స్కూల్ గోడను ఢీకొన్న ఆటో: విద్యార్థులకు గాయాలు | 4 students injured in wall collapse | Sakshi
Sakshi News home page

స్కూల్ గోడను ఢీకొన్న ఆటో: విద్యార్థులకు గాయాలు

Published Mon, Feb 29 2016 5:03 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

స్కూల్ గోడను ఆటో ఢీకొనడంతో అది కూలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.

భీమవరం : స్కూల్ గోడను ఆటో ఢీకొనడంతో అది కూలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి దిరుసుమర్రులోని జెడ్పీ స్కూల్ గోడను ఢీకొట్టింది. దీంతో ఆర్చ్ కూలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement