విశాఖపట్నం నగరం గాజువాక మండలం కోరుమన్నపాలెం సమీపంలో యాతపాలెంలో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
విశాఖపట్నం: విశాఖపట్నం నగరం గాజువాక మండలం కోరుమన్నపాలెం సమీపంలో యాతపాలెంలో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో బాధితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఈ ప్రమాదంలో 25 పూరిళ్లు దగ్దమైనాయి. రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.