్టిని తొలగించగా మృతదేహాలు కన్పించాయి. పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం విషయం తెలిసిన వెంటనే మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. తక్షణ సహాయంగా రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 75వేలు మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా అందజేశారు. వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం కల్పించడంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చదవండి: భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస -
కూలిన కుటుంబం.. సూర్యాపేటలో విషాదం
సాక్షి, సూర్యాపేట: తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వచ్చిన కొడుకు.. ఆ తల్లిదండ్రులతో కలిసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ ఇంటి గోడ కూలి మట్టిపెళ్లల కింద నలిగి ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. సూర్యపేట జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. నాగారం మండల కేంద్రంలో శీలం రాములు తన భార్య రాములమ్మ, కొడుకు శ్రీనివాస్(35)తో ఉంటున్నాడు. అయితే కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు శ్రీను హైదరాబాద్కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భారీగా గాలి దుమారం వీచింది. అప్పటికే ఆ ఇంటి మట్టి గోడలు వర్షాలకు నానిపోయి ఉండడంతో.. అవి కుప్పకూలి ఆ ముగ్గురి మీద పడినట్లున్నాయి. గురువారం ఉదయం విద్యుత్ శాఖ ఉద్యోగి కరెంట్ బిల్లు ఇచ్చేందుకు వెళ్లే వరకు ఆ ఇల్లు కూలిన విషయాన్ని ఎవరూ గమనించకపోవడం గమనార్హం. దీంతో.. ఆ ఉద్యోగి స్థానికులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే మట్టిపెళ్లల కింద చిక్కుకుని రాములు, రాములమ్మ, శ్రీను ప్రాణం విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ట్రాక్టర్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిద్రలోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా కుప్పకూలిన గోడ.. హైదరాబాద్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: గోడకూలి ఓ బాలుడు మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కాచిగూడ ఇన్స్పెక్టర్ రామ లక్ష్మణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ నుంచి బండి సింగ్, సేవారాజ్ కుటుంబాలు నగరానికి వలస వచ్చి కూలీ పనిచేసుకుంటూ కాచిగూడ, నింబోలిఅడ్డలో నివాలముంటున్నారు. బండి సింగ్ కుమారుడు ధీరూ సింగ్ (6), సేవా రాజ్ కుమార్తె రాధిక (5) తమ ఇంటి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా గోడకూలి చిన్నారి ధీరూ సింగ్ అక్కడికక్కడే మరణించగా, రాధిక తీవ్రంగా గాయపడింది. రాధికను కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాలికను అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా నిర్మాణం వల్లే.. ఖాళీ స్థలానికి అనుకుని పక్కనే ఉన్న స్థలంలో సత్యేందర్ నూతనంగా ఇంటి పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నాడు. ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇంటి నిర్మాణపు పనులు చేపడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటి యజమాని సత్యేందర్పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రామలక్ష్మణ రాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని కాచిగూడ పోలీసులు సందర్శించి వివరాల సేకరించారు. చదవండి: Hyderabad: ఐటీ కారిడార్లో దారుణం -
ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం!
లక్నో: భారీ వర్షాలు, వరదలు ఉత్తర్ప్రదేశ్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇటావా జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రెండు వేరు వేరు ప్రాంతాల్లో గోడలు కూలిపోయి మొత్తం 10 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటావాతో పాటు ఫిరోజాబాద్, బలరాంపుర్ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటావా చంద్రపురా ప్రాంతంలో ఇంటి గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందగా.. క్రిపాల్పుర్ ప్రాంతంలో పెట్రోల్ పంపు ప్రహారీ గోడ కూలి గుడిసెపై పడగా వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో అందావా కే బంగ్లా గ్రామంలో ఇంటి గోడ కూలిపోయి 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇటావా గ్రామంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
లక్నోలో ఘోర ప్రమాదం.. గోడ కూలి తొమ్మిది మంది దుర్మరణం!
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల ధాటికి గోడ కూలి తొమ్మిది మంది మృతి చెందారు. లక్నో దిల్ఖుషా ప్రాంతంలో శుక్రవారం వేకువ ఝామున ఈ ఘటన జరిగింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ సూర్య పాల్.. అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. దిల్ఖుషా ఏరియాలో గుడిసెల్లో కొందరు కార్మికులు నివసిస్తున్నారు. ఆర్మీ ఎన్క్లేవ్ గోడను ఆనుకుని వాళ్లు గుడిసెలు వేసుకున్నారు. ఈ క్రమంలో.. గత ఇరవై నాలుగు గంటల నుంచి వాన కురుస్తూనే ఉంది. గోడ కూలి ప్రమాదం జరిగింది అని లక్నో పోలీస్ జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్డియా వెల్లడించారు. తొమ్మిది మృతదేహాలను ఘటన జరిగిన వెంటనే దిబ్బల నుంచి వెలికి తీశామని, మరొకరు సజీవంగా బయటపడ్డారని ఆయన తెలిపారు. మరో చోట గోడ కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. Lucknow city wall collapsed after Heavy #Rain near-Dilkusha in #Lucknow#HeavyRain #UP pic.twitter.com/bVPaz25gUB — Himanshu dixit 🇮🇳💙 (@HimanshuDixitt) September 16, 2022 -
ఘోర ప్రమాదం.. గోడ కూలి పాప, మహిళ మృతి
సాక్షి, బెంగళూరు: డెంకణీకోట పట్టణంలోని ఉరుసు జాతరలో ఘోరం సంభవించింది. గోడ కూలడంతో ఓ పాప, మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. పట్టణంలోని యారబ్ దర్గాలో కొన్నిరోజులుగా ఉరుసు జరుగుతోంది. ఇందులో అసోం రాష్ట్రానికి చెందిన వారు అంగళ్లను ఏర్పాటు చేసుకొన్నారు. బుధవారం ఉరుసు ముగింపు సందర్భంగా అంగళ్లను ఖాళీ చేస్తుండగా పాత రాతి గోడ కూలిపోయింది. రాళ్ల కింద చిక్కి అసోం రాష్ట్రానికి చెందిన హామియాబేగం (35), రబికుల్ ఇస్లాం (22), సాధ్ ఆలీ (35), డెంకణీకోట జైవీధికి చెందిన బాలాజీ కూతురు సహన (11), వెంకటేష్ కూతురు హేమావతి(12)లు చిక్కుకొన్నారు. వెంటనే స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా హామియాబేగం, సహన మృతి చెందారు. మిగతా ముగ్గురికి డెంకణీకోట ప్రభుత్వ ఆస్ఫత్రిలో చికిత్సలందజేస్తున్నారు. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బెంగళూరులో ఏకధాటిగా వర్షాలు.. 1989 తరువాత ఇదే తొలిసారి -
విషాదం.. గోడ కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!
రాయ్పుర్: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోయి ముగ్గురు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్గఢ్లోని బస్తర్ కంకెర్ జిల్లాలో సోమవారం జరిగింది. పఖంజోర్ ప్రాంతం, ఇర్పానార్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ శలభ్ సిన్హా తెలిపారు. గోడ కూలిపోయిన సమయంలో బాధితులు ఇంట్లో నిద్రిస్తున్నారని వెల్లడించారు. ప్రమాదం సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు గ్రామానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అందాల్సిన సాయాన్ని వెంటనే అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అతి కష్టంపై అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్, కోర్బా, ముంగేలి, గరియాబంద్, రాయ్పుర్, దుర్గాంద్ ధంతారి జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ప్రేమ పెళ్లి.. పది నెలలకే ఊహించని దారుణం! -
వానకు ఇల్లు కూలి తల్లీబిడ్డ మృతి.. 2 నెలల కిందే అమ్మాయికి వివాహం
నల్లగొండ: అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డకు రెండు నెలల కిందే పెళ్లి చేసింది. ఆషాఢ మాసం కావడంతో ఆచారం ప్రకారం ఆ బిడ్డ వారం కింద తల్లి వద్దకు వచ్చింది. గురువారం రాత్రి కలిసి అన్నం తిన్నారు. ముచ్చట్లు చెప్పుకొంటూ పడు కొన్నారు. కానీ జోరు వానకు మట్టిగోడ తడిసి ఇల్లు కూలిపోయింది. దానికింద కూరుకుపోయి తల్లీబిడ్డ ఇద్దరూ కన్నుమూశారు. నల్లగొండ పట్టణంలోని పద్మానగర్లో ఈ ఘటన జరిగింది. మృతులను ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మాకివలస గ్రామానికి చెందిన నడిపూరి లక్ష్మి (47), ఆమె కుమార్తె కల్యాణి (21)గా గుర్తించారు. రెండు నెలల కిందే పెళ్లి చేసి.. మాకివలసకు చెందిన లక్ష్మి భర్త నాయుడు ఆర్థిక ఇబ్బందులతో పదేళ్ల కింద ఆత్మహత్య చేసుకు న్నాడు. దీనితో పిల్లలు భాస్కర్రావు, కల్యాణి ఇద్దరినీ ఆమెనే పోషిస్తోంది. నల్లగొండలోని పద్మా నగర్కు వలస వచ్చి మూడేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేసి పెడుతూ జీవిస్తోంది. కల్యాణికి మే 14న శ్రీకాకుళం జిల్లా ధర్మూర్ మండలానికి చెందిన బంధువుల అబ్బాయి శ్రీనుతో వివాహం చేసింది. బిడ్డ, అల్లుడు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటున్నారు. ఆషాఢ మాసం కావడంతో కల్యాణి వారం క్రితమే తల్లి దగ్గరికి వచ్చింది. శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో కుమారుడు బయటపడ్డాడని స్థానికులు చెప్తున్నారు. మృతదేహాలను అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తీసుకెళ్లారు. -
గోడ కూలుతుందని చెప్పినా వినలేదు
వరంగల్/రామన్నపేట: పాతకాలం నాటి మట్టి గోడను కదిలిస్తే కూలిపోతుందని యజమానికి, మేస్త్రీకి ఎంత చెప్పినా వినిపిం చుకోలేదు. యజమాని, మేస్త్రీలు కలసి నిర్ల క్ష్యంగా గోడను కదిపి కూలీల జీవితాలను నిలువునా కూల్చివేశారు. వరంగల్ నగరంలో గిర్మాజిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గిర్మాజిపేట కు చెందిన ముజామిల్ షరీఫ్ అనే వ్యక్తి పాత భవనం కొనుగోలు చేసి మరమ్మతులు చేపట్టాడు. ఈ భవనం పక్కనే ఉన్న మరో భవనానికి మధ్య ఒక్కటే అడ్డుగోడ ఉంది. దీనిని కూల్చేందుకు ఆ భవనం యజమాని అంగీకరించలేదు. పాతకాలం నాటి గోడ కా వడం వల్ల ఎక్కువ మందం (సుమారు 18 ఇంచులు)ఉంది. అందులో తనకు చెందిన 9ఇంచుల వరకు బెడ్ పోసుకునేందుకు పక్క భవనం యజమాని అంగీకరించాడు. ఈ నిర్మాణ పనులను షరీఫ్ తాపీ మేస్త్రీ శ్రీను అనే వ్యక్తికి అప్పగించాడు. 18ఇంచుల గోడ లో సగం 9ఇంచుల వరకు గాలా తీసి అందులో ఇనుప రాడ్లు పెట్టే క్రమంలో పాత గోడ ఒక్కసారిగా కూలిపోయి అక్కడే పనిచేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో దేశా యిపేటకు చెందిన సబీరాం సాగర్(26), సుందరయ్యనగర్కు బోసు సునీత(24)లు అక్కడికక్కడే చనిపోయారు. మేస్త్రీతోపాటు మరో కూలీ జ్యోతి కొద్దిపాటి గాయాలతో బయట పడ్డారు. అనాథలైన పిల్లలు.. గోడ కూలిన ఘటనలో చనిపోయిన సునీత భర్త ఎనిమిది నెలల క్రితం చనిపోయాడు. ఈమెది మంచిర్యాల కాగా, పని కోసం నగరానికి వచ్చి సుందరయ్య కాలనీలో అత్తతో కలిసి నివాసం ఉంటోంది. ఈమెకు ముగ్గురు పిల్లలు. సునీత చనిపోవడంతో వృద్ధురాలు, పిల్లలు అనాథలయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషించే కోడలు చనిపోవడంతో ముగ్గురు పిల్లలతోపాటు తాను ఎలా బతకాలని వృ ద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంటికి పెద్దదిక్కు పోయాడు దేశాయిపేటకు చెందిన సబీరాం సాగర్ తండ్రి సూరిబాబు తోళ్ల కార్ఖానాలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. కార్ఖానాలు మూతపడటంతో జీవనోపాధి లేకపోవడం తో సాగర్ చదువును మధ్యలోనే ఆపి భవన నిర్మాణ రంగంలో సలాక(ఐరన్) కార్మి కుడిగా మారాడు. రోజూ కూలీకి వెళ్తూ తమ్మున్ని చదవిస్తున్నాడు. సాగర్ చనిపో వడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడింది. -
పాఠశాలలో గోడ కూలి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
చెన్నై: పాఠశాలలో వాష్రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరునెల్వేలిలో ఉన్న షేఫర్ హయ్యర్ సెకండరీ బాయ్స్ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం ఉదయం సంభవించింది. విద్యార్ధులు మూత్ర విసర్జను వెళ్లగా మరుగుదొడ్డి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన ముగ్గురు చిన్నారులు అన్బళగన్ (9వ తరగతి), విశ్వరంజన్ (8వ తరగతి), సుతేష్ (6వ తరగతి)గా గుర్తించినట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది. గాయపడిన విద్యార్థులను సంజయ్ (8వ తరగతి), ఇసాకి ప్రకాష్ (9వ తరగతి), షేక్ అబూబకర్ కిదానీ (12వ తరగతి), అబ్దుల్లా (7వ తరగతి)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిని వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సానుభూతి తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ప్రకటించింది. చదవండి: ప్లీజ్ సార్, వెళ్లొద్దు.. బోరున విలపిస్తు రోడ్డెక్కిన విద్యార్థులు కాగా ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని, అప్పుడే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని తిరునెల్వేలి పోలీసులు తెలిపారు. మరోవైపు గోడ కూలిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళన చేశాయి. పాఠశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశాయి. అయితే స్కూల్ భవనం పాతబడిందని, కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు అది మూతపడి ఉండగా.. ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇటీవల స్కూల్ను తెరిచారని పోలీసులు తెలిపారు. అయితే, స్కూళ్లు తెరిచే ముందు పాఠశాలల పరిస్థితిని చెక్ చేసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ముందే సూచించిందని తెలిపారు. చదవండి: ఆమె సంకల్పానికి సలాం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి.. -
విషాదం: వాకింగ్ కోసమని వెళ్లి.. మట్టి పెళ్లల కింద..
సాక్షి, రహమత్నగర్: వాకింగ్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి మట్టి పెళ్లలు కింద మృతదేహమై కనిపించాడు. బుధవారం మిత్రుడిని కలిసి వెళ్తున్న క్రమంలో గోడ కూలి మీద పడటంతో ఆశిష్ (25) అనే యువకుడు అసువులు బాశాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. రహమత్నగర్ డివిజన్ శ్రీరాంనగర్ పోచమ్మ ఆలయం సమీపంలోని శ్రీ అనూష రెసిడెంట్ ప్రహరీ బుధవారం సాయంత్రం వర్షం కారణంగా కూలిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడం, వర్షం మూలంగా ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లారు. సహాయక చర్యల్లో భాగంగా గురువారం ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీతో మట్టి పెల్లలు తొలగిస్తుండగా అందులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. తమ్ముడు కనిపించడం లేదని.. వాకింగ్ కోసమని వెళ్లిన తన తమ్ముడు కనిపించడం లేదని అంతకుముందు రోజు ఆశిష్ సోదరి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. మృతుడి జేబులో ఉన్న కారు తాళం చెవిని చూసి ఆశిష్గా వారు గుర్తించారు. కల్యాణ్ నగర్ వెంటర్– 3కు చెందిన ఆశిష్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. నిత్యం వాకింగ్ కోసం వస్తూ అనూష రెసిడెంట్లో ఉండే మిత్రుణ్ని కలుస్తుంటాడు. ఈ క్రమంలోనే బుధవారం స్నేహితుడిని కలిసి వెళ్తున్న క్రమంలో గోడ కూలడంతో మృత్యువాత పడ్డాడని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ప్రపుల్లా రెడ్డి, ఎమ్మెల్యే, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ రాజ్కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. రూ.కోట్ల వ్యయంతో అపార్ట్మెంట్ కట్టి ప్రహరీ నిర్మించపోవడంతోనే ప్రమాదం జరిగిందని బస్తీ వాసులు మండిపడుతున్నారు. మట్టితో కట్టిన పాత గోడతో ఎప్పుడైనా ప్రమాదం వాటిల్లవచ్చని.. దానిని తొలగించి కొత్త గోడను ఏర్పాటు చేసుకోవాలని బస్తీ వాసులు పల మార్లు అపార్ట్మెంటువాసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
నీటిలో కలిసిన ప్రాణాలు.. కుటుంబాల్లో విషాదం
చాంద్రాయణగుట్ట: ఓ వెంచర్ నిర్వాహకుడి నిర్లక్ష్యమే చాంద్రాయణగుట్టలో ఎనిమిది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ తెలిపిన మేరకు.. బండ్లగూడ గౌస్నగర్లో మహ్మద్ హిల్స్ వెంచర్ పేరుతో మహ్మద్ పహిల్వాన్ కుటుంబ సభ్యులు వెంచర్ను చేస్తున్నారు. ఎత్తైన ప్రదేశంలో గుట్టపై ఉన్న ఈ వెంచర్కు ఇటీవలే భారీగా ప్రహారీ నిర్మించారు. కాగా ఈ ప్రహారీని ఎలాంటి పునాది లేకుండా బండరాళ్ల పైనే సిమెంట్ వేసి గ్రానైట్తో పైకి లేపారు. అనంతరం మట్టితో చదును చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి మట్టి కూరుకుపోవడంతో పాటు పునాది లేకపోవడంతో ప్రహారీ కూడా పట్టుతప్పి మంగళవారం రాత్రి ఒక్కసారిగా సగం మేర కూలి దిగువన ఉన్న రేకుల ఇళ్లపై పడింది. ఐదారు ఇళ్లపై గ్రానైట్లు పడినప్పటికీ....కేవలం రెండిళ్లపై ప్రభావం ఎక్కువగా చూపి అందులో ఉన్న ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి. ఒకే ఇంట్లో ఐదుగురి మృతి.. గౌస్నగర్కు చెందిన మహ్మద్ జహంగీర్ తన ఇద్దరు కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, పిల్లలతో సంతోషంగా మంగళవారం రాత్రి నిద్రించాడు. నిద్రించిన కాసేపటికే భారీ శబ్దాలు రావడంతో చిన్న కుమారుడు మహ్మద్ నవాజ్ అఖ్నీ వెంటనే బయటికి పరుగులు తీశాడు. ఇంట్లో ఉన్న జహంగీర్ కుమారుడు పెద్ద కుమారుడు సమద్ రబ్బానీ (35), కోడలు సబా హాష్మీ(26), రెండో కుమార్తె ఫౌజియా నాజ్ (36), ఆమె కుమారులు సయ్యద్ జైన్((3), జొయేద్ (19 రోజులు)లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో కుమార్తె సబియా అనాజ్ (31) తీవ్రంగా గాయపడింది. ఇలా ఒకే ఇంట్లో మొత్తం ఐదు మంది మృతి చెందారు. తల్లి, సంతానాన్ని కోల్పోయిన సిద్దిఖీ జహంగీర్ ఇంటిని ఆనుకునే సిద్దిఖీ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటిపై కూడా ఇదే మాదిరిగా గోడ కూలడంతో సిద్దిఖీ తల్లి జాకీ రా బేగం (50), కుమారుడు సయ్యద్ సాదిక్ (1), కుమార్తె సయ్యదా అన్వారీ (3)మృతి చెందారు. గౌస్నగర్లో విషాధచాయలు గౌస్నగర్లో పక్కపక్కింట్లోనే నివాసం ఉండే ఎనిమిది మంది మృత్యువాత పడడంతో స్థానికంగా తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాత్రి వర్షం కారణంగా రాలేకపోయిన బంధుమిత్రులు బుధవారం ఉదయమే పెద్ద ఎత్తున ఇళ్లకు చేరుకున్నారు. అనంతరం మృతదేహాలు రాకపోవడంతో పోస్టుమార్టం చేస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి బయల్దేరారు. నీటిలో కలిసిన ప్రాణాలు భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. జలం మధ్యలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జనం విలవిల్లాడారు. వరద నీటి సమస్యనుంచి బయటపడే ప్రయత్నంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. విద్యుదాఘాతంతో కార్పెంటర్ మృతి నాగోలు: కాసోజు నారాయణ చారి (35) ఎల్బీనగర్ బైరామల్గూడ కేకే గార్డెన్ సాగర్ ఎన్క్లేవ్ కాలనీలో నివాసముంటూ కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం కురిసిన భారీ వర్షంతో సాగర్ ఎన్క్లేవ్ కాలనీలో వరద నీరు వచ్చింది. ఇంట్లో స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయగా షార్ట్ సర్క్యూట్తో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. సెల్లార్ నీటిలో మునిగి చిన్నారి.. చంపాపేట: రమావత్ జితేంద్ర, లక్ష్మి దంపతులు సరూర్నగర్ పీఅండ్టీ కాలనీలోని సాహితీ నెస్ట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వీరికి అర్జిత్సాయి (3) అనే కుమారుడున్నాడు. భారీవర్షానికి అపార్ట్మెంట్ సెల్లార్లో వరదనీరు చేరింది. బుధవారం ఉదయం ఆడుకుంటూ సెల్లార్లోకి వెళ్ళిన అర్జిత్సాయి నీటిలోకి ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అర్జిత్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వరదలో కొట్టుకుపోయి మహిళ పహాడీషరీఫ్: మణికొండ ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు భార్య వరలక్ష్మి (32) గోషామహాల్లో జలమండలి కార్యాలయంలో స్వీపర్గా పని చేస్తుంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో సోదరుడు జోగు శంకర్ వెంట బైక్పై ఆదిబట్ల నుంచి శంషాబాద్ వైపు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వెళుతున్నారు. ఫ్యాబ్సిటీ సరస్సు నిండటంతో నీటి ప్రవాహంలో అదుపుతప్పారు. శంకర్ బయటికి వచ్చినా వరలక్ష్మి రాలేకపోయింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం రాత్రి 7 గంటలకు మృతదేహం లభించిందని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సెల్లార్లో నీటిని తోడుతూ.. అంబర్పే: బాగ్ అంబర్పేట వినాయక్నగర్లో మహాలక్ష్మి అపార్టుమెంట్ సెల్లార్లో నీరు చేరడంతో చంద్రమౌళి కుమారుడు రాజ్కుమార్(33) మోటార్ బుధవారం మోటార్ బిగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని అంబర్పేట పోలీసులు తెలిపారు. సెల్లార్లో షాక్.. ప్రైవేట్ ఉద్యోగి మృతి అమీర్పేట: గంటా శ్రీనివాస్ (47) ధరం కరం రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఐసీఐసీఐ బ్యాంకు వెనకాల సెల్లార్లో ఉన్న గోల్డెన్ కేఫ్ బార్ ఆండ్ రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో వరదనీరు రెస్టారెంట్లోకి వచ్చిన సమయంలో క్యాషియర్ శ్రీనివాస్తో పాటు, మేనేజర్ సుబ్బారెడ్డి, మరో బాయ్లో లోపలే ఉన్నారు. కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్చేశారు. తరువాత కరెంటు రావడంతో నీటిలో విద్యుత్ ప్రవహించింది. వరద నీటిలో ఉన్న షాక్ తగిలి పడిపోయాడు. అక్కడే ఉన్న మేనేజర్, బాయ్ పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్వైర్లు బయటకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిని పంపింగ్ చేస్తూ వైద్యుడు.. బంజారాహిల్స్: డాక్టర్ చల్లా సతీష్కుమార్ రెడ్డి (49) యోగా, ఫిజియోథెరపి, నేచురోపతి స్పెషలిస్ట్గా శ్రీనగర్కాలనీలోని ఎస్బీహెచ్ కాలనీలో సేవలందిస్తున్నాడు. సతీష్కుమార్రెడ్డి ఇంటి సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. బుధవారం ఉదయం నీటిని బయటికి పంపింగ్ చేసేందుకు ఆయన మెట్లు దిగి మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. భయంతో గుండెపోటు..వృద్ధురాలి మృతి బడంగ్పేట్: బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని సాయిబాలాజీ టౌన్షిప్ కాలనీమొత్తం ముంపునకు గురైంది. మంగళవారం రాత్రి ఇంటిలోకి వరదనీరు రావడంతో భయాందోళనకు గురైన రామసహాయం రత్నమాల(65), గుండెపోటుతో చనిపోయింది. అర్ధరాత్రి కాలనీ మొత్తం జలమయం కావడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో రాత్రి మొత్తం ఇతర కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటు గడిపారు. -
నాణ్యత మహానందీశుడికెరుక !
మహానంది: మహానంది క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే రాజగోపురం ముందు భాగంలో రెండు సుపథ మండపాల మధ్యలో గ్రీనరీ కోసం యూ ఆకారంలో నిర్మించిన గోడ బుధవారం కూలిపోయింది. గోడల మధ్యలో వేసిన మట్టికి పైప్ ద్వారా నీరు పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, చిన్నపాటి నీటి ఫోర్స్కే ఇలా జరగడంతో నిర్మాణాల్లో నాణ్యతపై స్ధానికులు, భక్తులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఈఓ మల్లికార్జునప్రసాద్ మాట్లాడుతూ సిబ్బంది ఫైర్ ఇంజన్లకు వాడే పైపుతో నీరు పట్టడం ద్వారా ఫోర్స్కు గోడ కూలిపోయిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాగా ఈ గోడ నిర్మాణానికి సుమారు రూ. 55 వేలకు పైగా ఖర్చు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. -
ఉమెన్స్ హాస్టల్లో తప్పిన పెను ప్రమాదం!
మాదాపూర్: సెల్లార్ తవ్వడంతో హాస్టల్ గోడ కూలి ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్లోని పత్రికానగర్లో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా సెల్లార్ పక్కనే ఉన్న గది గోడ కూలడంతో హాస్టల్లో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పత్రికానగర్లో సాయిసంగమేశ్వర హాస్టల్ను నెల్లూరు జిల్లా పంగం గ్రామానికి చెందిన శ్రీహరి అనే వ్యక్తి తల్లితో కలిసి మూడేళ్లుగా పీజీ ఉమెన్స్ హాస్టల్ను నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా హాస్టల్ పక్కనే భవన నిర్మాణం చేసేందుకు సెల్లార్ను తీస్తున్నారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు హాస్టల్కి అదనంగా ఉన్న గది గోడ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో గదిలో నిద్రిస్తున్న నిర్వాహకులు వెంకటమ్మకు తీవ్రగాయాలయ్యాయి. రెండు చేతులు, వెన్నెముక దెబ్బతిన్నాయి. మాదాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. హాస్టల్ ఖాళీ.. హాస్టల్ కింది భాగమంతా బీటలు వారడంతో ప్రమాదకరంగా మారింది. ఇందులో ఉన్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. దీంతో దాదాపు 70 మంది విద్యార్థినులు, వర్కింగ్ ఉమెన్స్ లగేజ్లు తీసుకొని వెళ్లిపోయారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులు స్థల యాజమానులపై కేసులు నమోదు చేశారు. యాజమానులు కాసు శైలజారెడ్డి, కాసు దినేష్రెడ్డి, సెక్షన్ ఇంజనీర్ రాజరాం తివారీ, టెక్నికల్ శ్రీశైలంలపై కేసులను నమోదు చేశారు. ఇలాంటి సెల్లార్లను తీసే సమయంలో ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూ చుట్టుపక్కల వారికి కూడా సమాచారం ఇవ్వాలి. అలాంటివి ఏమి చేయకుండా సెల్లార్లను తవ్వినట్లు అధికారులు తెలిపారు. -
ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి
-
ముగ్గురు చిన్నారులను మింగిన గోడ
నాంపల్లి: ఇంటి మధ్య గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడిన సంఘటన గురువారం రాత్రి నగరంలోని హబీబ్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఫ్జల్సాగర్ మాన్గార్ బస్తీలో రోజు కూలితో పొట్టపోసుకునే మిఠాయి లాల్, సీమ దంపతులు తమకున్న ఆదాయ వనరులతో పునాదులు లేకుండా సిమెంట్ ఇటుకలతో చిన్న శ్లాబ్ ఇల్లు నిర్మించుకున్నారు. అదే ఇంట్లో గబ్బార్, సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. మిఠాయిలాల్, సీమలకు రోష్ని (4), లక్ష్మీ (5) పావని (రెండు నెలలు) సంతానంకాగా గబ్బార్, సురేఖలకు వరలక్ష్మి (5), గీత (3), ఆరోల (2) పిల్లలుఉన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చిన తల్లిదండ్రులు బయట వీధిలోకి వెళ్లారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో గదిలోని వంట గది దిమ్మె వేడెక్కి గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్ దంపతుల ముగ్గురు పిల్లలూ మరణించారు. అలాగే గబ్బార్ దంపతుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నిలోఫర్కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. -
చితికిపోయిన పేదల బతుకు
వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. కాయకష్టం చేశారు.పొద్దుపోయాక ఇంటికి చేరుకున్నారు. భోజనాలు చేసి ఒక్కొక్కరూ నిద్రకు ఉపక్రమించారు. గాఢనిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ప్రహరీ గోడ కూలింది. తేరుకునేలోపే రెండు కుటుంబాలనుమింగేసింది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా మృత్యువు మొత్తం 17 మందినిపొట్టనపెట్టుకుంది.శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని అధికారులుఅనుమానిస్తున్నారు. ఈ విషాదకర ఘటనమేట్టుపాళయంలోతీవ్ర విషాదాన్ని నింపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: మేట్టుపాళయం సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి 17 మంది మృత్యువాత పడ్డారు. కుటుంబాలకు, కుటుంబాలే శిథిలాల కింద నలిగిపోయాయి. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వివరాలు.. కోయంబత్తూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేట్టుపాళయం, కట్రుపుర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఎడతెరిపిలేకుండా కురిసిన వాన ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మేట్టుపాళయం సమీపం నడూరు కన్నప్పన్ లే–అవుట్లో పేరొందిన వస్త్రదుకాణం యజమాని ఇల్లు ఉంది. దీనికి సమీపంలో 50 మందికిపైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. శివగామీ, అరుక్కానీ అనే మహిళలు మట్టితో పెంకుటిళ్లు నిర్మించుకుని కుటుంబసభ్యులతో నివాసముంటున్నారు. వస్త్రవ్యాపారి తన ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండ రాళ్లతో నిర్మించిన ప్రహరీ గోడ ఈ ఇళ్లకు అనుకునే ఉంది. ఇటీవల వర్షాలకు నేల మెత్తబడి, ప్రహరీ గోడ తడిసి కూలేస్థితికి చేరింది. ప్రహరీ పక్కన ఇళ్లలో నివసించే పేదలు ఆదివారం రాత్రి యథావిధిగా నిద్రించారు. శిథిలాలను తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది సోమవారం తెల్లవారు జాము 4 గంటల సమయంలో ఆ ప్రహరీ గోడ పెద్ద శబ్దంతో శివగామి, అరుక్కానీ పెంకుటిళ్లపై కూలింది. ఈ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ ప్రొక్లయిన్లను రప్పించి శిథిలాలను తొలగించగా మొత్తం 17 మంది నిద్రిస్తున్న దశలోనే ప్రాణాలువిడిచినట్టు కనిపించాయి. అరుక్కానీ, శివగామీ కుటుంబాల్లో అందరూ శిథిలాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. మృతుల్లో గురుస్వామి (45), రామనాథన్ (20), ఆనందకుమార్ (40), శివకామీ (45), ఓవియమ్మాళ్ (50), నిత్య (30), వైదేహీ (20), తిలకవతి (50), అరుక్కాని (55), రుక్మిణి (40), నివేదా (18), చిన్నమ్మాళ్ (70), మంగలమ్మాళ్(60), హరిసుధ (16), అక్షయ (7), లోగురాం (7), మహాలక్ష్మి (10) ఉన్నారు. శిథిలాలు పూర్తిగా తొలగిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. శిథిలాల తొలగింపునకు కోయంబత్తూరు నుంచి ప్రకృతి వైపరీత్యాల రక్షణ దళాలను రప్పించారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరఫున తలా రూ.4 లక్షల ఆర్థికసహాయాన్ని ప్రకటించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన వంద మందితో కూడిన బృందాన్ని రప్పించినట్లు పోలీస్శాఖ పశ్చిమ మండల డీజీపీ పెరియయ్యా తెలిపారు. మేట్టుపాళయంలో లాఠీచార్జీ రెండు కుటుంబాలను సమూలంగా తుడిచిపెట్టేసిన ఈ ఘోర ప్రమాదం రాష్ట్ర ప్రజలను గగుర్పాటుకు గురిచేసింది. మేట్టుపాళయం ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. పక్కా ప్రణాళిక లేకుండా బలహీనమైన ప్రహరీ గోడ నిర్మించుకుని 17 మందిని పొట్టనపెట్టుకున్న వస్త్రవ్యాపారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించిన మేట్టుపాళయం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా కదలక పోవడంతో లాఠీచార్జీ చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు మేట్టుపాళయంకు సీఎం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం మెట్టుపాళయంకు చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. -
నిద్ర నుంచే అనంత లోకాలకు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందరిలాగే వారు కూడా రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. కానీ మూసిన కళ్లు తెరవక ముందే వారి జీవితాలు ముగిసిపోయాయి. ఏం జరిగిందో గుర్తించేలోపే ప్రమాదం ముంచుకురావడంతో పడుకున్న స్థితిలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. తెల్లవారుజామున ప్రశాంతంగా నిద్రిస్తున్న రెండు కుటుంబాల్లోని 17 మందిని మృత్యుదేవత తడిసిన గోడ రూపంలో కబళించిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా మరణించిన వారిలో పది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపం నడూరు కన్నప్పన్ లే–అవుట్లో ఓ వస్త్రవ్యాపారి ఇంటి సమీపంలో 50 మందికి పైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఈ ఇళ్లకు ఆనుకునే ఉన్న వస్త్రవ్యాపారి ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండరాళ్లతో నిర్మించిన ప్రహరీగోడ ఉంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం ధాటికి.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు పెంకుటిళ్లపై కూలింది. రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 17 మంది నిద్రిస్తున్న దశలోనే ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం మేట్టుపాళయంకు వెళ్లనున్నారు. -
ఛాత్ ఉత్సవాల్లో 30 మంది మృతి
పాట్నా: గోడ కూలడం, తొక్కిసలాట, మునిగిపోవడం వంటి వాటి కారణంగా బిహార్లో 30 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలు బిహార్ ప్రజలు జరుపుకునే ఛాత్ పండగ సందర్భంగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు గోడ కూలిన ఘటనలో, ఇద్దరు పిల్లలు తొక్కిసలాటలో, మరో 26 మంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉత్సవాల సందర్భంగా మునిగిపోయి మరణించారు. ఛాత్ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. లక్షలాది మంది ఈ పండుగను దేవాలయాల వద్ద, ఘాట్ల వద్ద స్నానాలాచరించి జరుపుకున్నారు. -
గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి
సాక్షి, ఉంగుటూరు : గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణ పురంలో చోటు చేసుకుంది. రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజే కొద్దిగా వర్షం తెరిపి ఇవ్వడంతో పెద్దిరెడ్డి రాఘవమ్మ(60) అనే వృద్ధురాలు అటుగా వెలుతున్న సిరిపురపు శ్రీను(40) ఇంటిపై కవర్ కప్పాల్సిందిగా కోరింది. దీంతో శ్రీను ఇంటిపైకి బరకం వేస్తుండగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో శ్రీను, రాఘవమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. -
కూలిన నారాయణ కాలేజీ గోడ
సాక్షి, నెల్లూరు: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. కళాశాల గోడ కూలడంతో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని అరవింద్ నగర్లో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ కొందరు విద్యార్థులు ఉండడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని కళాశాల సిబ్బంది వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ కానీ, యాజమాన్యం కానీ ఇంతవరకూ స్పందించలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ప్రస్తుతం నారాయణ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి. కాలేజీ లోనికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. -
ముంబై అతలాకుతలం
సాక్షి, ముంబై: ముంబైను కుండపోత వర్షాలు మంగళవారమూ స్తంభింపజేశాయి. మలద్లోని పింప్రిపద ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గోడ కూలి, పక్కన గుడిసెల్లో నివసిస్తున్న 21 మంది మరణించారు. మరో 78 మంది క్షతగాత్రులయ్యారు. గత రెండ్రోజుల్లో వర్షం సంబంధిత కారణాలతో మహారాష్ట్రలో మొత్తంగా 39 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఆదివారం నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్డు, రైలు, విమాన రవాణా సేవలు ప్రభావితమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ముందుగానే హెచ్చరించడంతో ప్రభుత్వం ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. మలద్ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో 15 ఏళ్ల బాలిక శిథిలాల కింద చిక్కుకోగా, ఆమెను రక్షించే ప్రయత్నం విఫలమైంది. శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చే సమయానికే బాలిక మృతి చెందింది. మలద్ ప్రాంతంలోనే వరద రావడంతో మరో ఇద్దరు వ్యక్తులు కారులో చిక్కుకుని చనిపోయారు. విలే పార్లే ప్రాంతంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించగా, ముంబై శివారు ప్రాంతమైన ములంద్లోనూ గోడ కూలి ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోనే 25 మంది వర్షాల కారణంగా మృత్యువాత పడ్డారు. ముంబైలోని ఎయిర్పోర్ట్ కాలనీ, వకోలా జంక్షన్, పోస్టల్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మిఠీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు పరివాహక ప్రాంతాల నుంచి వెయ్యి మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించాల్సిన ఓ పరీక్షను కూడా ముంబై విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండ్రోజులపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్యన ఉన్న 24 గంటల్లో ముంబైలో 16.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైకి తూర్పున ఉన్న శివారు ప్రాంతాల్లో 32.9 సెంటీ మీటర్లు, పడమరన ఉన్న శివారు ప్రాంతాల్లో 30.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 203 విమానాల రద్దు.. మరో 55 దారి మళ్లింపు మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు. మరిన్ని రైళ్లు గమ్యస్థానం చేరకుండానే మధ్యలో నిలిచిపోయాయి. పట్టాలపైకి నీరు రావడం తో లోకల్ రైళ్లు కూడా కొన్ని చోట్ల దారి మధ్యలోనే నిలిచిపోయాయి. రైళ్లలో చిక్కుకున్న వేలాదిమంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ జవాన్ల సాయంతో మధ్య రైల్వే సిబ్బంది రక్షించి, వారికి తేనీరు, ఆహార పదార్థాలు అందించారు. పశ్చిమ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తమ సబర్బన్ రైలు సేవలు చర్చిగేట్, విరార్ల మధ్య సాధారణం కన్నా తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని చెప్పారు. రోడ్లన్నీ నీళ్లతో నిండటంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం కలిగింది. పుణేలోనూ ఆరుగురు.. ఇక మహారాష్ట్రలోని రెండో అతిపెద్ద నగరం పుణేలోని అంబేగావ్లో సోమవారం రాత్రి పొద్దుపోయాక గోడ కూలడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఠాణే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలోనూ మంగళవారం ఉదయం గోడ కూలి ముగ్గురు మరణించారు. బుల్ధానా జిల్లాలో పిడుగు పడటంతో 52 ఏళ్ల మహిళ చనిపోయింది. నాసిక్ జిల్లాలో మంగళవారం నీళ్ల ట్యాంకు కూలి నలుగురు కూలీలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కొంకణ్ ప్రాంతం మొత్తం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కాగా, ప్రభుత్వాల అవినీతి కారణంగానే ముంబై, పుణేల్లో గోడలు కూలి ప్రజలు చనిపోయారని ప్రతిపక్ష పార్టీలు మంగళవారం అధికార బీజేపీ, శివసేన పార్టీలపై విరుచుకుపడ్డాయి. నగరాన్ని నీళ్లతో ముంచేసినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఉండే ప్రాంతమైన బాంద్రాలోని కళా నగర్ కూడా నీట మునిగిందని, లోక్సభ ఎన్నికలకు ముందు ఠాక్రే తమ ఎంపీలతో గుళ్లు, గోపురాలకు తిరగకుండా తమ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ఎద్దేవా చేశారు. అదే స్ఫూర్తి.. భారీ వర్షాలతో కష్టాల్లో చిక్కుకున్న వారికి నగర ప్రజలు ఆపన్నహస్తం అందించారు. దారి మధ్యలో చిక్కుకున్న వారిని వీలైతే గమ్యస్థానాలకు చేర్చడం, సమీప ఇళ్లలో ఆశ్రయం కల్పించడం తదితర చర్యలతో సాయం చేశారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దగ్గర్లో ఎవరైనా చిక్కుకుపోతే తమ ఇళ్లకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా పలువురు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘నేనే చేసేది చాలా చిన్న సాయమే. వీర దేశాయ్ రోడ్ లేదా అంబోలీ ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వర్షం, వరద తగ్గే వరకు మా ఇంటికి వచ్చి ఉండటానికి మొహమాట పడకండి. ఎవరైనా ఉంటే నాకు నేరుగా మెసేజ్ పంపండి’ అని బిభాష్ చటర్జీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు అవెంజర్స్ సూపర్ హీరోలు అని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. ముంబైని భద్రంగా ఉంచేందుకు వారెంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేస్తూ ‘ముంబై విమానాశ్రయం మూతపడింది. పాఠశాలలను మూసేశారు. రైల్వే స్టేషన్లలోకి నీరు చేరింది. అయినా నా ఇంటికి వార్తా పత్రికలు సరైన సమయానికి, తడవకుండా వచ్చాయి. ఎవరికీ కనిపించని విధంగా గొప్ప గొప్ప పనులు చేస్తున్న వాళ్లందరికీ నేను అభివాదం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. వర్షాలు, వరదలను తట్టుకునేలా సరైన మౌలిక వసతులు లేకపోవడం, పరిస్థితిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం ముందుగా సిద్ధం కాకపోవడం తదితర సమస్యలపై వ్యాపారవేత్తలెవరూ ఒక్క మాటా మాట్లాడకపోవడం గమనార్హం. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ భారీ వర్షం ధాటికి రన్వే నుంచి పక్కకు వెళ్లిన విమానం ఘట్కోపర్లో వరదతో నిండిన రోడ్డు ముంబైలో చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న స్థానికుడు -
పుణెలోని అంబెగాన్లో విషాదం
-
ముంబై అతలాకుతలం.. వర్షాలకు 22మంది మృతి
సాక్షి, ముంబై/పుణె: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై మహా నగరం అతలాకుతలం అవుతోంది. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అతలకుతలమవుతోంది. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు. ముంబయి నగరంలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో గోడకూలి 13 మంది మృతిచెందారు. ఇంకో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే.. సంఘటన జరిగిన పింపరీపాడ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు స్పందించి పలువురినని శిథిలాల నుంచి బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంబేగావ్లోనూ.. పుణెలోని అంబెగావ్లోనూ విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు అంబేగావ్లోని సిన్గాడ్ కళాశాల గోడ కూలి ఆరుగురు మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన తెల్లవారుఝామున జరిగింది. ఘటన సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి తడిచిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మరోవైపు ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ్ ప్రాంతంలో అర్ధరాత్రి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక వ్యక్తి గాయపడ్డారు. పశ్చిమ కల్యాణ్ ప్రాంతంలోని దుర్గ ఆలయానికి అభిముఖంగా ఉన్న జాతీయ ఉర్దూ పాఠశాల గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
పుణెలోని కుంద్వాలో పెను విషాదం
-
అయ్యో పాపం
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటిటౌన్ :గోడ కూలి ఆరు నెలల బాలుడు మృతిచెందాడు. పట్టణంలోని గాంధీబజార్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా.. గాంధీ బజారులోని పాత ఆలయాన్నికూల్చి నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు. ఈక్రమంలో పాతగోడలను కూల్చివేస్తుండగా పక్కనే ఉన్న ఇంటిలో నిద్రిస్తున్న ఖాదర్ షరీఫ్ కుమారుడు మహమ్మద్ రహీల్(ఆరు నెలలు) పై పడింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖాదర్ షరీఫ్కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. కాగా మృతి చెందిన బాలుడు చివరి వాడు. -
కూలిన బంగారు గని.. 30 మంది మృతి
కుందుజ్: అఫ్గానిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి బదక్షన్ ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలో కార్మికులు పనిచేస్తుండగా గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ విషయమై కోహిస్తాన్ గవర్నర్ మొహమ్మద్ రుస్తమ్ రఘీ మాట్లాడుతూ.. ఇక్కడి గ్రామస్తులు నదీతీరంలో బంగారం కోసం 200 అడుగుల లోతైన గనిని తవ్వారని తెలిపారు. అనంతరం లోపలకు దిగి తవ్వకాలు జరుపుతుండగా పైనున్న గోడ ఒక్కసారిగా విరిగిపడిపోయిందని వెల్లడించారు. మరింత లోతుగా గనిని తవ్వేందుకు గ్రామస్తులు యంత్రాన్ని ఉపయోగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. వీరంతా సాధారణ గ్రామీణులనీ, నిపుణులు కారని వ్యాఖ్యానించారు. ఈ గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఖనిజాలను తవ్వుతున్నారనీ, వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేదని స్పష్టం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే సహాయక బృందాలను పంపామన్నారు. క్షతగాత్రులను రక్షణశాఖ హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 50,000 అఫ్గానీలు, క్షతగాత్రుల కుటుంబాలకు 10,000 అఫ్గానీలు నష్టపరిహారంగా అందిస్తామని ప్రకటించారు. అఫ్గానిస్తాన్ లో అక్రమ మైనింగ్అన్నది సర్వసాధారణం. తాలిబన్ ఉగ్రవాదులు ఆదాయం కోసం ప్రధానంగా మైనింగ్పైనే ఆధారపడుతున్నారు. -
ఆటో ఢీకొని..గోడకూలి..చిన్నారుల మృతి
