GAJUWAKA
-
స్టీల్ప్లాంట్ ఉద్యోగుల నిరసన.. గాజువాకలో నో పర్మిషన్
సాక్షి, విశాఖ: వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపునకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల కార్మికుల నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపునకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు. ఆందోళన అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందించనున్నారు అఖిలపక్ష కార్మిక సంఘాలు. అయితే, గాజువాకలో నిరసన చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు.. నిరసనలకు ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కుర్మన్నపాలెం దీక్ష శిభిరంలోనే నిరసన చేపట్టాలని పోరాట కమిటీ నిర్ణయించింది. -
కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ అఖిలపక్షం ఉద్యమం
-
గాజువాకలో ఇసుక దందా
-
గాజువాక మార్కెట్ లో మహిళల కొట్లాట
-
స్టీల్ ప్లాంట్ కోసం మహాధర్నా
-
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదలాలివీళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడు అంతా గమనిస్తున్నాడు. మీ బిడ్డకు ప్రజల దీవెనలున్నాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల చేతుల్లో ఓటు అనే బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్లను కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందని గట్టిగా చెబుతున్నా.విశాఖలోనే ప్రమాణ స్వీకారం..జూన్ 4 తర్వాత మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదే రోజు పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని గర్వంగా చెబుతున్నా. మూడు రాజధానుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నాం. మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తూ మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలతో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేశాం. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వస్తోంది. రూ.4,400 కోట్లతో మూలపేట పోర్టు పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా చేస్తున్నాం, విశాఖ–భోగాపురం 6 లేన్ల రహదారిని నిర్మిస్తున్నాం. విశాఖలో అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైంది కూడా మీ బిడ్డ పాలనలోనే.– ఇచ్ఛాపురం సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: ‘దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులున్నంత వరకూ మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. జూన్ 4న మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. మనం నొక్కిన బటన్లు అన్నీ వారం రోజుల్లోనే క్లియర్ చేస్తాం. ఢిల్లీతో కలిసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు సీఎంగా చేశానంటాడు. అన్నేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? జగన్ అంటే పథకాలు.. చంద్రబాబు అంటే మోసాలు, కుట్రలు, కుతంత్రాలే గుర్తుకొస్తాయి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు, కుతంత్రాలకు ఓటు అనే వజ్రాయుధంతో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంతలా దిగజారిపోయారు..కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తూ మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి? మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా తెచ్చినవి కాదు. గత ఐదేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఇస్తున్న పథకాలకే మీ జగన్ బటన్ నొక్కాడు. ఈ స్కీములు ఇవాళ ఏదో కొత్తగా తెచ్చినవి కాదు. ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్. బడ్జెట్ కేటాయింపులున్నవే. అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవే. 58 నెలలుగా ఇస్తున్న పథకాలకు అడ్డుపడుతూ జగన్ను కట్టడి చేసేందుకు ఢిల్లీతో కలసి కుట్రలు పన్నుతున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వీళ్లు దిగజారిపోయారు. గత ఐదేళ్లుగా క్యాలండర్లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరిలో అడ్డుపడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా? పెన్షన్ సొమ్ము ఇన్నేళ్ల పాటు మీ బిడ్డ ఇంటికే పంపించిన తర్వాత చివరి రెండు నెలలు ఆ డబ్బులు ఇంటికి రాకపోతే ఏం జరిగిందో ఆ అవ్వాతాతలు గ్రహించలేరనుకున్నారా? ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారం రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ మీ బిడ్డ క్లియర్ చేస్తాడు. బాబు ఒక్క బటనూ నొక్కలేదు..మనపై ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీ జగన్ మాదిరిగా ఎన్నడూ బటన్లు నొక్కలేదు. ఏ రోజూ ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులు, పథకాలు ఇవ్వలేదు. మీ బిడ్డ జగన్ ఈ 59 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్ని చోట్ల రూ.4 వేలు, రూ.5 వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే ఆ డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బే అది. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరూ వద్దు అనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీకు, మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అభివృద్ధి, పథకాలను కొనసాగిద్దాం..మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే. రాష్ట్రంలో గతంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. గడప గడపకూ మేనిఫెస్టోతో వెళ్లి మరోసారి ఆశీర్వదించాలని కోరాం. మన పథకాలు.. మచ్చుకు కొన్ని‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్ (ద్విభాషా పాఠ్య పుస్తకాలు), బడులు తెరవగానే పిల్లలకు విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం, తప్పనిసరి ఇంటర్న్షిప్... ఇలాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? మహిళా సాధికారత.. వినూత్న వ్యవస్థలుఅక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల గృహ నిర్మాణాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, రేషన్, పథకాలు.. ఇలా నేరుగా డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు గతంలో ఉన్నాయా?స్వయం ఉపాధికి అండగా..వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలతో స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? రూ.25 లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, జీవన భృతి అందిస్తూ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం, ఫైబర్గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం గ్రామంలోనే మహిళా పోలీసు, దిశా యాప్ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా చూశారా? నాడూ నేడూ అదే రాష్ట్రం.. అదే బడ్జెట్. చంద్రబాబు ఏ రోజూ పేదల కోసం బటన్లు నొక్కలేదు. అప్పుల గ్రోత్ రేట్ కూడా గతంలో కంటే ఇప్పుడే తక్కువ. ఇది కాదా అభివృద్ధి..?మీ జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే ఏ స్కీమూ గుర్తు రాదు కాబట్టి జగన్ హయాంలో అభివృద్ధి లేదంటూ అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32,000 కోట్లు అయితే మీ బిడ్డ జగన్ పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే అంటే ఇది అభివృద్ధి పాలన కాదా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ మీ బిడ్డ హయాంలోనే వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీని వరుసగా ఏటా నంబర్ వన్గా నిలబెట్టాం. కొత్తగా 4 సీ పోర్టులు నిర్మిస్తున్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. 15,000 గ్రామ సచివాలయాలు, 11,000 విలేజ్, వార్డు క్లినిక్లు, 11,000 ఆర్బీకేలు నెలకొల్పాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3.95% మాత్రమే ఉంది. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల మందికిపైగా సిబ్బందిని నియమించాం. మీ బిడ్డ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 కాగా కొత్తగా మరో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వమే.మన అభ్యర్థులను దీవించండి..నాకు సొంత తమ్ముడు లేడనే బాధ ఉండేది. రాజాను (రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా) చూశాక ఆ బాధ పోయింది. నా తమ్ముడిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. మీరు రాజాకు ఓటేస్తే గణేష్, అమ్మ (జక్కంపూడి విజయలక్ష్మి), రాజా భార్య అంతా కలిసి మీ మంచి కోసం ఇంకా ఎక్కువగా కృషి చేస్తారు. మంచి వైద్యుడిగా పేరున్న శ్రీను అన్న (రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్)ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించండి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను దీవించాలని కోరుతున్నా. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, నాకు అక్క లాంటి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించండి.మీ కుటుంబంతో చర్చించండి..ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. అది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపున నిలిచి ఈ యుద్ధం జరుగుతోంది. మీరంతా ఓటేసేముందు మీ కుటుంబంతో కలసి కూర్చొని చర్చించండి. చిన్న పిల్లల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్ ఎక్కడ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, హాస్పిటళ్లు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలి.ఉద్దానం కిడ్నీ కష్టాలకు విముక్తిదశాబ్దాలుగా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం రూ.780 కోట్లతో హిరమండలం నుంచి తాగునీటిని తరలించింది మీ బిడ్డ ప్రభుత్వమే. రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ను నిర్మించింది మన ప్రభుత్వమే. ఉత్తరాంధ్రలో కొత్తగా మెడికల్ కళాశాలలు కడుతున్నాం. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతున్నాయి. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల కడుతున్నది మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయంటే కారణం మీ బిడ్డే. సెల్ఫోన్ కనెక్టివిటీ లేని గిరిజన ప్రాంతాల్లో రూ.400 కోట్ల వ్యయంతో టవర్లను ఏర్పాటు చేశాం. 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3,23,000 ఎకరాల పట్టాలిచ్చి వారికి రైతు భరోసా అందిస్తూ జీవనోపాధి చూపించింది కూడా మీ బిడ్డే.కోరుకొండ భూముల సమస్య పరిష్కరిస్తా..కోరుకొండ భూముల గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుర్తుచేశాడు. ఫైల్ ప్రాసెస్లో ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల సమస్యను పరిష్కరిస్తామని సవినయంగా తెలియజేస్తున్నా.తుప్పు సైకిల్.. ఢిల్లీ మెకానిక్స్!ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు గుప్పించే చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, వివిధ సామాజిక వర్గాలు, పల్లెలు, పట్టణాల వాసులు అంతా కలసి సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేరు చేయాలని చంద్రబాబు తంటాలు పడుతున్నాడు. ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. తుప్పు పట్టిన సైకిల్ కేరియర్ మీద మాత్రమే కూర్చుంటా! టీ గ్లాస్ పట్టుకుని తాగుతా! మిగిలింది నావల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడు. దీంతో వదినమ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపి సైకిల్ను ఓ షేపులోకి తేవాలని కోరాడు. ఆ ఢిల్లీ మెకానిక్స్ ఇక్కడికి వచ్చి తుప్పు పట్టిన సైకిల్ను చూసి... హ్యాండిల్ లేదు! సీటు లేదు! పెడల్స్ లేవు! చక్రాలు, ట్యూబులు లేవు! మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు! ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తాం చంద్రబాబూ! అని అడిగితే పిచ్చి చూపులు చూస్తూ.. ఇదొక్కటే మిగిలిందంటూ ట్రింగ్ ట్రింగ్మని బెల్లు మోగిస్తున్నాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో!2014లో బాబు ముఖ్యమైన మోసాలు..⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ డ్వాక్రా సంఘాలకు రూ.14,205 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని రూపాయైనా మాఫీ చేశాడా?⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీమ్ కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్ను మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? ⇒ రాజానగరంలో ఎవరికైనా కనిపిస్తోందా? ⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. ⇒ అదే ముగ్గురు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ నమ్మబలుకుతున్నారు. -
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!
-
మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం: సీఎం జగన్
విశాఖపట్నం, సాక్షి: అబద్ధాలకు రెక్కలుకట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో మంగళవారం(మే7) జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీటింగ్కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. ‘మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలివి. గతంలో ఎప్పుడూ ఎవరూ బటన్ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెల్లకు డబ్బులిచ్చిందీ లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా.ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైస్ఆర్సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. మూడు వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్పోర్టు శరవేగంగా పూర్తవుతుండడానికి కారణం ఎవరు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ సౌకర్యం కల్పిస్తున్నాం. నాడు-నేడు ద్వారా బడులకు కొత్త రూపం తీసుకువచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన తీసుకువచ్చాం. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్ఆఫ్ డూయింగ్లో ఏపీని నెంబర్వన్గా నిలిపాం. బాబు హయాంలో కంటే ఎక్కువగా మీ బిడ్డ హయాంలో లక్ష కోట్లపైబడి పెట్టుబడులు వచ్చాయి’ అని సీఎం జగన్ వివరించారు. సీఎం జగన్ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలువిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తా.. జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే పాలన కొనసాగించేది విశాఖ నుంచేఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండిలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారుప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండివెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయాబాబు, దత్తపుత్రుడు, మోదీగారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటిప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదుగాజువాకలో కూటమికి ఓటేస్తే స్టీప్లాంట్ అమ్మేయమన్నట్లేగాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందిఇక్కడ టీడీపీ, ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపడం సాధ్యం కాదు ఎందుకంటే దీన్నే వారు ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారుప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, తర్వాత జగన్ ఎంత ప్రయత్నించినా నీకెందుకయ్యా వారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అనకూలంగా తీర్పు ఇచ్చారంటారుఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి -
జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ
-
గాజువాకలో జనజాతర
-
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
-
గాజువాక ఎన్నికల ప్రచారంలో గుడివాడ అమర్నాథ్
-
నాకు సీటు ఇవ్వరు అని ట్రోల్ చేసిన వాళ్ళకి చెప్తున్నా.. గుడివాడ అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్
-
YSRCP: గాజువాక సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైఎస్సార్సీపీ 12వ జాబితా విడుదల అయ్యింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలను ప్రకటిస్తూ మంగళవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట(అసెంబ్లీ) సమన్వయకర్తగా కావటి మనోహర్నాయుడు, గాజువాక(అసెంబ్లీ) సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను పార్టీ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. ఇక కర్నూలు మేయర్గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ప్రకటించడంతో కర్నూలు మేయర్గా సత్యనారాయణమ్మను నియమించారు. -
గాజువాకలో టీడీపీ-జనసేన సిగపట్లు!
పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తేనే దిక్కులేదు.. ఇప్పుడు మీరు పోటీ చేసి ఏం గెలుస్తారు? గాజువాకలో జనసేన నేతలపై టీడీపీ నాయకులు సెటైర్లు పేలుస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్కల్యాణ్ పోటీ చేశారు కనుక ఈసారి గాజువాక తమకే ఇవ్వాలని జనసేన నేతలు పట్టుపడుతున్నారు. పవన్ గెలవలేనపుడు మీకు సీటు ఎందుకివ్వాలని టీడీపీ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సిగపట్లు మొదలయ్యాయి. ఇంకా రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు మొదలు కాకముందే గాజువాకలో గలాటా మొదలైంది. అసలక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్తో చంద్రబాబుకు కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం గాజువాకలో సొంత పార్టీ అభ్యర్థికే చంద్రబాబు ప్రచారం చేయలేదు. పక్క నియోజకవర్గంలో ప్రచారం చేసి పవన్ పోటీ చేస్తున్న గాజువాకలో టీడీపీకి ప్రచారం చేయకుండా వెనుదిరిగారు. గత ఎన్నికల్లో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈసారి గాజువాక తమకే కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు. జనసేన తరఫున పోటీ చేయడానికి కోన తాతారావు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన తరఫున ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోన తాతారావు. గాజువాకలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొదటినుంచి పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నానని అవకాశవాద రాజకీయాల కోసం తానేమి పార్టీలోకి కొత్తగా రాలేదంటున్నారు. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచి పదవులు అనుభవించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా తమ నాయకుడు జనసేనలోకి రాలేదని కోన తాతారావు అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గాజువాకలో పోటీ చేయాల్సిందే అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ క్యాడర్ మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపిందని చెబుతున్నారు. అధ్యక్షుడు పవన్కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన గాజువాక సీటును మళ్లీ ఎందుకు జనసేనకి ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. జనసేనతో పోలిస్తే టీడీపీనే ఇక్కడ బలంగా ఉందంటున్నారు. తమను కాదని జనసేనకి సీటు ఇచ్చినట్లయితే సహకరించేది లేదని టీడీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. జనసేనకు సీటు ఇచ్చినట్లయితే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను కూడా పంపుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు మొదలు కాకముందే గాజువాకలో రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. జనసేన అధ్యక్షుడికే గాజువాకలో దిక్కులేనపుడు..మామూలు నాయకుడు పటిష్టమైన స్థితిలో ఉన్న వైస్ఆర్ కాంగ్రెస్ను ఎదుర్కొనగలడా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందో చూడాలి. -
సామాజిక న్యాయానికి ప్రతీక సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: సామాజిక న్యాయానికి ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని గౌరవంగా బతుకుతున్నారంటే సీఎం వైఎస్ జగన్, ఆయన పథకాలే కారణమని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం గాజువాక నియోజకవర్గం పాత గాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని, ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు, చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గతంలో మనమందించే పథకాలను అవహేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా పథకాలు ఇస్తా అంటున్నాడని, ఇవి పేదలకు అందించే పథకాలని ఇప్పుడు తెలిసాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి వారి మాటలు నమ్మకూడదని చెప్పారు. ఓ రోడ్డు వేస్తేనో, బిల్డింగ్ కట్టేస్తేనో అభివృద్ధి కాదని, పేద వాడి జీవన ప్రమాణాలను పెంచి, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి జరిగినట్లని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల అభివృద్ధికే అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో బడుగుల అభ్యున్నతి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అని చెప్పారు. ఈ వర్గాలను అన్ని రంగాల్లోనే అగ్రగణ్యులుగా నిలబెడుతున్న ఘనత సీఎం జగన్దేనని తెలిపారు. గతంలో బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకే సమావేశం పెట్టుకునే ధైర్యం కూడా ఉండేది కాదని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తలెత్తుకొని ధైర్యంగా సభలు పెట్టుకోగలుగుతున్నామని అన్నారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన వద్ద ఈ వర్గాల నాయకులు ఎందుకు బానిసత్వం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమానించిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముందుగా లేఖ రాసింది సీఎం జగన్ అని గుర్తించుకోవాలన్నారు. పవన్కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఓ పార్టీకి, రాష్ట్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్ను 2024లోనూ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ను ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలను భుజానికెత్తుకున్న జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. ఒకప్పడు చంద్రబాబును ఛీకొట్టిన పురందేశ్వరి ఇప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆమె బీజీపీ కండువా వేసుకుని టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్బాషా మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 600పైగా హామీల్లో ఒకటీ నెరవేర్చలేదని, అయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలోనే ముస్లిం మైనారిటీలకు సువర్ణ పాలన అందించిని ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. విశాఖ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ బీసీ మహిళకు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కట్టబెట్టారని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ సామాజిక సాధికారతకు కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ను 30 ఏళ్ల పాటు సీఎంను చేసుకుందాం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో పడిపోయిన గాజువాక హౌస్ కమిటీ సమస్యను సీఎం జగన్ త్వరితగతిన పరిష్కరించారని చెప్పారు. సీఎం జగన్ను 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన భవిష్యత్ తరాల భవిత బాగుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త కె.కె రాజు, మాజీ మంత్రి బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు. -
బస్సు యాత్ర రెస్పాన్స్ చూసి ప్రతిపక్షాల వెన్నులో వణుకు
-
మార్కాపురం, గాజువాకలో వైఎస్ఆర్ సీపీ బస్సు యాత్ర
-
గాజువాక ఆటోనగర్ లో 112 అడుగుల ఆయుష్ గణపతి
-
గాజువాకలో కళ్లు చెదిరేలా భారీ గణపతి విగ్రహం..
-
గాజువాక మార్గదర్శి ఆఫీసులో సీఐడీ సోదాలు
-
గాజువాకలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
ఏపీఐఐసీ స్థలంపై టీడీపీ నేతల కన్ను.. రాత్రికి రాత్రే..
అగనంపూడి (గాజువాక): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు చేసిన యత్నాలను ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అగనంపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 228లోని రెండెకరాల స్థలాన్ని గతంలో ఫార్మా సిటీ నిర్వాసితుల కోసం కేటాయించారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్వాసితులకు స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే అదునుగా భావించిన ఆ వార్డుకు చెందిన టీడీపీ నేతలు సదరు స్థలంలో రాత్రికి రాత్రే దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాల పేరుతో సదరు స్థలాన్ని వారి చేతుల్లోకి తీసుకోవాలని కుట్ర పన్నారు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గాజువాక రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు ఆక్రమిత స్థలాన్ని సందర్శించి సిమెంట్ దిమ్మలను నేలమట్టం చేశారు. అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత హెచ్చరించారు. -
మోసం చేశాడని కేసు పెట్టి జైలుకు పంపి.. పెళ్లి చేసుకుంటుంటే పెట్రోల్తో..
సాక్షి, విశాఖపట్నం: ఓ యువతి తనను మోసం చేశాడని ప్రేమికుడిపై కేసు పెట్టి జైలుకు పంపింది. జైలు నుంచి విడుదలైన యువకుడు మరో పెళ్లి చేసుకుంటుంటే అదే యువతి కల్యాణ మండపానికి వచ్చి పెట్రోల్ బాటిల్తో రచ్చచేసింది. విషయం గాజువాక పోలీసులకు చేరడంతో వారు వచ్చి యువతి బంధువులకు నచ్చజెప్పారు. కోర్టు వివాదంలో ఉన్న అంశాన్ని కోర్టులో తేల్చుకోవాని సూచించారు. యువతి బంధువులకు నచ్చచెబుతున్న గాజువాక సీఐ భాస్కరరావు జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాం గ్రామానికి చెందిన ఎం. విజయ్ భగత్ ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను పార్వతీపురానికి చెందిన డి. ప్రియాంక అనే యువతిని ప్రేమించి కొంత కాలం తర్వాత వదిలేశాడు. దీంతో ఆమె విజయ్భగత్ మోసం చేశాడని మే నెలలో కేసు పెట్టడంతో యువకునికి జైలు శిక్ష పడింది. జైలు నుంచి వచ్చిన విజయ్ భగత్ మరో సంబంధం చూసుకొని శనివారం నాతయ్యపాలెంలోని కల్యాణ మండపంలో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక తన బంధువులు, స్నేహితులతో కల్యాణ మండపానికి చేరుకొని పెట్రోల్ బాటిల్తో బెదిరింపులకు దిగింది. సమాచారం అందుకున్న గాజువాక సీఐ ఎల్.భాస్కరరావు, ఎస్ఐ కొల్లి సతీష్ వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని యువతితో పాటు బంధువులకు సూచించారు. చదవండి: (విశాఖ.. ఎగుమతులకు స్వర్గధామం) -
హరితవనంగా ఆటో.. ఎక్కడ ఉందో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: ఇంటి పెరట్లో.. మిద్దెలపైన మొక్కలు పెంచడం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటోను హరితవనంగా మార్చాడు ఓ ఆటోవాలా. పర్యావరణ పరిరక్షణకు తన ఆటోకు చుట్టూ కుండీలను ఏర్పాటు చేసి వాటిలో పచ్చని మొక్కలను పెంచుతున్నాడు. ఇలా ఐదేళ్లుగా తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు డేవిడ్. గాజువాక గణపతినగర్ అతని నివాసం. కాకినాడ జిల్లా హెచ్.కొత్తూరు నుంచి ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం గాజువాక వచ్చాడు డేవిడ్. అక్కడ పాసింజర్ ఆటో కొనుక్కుని నడుపుతున్నాడు. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న డేవిడ్కు తానుంటున్న అద్దె ఇంట్లో వాటిని పెంచడానికి స్థలం లేదు. దీంతో తన ఆటోలోనే వాటిని పెంచాలన్న ఆలోచన కలిగింది. ఆటోకు కుడివైపున, హ్యాండిల్కు ఇరువైపులా బోల్టులు బిగించి కుండీలను స్థిరంగా ఏర్పాటు చేసి వాటిలో అందమైన మొక్కల పెంపకం ప్రారంభించాడు. వీటిలో ఆరోగ్యాన్నిచ్చే పసుపు మొక్కలు, సుగంధ పరిమళాన్ని వెదజల్లే మొరవంతో పాటు మనీప్లాంట్, పూలమొక్కలు వెరసి 11 రకాల మొక్కలను పెంచుతున్నాడు. అంతేకాదు ఆటోకు ముందు భాగంలో, అద్దానికి పైన, ఆటో లోపల కాళ్లు ఉంచే చోట్ల పచ్చని మ్యాట్లను కూడా అమర్చాడు. ఇలా ఆటో లోపల, బయట పచ్చదనంతో నింపేశాడు. పసుపు పచ్చని ఆటో చుట్టూ ఆకుపచ్చని మొక్కలతో ఆ ఆటో రోడ్లపై వెళ్తుంటే చూసే వారికి కనువిందు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముచ్చట పడిన వారు ఈ ఆటో ఫొటోలను కూడా తీసుకుంటున్నారు. స్కూలు పిల్లలను ఎక్కువగా తీసుకెళ్లే డేవిడ్.. తన ఆటోలో మొక్కలు, పచ్చదనాన్ని చూసి వారు మురిసిపోతుంటారు. వీటిని ఈ స్కూలు పిల్లలు గాని, డేవిడ్ పరిసర ప్రాంతాల వారు గాని పాడు చేయరు. అన్నట్టు.. డేవిడ్ ఆటోలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఆవు గత్తాన్ని తన సొంతూరు నుంచి ప్రత్యేకంగా తెస్తుంటాడు. ఒకసారి తెచ్చిన గత్తం ఐదారు నెలలకు సరిపోతుంది. పచ్చదనంపై మమకారంతో.. చిన్నప్పట్నుంచి నాకు పచ్చదనం అంటే ఇష్టం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు మేలు చేస్తాయని తెలుసు. నేనుంటున్న అద్దె ఇంట్లో మొక్కల పెంపకానికి జాగా లేదు. అందుకే నా ఆటోలో శాశ్వతంగా మొక్కలు ఏర్పాటు చేస్తే పచ్చదనంతో పాటు పర్యావరణాన్ని నా వంతు కాపాడవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పగలంతా నగరంలో తిరిగి రాత్రి వేళ ఆ మొక్కలకు నీరు పోస్తాను. ఇక నా ఆటోలో ప్రయాణించే వారు పచ్చని పార్కులో కూర్చొని జర్నీ చేస్తున్న అనుభూతి పొందుతున్నామని చెబుతుంటారు. ఆ మాటలు వింటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. – ఎం.డేవిడ్, ఆటోడ్రైవర్, గాజువాక -
అది పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై దండయాత్ర
గాజువాక: పరిపాలన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. పరిపాలన రాజధానికి మద్దతుగా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో గాజువాకలో బుధవారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో చేపట్టిన పాదయాత్ర పెట్టుబడిదారుల పాదయాత్ర అని, అది చంద్రబాబు బినామీల పాదయాత్ర అని.. అది ఉత్తరాంధ్రపై దండయాత్రగా చెప్పారు. చంద్రబాబు బినామీలు, ఆయన సామాజికవర్గానికి చెందినవారు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని, వారి అభివృద్ధి కోసం ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని ఓర్వలేక ఈ ప్రాంత ప్రజలపై చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రను విశాఖలోకి రానిచ్చేదిలేదని, పాయకరావుపేట దగ్గర అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడి నేతలు పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు ప్రకటించాలని, లేకుంటే ఆయా నేతల ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంతారావు స్పష్టం చేశారు. గీతం విద్యా సంస్థల అధిపతి భరత్ అమరావతికి మద్దతు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, గీతం ద్వారా ఉత్తరాంధ్రలో కోట్లాది రూపాయలు సంపాదించుకుని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడటం హేయమైన చర్యని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్దాస్, సోమశేఖర్, బాలాజీ, ఉదయ్, జాని, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్ని తదితరులు పాల్గొన్నారు. -
Rakesh Master: వైజాగ్లో రాకేష్ మాస్టర్ సందడి
గాజువాక(విశాఖపట్నం): ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ గాజువాకలో సందడి చేశారు. రిచ్ గైస్ ఆధ్వర్యంలో చిట్టినాయుడు కాలనీలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలకు హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ట్విటర్ రివ్యూ -
విశాఖ: గాజువాక లంక మైదానంలో కొలువుదీరిన భారీ గణనాథుడు
-
గాజువాక తహసీల్దార్కు 6 నెలలు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావుకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. లోకేశ్వరరావు ఈ నెల 18న హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు హాజరు కావాలని, అనంతరం ఆయన్ని ‘సివిల్ ప్రిజన్’కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. గాజువాక మండలం, తూంగ్లాం గ్రామం సర్వే నంబర్ 29/1లో ఉన్న తమ భూమి నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ పి.అజయ్కుమార్, మరొకరు హైకోర్టులో 2014లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్లను వారి భూమి నుంచి ఖాళీ చేయించవద్దని ఆదేశించింది. అయినా, అధికారులు ఆ భూమిలో నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని తహసీల్దార్ తన కౌంటర్లో వివరించారు. ఇతర అధికారుల కౌంటర్లను కూడా పరిశీలించిన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చట్ట ప్రకారం ఖాళీ చేయించాల్సిందన్నారు. తహసీల్దార్ ఆ పని చేయకుండా నిర్మాణాలను కూల్చివేశారని, అది కూడా కోర్టు ఉత్తర్వులు ఉండగా చేశారని ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వులు చట్ట విరుద్ధమైతే అప్పిలేట్ కోర్టులో సవాలు చేయాలే తప్ప, వాటికి విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పారు. తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తేల్చారు. అందువల్ల కోర్టు ధిక్కార చట్టం కింద తహసీల్దార్కు 6 నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
గాజువాకలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం
-
ఇదేం దుర్మార్గం దేవుడా! వెంకన్నకు మొక్కు తీర్చుకుండానే అనంత లోకాలకు
Road Accident At Chittoor: తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీనివాసుని దర్శించుకోవాలని... తమ కుమార్తె పుట్టు వెంట్రుకలు స్వామికి సమర్పించుకుని మొక్కు తీర్చుకోవాలని బయలుదేరిన ఓ కుటుంబ సభ్యులు ఆ మొక్కు చెల్లించుకోకుండానే మృత్యు ఒడికి చేరిపోయారు. లారీ రూపంలో మృత్యుదేవత ఎదురురావడంతో తల్లి, ఏడాదిన్నర వయసు గల చిన్నారితోపాటు మరో ఇద్దరు యువకులు చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘటనా స్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ హృదయవిదారక ఘటనతో గాజువాక ప్రాంతంలో విషాదం నెలకొంది. గాజువాకలో విలపిస్తున్న స్వాతి, ప్రేమ్కుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ స్నేహితుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గాజువాక దరి శ్రీనగర్ ప్రాంతానికి పైడి ప్రేమ్ కుమార్ (23), అతని సోదరి స్వాతి (25), ఆమె కుమార్తె శ్యామ్ అచ్యుత (1), స్నేహితులు పాత గాజువాకకు చెందిన సునీల్, అజీమాబాద్ కాలనీకి చెందిన ఖాదర్ వలీతో కలిసి తిరుపతి బయల్దేరారు. గురువారం ఉదయం విశాఖ నుంచి రైలులో బయల్దేరిన వారు విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి ఖాదర్ వలీ స్నేహితుడి కారు తీసుకుని తిరుపతి బయల్దేరారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆగి వున్న లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆ నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఖాదర్వలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు బోరున రోదిస్తున్నారు. ఈ సంఘటనతో గాజువాక ప్రాంత వాసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. స్వాతి పెద్ద కుమార్తె పోక్షిత (ఫైల్) పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు వెళ్లి... మృతురాలు స్వాతి భర్త వి.ఎల్.నారాయణ ఉద్యోగ రీత్యా సింగపూర్లో ఉంటున్నారు. దీంతో ఆమె ఇక్కడ తన తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో నాలుగేళ్ల పెద్ద కుమార్తె పోక్షితను గాజువాకలోనే తల్లిదండ్రుల వద్ద ఉంచి... ఏడాదిన్నర వయసు గల చిన్న కుమార్తె శ్యామ్ అచ్యుత పుట్టు వెంట్రుకలు తిరుమల వేంకటేశ్వరస్వామికి సమర్పించి మొక్కు చెల్లించేందుకు తమ్ముడు ప్రేమ్కుమార్, అతని స్నేహితులు సునీల్, ఖాదర్వలీతో కలిసి తిరుపతి బయల్దేరింది. అలా బయలుదేరిన వీరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. స్వాతి తమ్ముడు ప్రేమ్కుమార్ నగరంలోని ఒక నగల షోరూమ్లో సేల్స్మ్యాన్గా పని చేస్తున్నాడు. అందొచ్చిన కుమారుడు, కుమార్తె మృత్యువాతపడడంతో వారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. సమాచారం తెలిసిన వెంటనే స్వాతి తండ్రి రామచంద్రరావు సంఘటన స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సునీల్ ఒక సెల్ షాప్లో పని చేస్తున్నట్టు తెలిసింది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు సునీల్ (ఫైల్) ఇదేం దుర్మార్గం దేవుడా... రోడ్డు ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలు, మనవరాలు మృతి చెందడంపై వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇదేం దుర్మార్గం దేవుడా అంటూ వారు విలపించిన తీరు చూపరులను సైతం కన్నీరు పెట్టించింది. ‘నీ దర్శనానికి బయల్దేరిన మా బిడ్డలను తిరిగి రాకుండా చేశావా’ స్వామీ అంటూ వారు రోదించడం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. మా పిల్లలను తీసుకెళ్లిపోయి మనవరాలిని మాకు అప్పగించావా అంటూ స్వాతి, ప్రేమ్కుమార్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
వారం రోజుల్లో విదేశాలకు.. కారం, కత్తి, ఐరన్ రాడ్తో కొట్టి..
సాక్షి, గాజువాక (విశాఖ): గాజువాకలోని గోపాలరెడ్డినగర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చలేదన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక యువకుడిని కిరాతకంగా హతమార్చారు. కారం, కత్తి, ఐరన్ రాడ్తో కొట్టి హత్య చేశారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... గోపాలరెడ్డినగర్కు చెందిన ఛత్రబోయిన ప్రసాద్ (32) సింగపూర్లో వెల్డర్గా పని చేసి వచ్చాడు. మరో వారం రోజుల్లో మస్కట్కు వెళ్లేందుకు వీసా సంపాదించాడు. కాగా, సమీప బంధువులైన శ్రీను, చిన్న, పోతురాజు వద్ద కొద్దికాలం క్రితం రూ.80వేలు అప్పుగా తీసుకున్నాడు. తమ అప్పు తిరిగి చెల్లించాలని వారు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి చెల్లించేస్తానని ప్రసాద్ అంగీకరించాడు. అయితే ఇప్పటి వరకు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రసాద్ మళ్లీ విదేశాలకు వెళ్లిపోతున్నాడన్న విషయం తెలుసుకొని శ్రీను, చిన్న, పోతురాజు మరింత ఒత్తిడి పెంచారు. చదవండి: (ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..) ఆదివారం సాయంత్రం తమ కాలనీ సమీపంలో జన సంచారం లేని ప్రాంతానికి వెళ్లిన ప్రసాద్ను ముగ్గురు వ్యక్తులు కారం, కత్తి, ఐరాన్ రాడ్తో హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. నిందితులు ముగ్గురు మృతునికి దగ్గరి బంధువులుగా తెలుస్తోంది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన వెంటనే నిందితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. సోదరుడు కూడా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఏడీసీపీ రాజ్కమల్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చదవండి: (వాట్సాప్ మెసేజ్: తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా..) -
Plastic ban: ప్లాస్టిక్ అమ్మకాలపై ‘మహా’ కొరడా! రూ.75 వేల అపరాధ రుసుం..
Plastic use can lead to fines గాజువాక : ప్లాస్టిక్ అమ్మకాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసి భారీ ఎత్తున పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుల నుంచి అపరాధ రుసుం కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశారు. టాస్క్ఫోర్స్ ఏర్పాటు గాజువాకలో ప్లాస్టిక్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు ఇటీవల జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదులు అందడంతో ఆయన స్పందించారు. ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని జోనల్ అధికారులను ఆదేశించడంతో పాటు గాజువాక జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య విభాగం అధికారులు గాజువాక మార్కెట్లో ప్లాస్టిక్ సంచులను విక్రయిస్తున్న ఐదు దుకాణాలపై దాడి చేసి 500 కేజీల ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులనుంచి రూ.75వేల అపరాధ రుసుం వసూలు చేశారు. ప్లాస్టిక్ ఎవరు విక్రయించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో భాగంగా స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జోనల్ కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు! -
Gajuwaka: బైక్ రేసింగ్లో దూసుకుపోతున్న అవినాష్
గాజువాక: జాతీయ స్థాయి బైక్ రేసులో గాజువాక శ్రీనగర్కు చెందిన యువకుడు ప్రతిభ ప్రదర్శించాడు. ది వ్యాలీ రన్ పేరుతో ఈనెల 5న పూణేలో నిర్వహించిన నేషనల్ డ్రాగ్ రేసింగ్లో పాల్గొన్న వై.అవినాష్ 1000 సీసీ బైక్ రేసులో ద్వితీయ స్థానం సాధించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది విశాఖ నగరానికి మంగళవారం చేరుకొన్న అవినాష్ను పలువురు అభినందించారు. నాలుగేళ్లుగా పోటీలకు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అవినాష్ నాలుగేళ్లుగా రేసుల్లో పాల్గొంటున్నాడు. కోల్కతాలో గతంలో నిర్వహించిన ఎలైట్ ఆక్టేన్, నేషనల్ డ్రాగ్ చాంపియన్షిప్లలో పాల్గొన్న అవినాష్ తొమ్మిదో ర్యాంకు సాధించాడు. ఆ తరువాత బెంగళూరులో నిర్వహించిన పోటీలకు హాజరై 13వ ర్యాంకు తెచ్చుకున్నాడు. పూణేలోని లోనావాలాలో తాజాగా నిర్వహించిన రేసులో రెండో ర్యాంకు సాధించి పలువురి మన్ననలను పొందాడు. సేవా భావం తండ్రితో కలిసి స్టీల్ప్లాంట్లో ట్రాన్స్పోర్టు వ్యాపారం నిర్వహిస్తున్న అవినాష్ సమాజ సేవలోను పాలుపంచుకొంటున్నాడు. ప్రస్తుతం 20 మంది అనాథ పిల్లల చదువుకు సహాయం చేస్తున్నాడు. -
మహాబలిపురంలో విశాఖ యువకుడి మృతి
సాక్షి, పెదగంట్యాడ (గాజువాక): గాంధీనగర్కు చెందిన ఓ విద్యార్థి చెన్నై సమీపంలోని మహాబలిపురం బీచ్లో మంగళవారం మృతి చెందాడు. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని గాంధీనగర్లో కాతా బాలకృష్ణ, వెంకటలక్ష్మి పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ ‘వర్షు’ ఆక్వా ప్రింట్స్ పేరిట ప్రింటింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు కాతా వర్షు (18) చెన్నైలోని ఓ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదవుతున్నాడు. చెన్నై నుంచి స్నేహితులతో కలసి మహాబలిపురం బీచ్కు వెళ్లాడు. అక్కడ బీచ్లో దిగిన తర్వాత కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు. గల్లంతైన వర్షు కోసం అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. మూడు రోజుల క్రితం చెన్నైకు దగ్గరుండి దించి వచ్చిన తల్లి వెంకట లక్ష్మి .. కుమారుడి మృతి వార్త విని కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు, బంధువుల మహాబలిపురానికి బయలుదేరి వెళ్లారు. మృతదేహాన్ని బుధవారం ఇక్కడకు తీసుకురానున్నారు. చదవండి: (సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్) -
బాలికపై కామాంధుడి పైశాచికత్వం.. తండ్రి భయంతో
సాక్షి, అగనంపూడి (గాజువాక): అగనంపూడిలో దారుణం జరిగింది. కామాంధుడి పైశాచికత్వానికి 14 ఏళ్ల బాలిక బలైంది. నీలి చిత్రాలు చూపించి.. రెండు నెలలుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చివరకు తండ్రికి దొరికిపోతానేమోనన్న భయంతో ఆమె అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అగనంపూడి శనివాడకాలనీలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ప్రాథమిక విచారణలో సేకరించిన అంశాలను సౌత్ ఇన్చార్జి ఏసీపీ శ్రీరాముల శిరీష బుధవారం మీడియాకు వెల్లడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపేటకు చెందిన పాండ్రంగి సత్యం భార్య, కుమారుడితో కలిసి శనివాడలోని సాయి ప్రణయ్ రెసిడెన్సీలో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో పెంట్హౌస్లో నివాసముంటున్నాడు. ఎదురుగా ఉన్న ఆదిత్య నివాస్లో సత్యం చెల్లెలు భర్త కూడా వాచ్మన్గా పనిచేస్తున్నాడు. సత్యం కుమార్తె (14) అగనంపూడి హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఆదిత్య నివాస్ మొదటి అంతస్తులో కార్పెంటరీ పనులు చేస్తున్న ఆరుగురు యువకులు నివాసముంటున్నారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన దిగుమర్తి నరేష్ గత జూలైలో ఇక్కడకు వచ్చాడు. అగనంపూడిలో ఇంటీరియర్ పనులు చేస్తున్నాడు. ఎదుట అపార్ట్మెంట్లో ఉన్న ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. నీలి చిత్రాలు చూపించి.. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. రెండు నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. కాగా.. మంగళవారం రాత్రి సత్యం ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో నరేష్ బాలికకు ఫోన్ చేసి రమ్మని కోరడంతో ఆమె ఆదిత్య నివాస్లోకి వెళ్లింది. ఈ లోగా ఆమె తండ్రి బాత్రూమ్ కోసం లేవడం, కుమార్తె లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్మెంట్ టెర్రస్పైన, కింద వెతికారు. ఆచూకీ లేకపోవడంతో ఎదురుగా ఉన్న బాలిక మేనత్త ఇంట్లో ఉందేమోనని వెళ్లి చూశారు. అక్కడ కూడా ఆమె లేకపోవడంతో ఏడుస్తూ.. కేకలు వేశారు. ఇది విన్న ఆమె.. నాన్నకు దొరికిపోతానేమోనన్న భయంతో అపార్ట్మెంట్ టెర్రస్పై నుంచి దూకేసింది. బాలిక మృతదేహం చూసి వారంతా షాక్కు గురయ్యారు. కుమార్తె మరణించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమార్తె మృతికి కారణమైన నరేష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదిత్య నివాస్లో నివాసముంటున్న నరేష్తోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వేర్వేరుగా విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ వ్యవహారంలో నరేష్ రూమ్మేట్స్కు సంబంధం లేదని ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్చార్జి ఏసీపీ తెలిపారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, నిందితుడు వెల్లడించిన వివరాలు, ప్రాథమిక విచారణ మేరకు నరేష్పై లైంగిక దాడులు, అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఫోన్ డేటా విశ్లేషిస్తామని, ఫోరెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. సమావేశంలో దువ్వాడ సీఐ టి.లక్ష్మి, గాజువాక సీఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. పరామర్శించిన నేతలు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులను పలువురు నేతలు పరామర్శించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వి.అనిత, పల్లా శ్రీనివాసరావులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రశాంతమైన అగనంపూడిలో ఇలాంటి సంఘటన దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని దేవన్రెడ్డి మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించలేరు..
గాజువాక: విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికులు ఏడు నెలలుగా పోరాడుతున్నా కేంద్రం మొండిగా వ్యవహరించడం సబబు కాదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ స్టీల్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉక్కు అఖిల పక్ష కార్మిక, నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలో ఆదివారం నిర్వహించిన మహా పాదయాత్రను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పన్నినా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించలేరని స్పష్టం చేశారు. ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాయన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు నష్టాలొచ్చాయన్నది మాత్రం దుష్ప్రచారమని కొట్టిపారేశారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
బతికిలేకున్నా.. బతికించాడు
సాక్షి,విశాఖపట్నం (గాజువాక) : జీవనమృతుడిగా మారిన వ్యక్తి అవయవాలు దానం చేసి....ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. నాతయ్యపాలేనికి చెందిన భూపతి కిరణ్ కుమార్ (26) ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నాటి నుంచి వైద్యానికి స్పందించకపోవడంతో శనివారం బ్రెయిన్ డెడ్గా వైద్యుడు కిరణ్ కుమార్ నిర్థారించారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందిన దుఃఖంలోనూ ఆ కటుంబం కన్నీళ్లను అదిమిపెట్టుకుని గొప్ప మనసు చాటుకుంది. తన కుమారిడి అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో వైద్యులు, బంధువులు బాధిత కుటుంబాన్ని అభినందించారు. మృతుడు భూపతి కిరణ్ కుమార్ నేవల్ అర్మెంట్ డిపోలో టీఎఫ్ (ఎస్కే)గా పనిచేస్తున్నాడని, తండ్రి భూపతి కృష్ణ (ఈ మధ్యనే బెహ్రాన్లో పనిచేస్తూ తన స్వస్థలానికి వచ్చారు), తల్లి రమణమ్మ (గృహిణి), సోదరి మాధురి (ఎన్ఏడీ ఉద్యోగి) ఉన్నారని బంధువులు తెలిపారు. అంతటి దుఃఖంలోనూ కుమారుడి అవయవాలు దానం చేసేందుకు కృష్ణ, రమణమ్మ ముందుకొచ్చారు. దీని కి సంబంధించి అంగీకార పత్రాన్ని షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి యాజమాన్యానికి అందజేశారు. ఇద్దరికి అమర్చనున్న వైద్యులు కిరణ్ కుమార్కు చెందిన హార్ట్, లంగ్స్ పార్ట్లను హైదరాబాద్లోని ఓ రోగికి అమర్చేందుకు తరలించారు. అలాగే కిడ్నీ, లీవర్లను కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి అమర్చనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
రెండు రోజుల్లో పుట్టిన రోజు.. ఈ చిరునవ్వులు రాలిపోయాయి
ఆ చిరునవ్వులు ఇక లేవు..మృత్యుఒడిలో మాయమైపోయాయి. నిత్యం చలాకీగా సందడి చేసే ఆ నవ్వుల పూదోట వాడిపోయింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ ఇంట్లో విషాదం నింపింది. నేను లేని లోకంలో నిను చూసేది ఎవరు అనుకుందో ఏమో ఆ తల్లి తన కంటిపాపనూ తీసుకుపోయింది. సాక్షి,విశాఖపట్నం: కుటుంబ కలహా లతో వివాహిత రెండేళ్ల కుమారుడితో సహా అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గాజువాక ఎస్ఐ సూర్యప్రకాశరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంతోష్ బెహరా న్యూ పోర్టులో డెలివరీ విభాగంలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య జయంతి బెహరా(26), కుమారుడు రోనిత్ కుమార్ (2)తో కలిసి చుక్కవానిపాలెంలోని సువర్ణ శ్రీనివాసం అపార్ట్మెంట్లో రెండేళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు. రెండు రోజుల్లో వారి కుమారుడు రోనిత్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవలసి ఉంది. ఈ వేడుకలపై భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో గొడవలు జరగుతున్నాయని వారి బంధువులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జయంతి బెహరా తన కుమారుడిని తీసుకొని అపార్ట్మెంట్ పైకి వెళ్లి అక్కడ నుంచి దూకేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న రోనిత్ కుమార్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సంతోష్ బెహరా విధుల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్
గాజువాక: సెలవు రోజున విద్యార్ధి గోడ దూకి పాఠశాలలోకి వచ్చాడనే కోపంతో విద్యార్థిని ఓ వాచ్మెన్ చితక్కొట్టాడు. వీపు, చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే వాచ్మెన్పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాకలో జరిగింది. అయితే వాచ్మెన్ దాడి చేసిన విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు. రాత్రి చొక్కా తీసి నిద్రిస్తున్న సమయంలో ఒంటిప్తె ఉన్న దెబ్బలు చూసి తల్లి అడగడంతో ఈ విషయం బయటపడింది. గాజువాక బీసీ రోడ్డులో ఉన్న మార్వెల్ పాఠశాలలో చ్తెతన్య ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కొంతమంది విద్యార్థులతో కలసి ఆడుకునేందుకు పాఠశాలకు వచ్చాడు. అయితే వాచ్మెన్ అనుమతి తీసుకుని లోనికి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో వేరే అబ్బాయి వచ్చాడు. పాఠశాలలలో ఉన్న బస్సు ఎక్కి హారన్ కొట్టడంతో వాచ్మెన్కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కర్రతో చితకబాదాడని బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంటికెళ్లినా విద్యార్థి వాచ్మెన్ కొట్టిన విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే రాత్రి నిద్రిస్తుండగా తల్లి సత్యగౌరి చూసి ప్రశ్నించగా ఈ విషయం బయటకు వచ్చింది. తెల్లారి వెంటనే పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ను నిలదీశారు. తప్పు చేస్తే ఇంత దారుణంగా వాచ్మెన్ కొడతారా అని అడిగారు. విద్యార్ధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అంటూ నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్తో మాట్లాడి వాచ్మెన్ను పిలిపించారు. అయితే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే వాచ్మెన్ దారుణంగా కొట్టాడని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. చదవండి: ఇన్స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్లో..
సాక్షి, గాజువాక (విశాఖపట్నం): ప్రేమ వ్యవహారం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకొంది. తన భార్య మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందని తెలుసుకున్న భర్త మనస్తాపంతో నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆ వివాహిత ప్రేమించి పెళ్లాడిన భర్త (ప్రియుడు)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుందరయ్య కాలనీదరి దుర్గానగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై సౌత్ ఏసీపీ జి.ఆర్.రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరవాడ మండలం పి.బోనంగి గ్రామానికి చెందిన మోటూరి నాగిణి (24) అదే గ్రామానికి చెందిన బోకం అవినాష్ (28)ను ప్రేమించింది. అయితే ఆమె తల్లిదండ్రులు పాపారావు అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం జరిపించారు. అనంతరం ఉపాధి కోసం పాపారావు తన భార్యతో కలిసి అండమాన్ వెళ్లిపోయాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తూ నివాసముంటున్నాడు. వాళ్ల కాపురం నాలుగేళ్లపాటు సాఫీగానే సాగింది. అయితే బోనంగిలోని తమ పుట్టింటికి నాగిణి అండమాన్నుంచి వచ్చింది. పెళ్లికి ముందే ప్రేమించిన అవినాష్తో చనువుగా తిరుగుతోంది. ఈ క్రమంలో నాగిణిని అండమాన్ పంపేందుకు ఆమె తల్లిదండ్రులు రెండుసార్లు టికెట్లు తీసినా వెళ్లలేదు. తన భార్యకు అవినాష్కు మళ్లీ సంబంధం ఏర్పడిందన్న విషయం తెలుసుకున్న పాపారావు తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకొన్నాడు. చదవండి: (విషాదం: పోలీస్ దంపతుల ఆత్మహత్య) ఇదిలా ఉండగా, నాగిణి, అవినాష్లు ఈనెల 16న ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు వారు పరవాడ దరి వాంబేకాలనీలో కనిపించడంతో పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ గురువారం ఉదయం కశింకోటలోని దుర్గా గుడిలో వివాహం చేసుకొని అవినాష్ ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడంతో ఇక్కడి దుర్గానగర్లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. శ్రీనగర్లో ఇల్లు అద్దెకు తీసుకుంటున్నామని, ఇక్కడే కాపురముంటామని చెప్పిన వారిద్దరూ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలమని ఇంటి యజమానికి చెప్పి ఆ ఇంటికి అడ్వాన్స్ చెల్లించారు. రెండు రోజుల్లో సామగ్రి తెచ్చుకుంటామని ఇంట్లో దిగారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు దాటుతున్నా తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమాని వెళ్లి చూశాడు. ఇద్దరూ ఆ ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి పోసుకొని కనిపించడంతో గాజువాక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగిణి తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో తమ బిడ్డ నిర్జీవంగా ఉండడం చూసి బోరున విలపించారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!) సమాచారం అందుకున్న సౌత్ ఏసీపీ జి.ఆర్.రెడ్డి, గాజువాక సీఐ మల్లీశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. కుటుంబ సభ్యుల నిరాకరణ, భర్త ఆత్మహత్య చేసుకున్నాడన్న మనస్తాపమో, మరేదైనా కారణం చేతనో వారు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని ఏసీపీ పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. కాగా, మృతుల గదిలో సూసైడ్ నోట్ లభించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, తమ ప్రేమను కాదంటున్నారనే కారణంతోనే ఆత్మహత్య చేసుకొంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు ఏసీపీ తెలిపారు. తమ మృతదేహాలను ఒకేచోట ఖననం చేయాలని వారు ఆ లేఖలో కోరారు. చదవండి: (మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను) -
హమ్మయ్య.. ప్రాణాలతో తీరానికి..
సాక్షి, విశాఖపట్నం: గాజువాక ప్రాంతంలోని యారాడలో సముద్ర తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు చావు అంచుల నుంచి తప్పించుకున్నారు. ఆటవిడుపుగా యారాడకు వచ్చిన ఏడుగురు యువకులు అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్లలో చిక్కుకున్నారు. వారిలో నలుగురు యువకులు బయపడగా.. మిగతా ముగ్గురు మాత్రం అక్కడి నుంచి రాలేకపోయారు. తమ మిత్రులు ప్రమాదంలో చిక్కుకున్నారని యువకులు న్యూ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు .. రెవెన్యూ, రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో అధికార యంత్రాంగం యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో నగరానికి చెందిన కొండ నవీన్ (20), భీశెట్టి యశ్వంత్ (20), కె.శ్రవణ్ (20) ను రక్షించించారు. యువకులు క్షేమంగా బయటపడటంతో అధికారులు, కుటుంబ సభ్యులు, వారి మిత్రులు ఊపిరిపీల్చుకున్నారు. -
వరలక్ష్మిని చంపేందుకు క్రైమ్ సినిమాలు చూశాడు..
అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతోనే జీవితమనుకున్నాడు. కానీ అతడు అనుకుంది జరగలేదు. ఆమె అతడిని స్నేహితుడిగా మాత్రమే చూసింది. తట్టుకోలేకపోయాడు. కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కకూడదని నిశ్చయించుకున్నాడు. అలా తనలోని ప్రేమికుడు కాస్తా రాక్షసుడిగా మారాడు. ప్రేమికురాలిని హతురాలిగా మార్చేందుకు క్రైమ్ సినిమాలు చూశాడు. నేరం చేసి తప్పించుకోవడమూ నేర్చుకున్నాడు. కానీ అది సినిమా, ఇది నిజ జీవితమని గుర్తించలేకపోయాడు. యువతిని పొట్టనపెట్టుకున్నాడే కానీ హత్యా ఘాతుకం నుంచి తప్పించుకోలేకపోయాడు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వరలక్ష్మి హత్య కేసులో సంచలన నిజాలు బయటపెడుతున్నాయి. నిందితుడు అఖిల్ సాయి వెంకట్ తనకు దూరమైన వరలక్ష్మి ఎవరికీ దక్కకూడదనే కోపంతో ఈ హత్యకు పథకం వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య చేయడంతో పాటు, నేరం బయటపడకుండా ఉండేందుకు అతడు పాపులర్ క్రిమినల్ సినిమాలను చూశాడు. ఓ పాపులర్ సినిమాలో హత్య చేసిన తర్వాత చుట్టూ కారం చల్లితే డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టని సీన్లను చూసినట్టు నిందితుడు వెల్లడించాడు. దీంతో పక్కా పథకం ప్రకారం ముందుగానే కారం కొనుగోలు చేసి, అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి, బ్లేడుతో కోసి, ఎటువంటి ఆధారాలు లభించకుండా చుట్టూ కారం చల్లాలని భావించాడు. అలాగే 'దృశ్యం' సినిమాలో చేసినట్లు పోలీసులను తప్పుదారి పట్టించిన మరొకరిపై నేరాన్ని మోపే ప్రయత్నం కూడా చేశాడని తేలింది. (చదవండి: వరలక్ష్మి హత్యకేసులో మరింత లోతుగా విచారణ) మరికొన్ని రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తాము కాగా గాజువాక శ్రీనగర్లోని సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి (17)పై చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్సాయి వెంకట్ (21) శనివారం రాత్రి బ్లేడ్తో దాడి చేసి.. అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన విషయం తెలిసిందే. హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నేడు (గురువారం) మరోసారి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టుపక్కల పరిసరాలలో కొందరి నుంచి సాక్ష్యాలు కూడా సేకరించారు. నిందితుడిపై హత్యానేరంతోపాటు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అభియోగంపై యాక్ట్ జత చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఏసీపీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: చదువుల తల్లిని చిదిమేశాడు) -
ఆన్లైన్లో అప్పులు.. యువతి ఆత్మహత్య
సాక్షి, గాజువాక : ఆన్లైన్లో చేసిన అప్పులను తీర్చలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక శ్రీనగర్లోని సుందరయ్య కాలనీలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక ఆటోనగర్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న మాండవ సత్యనారాయణ కుమార్తె అహల్య (25) ఎంబీఏ పూర్తి చేసింది. ఇటీవల ఆమె ఆన్లైన్ యాప్ల ద్వారా రూ.40 వేల వరకు అప్పు చేసింది. ఆ అప్పు మంగళవారం నాటికల్లా తిరిగి చెల్లిస్తానని సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో అప్పు తిరిగి చెల్లించాల్సిందిగా ఆయా యాప్ల సిబ్బంది నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ నేపథ్యంలో అహల్య తండ్రి సత్యనారాయణ తలుపులమ్మ దర్శనం కోసం మంగళవారం బయల్దేరి వెళ్లారు. తల్లి ఉషామణి బ్యాంకుకు వెళ్లింది. ఇంటర్ చదువుతున్న తమ పిన్ని కుమారుడికి పదిన్నర గంటల వరకు క్లాసు చెప్పిన అహల్య స్నానం చేస్తానని అతడిని హాల్లోకి పంపించింది. బ్యాంకు నుంచి కుమార్తెకు ఫోన్ చేయగా ఆమె స్పందించకపోవడంతో ఉషామణి హుటాహుటిన ఇంటికి చేరుకుంది. (చదివింది ఎంబీఏ.. చేసేది పార్ట్టైమ్ చోరీలు) ఎంత పిలిచినా తలుపు తెరవకపోవడంతో బద్దలుగొట్టి గదిలోకి వెళ్లి చూసేసరికి అహల్య ఫ్యాన్ హుక్కు తాడుతో ఉరి వేసుకొని మృతి చెంది కనిపించింది. చుట్టుపక్కలవారి సహాయంతో మృతదేహాన్ని కిందకి దింపి గాజువాక పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్ ప్రాథమిక విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి ఫోన్లో తొమ్మిది యాప్ల ద్వారా అప్పులు చేసినట్టు గుర్తించారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. -
వరలక్ష్మి కుటుంబానికి పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: ప్రేమోన్మాదానికి బలైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి మేకతోటి సుచరిత రూ.10 లక్షల చెక్ను అందజేశారు. సోమవారం వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ వరలక్ష్మి ఘటన చాలా బాధాకరమన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు. ‘ఈ హత్యలో నిందితునికి ఇతరులు సహకరించరన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రతి విద్యార్థి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నాం. టీనేజ్ వయసులో అమ్మాయిల ప్రవర్తనపైనే కాదు, అబ్బాయిల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే 10 లక్షల సహాయం అందించామ’ని హోంమంత్రి తెలిపారు. నిందితుడు అఖిల్కు మరికొంతమంది సహకరించారని ఆరోపించిన వరలక్ష్మి తల్లిదండ్రులు.. అఖిల్కు రౌడీషీటర్లతో సంబంధాలున్నాయని తమకు రక్షణ కల్పించాలని సుచరితను కోరారు. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను సుచరిత ఆదేశించారు. (చదవండి: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్) -
వరలక్ష్మీ హత్య కేసు: అఖిల్ సాయికి 14 రోజుల రిమాండ్
-
విశాఖలో బాలుడి కిడ్నాప్..
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): విశాఖలో పారిశ్రామిక ప్రాంతం ఆటోనగర్లో ఆదివారం జరిగిన బాలుడి కిడ్నాప్ను కొన్ని గంటల వ్యవధిలోనే గాజువాక పోలీసులు ఛేదించారు. సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు.. రాజస్థాన్కు చెందిన నరేష్కుమార్ ఆటోనగర్ బి–బ్లాక్లోని సెయిల్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్. ఆయన భార్య, కుమారుడు మయాంక్కుమార్(4)తో కలిసి ఆటోనగర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నాడు. పరిశ్రమలకు మెటీరియల్ సరఫరా చేసే ప్రదీప్బిశ్వాల్తో వ్యాపార లావాదేవీల కారణంగా నరేష్కుమార్ రూ.40 లక్షలు బాకీ పడ్డాడు. ఆదివారం ఉదయం బిశ్వాల్ తన భార్య, కుమారుడితో కలిసి రావలసిన సొమ్ము అడిగేందుకు సరేష్కుమార్ ఇంటికి అద్దె కారులో వచ్చారు. తర్వాత అదే కారులో బిశ్వాల్ తన కుమారుడితో పాటు నరేష్కుమార్ కుమారుడు మయాంక్కుమార్ను కూడా ఎక్కించుకుని వెళ్లిపోయాడు. తన కుమారుడు కిడ్నాప్నకు గురయ్యాడని నరేష్కుమార్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కొన్ని గంటల్లోనే బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల సాయం
సాక్షి, అమరావతి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకాన్ని తీవ్రంగా పరిగణించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ల నుంచి వివరాలను తెలుసుకున్న సీఎం బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతురాలు వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్ను ఆదేశించారు. ప్రతి టీనేజ్ బాలిక మొదలు మహిళలందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా ఎడ్యుకేట్ చేయాలని సూచించారు. పాఠశాల, కాలేజీ విద్యార్థినులు వందశాతం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలను అదుపుచేయడానికి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని మహిళలు సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్గా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
చదువుల తల్లిని చిదిమేశాడు
సాక్షి, విశాఖపట్నం/గాజువాక: అతడి ప్రేమోన్మాదం చదువుల తల్లిని పొట్టన పెట్టుకుంది. గాజువాక శ్రీనగర్లోని సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి (17)పై చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్సాయి వెంకట్ (21) శనివారం రాత్రి బ్లేడ్తో దాడి చేసి.. అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం కేజీహెచ్లో పోస్ట్మార్టం నిర్వహించాక వరలక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదువులో టాపర్ వరలక్ష్మి పదో తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్లో 9.8 జీపీఏ సాధించింది. ఆమె గాజువాకలో పాఠశాలలో చదువుతున్నప్పుడు అఖిల్సాయి వెంకట్ పరిచయమయ్యాడు. అతడు ప్రస్తుతం బీఎల్ ఫైనలియర్ చదువుతున్నాడు. మూడేళ్లుగా వారిద్దరి మధ్య స్నేహం ఉందని చెబుతున్నారు. శనివారం వరలక్ష్మి మేనత్త ఇంట్లో పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. మధ్యాహ్నం బట్టలు మార్చుకుని వస్తానని తల్లిదండ్రులకు చెప్పడంతో వరలక్ష్మిని ఆమె అన్నయ్య ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం యువతి సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్లేడ్తో గొంతు కోసి.. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకున్న అఖిల్సాయి వరలక్ష్మికి ఫోన్ చేసి.. ఆమెను చూడాలని ఉందని.. సాయిబాబా ఆలయం వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన వరలక్ష్మితో చాలాసేపు మాట్లాడాడు. ఆ తరువాత వెంట తెచ్చుకున్న బ్లేడ్తో ఆమెపై దాడి చేసి.. గొంతు, చేతుల్ని కోయడంతోపాటు మొహంపై పిడిగుద్దులు కురిపించాడు. వరలక్ష్మి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె సోదరుడు, తండ్రి ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావమై వరలక్ష్మి మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. పథకం ప్రకారమే హత్య వరలక్ష్మిని అఖిల్సాయి వెంకట్ పథకం ప్రకారమే హత్య చేశాడని పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్సిన్హా స్పష్టం చేశారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన వరలక్ష్మి తల్లిదండ్రులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నిందితుణ్ణి అరెస్ట్ చేశామని, ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశామని చెప్పారు. దిశ ఏసీపీ దర్యాప్తు చేస్తున్నారని, వారం రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని చెప్పారు. నిందితుడు హత్య తరువాత ఘటనా స్థలంలో వేరే సీన్ తయారు చేశాడని, ఈ దాడిని వేరే వ్యక్తిపై నెట్టడానికి ప్రయత్నం చేశాడని చెప్పారు. హత్యకు ముందు ఓ రౌడీషీటర్ను కూడా సంప్రదించినట్టు సమాచారం ఉందన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పరామర్శ వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదివారం పరామర్శించారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నేడు విశాఖకు హోం మంత్రి సాక్షి, గుంటూరు: రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. ఈ మేరకు హోం మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని ఆ ప్రకటనలో హోం మంత్రి పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. -
అఖిల్ను వెంటపడవద్దని హెచ్చరించినా..
సాక్షి, విశాఖ : ఉన్మాది చేతితో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన వరలక్ష్మి కుటుంబ సభ్యుల్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. గాజువాక శ్రీనగర్ కాలనీలో వరలక్ష్మి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘వరలక్ష్మి హత్య అమానుషం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. దిశ చట్టం ప్రకారం నిందితులపై పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు దిశ చట్టం ద్వారా కఠినమైన శిక్ష పడుతుంది. ఏడాది క్రితం అఖిల్ను తమ కుమార్తె వెంట పడవద్దని వరలక్ష్మి కుటుంబీకులు హెచ్చించినా అతడి వైఖరి మారలేదు. అయినా ఈ దారుణానికి ఒడిగట్టాడు. (చదవండి : పక్కా ప్లాన్తోనే వరలక్ష్మిని హత్య చేశాడు..) ఈ హత్యలో అఖిల్ తండ్రి పాత్రపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆపదలో ఉన్న యువతులు దిశ యాప్ను వినియోగించుకోవాలి. ప్రేమ పేరిట దాడుల నియంత్రణకు విద్యార్థులకు కౌన్సిలింగ్ అవసరం. ఇలాంటి ఘటనకు కారణమైన అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది. బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 10 లక్షల పరిహారం ప్రకటన ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే.’ అని అన్నారు. (చదవండి : వరలక్ష్మి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు) ఈ ఘటనను విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం పోలీసు అధికారులు వెంటనే స్పందించిన తీరును అభినందించారు. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా సమాజంలో అన్ని వర్గాలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. మరోవైపు పోస్ట్మార్టం అనంతరం వరలక్ష్మి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. విగతజీవిగా ఉన్న కూతురిని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న హోమంత్రి సుచరిత మోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హోంమంత్రి మేకతోటి సుచరి ఈ రోజు రాత్రి విశాఖపట్నంకు బయలుదేరారు. రేపు ఉదయం 10 గంటలకు గాజువాక చేరుకొని వరలక్ష్మి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. ఇప్పటికే దాడి చేసిన ప్రేమోన్మాది అఖిల్ సాయి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. -
పక్కా ప్లాన్తోనే వరలక్ష్మిని హత్య చేశాడు..
సాక్షి, విశాఖపట్నం : గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి ప్రేమోన్మాదానికి ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి బలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తాజాగా వరలక్ష్మిని పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా భావిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఆదివారం గాజువాక శ్రీనగర్లోని వరలక్ష్మి ఇంటికి స్వయంగా వెళ్లిన సీపీ కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. (చదవండి : గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'వరలక్ష్మి హత్య పక్కా ప్రణాళికతో జరిగింది. హత్య చాలా బాధాకరమైన సంఘటన. నిందితుడు తండ్రి ఇచ్చిన సమాచారంతో సంఘటన ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అయితే అప్పటికే చాలా రక్తం పోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే వరలక్ష్మి మృతి చెందింది. కాగా ఈ హత్య కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేశాం. ఈ కేసును దిశా ఏసీపీకి అప్పగించాం. వారం రోజుల్లో చార్జీ షీట్ వేస్తాం. (చదవండి : వరలక్ష్మి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు) విశాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా 'సంఘటనా ప్రాంతంలో ఎలాంటి క్లూస్ లభించకూడదని తారుమారు చేయాలననే ప్రయత్నం చేశారు. వరలక్ష్మి హత్యకు ముందే అఖిల్ ఒక రౌడీ షీటర్ను సంప్రదించినట్లు తెలిసింది. నిందితుడు చాలా పక్కా ప్లాన్ తో మర్డర్ చేశాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం కత్తి, కారం తీసుకుని వరలక్ష్మిని హత్య చేయడానికి సిద్ధం అయ్యాడు. ఆ తర్వాత ఇదంతా వేరే వాళ్ళు చేసినట్లుగా చూపించేందుకు యత్నించాడు.అయితే నిందితుడు తండ్రి నుంచి పోలీసులకు సమాచారం మొదటగా రావడంతో వరలక్ష్మి హత్య కేసులో అఖిల్ తండ్రి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నాం. కాగా 6.42 సమయంలో హత్య జరిగినట్లు అఖిల్ తండ్రి ఫోన్లో చెప్పారని.. కాగా అఖిల్ తండ్రిపై గతంలో రౌడీషీట్ ఉందని తేలింది. పక్క ప్లాన్తోనే ప్యూర్ క్రిమినల్ మర్డర్ చేశారు. .చట్ట ప్రకారం అన్ని కఠిన చర్యలు తీసుకుంటామని' కమిషనర్ మనీష్ తెలిపారు. -
ఉన్మాదం
-
గాజువాక: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పథకం ప్రకారమే వరలక్ష్మి హత్య జరిగింది. యువతి హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణమని తేలింది. వరలక్ష్మిపైన అనుమానంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. (మరదలితో రెండో పెళ్లి.. నిప్పంటించిన మొదటి భార్య) కాగా.. సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటంతో భరించలేక పథకం ప్రకారం హత్య చేసినట్టు వెల్లడైంది. మరో వైపు ఊహించని ఈ పరిణామంతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి కోరుకుంటోంది. తాజా ఘటనపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబానికి ఎదురు కారాదని స్థానికులు బాధిత యువతి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సుచరిత గుంటూరు: విశాఖపట్నం ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్రంగా మండిపడ్డారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే అంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నాతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న హోంమంత్రి.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్) శాంతి ర్యాలీకి మహిళా కమిషన్ పిలుపు ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మికి నివాళి అర్పిస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. వరలక్ష్మికి మద్దతుగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. -
40 లక్షల అప్పు.. బాలుడి కిడ్నాప్
సాక్షి, విశాఖపట్నం : గాజువాక ఆటోనగర్లో బాలుడి కిడ్నాప్ ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. రాజస్తాన్కు చెందిన నరేష్ యాదవ్ విశాఖకు వలస వచ్చి పరిశ్రమ నడుపున్నారు. వ్యాపారం నిమిత్తం ఓ వ్యక్తి వద్ద ఇటీవల 40 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే లాక్డౌన్, కరోనా వైరస్ కారణంగా అప్పు తిరిగి చెల్లించడంలో కొంత ఆలస్యమైంది. ఈ క్రమంలోనే డబ్బు తిరిగి చెల్లించాలని వ్యాపారి తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. అయినప్పటికీ నరేష్ చెల్లించకపోవడంతో.. అతని ఆరేళ్ల కుమారుడిని ఆదివారం ఉదయం కిడ్నాప్ చేశాడు. వెంటనే తండ్రి నరేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గంట వ్యవధిలోనే కేసును ఛేదించారు. దుండుగుల నుంచి బాలుడిని క్షేమంగా తీసుకువచ్చారు. ఐదుగురుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్
-
గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, విశాఖపట్నం : గాజువాక ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ, సీఎస్ని ఆదేశించారు. బాధితురాలు వరలక్ష్మి కుటుంబసభ్యులకు 10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్లను సీఎం జగన్ ఆదేశించారు. విద్యార్థినులందరూ దిశా యాప్ను డౌన్లోడ్ చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ప్రేమోన్మాదం ఓ యువతి ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్న వరలక్ష్మి (17) అనే యువతిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్సాయి వెంకట్(21) ప్రేమ పేరుతో వేధించేవాడు. శనివారం రాత్రి రాము అనే స్నేహితుడితో కలిసి ఆమెకు ఫోన్చేసి సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్సాయిని నిలదీయగా.. మాట్లాడాలి రా అంటూ తుప్పల్లోకి లాక్కెళ్లాడు. అక్కడి పరిస్థితిని చూసిన వరలక్ష్మి ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్ చేసి చెప్పగా.. కోపోద్రిక్తుడైన అఖిల్సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికాడు. హోం మంత్రి మేకతోటి సుచరితకు ఆదేశం.. ఘటన తెలిసిన వెంటనే ఆదివారం ఉదయం సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి సీఎం జగన్ వివరాలను తెలుసుకున్నారు. వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్ను ఆదేశించారు. ప్రతి టీనేజ్ బాలిక మొదలు ప్రతి మహిళ వరకు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా వారిని ఎడ్యుకేట్ చేయాలన్నారు. ప్రత్యేకించి పాఠశాలల్లో చదువుతున్న బాలికలు మొదలు కాలేజీ విద్యార్థినుల వరకు వందకు వంద శాతం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని బాలిక లేదా మహిళ ఏదైనా సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్గా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. కాగా ఘటనలో ప్రధాన నిందితుడు అఖిల్సాయి ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదువుతున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రేమోన్మాది అఖిల్ సాయి, రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల్సాయి - రాముతో వరలక్ష్మికి ఉన్న సాన్నిహిత్యంపై విచారణ చేపడుతున్నారు. రాముతో సాన్నిహిత్యంగా ఉండటంతో అఖిల్ వరలక్ష్మిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వరలక్ష్మి హత్యకేసులో లోతుగా విచారణ చేపట్టాము. నిందితుడు అఖిల్ సాయి పై దిశా చట్టం పై కేసు నమోదు చేశాము. వారం రోజుల్లో చార్జిషీట్ కూడా దాఖలు చేస్తాము. ప్రేమ వ్యవహారంలో దారి తప్ప డమే హత్యకు కారణంగా అనుమానం ఉంది. త్వరలో విశాఖ వ్యాప్తంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా -
ప్రేమోన్మాది ఘాతుకం
-
గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం/గాజువాక: ప్రేమోన్మాదం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్న వరలక్ష్మి (17) అనే యువతిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్సాయి వెంకట్(21) ప్రేమ పేరుతో వేధించేవాడు. శనివారం రాత్రి రాము అనే స్నేహితుడితో కలిసి ఆమెకు ఫోన్చేసి సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్సాయిని నిలదీయగా.. మాట్లాడాలి రా అంటూ తుప్పల్లోకి లాక్కెళ్లాడు. అక్కడి పరిస్థితిని చూసిన వరలక్ష్మి ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్ చేసి చెప్పగా.. కోపోద్రిక్తుడైన అఖిల్సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికాడు. చెల్లెలు ఏదో ప్రమాదంలో చిక్కుకుని ఉంటుందని భయపడిన ఆమె అన్న తండ్రి గురునాథరావుతో కలిసి ద్విచక్ర వాహనాలపై హుటాహుటిన వెళ్లగా.. ఆ యువతి ఆలయ మెట్లపై రక్తపు మడుగులో కనిపించింది. అప్పటికే రాము పరారయ్యాడు. మెట్లు దిగి వస్తున్న అఖిల్సాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొనఊపిరితో ఉన్న యువతిని కారులో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రధాన నిందితుడు అఖిల్సాయి ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదువుతున్నాడు. మరో నిందితుడు రాము డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. హతురాలు వరలక్ష్మి తండ్రి గురునాథరావు స్థానికంగా ట్రాన్స్పోర్టు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. -
చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి
-
విశాఖలో డాక్యుమెంట్ రైటర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : గాజువాక రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడిన ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ మొదలవలస కృష్ణరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తనకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగుల అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గాజువాక రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగి విజయ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధుర వలస కృష్ణారావు అనే ఈ డాక్యుమెంట్ రైటర్ గత కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బందిని బెదిరించి తనకు త్వరితగతిన పనులు చేసుకునే రకంగా ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది. (సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం:) తాజాగా తనను కూడా కులం పేరిట దూషించినట్లు విజయ పేర్కొంది. తనను మాత్రమే కాకుండా కార్యాలయంలోని పలువురిని కృష్ణారావు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు డాక్యుమెంట్ రైటర్ కృష్ణారావును అరెస్టు చేసి అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగులపై బెదిరింపులు, అక్రమార్జన తదితర ఆరోపణల మేరకు కృష్ణారావుపై విచారణ కొనసాగిస్తామని డీసీపీ క్రైమ్ వి. సురేష్ బాబు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడిన కృష్ణ రావు అరెస్టు పట్ల ప్రజా సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాకగత కొన్నేళ్లుగా గాజువాక కేంద్రంగా అతను భారీగా అక్రమార్జన చేశారని దీనిపై కూడా లోతుగా విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.(‘వారికి అన్యాయం జరిగితే ఉపేక్షించం’) -
భారీ పరిశ్రమలపై కరోనా ప్రభావం
-
టౌన్ ప్లానింగ్పై ఏసీబీ పంజా
మంగళవారం ఉదయం 10.30 గంటల సమయం..గాజువాకలోని జీవీఎంసీ జోన్–5 కార్యాలయంలో అప్పుడప్పుడే కార్యకలాపాలు మొదలవుతున్నాయి. అదే సమయంలో ఒక్కసారిగా పది మంది వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఉద్యోగుల నుంచి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు మొదలుపెట్టారు.అదే సమయానికి.. మధురవాడలోని జోన్–1 కార్యాలయంలోనూ అదే సీన్.అవినీతి ప్లానింగ్తో నగరపాలనను గాడి తప్పిస్తున్న జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ డీఎస్పీలు షకీలాభాను, రంగరాజుల ఆధ్వరం్యలో రెండు బృందాలు గాజువాక, మధురవాడ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. రెండు చోట్లా టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఈ సోదాలు కేంద్రీకృతం కావడం విశేషం.తనిఖీ బృందాలు ఫైళ్లు, రికార్డులు పరిశీలించడంతో సరిపెట్టకుండా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నుంచి చైన్మన్ వరకు.. అలాగే ఆ సమయంలో అక్కడ ఉన్న బయటి వ్యక్తులను తరచి తరచి ప్రశ్నించారు. వారిలో కొందరు అనధికార ఉద్యోగులుగా చెలామణీ అవుతున్న విషయాన్ని గుర్తించారు. కాగా మధురవాడ జోనల్ కార్యాలయంలో ఒక అనధికార మహిళా ఉద్యోగి వద్దటౌన్ ప్లానింగ్ సిస్టమ్కు చెందిన పాస్వర్డ్ ఉన్న విషయం సోదాల్లో వెలుగు చూసింది. బిల్డింగ్ ప్లాన్లకు అనుమతుల జారీలో కొన్ని ఉల్లంఘనలు సైతం ఏసీబీ అదికారులు దృష్టికి వచ్చాయి. విశాఖపట్నం, మధురవాడ (భీమిలి): భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరులో నిబంధనలు తుంగలో తొక్కేయడం... నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘించినా చూసీచూడనట్లు వ్యవహరించడం... అధ్వానంగా రికార్డుల నిర్వహణ, అనధికార నిర్మాణాలు కట్టడిచేయలేకపోవడం... ఇలా ఒక్కటేమిటి అన్నింటా జీవీఎంసీ జోన్–1 కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సి బ్బంది అవకతవకలకు పాల్పడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏసీబీ అధికారులు తేల్చారు. మధురవాడలోని జోనల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు జెడ్సీ రాము సమక్షంలోను, వేర్వేరుగా స్థానిక అధికారులను ప్రశ్నించారు. అనంతరం బీరువాలు, రికార్డులు పరిశీలించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం మంగళవారం సాయంత్రం వరకూ సోదాలు జరుగుతుండగా ప్రాథమిక సమాచారాన్ని డీఎస్పీ రంగరాజు మీడియాకి తెలిపారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో, ప్లాన్లు అమోదించడంలో జరుగుతున్న అవకతవకలు పరిశీలించాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది రికార్డులు సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. అనధికార నిర్మాణాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని, పరిశీలించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని గుర్తించామన్నారు. ఈ డీవియేషన్స్ టీపీఎస్, టీపీవో, ఏసీపీ... ఇలా అన్ని స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా నాన్ ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ రికార్డుల నిర్వహణ, టీడీఆర్ ఇవ్వడం వంటి వాటిలో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని తెలిపారు. అలాగే ఇక్కడ అత్యంత రహస్యంగా ఏసీపీ మాత్రమే ఉపయోగించాల్సిన డాంగిల్, పాస్వర్డ్ ఓ అనధికార మహిళకు అప్పగించి పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. చివరకు అత్యంత ముఖ్యమైన ఆర్టీఐ రిజిస్టర్ కూడా సక్రమంగా నిర్వహించలేదని చెప్పారు. ఆరిలోవ ఇందిరానగర్లో ఓ భవనంలో మూడు ప్లాట్ల నిర్మాణానికి అనుమతి తీసుకుని 8 ప్లాట్స్ నిర్మిస్తున్నట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చామని, దానిపై కూడా విచారణ సాగుతుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు సిఫార్స్ చేస్తామని తెలిపారు. ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఆఫీసులో, మరో ఇన్స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో విచారణ సాగిస్తున్నామని తెలిపారు. జోన్–5లోనూ విస్తృత సోదాలు గాజువాక: జీవీఎంసీ జోన్ – 5 (గాజువాక జోన్) కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు, సిబ్బంది మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఒక్కసారిగా పది మంది ప్రవేశించి విభాగంలోని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగించారు. ఏసీబీ అడిషినల్ ఎస్పీ షకీలాభాను, సీఐ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన అధికారులు టౌన్ప్లానింగ్ విభాగంలోని ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ ఫైళ్లకు సంబంధించిన అనుమతుల్లో చోటుచేసుకున్న జాప్యంపై విభాగం అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సహాయ ప్లానింగ్ అధికారి అమర్నాథ్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వెంకటరావు, గోపన్నలను వివిధ అంశాలపై విచారించారు. గుమస్తాలను విచారించడంతోపాటు వారి వద్ద ఉన్న నగదు సైతం పరిశీలించారు. అనంతరం ఆ వివరాలను నమోదు చేశారు. విభాగంలో అనధికారికంగా పని చేస్తున్న వ్యక్తుల వివరాలు సేకరించారు. విభాగంలో అప్పటికే ఉన్న బయటి వ్యక్తులను ప్రశ్నించారు. సమస్యలుంటే తమతో చెప్పాలని ఏసీబీ అధికారులు కోరడంతో పలువురు తమ సమస్యలను వివరించారు. అనంతరం జోన్లో చోటు చేసుకొంటున్న అనధికార నిర్మాణాలపై చైన్మ్యాన్లను ప్రశించారు. పలు వార్డుల్లో పర్యటించి వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నుంచి పలు వివరాలు సేకరించారు. టౌన్ప్లానింగ్ సిబ్బంది హాజరు, సర్వీస్ రిజిస్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడిషినల్ ఎస్పీ షకీలాభాను మాట్లాడుతూ అనధికార వ్యక్తుల నుంచి రూ.29వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యాలయం పరిధిలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇద్దరు అనధికార కంప్యూటర్ ఆపరేటర్లు కార్యాలయంలో పనిచేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా దాడులు టౌన్ప్లానింగ్ విభాగంపై ఏసీబీకి వరుసగా అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. గాజువాక జోన్లో ఈ ఫిర్యాదులు మరింత వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వనిదే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలేదని, అనధికారిక నిర్మాణాల్లో చైన్మ్యాన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని, డబ్బులు వసూలు చేసి అనుమతిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ అంశాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. -
గాజువాకలో జనసేనకు షాక్
సాక్షి, విశాఖపట్నం: సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల పార్టీని వీడగా తాజాగా విశాఖపట్నానికి చెందిన మరో నాయకుడు జనసేనకు గుడ్బై చెప్పారు. గాజువాక సీనియర్ నాయకుడు కరణం కనకారావు బుధవారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనకారావును పార్టీ కండువాతో సాదరంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆహ్వానించారు. కనకారావుతో పాటు 200 మంది జనసైనికులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజవర్గాల నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణ జనసేన తరపున విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నందుకు నిరసనగా ఇటీవల జనసేన పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారు. (చదవండి: జనసేనకు గట్టి షాక్.. ‘జేడీ’ ఔట్) -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి పండుగ సీజన్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్పై అధికారులు కొరడా ఝళిపించారు. గాజువాక సమీపంలోని అగనంపూడి టోల్గేట్ వద్ద ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించారు. ప్రవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేశారు. మొత్తం 59 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఐదు బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు. -
తోడు పోయింది.. గూడు చెదిరింది..!
సాక్షి, గాజువాక : విధి ఎప్పుడు ఎవరిపై కర్కశంగా కక్ష వహిస్తుందో అంతుచిక్కదు. ఎప్పుడే తీరున వేటు వేస్తుందో అర్థం కాదు. విధి వికృత లీల కారణంగా అప్పటి వరకూ సంతోషంగా సాగుతున్న కుటుంబాన్ని ఒక్కసారిగా పెను విషాదం కాటేస్తుంది. అనుకోని దుర్ఘటన తుపానులా విరుచుకుపడి సాఫీగా సాగుతున్న కుటుంబ నౌక తలకిందులవుతుంది. అటువంటి విషాదకర సంఘటనే గురువారం సంభవించింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భర్తకు డయాలసిస్ చేయించేందుకు తోడుగా వెళ్తున్న మహిళను కావేరి ట్రావెల్స్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ ప్రమాదం కారణంగా ఆమె భర్త గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊహించని ఈ ఉపద్రవంతో వారి పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గాజువాకలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ బస్సు ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన సమాచారం ప్రకారం... దువ్వాడ వీఎస్ఈజెడ్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న దీపక్ వల్లభ మాండవ్య పాతకూర్మన్నపాలెం జంక్షన్లోని విజయ టవర్స్లో నివాసముంటున్నారు. అతనికి కిడ్నీలో సమస్య తలెత్తడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రోజూ డయాలసిస్ చేయించుకొంటున్నారు. దీని కోసం ఆస్పత్రికి రోజూ కారులో వెళ్తున్న దీపక్ గురువారం మాత్రం తన భార్య కీర్తి మాండవ్య (47)తో కలిసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. జాతీయ రహదారిపై శ్రీనగర్ జంక్షన్ తరువాత వెనుక నుంచి వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు దీపక్ నడుపుతున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో కీర్తి మాండవ్య రోడ్డును ఢీకొనడంతో తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. (చదవండి: ప్రాణాలు కాపాడిన అపరిచిత వ్యక్తి ఫోన్కాల్) దీపక్ ఎడమచేతికి, ముఖానికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీపక్ ప్రస్తుతం నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు గాజువాక సీఐ సూరినాయుడు తెలిపారు. మృతురాలికి ఒక పాప (16), బాబు (11) ఉన్నారు. తల్లిని కోల్పోయి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాను పిల్లల యోగక్షేమాలు ఎలా చూసుకోగలనని దీపక్ విలపిస్తున్న తీరు చూపరులను కలచివేస్తోంది. ఏఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పెళ్లి.. విషాదాంతం
రాత్రి ఇద్దరూ వివాహ కార్యక్రమానికి వెళ్లివచ్చారు.. తెల్లారేసరికి విగత జీవులై జంటగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న ఓ యువజంట విషాదాంతం గాజువాకలో కలకలం రేపింది. గాజువాక హైస్కూల్ రోడ్డులోని పెంటయ్యనగర్కు చెందిన నరేంద్రకుమార్, ఢిల్లీశ్వరి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ జనవరిలో ఒక్కటయ్యారు. ప్రేమ పోరాటంలో గెలిచిన ఈ జంట.. జీవిత పోరాటంలో మాత్రం ఓడిపోయారు. ఆర్థిక ఇబ్బందులే వీరిని విధి చేతిలో ఓటమిపాల్జేశాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఢిల్లీశ్వరీకి ఇటీవల గర్భస్రావం అయ్యిందని.. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం బాగోటం లేదని.. అదే వారి ఆత్మహత్యకు కారణం కావచ్చన్న మరో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రేమను గెలిపించుకోవడానికి ఇరు కుటుంబాల పెద్దలను ఎదిరించి.. దూరప్రాంతానికి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఈ రెండు కారణాలతోనే ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలోనూ కేసును పరిశీలిస్తున్నారు. సాక్షి, గాజువాక: పెద్దలను ఎదిరించి ప్రేమను గెలిపించుకున్న ఓ యువజంట జీవితంలో ఓడిపోయింది. కులాంతర వివాహం చేసుకొని తమ ధైర్యాన్ని చాటిన ఆ దంపతులు జీవించడంలో మాత్రం పిరికితనం ప్రదర్శించారు. ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చిన కొద్ది గంటలకే ఆ దంపతుల చావు కబురు తెలియడంతో వారి కుటుంబ సభ్యలు తల్లడిల్లిపోయారు. పోలీసులు, స్థానికు ల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాజువాక హైస్కూల్ రోడ్లోని పెంటయ్యనగర్కు చెందిన సేనాపతి నరేంద్రకుమార్(22), పుట్టేపు ఢిల్లీశ్వరి(19) ప్రేమించుకొని ఈ ఏడాది జనవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి తొలుత పెద్దలు అంగీకరించకపోవడంతో ఒంగోలుకు పారిపోయి అక్కడ వివాహం చేసుకున్నారు. అక్కడే ఢిల్లీశ్వరికి గర్భస్రావమైందని తెలుసుకున్న పెద్దలు రెండు నెలల క్రితం వారిని ఇక్కడికి తీసుకొచ్చి తమ ఇళ్లకు సమీపంలోనే మరో ఇంట్లో కాపురం పెట్టించారు. నరేంద్రకుమార్ గాజువాక ఆటోనగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారని అందరూ అనుకొంటున్న సమయంలో వారు ఆత్మహత్య చేసుకోవడంతో గాజువాకలో విషాదం చోటుచేసుకుంది. రోదిస్తున్న మృతుల బంధువులు ఆత్మహత్యపై భిన్న కథనాలు యువ జంట ఆత్మహత్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు కొంతమంది.. ఆమెకు అనారోగ్యం కారణంగానే ఇద్దరూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు మరికొంతమంది బంధువులు చెబుతున్నారు. ఈ జంటకు చెందిన బంధువులు ఆర్థికంగా అంత పరిపుష్టి కలిగినవారు కాదు. ఢిల్లీశ్వరి తల్లితండ్రులు పండ్ల వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. నరేంద్ర కుమార్కు తండ్రి లేరు. తల్లి, ఒక సోదరి ఉన్నారు. ఆమె ఇటీవల వార్డు వలంటీర్గా ఎంపికైంది. దీంతో పెద్దలు వారిని ఆర్థికంగా ఆదుకొనే పరిస్థితి లేదు. ఆటోనగర్ కంపెనీలో వస్తున్న కొద్దిపాటి జీతం తమ అవసరాలకు సరిపోవడంలేదని, దీంతో భవిష్యత్పై బెంగతో ఈ పని చేసి ఉండవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీశ్వరికి గర్భస్రావమైన తరువాత ఆమె ఆరోగ్యం బాగోవడం లేదని అంటున్నారు. ఈ కారణంతో ఇద్దరూ ప్రాణాలను తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండూ కాకుండా వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం. పెద్దల నుంచి ఇబ్బందులేమైనా? ఉన్నాయా? అన్న కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కటవ్వడం కోసం పెద్దలనే ఎదిరించిన ఆ జంటకు ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టమేమొచ్చిందంటూ స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అన్యోన్యంగా ఉన్న యువ దంపతులు గురువారం రాత్రి కూడా ఒక స్నేహితుడి వివాహానికి వెళ్లినట్టు బంధువులు చెబుతున్నారు. వివాహం చూసుకొని రాత్రి తిరిగి వచ్చిన తరువాత తెల్లవారేసరికి ఇంతటి అఘాయిత్యం చేసుకోవడం ఎవరికీ మింగుడుపడటం లేదు. ప్రతిరోజు ఉదయం 6 గంటలలోపే ఇంటి బయటకు వచ్చి సందడి చేసే ఆ దంపతులు విగతజీవులుగా పడి ఉండడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్యమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా వంటి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.ఈ విషయాన్ని గాజువాక సీఐ సూరినాయుడు వద్ద ప్రస్తావించగా, ఇప్పటి వరకు తమకు కూడా ఎటువంటి నిర్ధిష్టమైన సమాచారం లభించలేదన్నారు. ఈ విషయాలపై దర్యాప్తులో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: ఒకే ఫ్యాన్కు ఉరేసుకున్న దంపతులు
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి విహహం చేసుకున్న జంట ఆశలన్నీ కొంత కాలంలోనే ఆవిరైపోయాయి. నూతన దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గాజువాక పెంటయ్యనగర్కు చెందిన నరేంద్రకుమార్, దిల్లేశ్వరి తల్లిదండ్రులకు తెలియకుండా గత జనవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. ఒంగోలులో వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ఆటోనగర్లో ప్రైవేటు ఉద్యోగం చేసే నరేంద్రకుమార్ జీతం అంతంతమాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్వల్ప వివాదాలు చేటుచేసుకున్నాయి. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన దంపతులు శుక్రవారం ఒకే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సరిపడా ఆదాయం రావట్లేదని, భవిష్యత్తుపై బెంగతో చనిపోయినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. అయితే గత రెండు నెలల నుంచి ఈ జంట తిరిగి గాజువాకలో నివసిస్తున్నట్లు వారి తల్లిదండ్రులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘ఆ ఘనత ఆయనకే దక్కుతుంది’
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాజువాకలో వైఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ స్టీల్ సిటీ డిపోలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పేద,బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలని కార్మికులకు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. -
గాజువాకలో జనసేనకు భారీ ఝలక్
సాక్షి, విశాఖ : జనసేన పార్టీకి షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు జనసేనను వీడుతున్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ పార్టీని వీడితే తాజాగా గాజువాకలోనూ ఆ పార్టీ నేత, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన నిన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు లేఖ రాశారు. గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తాను గత 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలతో పాలు పంచుకుంటూ అయిదేళ్లుగా శాసనసభ్యుడిగా పని చేసి... ప్రజలందరికి అనునిత్యం చేదోడు వాదోడుగా ఉన్నాను. భవిష్యత్లో కూడా రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కార్యకర్తల, శ్రేయోభిలాషుల కోరిక మేరకు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెంకట్రామయ్య తెలిపారు. ఇంతవరకూ తనపై చూపిన అదరాభిమానాలకు కృతజ్ఞుడినని ఆయన అన్నారు. ఇక చింతలపూడి వెంకట్రామయ్య రాజీనామాతో గాజువాకలో జనసేన పార్టీ ఖాళీ అయినట్లే. కాగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్బై చెప్పారు. వీరి బాటలోనే మరికొందరు నడవనున్నట్లు సమాచారం. -
కూలిన వినాయకుడి మండపం
సాక్షి, విశాఖపట్నం: వినాయక చవితి పురస్కరించుకుని భారీ వినాయక విగ్రహం ఏర్పాటులో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గణనాథుడి మండపం కుప్పకూలిన ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది.సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా నాతయ్యపాలెంలో 70 అడుగుల గణనాథుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా అతి పెద్ద మండపాన్ని నిర్మించి అందులోనే విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. ఇందుకోసం గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలితో పాటు భారీ వర్షం కారణంగా మండపం పేకపేడలా కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సుమారు రూ.15 లక్షలతో నెల రోజులుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఎన్నికల తర్వాత పత్తాలేని ‘పవనం’
గెలిచినా ఓడినా గాజువాకను వదిలేది లేదు.. నెలలో కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను.. ఎన్నికల ముందు రాష్ట్రమంతటా తిరగాల్సి రావడంతో గాజువాకకు తక్కువగా వచ్చాను.. ఇకపై తరచూ వస్తాను.... ఇది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఓ పత్రికలో ఇదే సారాంశంతో వాణిజ్య ప్రకటన విడుదల చేశారు.. ఓడిపోయినప్పటికీ నాకు ఓట్లేసిన గాజువాక ప్రజలను త్వరలోనే కలుసుకుంటానని ప్రకటించారు. ఇవి జరిగి దాదాపు మూడు నెలలైంది. జనసేన ‘పవనం’ పత్తా లేదు. గాజువాక వైపు అస్సలు చూడలేదు సరికదా.. ఎక్కడా ఆ ఊసే ఎత్తలేదు. గాజువాకతో పాటు పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గానికి మాత్రం పవన్కల్యాణ్ వెళ్లారు. ముందుగా అక్కడి శ్రేణులను విజయవాడ పిలిపించుకుని మాట్లాడారు కూడా.. అయితే గాజువాకకు రాకుంటే రాకపోయె.. కనీసం ఇక్కడి నేతలనైనా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. తన కోసం గాజువాక సీటు త్యాగం చేసి.. పెందుర్తికి తరలిపోయిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యను కూడా ఇంతవరకు పవన్ పలకరించలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గాజువాకను ‘గ్లాసు’వాక చేసేస్తామంటూ ఎన్నికల ముందు జనసేన శ్రేణులు ఉబలాటపడిపోయారు.పవన్ కల్యాణ్ సినిమా క్రేజ్ చూసి గాజువాకలో గెలుపుపై లెక్కలు వేసుకున్నారు. అభిమానుల హడావుడి అలా ఉంటే.. పవన్ కల్యాణేమో కుల లెక్కలు.. 2009లో పీఆర్పీ అభ్యర్ధిగా చింతలపూడి వెంకట్రామయ్య అనూహ్య గెలుపును గుర్తుచేసుకొని.. ఆశల గుర్రంపై ఊరేగుతూ గాజువాకకు అర్ధంతరంగా దిగుమతైపోయారు. అయితే అక్కడి ప్రజలు ఫలితాల రూపంలో ఆయనకు చుక్కలు చూపించారు. భారీ ఓట్ల తేడాతో పరాజయం రుచి చూపించారు. ఈ ప్రాంతంతో ఎటువంటి అనుబంధం లేకుండా.. ఇక్కడి సమస్యలపై ఏమాత్రం అవగాహన చేసుకోకుండా.. ఎన్నికల ప్రచారానికే సరిగ్గా రాకుండా.. ఇక్కడే ఉంటానని అద్దెకు తీసుకున్న ఇంట్లో ఒక్కరోజు కూడా బస చేయని పవన్ కల్యాణ్ విషయంలో గాజువాక ప్రజ సరైన తీర్పునిచ్చింది. భీమవరంలో కంటే కూడా ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించింది. ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పవన్కల్యాణ్ గాజువాక ప్రజలనుద్దేశించి ఓ వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే గాజువాక వచ్చి తనకు ఓట్లేసిన వారిని కలుసుకుంటానని ప్రకటించారు. ఆ మేరకు వస్తారని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆశించారు. కానీ ఫలితాలు వచ్చి దాదాపు మూడు నెలలు కావొస్తున్నా ఆయనగారి జాడ లేకపోవడంపై జనసేన వర్గాల్లోనే చర్చకు దారితీసింది. అడపాదడపా జేడీ పర్యటన.. ఇక విశాఖ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన జేడీ అలియాస్ వీవీ లక్ష్మీనారాయణ మాత్రం అడపాదడపా నగర వాసులకు కనిపిస్తున్నారు. గాజువాకలో అధినేత పవన్కల్యాణ్ తీసుకున్న అద్దె ఇంటితో సహా పార్టీ కార్యాలయాల్లో చాలావరకు మూతపడిన నేపథ్యంలో జేడీ పర్యటనలు మాత్రం అడపాదడపా కొనసాగుతున్నాయి. అయితే జేడీని పార్టీ పొలిట్బ్యూరోలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పొలిట్ బ్యూరోలో జేడీ కంటే అర్హులెవరంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇక జనసేనకు జేడీ దూరమంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై జేడీనే ఘాటుగా స్పందించడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ఇప్పుడు విషయమేమిటంటే.. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ను అభినవ వివేకానందుడితో పోల్చిన జేడీ.. పోటీ చేసి ఓడిపోయిన గాజువాకను కనీసంగా కూడా తలవని పవన్ నిర్వాకంపై ఎటువంటి అభిప్రాయం వెల్లడిస్తారన్నదే జిల్లా జనసేన నేతలు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు గాజువాక గురించి ప్రస్తావించని పవన్ తీరుతో జేడీ, జనసేన నేతలేమో గానీ క్యాడర్ మాత్రం తల పట్టుకుంటోంది. ఇప్పటివరకు ఆ ఊసెత్తని పవన్.. దారుణ పరాభవంతో కొద్దిరోజులు బయటకు రాని పవన్కల్యాణ్.. ఆ తర్వాత విజయవాడ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల వారీగా భేటీ అవుతూ వచ్చారు. ఆ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో తాను పోటీ చేసిన భీమవరం శ్రేణులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత స్వయంగా భీమవరంలో పర్యటించారు. వివిధ నియోజకవర్గాల శ్రేణులతోనూ సమావేశమవుతూ వస్తున్నారు. కానీ భీమవరంతో పాటు పోటీచేసి ఓడిపోయిన గాజువాక గురించి మాత్రం ఇప్పటివరకు ఆయన పెదవి విప్పలేదు. ఫలానా సమయంలో రావొచ్చని కానీ, అసలు వస్తానని గానీ పార్టీ నేతలకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదు. పోనీ రాకుంటే రాకున్నారు.. కనీసం గాజువాక నేతలను, కార్యకర్తలను విజయవాడకు పిలిపించి మాట్లాడారా.. అంటే అదీ లేదు. భీమవరం నేతలను, శ్రేణులకు పిలిపించి మాట్లాడి.. ఆ తర్వాత అక్కడి వెళ్ళిన పవన్కు గాజువాక మీద ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోందని స్వయంగా జనసేన నేతలే మధనపడుతున్నా బహిరంగంగా అనలేక నోరునొక్కుకుంటున్నారు. అంతెందుకు తన కోసం గాజువాక సీటు వదిలి.. పెందుర్తికి వెళ్ళి నష్టపోయిన గాజువాక తొలి ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యను కూడా ఇంతవరకు పవన్ పలకరించలేదంటేనే ఇక... ఆ పార్టీ శ్రేణుల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. -
కలలు చెదిరి..కన్నీళ్లు మిగిలి..