శ్రీశైలం ప్రాజెక్ట్ : ఆ ఇంటి ఆశాదీపాలు ఆరిపోయాయి. చిన్నారుల ముద్దుముద్దు మాటలు వారికి శాశ్వతంగా దూరమయ్యాయి. బుడిబుడి అడుగుల సవ్వడులు మూగబోయాయి. అంతవరకూ లోకాన్ని మరిచి ఆడుకున్న చిన్నారులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రిక్రియేషన్ క్లబ్ సమీపంలో బుధవారం ఆటో ఢీకొనడంతో గోడ కూలి ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల మేరకు.. వెస్ట్రన్కాలనీ సమీపంలోని రిక్రియేషన్క్లబ్ ఎదురు వీధిలో తిరుపతినాయక్ కుటుంబం ఉంటోంది. ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు శక్రూనాయక్, శీనునాయక్. వీరంతా కలిసే ఉంటున్నారు. శక్రూనాయక్ ఒక కుమారుడు(సందీప్), ఒక కుమార్తె, శీనునాయక్కు ఒక కుమారుడు, ఒక కుమార్తె(కీర్తి) ఉన్నారు. ఉదయం ఇటుకల లోడుతో ఓ ఆటో తిరుపతినాయక్ ఉంటున్న వీధిలోకి వచ్చింది. డ్రైవర్ వేగంగా నడపడంతో ఆటో పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈక్రమంలో గోడ కింద ఆడుకుంటున్న చిన్నారులు సందీప్ (5), కీర్తి (3)కి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే ఉన్న శీను నాయక్ భార్య రమణమ్మ గాయాలపాలైంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మైనర్? ప్రమాదానికి కారకుడైన ఆటో డ్రైవర్ మైనర్ అని తెలిసింది. అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని సమాచారం. ఆటోకు కూడా రికార్డులు లేనట్లు తెలుస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు తమ కళ్ల ముందే ప్రమాదానికి గురై మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మృతి చెందిన చిన్నారులకు రెండు రోజుల్లో కేశఖండన కార్యక్రమం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు , టూ టౌన్ ఎస్ఐ ఓబులేసు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
అంబర్పేటలో విషాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అంబర్పేట్, ప్రేమనగర్లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశాతతూ గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అనుమతులు లేకుండా ఓ కంపెనీ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా ఈ ఘటన చోసుకుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవన యజమాని పరారీలో ఉండగా గాలింపు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ఒంగోలులోముగ్గురు చిన్నారులను బలిగొన్న గోడ
-
ప్రహరీ కూల్చివేత.. ఎమ్మెల్యేపై కేసు
-
ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ పై కేసు
రాజేంద్రనగర్/మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి డివిజన్ ప్రగతి కాలనీకి వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ తొలగించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్దేవ్పల్లి డివిజన్ సర్వే నెంబర్ 161లో మోహన్రెడ్డి పేరుపై రెండెకరాలు, శ్రీనాథ్రెడ్డి పేరిట 1.36 గుంటల స్థలం ఉంది. ఈ దారి గుండా ప్రగతి కాలనీ, లాల్బహదూర్శాస్త్రీ కాలనీ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం స్థలం చుట్టూ మోహన్రెడ్డి, శ్రీనాథ్రెడ్డిలు ప్రహారీని నిర్మించి గేటును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం కాలనీ ప్రజలు ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్కు తెలిపారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం స్థలం వద్దకు వచ్చి స్థానికులతో కలిసి ప్రహారీని కూల్చివేశాడు. దీంతో స్థల యజమానులు మైలార్దేవ్పల్లి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థల యజమానులు ప్రహారీని పునర్ నిర్మించారు. స్థానికులు విషయాన్ని మరోసారి ఎమ్మెల్యేకు తెలపడంతో ఆయన కాలనీ ప్రజలతో వచ్చి మరోసారి ప్రహారీని కూల్చివేశారు. యజమానులు మరోసారి మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్థల యజమాని శ్రీనాథ్రెడ్డి మాట్లాడుతూ... తమ స్థలంలో ప్రహారీని నిర్మించుకుంటే ఎమ్మెల్యే దౌర్జన్యంగా వచ్చి కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రగతి కాలనీ ప్రజలకు రాకపోకలు సాగించేందుకు దారి ఉందన్నారు. దారి కావాలంటే ప్రభుత్వ పరంగా తమకు తగు స్థలాన్ని లేదా నష్టపరిహారం ఇవ్వాలని.. అదేదీ లేకుండా ఎమ్మెల్యే దౌర్జన్యంగా ప్రహారీని కూల్చి తమను వేధించడం తగదన్నారు. కావాలనే ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ తమను వేధిస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇస్తామని చెప్పా: ఎమ్మెల్యే ప్రగతి కాలనీ ప్రజలు దశాబ్దాలుగా రోడ్డును వినియోగిస్తున్నారు. ఇదే విషయాన్ని యజమానులకు తెలిపి దారి వదలాలని సూచించా. అందుకుగాను ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని కూడా చెప్పా. కానీ స్థల యజమానులు మాత్రం మొండిగా ప్రహారీని నిర్మించడంతో స్థానికులు ప్రహారీని కూల్చివేశారు. -
మట్టిలో ‘కలిసి’పోయారు
వర్షానికి పెంకుల ఇల్లు కూలి దంపతులు సహా మనుమడు మృతి చెందడంతో రామకుప్పంలోని రాజుపేటలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాలుగా ఇటుక బట్టీలో కూలీలుగా జీవనం సాగి స్తున్న ఆ భార్యాభర్తలు చివరికి గోడకూలి మట్టిలోనే కలిశారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, రామకుప్పం: వర్షానికి నానిన గోడ కూలి ఒకే ఇంట్లో ముగ్గురు దుర్మరణం చెందడం రామకుప్పంలో తీవ్ర విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రెక్కాడితేగానీ డొక్క నిండని కుటుంబం సుక్కుర్సాబ్ది. బతుకు దెరువు కోసం రాజుపేట నుంచి కర్ణాటక సరిహద్దు రాజుపేటరోడ్డుకు వెళ్లా రు. అక్కడ బాడుగ ఇంట్లో ఉంటూ సుక్కుర్సాబ్ (60), అతని భార్య పాతిమా(50) ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. పని ఎక్కువగా ఉన్న సమయంలో బట్టీ వద్ద యజ మాని ఏర్పాటు చేసిన పెంకుల ఇంటిలోనే నిద్రించేవారు. తెల్లవారుజామున పనుల్లో నిమగ్నమయ్యేవారు. వయసు మీదపడినా పొట్ట కూటి కోసం శక్తివంచన లేకుం డా కష్టపడి ఇటుకలు తయారు చేసే వారు. వీరి పాలిట పెంకుల ఇల్లు మృత్యుపాశమైంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటుకుల బట్టీలో ఇద్దరు కలిసి ఇటుకలు తయారు చేశారు. రాత్రి పెంకుల ఇంటిలోనే తలదాచుకున్నారు. అక్కడే భోజనం చేశారు. నిద్రకు జారుకునే సమయంలో తమ కుమార్తె ఆశ ఐదేళ్ల కొడుకు నయాజ్తో కలిసి ఇటుకుల బట్టీ వద్దకు వచ్చి తల్లిదండ్రులను కలిసింది. కొద్దిసేపు మాట్లాడి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో చిన్నారి నయాజ్ అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంటానని మారాం చేయడంతో ఆశ తన కుమారుడుని అక్కడే వదిలి వెళ్లింది. రాత్రి 11 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో పెంకుల ఇంటి గోడలు ఒక్కసారిగా కుప్ప కూలాయి. పెంకులు, కట్టెలు మీదపడడంతో గాఢ నిద్రలో ఉన్న సుక్కుర్సాబ్, పాతిమా, నయాజ్(05) ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేసినా.. అప్పటికే రక్తపు మడుగులో చిక్కుకుని మృతి చెందారు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. రాజుపేటరోడ్డులో అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కరాత్రి గడిచి ఉంటే.. మృతి చెందిన చిన్నారి నయాజ్ తల్లి ఆశ రోదనలు స్థానికులను కలచివేశాయి. బెంగళూరులో కూలి పనులకు వెళ్లేందుకు బుధవారం ప్రయాణానికి అంతా సిద్ధం చేసినట్లు ఆమె వాపోయింది. ఈ ఒక్క రాత్రి గడిచి ఉంటే తన బిడ్డ బతికి ఉండే వాడని కన్నీరుమున్నీరైంది. తన బిడ్డకు అప్పడే నూరేళ్లు నిండాయంటూ గుండెలు బాదుకుంది. మృత్యువులోనూ వీడని సంబంధం సుక్కుర్సాబ్కు భార్య పాతిమా మొద టి నుంచి పనుల్లో చేదోడువాదోడుగా ఉండేది. 30 ఏళ్ల క్రితం ఒక్కటైన ఈ జంట.. మరణంలోనూ తమ బం ధాన్ని వీడలేదని స్థానికులు వాపోయారు. ప్రాణాలు తీసిన ఇటుకల బట్టీ.. కూలీల కోసం ఏర్పాటు చేసిన పెంకుల ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. అయినా యాజమాని ఏం పట్టించుకోక నిర్లక్ష్యంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకుని పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వర్షానికి కూలిపోయిన పెంకుటిల్లు -
గోడ కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్: గోడ కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన నగరంలోని మెహిదీపట్నం అయోద్యనగర్లో బుధవారం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న ఓ గోడ కూలడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కూకట్పల్లిలో కూలిన గోడ: చిన్నారి మృతి
హైదరాబాద్: ప్రహరి గోడ కూలిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన నగరంలోని కూకట్పల్లిలో శనివారం వెలుగు చూసింది. స్థానిక ఇంద్రాహిల్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న నూతన భవనం పక్కనే ఉన్న చిన్న ఇంటి ప్రహరిగోడ కూలింది. దీంతో అక్కడే ఉన్న వరలక్ష్మీ అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. కొత్త భవనం నిర్మాణంలో ఉండటం వల్లే ప్రహరిగోడ కూలినట్లు స్థానికులు తెలిపారు. -
గోడ కూలి ముగ్గురు కూలీల దుర్మరణం
-
గోడ కూలి ముగ్గురు కూలీల దుర్మరణం
వరంగల్: వరంగల్ శివారులోని ఎనమాముల గ్రామం వద్ద ఉన్న వేరుశెనగ మిల్లు గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం జరిగింది. మిల్లులో పనిచేస్తున్న కూలీలు ప్రహరీ గోడ వద్ద కూర్చుని ఉండగా గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో కొమ్ము స్వరూప, ఎం.స్వరూప, ఉల్లి రేణుక అనే మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులందరూ ఎనమాముల గ్రామానికి చెందినవారు. -
గోడ కూలి ఇద్దరు మృత్యువాత
భీమవరం : పాత ఇంటి గోడను పడగొడుతుండగా ప్రమాదవశాత్తు శిథిలాల కింద పడి ఇద్దరు చని పోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు(65) గురువారం తన ఇంటిని పడగొట్టేందుకు గ్రామానికే చెందిన బొడ్డు నాగరాజు(45)ను కూలీగా పెట్టుకుని పని ప్రారంభించాడు. గోడను కూల్చుతుండగా ఒక్కసారిగా గోడ కూలి వారిపై పడింది. శిథిలాల కింద పడి తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించి, కేసు దర్యాప్తు చేపట్టారు. -
పనికి వెళితే ప్రాణాలు పోయాయి
తాడేపల్లిగూడెం రూరల్ : కూలి పనులకు వెళ్లిన వారిని అకాల మృత్యువు కబళించింది. మట్టి ఇంటిని పడగొడుతుండగా ప్రమాదవశాత్తు గోడ కూలడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ఎస్సీ ఏరియాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆరుగొలను ఎస్సీ ఏరియాలోని గెడ్డం అంజియ్యకు చెందిన మట్టి ఇంటిని పడగొట్టే పనులు ఇటీవల ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం పనులు చేస్తుండగా కూలీలపై గోడ కూలింది. దీంతో కూలీలు గోపిరెడ్డి శ్రీనివాస్ (45), కండెల్లి రాముడు (55) మృతి చెందారు. శ్రీనివాస్ తల గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జయ్యింది. వీఆర్వో వైఐవీ మంగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కూలీ బతుకుల్లో పుట్టెడు శోకం మృతులు శ్రీనివాస్, రాముడు రోజు వారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్కు భార్య పద్మ, కుమార్తె కల్యాణి, కుమారుడు సతీష్ ఉన్నారు. కల్యాణికి వివాహం కాగా సతీష్ కూడా కూలీ పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. శ్రీనివాస్ మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. కండెల్లి రాముడుకు భార్య చంద్రమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా పెద్ద కుమారుడు అబ్బులు కూలీ పనులు చేస్తున్నాడు. రెండో కుమారుడు వెంకటేశ్వరరావు జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఒకే రోజు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన కుటుంబ పెద్దలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గోడ కూలి ఇద్దరి మృతి
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలిపడి ఇద్దరు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాత ఇంటిని ఐదుగురు వ్యక్తులు కలసి కూల్చుతున్నారు. అయితే, గోడ అకస్మాత్తుగా కూలిపడటంతో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులను గ్రామానికి చెందిన కండెల్లి రాముడు(55), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(45)గా గుర్తించారు. వారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
సినీ ప్లానెట్లో గోడ కూలి యువకుడు మృతి
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గోడ కూలడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కాకినాడ సమీపంలోని చిత్తరోడే గ్రామానికి చెందిన కుమారి భర్త చనిపోవడంతో కుమార్తె, కుమారుడు వీరబాబు తో కలిసి రెండేళ్ల క్రితం కొంపల్లి గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం కొంపల్లి సినీ ప్లానెట్లో పాతగోడలను కూల్చివేతకు వెళ్లిన వీరబాబు గోడ పక్కనే పనులు చేస్తుండగా మట్టిగోడలు విరిగి పడ్డాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికంగా ఉన్న రష్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తాము రాకముందే మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించడంపై మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు పోలీసులు జోక్యం చేసుకుని గొడవ జరగకుండా వారిని స్టేషన్కు తీసుకువెళ్లి సముదాయించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
యూపీలో గోడ కూలి ఐదుగురు మృతి
-
కూలిన గోడ : బాలుడు మృతి
అనంతపురం : ఉరవకొండ మండలం వై రాంపురంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడ బాగా నీటితో నానడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. -
గోడ కూలి వృద్ధురాలి మృతి
ఘనపురం(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లా ఘనపురం మండలం కమాలొద్దీన్పూర్లో ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతిచెందింది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో పనులు చేసుకుంటున్న సమయంలో భారీ వర్షాలకు బాగా నానిన గోడ కూలింది. దీంతో మట్టిపెళ్లలు మీదపడి ఆమె అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
కూలిన ఇంటి గోడ:ఇద్దరు మృతి
-
కూలిన భారీ గోడ.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ క్రమంలో నగర శివారులోని రాజేంద్రనగర్ నేతాజీనగర్లో సుషీల్ కంటెయినర్ ప్లాస్టిక్ కంపనీ ప్రహరి గోడ కూలింది. ఆ సమయంలో గోడ పక్కన నిలిపి ఉంచిన ఓ ఆటోతో పాటు రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పలు విద్యుత్స్తంభాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఆయా కాలనీలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోడ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
నిమజ్జనంలో అపశ్రుతి
– గోడకూలి 15 మందికి గాయాలు కర్నూలు(హాస్పిటల్): నగరంలో మంగళవారం జరిగిన నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. వినాయక ఘాట్ పక్కన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పాత కట్టడం కావడంతో కూలిపోయి 15 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వినాయక ఘాట్ వద్దకు చేరుకున్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కితే నిమజ్జన కార్యక్రమం మరింత బాగా చూడొచ్చు అన్న ఉద్దేశంతో వారు కాంప్లెక్స్ ఎక్కే ప్రయత్నం చేశారు. మెట్ల మార్గం పాతబడిపోయి ఉండటంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో కర్నూలు నగరంలోని మమతానగర్కు చెందిన శంకరమ్మ (50), శరీన్ నగర్కు చెందిన అయ్యమ్మ, సునీత, ఆమె భర్త రాజు, లక్ష్మి, మంజుతో పాటు బుధవారపేటకు చెందిన మద్దమ్మ, శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీఉషా, కష్ణనగర్కు చెందిన తిరుపాల్, షరీన్నగర్కు చెందిన శ్రీవాణి, శివతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్లో పైలెట్ రాంబాబు, టెక్నిషియన్ ఆంజనేయులు తదితరులు ప్రథమ చికిత్స చేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో శంకరమ్మ, సునీతలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. -
కారుపై కూలిన గోడ : డ్రైవర్కు గాయాలు
హైదరాబాద్: పాఠశాల గోడ కూలి కారుపై పడింది. దీంతో కారు డ్రైవర్కు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన నగరంలోని సీతాబాగ్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ పాఠశాల గోడ కూలి... ఓలా క్యాబ్పై పడటంతో.. క్యాబ్ డ్రైవర్కు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. నగరంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గోడ నానడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
గోడ కూలి ఇద్దరు మహిళల మృతి
బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పీఆర్ వెంకటేశ్వర్ రెడ్డి ఇంటి గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో గుడిసె పుల్లమ్మ(55), చిట్టెక్క(30) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఇంటి మరమ్మతులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిద్రలోనే పరలోకానికి..
ఇద్దరు చిన్నారులను బలిగొన్న గోడ రామాయంపేట: ఓ గోడ ఇద్దరు చిన్నారులను పొట్టన పెట్టుకుంది. అప్పటివరకు అంతా ఉల్లాసంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకున్నారు. భోజనం చేసి తమ పూరి గుడిసెలో నిద్రపోయారు. తెల్లారేసరికి గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కళ్లెదుటే కన్న కూతుళ్లను కోల్పోయిన వారు అంతులేని ఆవేదనకు లోనయ్యారు. వారి రోదన తండా వాసులను సైతం కంటతడిపెట్టించింది. వివరాలు ఇలా... రామాయంపేట మండలం నస్కల్ పరిధిలోని నగరం తండాకు చెందిన బానోత్ లాలూ, కంలీ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. ఆ తరువాత తమ పూరిగుడిసెలో నిద్రపోయారు. ఆదివారం తెల్లవారు జామున అకస్మాత్తుగా గోడ కూలడంతో పెద్ద కూతురు మౌనిక (9), చిన్న కూతురు గీత(5) తీవ్రంగా గాయపడ్డారు. కంలితోపాటు కుమారుడు చందుపై పెళ్లలు పడడంతో స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రఆందోళకు గురైన లాలూ వెంటనే తండాలోని ఆటో డ్రైవర్ను లేపి ఇద్దరు పిల్లల ను చికిత్స నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలిం చాడు. అప్పటికే మౌనిక(చిట్టి), గీత మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అదే ఆటోలో మృత దేహాలను తం డాకు తరలించారు. విషయం తెలుసుకొన్న గిరిజనులు, పరిసర గ్రామాల ప్రజలు తండాకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనితో తండాలో విషాదం నెలకొంది. కన్నీరు మున్నీరైన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుడిసె గోడ పూర్తిగా తడవడం వల్లే కూలినట్టు తెలిసింది. ఉన్న ఇద్దరు కూతుళ్లను కోల్పోయి.. భానోత్ లాలూ, కంలి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. కాగా ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లను పోగొట్టుకున్నారు. పెద్ద కూతురు చిట్టి అలియాస్(9) నాలుగో తరగతి చదువుతుంది. రెండో కూతురు గీత(5) అంగన్వాడీ కేంద్రంలో చదువుతుంది. కుమారుడు చందు అందరికంటే చిన్నవాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: పద్మ నగరం తండాలో జరిగిన ఘటనను తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. స్థానిక ఎంపీపీ పుట్టి విజయల క్ష్మి, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి తదితరులు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.5వేల నగదు ఆర్థిక సాయాన్ని అందజేశారు. వారి వెంట పుట్టి యాదగిరి, బిజ్జ సంపత్, అందె, బాజ చంద్రం, మన్నె జలంధర్, టీఆర్ఎస్ నందిగామ అధ్యక్షుడు బుచ్చ నర్సింలు, కన్న అంజాగౌడ్ తదితరులు ఉన్నారు. -
మెదక్లో బాలికలు మృతి
రామాయంపేట: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామాయంపేట మండలం నగరంతండాలో శనివారం రాత్రి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. గత రెండు రోజులుగా మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. పాత గోడ కూలింది. ఆ సమయంలో అక్కడే నిద్రిస్తున్న గీత(7), చిట్టి(10) అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
గోడకూలి ఐదుగురు మృతి
అలహాబాద్: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు కూలీలపై గోడ కూలడంతో వారు సజీవ సమాధి అయ్యారు. అలహాబాద్ ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ఘటన జరిగింది. ఓ ఈద్గా గోడకు అనుకొని ఏర్పాటు చేసిన టెంటులో బసచేస్తున్న వారిపై అర్థరాత్రి దాటిన తరువాత గోడకూలింది. కూలీలంతా నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం గోడకూలి ఉండటం గమనించిన స్థానికులు.. శిధిలాల కింద కూలీల మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ అధికారి దినేష్ షా వెల్లడించారు. ఈద్గా పురాతనమైనది కావడంతో దానిని రిపేర్ చేసే పనిలో ఉన్న కూలీలు అక్కడ తాత్కాలిక బస ఏర్పాట్లు చేసుకోగా.. వారిపై గోడ కూలినట్లు ఆయన వెల్లడించారు. -
గోడ కూలి ఒకరి మృతి
కల్లూరు: ఉపాధి కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలిన ఘటనలో చనిపోయాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలకేంద్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మహ్మదీయ మసీదు ఆవరణలోని షెడ్డులో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎ.సూరవరం గ్రామానికి చెందిన విశ్వనాథ ఈశ్వర్రావు అలియాస్ శివ(32) కొన్ని రోజులుగా ఉంటున్నాడు. గోనె సంచులు కుట్టేపని చేసుకుంటున్నాడు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి షెడ్డు గోడ బాగా నాని అర్థరాత్రి సమయంలో ఈశ్వర్రావుపై పడింది. దీంతీ శివ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
వర్షానికి గోడ కూలి నలుగురు మృతి
మృతుల్లో అక్కాతమ్ముడు మాక్లూర్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో వర్షానికి పాత భవనం గోడ కూలడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో నందిపేట మండలం జోర్పూర్కు చెందిన ఏడే రమాదేవి(21), మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కులకు చెందిన నీరడి అఖిల(19) అక్కడికక్కడే మృతిచెందగా.. వెల్మల్ గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్(48), జోర్పూర్కు చెందిన ఏడే ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రమాదేవి, అఖిల, ప్రవీణ్ కుటుంబ సభ్యులు శనివారం మండల కేంద్ర సమీపంలోని శ్రీకేదారేశ్వర ఆశ్రమం వద్ద సత్యనారాయణ పూజ కోసం వెళ్లారు. పూజా కార్యక్రమాలు ముగించుకుని వీరి కుటుంబ సభ్యులు ట్రాక్టర్లో వెళ్లగా, వీరు మాత్రం బైక్పై బయలు దేరారు. సాయంత్రం మండల కేంద్రంలోని నర్సాగౌడ్కు చెందిన పాత భవనం వద్దకు రాగానే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరు పాత భవనం వద్ద నిలబడ్డారు. ఇదే సమయంలో నందిపేట నుంచి ఇంటికి వెళ్తున్న ఆకుల సుదర్శన్ కూడా వీరి వద్ద వచ్చి నిలబడ్డాడు. ఈ క్రమంలో గోడ కూలడంతో రమాదేవి, అఖిల అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని స్థానికులు ట్రాక్టర్లతో మట్టిపెళ్లలను తొలగించి బటయకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సుదర్శన్, ప్రవీణ్ను 108 అంబులెన్స్లో జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మృతిచెందారు. మృతుల్లో రమాదేవి, ప్రవీణ్లు అక్కా తమ్ముడు. రమాదేవి ఇంటర్ పూర్తి చేయగా, ప్రవీణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నీరడి అఖిలది మాక్లూర్ మండలం గొట్టుముక్కుల. ఈమె బాన్సువాడ మండలం బోర్లం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆకుల సుదర్శన్ చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. -
ప్రహరీ గోడ కూలి ముగ్గురికి తీవ్రగాయాలు
కందుకూరు (రంగారెడ్డి జిల్లా) : నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలైన సంఘటన కందుకూరు పట్టణంలో మంగళవారం జరిగింది. కందుకూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదురుగా ఓ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ గోడ కూలింది. ముగ్గురు కార్మికులు కూలిన గోడ కింద ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కాపాడి.. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
వానకు కూలిన గోడ: నలుగురికి తీవ్రగాయాలు
హైదరాబాద్ : భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ పిట్టగోడ కుప్పకూలి పక్కన్నే ఉన్న రేకుల గదులపై పడింది. నిద్రిస్తున్న రెండు కుటుంబాలు క్షణాల్లో చెల్లాచెదురయ్యాయి. ఓ చిన్నారితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిద్ధిఖీనగర్లో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన రాజు ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ సిద్దిఖీనగర్లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున గాలి వాన రావడంతో నిద్ర లేచి తలుపు తెరిచి నిలబడి ఉన్నాడు. రవీందర్ అనే వ్యక్తి వీరి ఇంటి పక్కనే భవనం నిర్మిస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న పిట్ట గోడ కుప్పకూలి రాజు గదిపై పడింది. నిద్రిస్తున్న భార్య సంగీత, కూతురు సంయుక్త(18 నెలలు)లపై శిథిలాలు పడ్డాయి, దీంతో చిన్నారి ఎడమ కాలు తొడ భాగంలో విరిగింది. తల్లి సంగీత తలకు తీవ్ర గాయమైంది. పక్క గదిలో ఉడుగుల యాదగిరి(36), భార్య లక్ష్మి నిద్రిస్తుండగా పిట్టగోడ శిథిలాలు గదిపై పడ్డాయి. లక్ష్మీ(30) నడుము భాగంలో ఫ్రాక్చర్ అయ్యింది. యాదగిరి ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అంజయ్యన గర్లోని కాకాతీయ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సర్కిల్-11 ఉప కమిషనర్, ఉప వైద్యాధికారి కె.ఎస్.రవి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవల ఖర్చులను జీహెచ్ఎంసీ భరిస్తుందని ఉప కమిషనర్ తెలిపారు. బాధితులను స్థానిక కార్పోరేటర్ షేక్ హమీద్ పటేల్ పరామర్శించారు. ఘటనా స్థలం పరిశీలన కూలిన పిట్టగోడను ఉప కమిషనర్ వి.వి.మనోహర్ పరిశీలించారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామనని స్పష్టం చేశారు. గాలి దుమారం, భారీ వర్షానికి కూలిన చెట్లు, వరద ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడతామని చెప్పారు. -
స్కూల్ గోడను ఢీకొన్న ఆటో: విద్యార్థులకు గాయాలు
భీమవరం : స్కూల్ గోడను ఆటో ఢీకొనడంతో అది కూలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి దిరుసుమర్రులోని జెడ్పీ స్కూల్ గోడను ఢీకొట్టింది. దీంతో ఆర్చ్ కూలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
గోడ కూలి ఎంపీటీసీ మృతి
కర్లపాలెం (గుంటూరు) : పాత ఇంటి పునర్నిర్మాణ పనులు చేపడుతుండగా.. ప్రమాదవశాత్తు గోడ కూలి ఎంపీటీసీ సభ్యురాలు మృతిచెందింది. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మరక వెంకటరమణ(50) ఆదివారం తన పాత ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మీదపడింది. హుటాహుటిన ఆమెను శిథిలాల మధ్య నుంచి బయటకు తీయగా అప్పటికే ఆమె మృతిచెందింది. -
గోడ కూలి తల్లీ , కుమార్తె మృతి
విజయవాడ: విజయవాడ సమీపంలోని నిడమనూరు గ్రామంలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలి తల్లి, కుమార్తె మృతి చెందారు. స్థానికంగా ఉండే రాధ( 40) , ఆమె కుమార్తె శిరీష(14) ఇంటి పని చేసు కుంటుండగా పక్కనున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో రాధ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన శిరీష విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. -
గోడ కూలి ఇద్దరు వృద్ధులు దుర్మరణం
సీతానగరం : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ప్రహరీ గోడ కూలి ఇద్దరు వృద్ధులు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన ఎర్రగోగుల మంగతాయారు (72), నిడదవోలు సూర్యకాంతం (75)లు ఇంటి ప్రహరీ గోడ పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. దెబ్బతిని ఉన్న ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. -
గోడ కూలి దంపతుల దుర్మరణం
వనపర్తి: మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో మంగళవారం ఉదయం ఓ ఇంటి గోడ కూలడంతో దంపతులు మృతిచెందారు. ఇంటి మరమ్మతులు జరుగుతున్నందున చెన్నమ్మ(50), బక్కన్న(60) దంపతులు సోమవారం రాత్రి ఇంటి ముందు స్థలంలో నిద్రపోయారు. చలి ఎక్కువగా ఉండడంతో తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. అయితే తెల్లవారుజామున హఠాత్తుగా గోడ కాలడంతో చెన్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన బక్కన్నను మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఆ ఇంట్లో వీరిద్దరే ఉంటున్నారు. వారి పిల్లలు వేరే గ్రామంలో కాపురం ఉంటున్నారు. వారికి గ్రామస్తులు సమాచారం అందించారు. ఒక్కసారిగా దంపతులిద్దరూ మృతిచెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. -
ఇంటి గోడ కూలి ఇద్దరి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం గ్రామంలో మిద్దె కూలి చంద్రకళ(21) అనే బాలింత మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకుంది. వర్షాలకు ఇంటి గోడ బాగా తడిసినందువల్లే కూలిపోయిందని స్ధానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చంద్రకళ 15 రోజుల క్రితమ మగబిడ్డకు జన్మనించింది. ఈ ప్రమాదం నుంచి పసికందు క్షేమంగా బయటపడ్డాడు గోడకూలి చిన్నారి మృతి రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మింగారిపల్లెలో ఇంటి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. అల్పపీడనం కారణంగా రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు ఇంటి గోడ కూలడంతో అచ్యుత్ అనే బాలుడు మృతి చెందాడు. -
గోడ కూలి ఐదు ఇళ్లు ధ్వంసం
మదనపల్లి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఈద్గా గోడ కూలింది. ఈ ఘటనలో 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని నక్కలదిన్నె కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనలో సమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు తెలిపారు. -
అమిత్ షా ర్యాలీలో అపశృతి
బాగా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. గురువారం బీహార్లోని బాగా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఓ గోడ కూలి దాదాపు పదిమంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపట్ల పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇస్తూ అమిత్ షా ర్యాలీ కోసం హెలికాప్టర్లో వస్తుండగా దానిని చూసేందుకు భారీ సంఖ్యలో ఓ గోడపైకి ఎక్కారని దీంతో ఆ గోడ కూలి వారు ప్రమాదం బారిన పడ్డారని చెప్పారు. వారు ఆ గోడ ఎక్కడానికి ముందే బీటలు వారి బలహీనంగా ఉందని అందుకే పడిపోయిందని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఏదో జరిగిపోతుందన్న భయంతో జనాలు పరుగులు తీయగా తొక్కిసలాట జరిగే పరిస్థితి తలెత్తింది. కానీ పోలీసులు అప్రమత్తమడంతో మరో తొక్కిసలాట ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపట్ల అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. -
గోడకూలి వ్యక్తి మృతి
వర్షం ధాటికి గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో అల్లుసానిపల్లెలో మంగళవారం నాగరాజు(65) అనే వ్యక్తి మరణించాడు. ఇంట్లో నిద్రిస్తుండగా వర్షం ధాటికి పూర్తిగా దెబ్బతిన్న గోడ కూలింది. దీంతో అక్కడే ఉన్న నాగరాజు శిధిలాల కింద కూరుకు పోయి మృతి చెందాడు. -
గోడ కూలి 10 వాహనాలు ధ్వంసం
ముషీరాబాద్ (హైదరాబాద్) : పాత గోడ కూలి పక్కనే ఉన్న 10 వాహనాలపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన గురువారం నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడిక్మెట్లో ఉన్న మేడిబావి బస్తీలో జరిగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న జైరాం స్టీల్స్కు చెందిన 9 వేల గజాల స్థలాన్ని కిషన్ యాదవ్ అనే వ్యక్తి ఇటీవలే కొనుగోలు చేశాడు. అయితే ఈ స్థలంలో వాస్తు కోసం 110 గజాల విస్తీర్ణంలో బావిని తవ్వి ఆ మట్టిని గోడ పక్కనే పోయించారు. కాగా గురువారం కురిసిన వర్షం కారణంగా మట్టి కుంగిపోయి, గోడపై ఒత్తిడి పెరగడంతో అది కుప్పకూలింది. ఇదే సమయంలో గోడపక్కనే ఉన్న దాదాపు 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 20 లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. వీటిలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలున్నాయి. ఈ ఘటనతో నష్టపరిహారం చెల్లించాల్సిందేనని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. -
భారీ వర్షాలకు కూలిన గోడ
-
గోడకూలి వ్యక్తి మృతి
తోట్లవల్లూరు: ప్రమాదవశాత్తు గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. మండల కేంద్రంలో ఓ పాత భవనాన్ని కూలుస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కటారి వెంకటేశ్వరరావు(55) అనే వ్యక్తిపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లోని తుండ్లా ప్రాంతంలో మంగళవారం గోడ కూలింది. ఈ ఘటనలో 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటు చేసుకుందని... గోడ కూలిన సమయంలో కుటుంబంలోని వారంతా నిద్రిస్తున్నారని చెప్పారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
గోడకూలి చిన్నారి సహా ఇద్దరు మృతి
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రమల్లెపల్లెలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. గ్రామానికి చెందిన ఎర్రస్వామి(25), రామాంజినమ్మ(20) దంపతులు తమ కుమార్తె శ్వేత(5)తో కలసి బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రించారు. అర్థరాత్రి సమయంలో వారు నిద్రిస్తున్న చోట ఉన్న పాత గోడ కూలి వారిపై పడింది. ఈ ఘటనలో రామాంజినమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శ్వేత అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. కాగా, స్వల్పంగా గాయపడిన ఎర్రస్వామి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. -
బాలికలపై కూలిన గోడ, ఇద్దరు మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం గోడ కూలి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మరో బాలిక గాయపడింది. అడయార్ ప్రాంతంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గోడ దగ్గర కూర్చున్న ముగ్గురు బాలికలపై ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ ఘటనలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. -
గోడకూలి 9 మందికి తీవ్రగాయాలు
-
గోడకూలి 9 మందికి తీవ్రగాయాలు
హైదరాబాద్ : నగరంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడకూలి 9 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్లో చోటు చేసుకుంది. హఫీజ్బాబానగర్ బీబ్లాక్లో ఉండే మోహినుద్దీన్ ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంటికి శుక్రవారం దుబాయి నుంచి బంధువులు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పక్కనే నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల ఇంటి గోడ నానింది. మోహినుద్దీన్ ఇంటిపై ఆ గోడ కూలి పడటంతో ఇంట్లో ఉన్న మొత్తం 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చుట్టుపక్కల వారు శిథిలాల నుంచి వారిని బయటకు తీసి, అపోలో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. -
గోడకూలి యువకుడి మృతి
చిత్తూరు(పుంగనూరు): నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చెదల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నౌషాద్(33) ఇంటి మరమ్మత్తులు చేపడుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
‘కూలి’న బతుకులు
గాజువాక: విశాఖలోని గాజువాక పరిధిలోని వడ్లపూడి నిర్వాసిత కాలనీ కణితిలో గోడ కూలిన సంఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఒక సామాజిక భవనం విస్తరణ పనుల కోసం చేపట్టిన పనుల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇదే సంఘటనలో మరో ఇద్దరు కూలీలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కణితి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కనగల ఆర్యవైశ్య సామాజిక భవనం విస్తరణ పనులను మూడు రోజుల కిందట ప్రారంభించారు. మింది దరి గుడివాడ అప్పన్న కాలనీలో నివాసం ఉంటున్న కణితి ఈశ్వరరావు, సాత్రబోయిన అనంతలక్ష్మి , మురళి, రాంబాబు, బంగారమ్మ రెండు రోజులుగా జేసీబీ తవ్విన గోతిలో మట్టిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. వారు ఒక పక్క పని చేస్తుండగా మరోపక్క జేసీబీతో మిగిలిన గొయ్యి తవ్విస్తున్నారు. గొయ్యిని ఆనుకుని ఉన్న పాఠశాల ప్రహరీ కదలడాన్ని కూలీలు గమనించారు. వెంటనే జేసీబీ పని ఆపాల్సిందిగా డ్రై వర్రాముకు కేకలు వేసినప్పటికీ శబ్ధంలో అతడికి వినిపించలేదు. జేసీబీ వైబ్రేషన్కు గోడ మరింత బలహీనపడడంతో కూలీలందరూ గొయ్యి చివరన భాగంలో ఒక మూలకు చేరిపోయారు. గోడ లోపల ఉంటే ప్రమాదమని భావించిన ఈశ్వరరావు, అనంతలక్ష్మి గొయ్యినుంచి బయటకు వచ్చేందుకు గొయ్యి రెండో చివరకు పరుగులు తీశారు. వారు సరిగ్గా గొయ్యి మధ్యకు వచ్చేసరికి పాఠశాల ప్రహరీ ఒక్కసారిగా వారిపై కూలిపోయింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరూ మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఈశ్వరరావు మృతదేహాన్ని స్ట్రెచర్పై బయటకు తీసుకొచ్చారు. అనంతలక్ష్మి మృతదేహం శిథిలాలకింద ఉండిపోవడంతో బయటకు తీయడం సాధ్యం కాలేదు. కొద్దిసేపటికి సంఘటనా స్థలానికి చేరుకున్న జోన్-2 డీసీపీ డాక్టర్ రామ్గోపాల్ నాయక్ దువ్వాడ, గాజువాక సీఐలను ఆదేశించడంతో మరో జేసీబీని తీసుకొచ్చి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజపురానికి చెందిన అతను కూలి పనుల నిమిత్తం ఇక్కడకు వలస వచ్చి అప్పన్న కాలనీలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. అనంతలక్ష్మి స్వస్థలం గుడివాడ అప్పన్నకాలనీగా ఆమె సమీప బంధువులు తెలిపారు. ఆమెకు భర్త, ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఈశ్వరరావు భార్య అర్జునమ్మ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరైంది. రెండుసార్లు స్పృహ తప్పి పడిపోవడంతో బంధువులు ఆమెకు సపర్యలు చేశారు. సంఘటనా స్థలానికి పోలీస్ కమిషనర్ అమిత్గార్గ్, వైఎస్సార్సీపీ నాయకులు అమర్నాథ్, నాగిరెడ్డి చేరుకుని పరిశీలించారు. ఆ ముగ్గురూ మృత్యుంజయులు ఈ గొయ్యిలోనే పని చేస్తున్న మరో ముగ్గురు కూలీలు మృత్యువును జయించారు. ప్రమాదాన్ని గమనించి గొయ్యిలోని ఒక చివర మూలకు వెళ్లిపోయి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నామని ప్రమాదం నుంచి బయట పడిన మురళి, రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు. అప్పటివరకు తమను వెన్నంటే ఉన్న ఈశ్వరరావు, అనంతలక్ష్మి అకస్మాత్తుగా బయటకు పరుగులు తీయడంతో గోడకింద పడిపోయారని, తమకు ఒక్క మాట కూడా చెప్పకుండానే పరిగెత్తి వెళ్లిపోయారని వాపోయారు. -
మట్టిగోడ కూలి.. విద్యార్థి మృతి 23 మందికి గాయాలు
నోయిడా: ప్రమాదవశాత్తు మట్టిగోడ కూలి పాఠశాలపై పడిన ఘటనలో తొమ్మిదేళ్ల విద్యార్థి మృతి చెందగా, 23 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన యూపీ పరిధిలోని ఢిల్లీ శివారు ప్రాంతమైన నోయిడాలో గురువారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నోయిడా సెక్టార్-49లోని ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన మట్టిగోడ పక్కనే ఉన్న ఆర్సీవీ జూనియర్ ఉన్నత పాఠశాలపై కూలిపడింది. ఈ ఘటనలో సందీప్(9) తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మిగతా 23 మంది విద్యార్థులు ప్రయాగ ఆస్పత్రి, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు మట్టి గోడ యజమాని ప్రవీణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకూ అతడిని అరెస్టు చేయలేదు. కేసు విచారాణ కోనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
ఇంటి గోడ బలిపీఠమైంది
భీమవరం క్రైం :నిద్రలోనే తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గోడ రూపంలో తమ పిల్లలను బలిగొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక ఏమి చేయాలో తెలియక అయోమయస్థితిలో ఉండిపోయారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ఈ ఘటన కడుపుకోత మిగల్చడంతో వారు రోదిస్తుండటంతో ఆ ప్రాంతవాసులను కలచివేసింది. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చింతాడ లచ్చన్న, మంగమ్మలది భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామం. అయితే పొట్టకూటికోసం వారు కొంత కాలం హైదరాబాద్ వెళ్లి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. అక్కడ కూడా సరైన పనులు లేక నెల క్రితం చినఅమిరం వచ్చి అల్లం సుబ్బలక్ష్మికి చెందిన నివాసంలో అద్దెకు దిగారు. ఇళ్ల నిర్మాణ పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం వంట చేద్దామని తల్లి మంగమ్మ ఆరు బయటకు వచ్చింది. లచ్చన్న కూడా ఇంటి బయటకు వచ్చా డు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కుమార్తె ఎస్తేరు (5), కుమారుడు సోమేష్ (3)లపై సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ పెద్ద శబ్ధంతో కూలిపోయింది. చిన్నారులకు తీవ్ర రక్తస్రావమవడంతో 108లో భీమవరం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నా బిడ్డలను బతికించండి.. తన బిడ్డలను బతికించండంటూ ప్రభుత్వాసుపత్రి వైద్యులను లచ్చన్న, మంగమ్మలు వేడుకుంటున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. ఉన్న ఇద్దరు బిడ్డలు మృత్యువాతపడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. భీమవరం టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై శ్రీనివాసకుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సంఘటనపై మాట్లాడారు. వారికి ప్రభుత్వపరంగా ఏమైనా సహకారం అందించాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయసూర్య తెలిపారు. కాగా సంఘటనా ప్రాంతాన్ని భీమవరం ఇన్చార్జి తహసిల్దార్ దశిక వంశీ పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. దీనిపై కలెక్టర్కు నివేదిస్తామని చెప్పారు. -
గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం చిన్న అమిరంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా శనివారం తెల్లవారుజామున గోడ కూలింది. ఆ గోడ పక్కనే నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. దాంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. -
అధైర్యపడకండి.. అండగా ఉంటాం
ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు: చెన్నైలో గత నెల 28న నిర్మాణంలో ఉన్న బహుళ అంత స్తుల భవనం కూలిన ఘట నలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని పాతపట్నం ఎమ్మె ల్యే కలమట వెంకటరమణ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఎల్ఎన్ పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో బాధిత కుటుంబాలను ఆది వారం పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం రూ.25 వేలు ఇంకా ఇవ్వలేదని బాధితులు ఎమ్మెల్యేకు చెప్పారు. సాయం అందేందుకు సీఎంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు, ఎమ్మెల్యే కోటా నుంచి ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయాలను అందేలా కృషి చేస్తామని రెడ్డి శాంతి అన్నారు. అందవరపు అబ్బాయి, శివ్వాల కిశోర్, లుకలాపు రాజారావు, ముగడ జనార్థనరావు, కొమరాపు తిరుపతిరావు, కె.చిరంజీవి, పి.ఆదినారాయణ, గేదెల జగన్మోహనరావు, శిమ్మ సాంబశివరావు, కిలారి త్రినాథరావు, యారబాటి రామకృష్ణ, కొల్ల రాము, ఎర్ర జనార్థనరావు, ముగడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వలసలు నివారించి ఉపాధి కల్పించండి... హిరమండలం మండలంలోని గొట్ట,లక్ష్మీపురంకు చెందిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, రెడ్డిశాంతి పరామర్శించారు.ఈ దుర్ఘటనలో భర్త శ్రీను, కుమార్తె భవానీలను కోల్పోయిన మీసాల వరలక్ష్మిని పరామర్శించారు. పల్లెల్లో వలసలు నివారించి గ్రామీణులకు ఉపాధి వనరులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. జెడ్పీటీ సీ ప్రతినిధి, సర్పంచ్ లోలుగు.లక్ష్మణరావు, ఎ.అబ్బాయి, ఎ.వి సురేష్, గేదెల.జగన్మోహనరావు, టి.రమేష్ ఉన్నారు. రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి... చెన్నై ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. కొత్తూరు మండలంలోని ఇరపాడుకు చెందిన అన్నదమ్ములు అమాలపురం శ్రీనివాసరావు(రమేష్), రాజేష్, కిమిడి సుబ్బారావులు కుటుంబాలను ఆదివారం రెడ్డిశాంతి, ఎంఎల్ఏ కలమట వెంకటరమణలు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు సూర్యారావు, రమణమ్మ, దశాలుమ్మలను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రకటించిన రూ. 25 వేలను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, పీఏసీఎస్ అధ్యక్షుడు ఏ. అరుణ్ కుమార్, వైఎస్సార్ సీపీ మండల పార్టీ కన్వీనర్ పొత్రకొండ మోహన్రావు, సర్పంచ్ బర్రి గోవిందరావు, మాజీ ఉప సర్పంచ్ జి. భానుమూర్తి, పీఏసీఎస్ మాజీ ఉపాధ్యక్షుడు బూర్లె శ్రీనివాసరావు, పోర్న గోవింద, మునకోటి సీతారాం, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ గొంటి రమేష్, గంగరాజు, సింహచలం తదితరులు పాల్గొన్నారు.