సాక్షి, గాజువాక: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి దుర్మరణం పాలవడంతో గాజువాకలో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఇంటికి తిరిగొస్తానని చెప్పిన ఆ వ్యక్తి మృతి చెందినట్టు కబురు రావడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. వివరాలిలా ఉన్నాయి. పాతగాజువాక దరి టీవీఎన్ కాలనీకి చెందిన కె.సూర్యనారాయణ(45) ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం మలేషియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో వెల్డర్గా పని చేస్తున్నాడు. వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి రాకుండా అక్కడే మరో కంపెనీలో ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించాడు. పని దొరక్కపోవడంతో తాను తిరిగి వచ్చేస్తానని భార్య జయకు ఫోన్ చేసి చెప్పాడు. తనవద్ద డబ్బులు లేవని, డబ్బులు పంపిస్తే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె తనకు తెలిసివారి వద్ద రూ.30వేలు అప్పు చేసి భర్త అకౌంట్లో జమ చేసింది. డబ్బులు అందుకున్న సూర్యనారాయణ ఇక బయల్దేరడమే తరువాయి అని భార్యకు చెప్పాడు. భర్త రాక కోసం ఎదురుచూస్తున్న జయకు అతడు బాత్ రూమ్లో కాలుజారి పడిపోవడంతో మృతి చెందినట్టు సమాచారం అందింది. సూర్యనారాయణతో పాటు అదే రూమ్లో ఉంటున్నవారు ఈ విషయాన్ని ఆమెకు ఫోన్లో చెప్పారు. వీసా గడువు ముగియడంతో మృతదేహం పంపేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఏడాదిన్నర క్రితం అతడు ఉపాధి కోసం విజిటింగ్ వీసాపై వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వీసా గడువు ముగియడంతో మృతదేహం విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కాలేదు. దీంతో తన భర్త మృతదేహాన్ని రప్పించాలని మృతుని భార్య జయ వేడుకుంటోంది. మృతునికి భార్యతో పాటు లోకేష్, ఉదయ్కుమార్ అనే ఇద్ద కుమారులున్నారు. తండ్రి మరణంతో వారు పెద్ద దిక్కును కోల్పోయారు. జీవితంపై ఎన్నో కలలు కన్న ఆ కుటుంబానికి చివరికి కన్నీళ్లు మిగిలాయి. వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శ సూర్యనారాయణ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకుడు తిప్పల దేవన్రెడ్డి.. టీవీఎన్ కాలనీలోని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు తెలియజేసి మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులతో కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. మృతదేహాన్ని పంపించడానికి వారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా దేవన్రెడ్డి తెలిపారు. మృతుని కుటుంబాన్ని మాజీ కార్పొరేటర్ ఉరుకూటి అప్పారావు, వైఎస్సార్సీపీ నాయకులు ఉరుకూటి చందు, దొడ్డి రమణ తదితరులు పరామర్శించారు. -
నన్ను అసెంబ్లీకి అడుగుపెట్టనీకుండా కుట్ర...
సాక్షి, అమరావతి: తాను జీవితాంతం రాజకీయాల్లోనే కొనసాగుతానని, ఇక నుంచి కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన శవాన్ని నలుగురు మోసుకు వెళ్లే వరకూ తాను జనసేనను మోస్తూనే ఉంటానని అన్నారు. తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని, విజయం సాధించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ పరమైన సమీక్షల్లో భాగంగా ఆయన నిన్న విశాఖ జిల్లాకు చెందిన జనసేన అభ్యర్థులతో మంగళగిరిలోని తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. అనంతరం గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.పవన్ అనే వ్యక్తిని అసెంబ్లీ అడుగు పెట్టనివ్వకూడదనే లక్ష్యంతో ప్రత్యర్థులు పని చేశారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ ప్రజా తీర్పును గౌరవిద్దాం’ అన్నారు. కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేసి పవన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
జనసేనానికి షాక్.. రెండు స్థానాల్లోనూ వెనుకంజ!
సాక్షి, అమరావతి : ‘గాజు గ్లాసు మాది నిర్ణయం మీది అంటూ’.. తొలిసారి ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఊహించిన షాక్ తగిలింది. మార్పు కోసం ఓటేయండి అన్న జనసేనాని మాటలను ఆంధ్రప్రజలు తిరస్కరించారు. సర్వే చేయించుకొని మరి తన గెలుపుకు అనువైన రెండు స్థానాలు భీమవరం, గాజువాకలో పోటీచేసిన పవన్ కల్యాణ్కు ఆ రెండు చోట్ల గట్టి ఎదురుదెబ్బే తగిలింది. రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తేయ్యే సరికి జనసేనాని ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు. భీమవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డిలు ముందంజలో ఉన్నారు. ఈ ఇద్దరు భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. వైఎస్ జగన్ చరిష్మా ముందు పవన్ స్టార్డమ్ కొట్టుకుపోయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ జోరు కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. -
గబ్బర్సింగ్ ఎక్కడ?
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: మీరు ఎండలో మాడిపోతుంటే నేనూ మీతో పాటే మాడిపోతాను కానీ.. రూముల్లో కూర్చోను.మీరు వర్షంలో తడుస్తుంటే నా గొడుగు విసిరేసి నేనూ మీతోనే ఉంటా.. ఎలక్షన్ల కోసమే రాజకీయాలు కాదు.. ప్రజాసమస్యలపై పోరాడటం కోసమే నేను జనసేన పార్టీ పెట్టాను.. రాజకీయాలు మార్చేస్తాను.. ఇవన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు.. సరిగ్గా చెప్పాలంటే పోలింగ్ కు ముందు వీరావేశంతో వల్లించిన డైలాగులు. పవన్ సినిమాటిక్ డైలాగులకు, చేతలకు ఎంత వ్యత్యాసముందో గాజువాకలో వాస్తవ పరిస్థితులను చూస్తేనే అర్ధమవుతుంది. గాజువాకతో ఎటువంటి సంబంధం లేకపోయినా.. కేవలం కులలెక్కలతోనూ, 2009లో పీఆర్పీ నుంచి చింతలపూడి వెంకట్రామయ్య గెలుపును బేరీజు వేసుకుని పవన్ గాజువాకపై వాలిపోయారు. కనీసం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోనైనా గాజువాక సమస్యలపై దృష్టి పెట్టి ఇక్కడి ప్రజలతో మమేకమవుతారని అభిమానులు, రాజకీయ పరిశీలకులు ఆశించారు. కానీ ఆయన ఇక్కడి ప్రజల సమస్యలపై ఏమాత్రం అవగాహన తెచ్చుకోలేకపోయారు. వేలాది పుస్తకాలు చదివానని గొప్పగా చెప్పుకునే ఆయన గాజువాకలోని ప్రధాన మౌలిక సమస్యల పరిష్కారం గురించి కూడా చెప్పలేకపోయారు. సినీ డైలాగుల మాదిరిగానే ఉద్యోగాల కల్పనపై, సాధ్యం కాని అగనంపూడి రెవెన్యూ డివిజన్ వంటి హామీలు గుప్పించడం తప్పించి సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక ప్రణాళికను కూడా వెల్లడించలేకపోయారు. స్థానికేతర వివాదం తెరపైకి వచ్చినప్పుడు కూడా తాను ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటాననే ప్రకటన కూడా చేయలేకపోయారు. గాజువాక వై జంక్షన్లోని కర్ణవానిపాలెంలో అద్దె ఇల్లు తీసుకున్నానని ఆర్భాటం చేసి ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో బస చేయలేకపోయారు. పోనీ కనీసం గాజువాక మొత్తం కలియతిరిగారా.. ప్రచారమైనా పక్కాగా నిర్వహించారా... అంటే అదీ లేదు. నామినేషన్కు ముందు ఓసారి.. ఆ తర్వాత ఓసారి.. మొత్తంగా మూడుసార్లు మాత్రమే గా>జువాకలో పర్యటించారు. పోలింగ్కు ముందు రోజైనా పవన్ ఇక్కడికి వస్తే బాగుంటుందని అభిమానులు ఆశించినా.. పవన్ అవేమీ లెక్కచేయలేదు. ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించాల్సి వచ్చిన నేపథ్యంలో గాజువాకకు రావడం కుదరలేదేమోనని అభిమానులే పాపం సరిపెట్టుకున్నారు. ఆత్మీయ సమావేశానికీ రాలేదు... ఇక మేడే రోజు పార్టీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికైనా పవన్ వస్తారని అభిమానులు, పార్టీ నేతలు భావించారు. కానీ ఆ సమావేశానికి కూడా డుమ్మా కొట్టి తన సోదరుడు నాగబాబును పంపించారు. ఆ సమావేశంలోనే నాగబాబు శృతిమించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇలా పోటీ చేసి.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయిన అభ్యర్ధి జిల్లాలో మాత్రం పవన్ కల్యాణ్ ఒక్కరే అనడంలో అతిశయోక్తి లేదు. మిగిలిన జనసేన అభ్యర్ధులు కూడా అడపాదడపా కానవొస్తు న్నా... పవన్ మాత్రం ఇంకా సేదతీరుతూనే ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలలో ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటానన్న పవన్ గాజువాకకు వచ్చిన సందర్భంలో ఓసారి పవన్ నెలలో ఎక్కువ రోజులు తాను ఇక్కడే ఉంటానని ప్రకటించారు. కానీ ఎన్నికలైన తర్వాత కనీసం ఒక్కసారి కూడా గాజువాక వైపు కన్నెత్తిచూడకపోవడమే ఇప్పుడు విమర్శలపాలవుతోంది. పోలింగ్కు, కౌంటింగ్కు తక్కువ రోజుల వ్యవధి ఉంటే ఈ తరహా విమర్శలు వచ్చేవి కావు. కానీ మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్కు,. కౌంటింగ్కు 42రోజుల గ్యాప్ వచ్చింది. దీంతో మధ్యలో పవన్ తప్పకుండా గాజువాక వస్తారని భావించారు. పోలింగ్కు ముందు కుదరకపోవడంతో ఆ తర్వాతైనా వచ్చి నియోజకవర్గంలో పర్యటిస్తారని చాలామంది ఆశించారు. పార్టీ శ్రేణులైతే.. నియోజకవర్గ సమీక్ష ఇక్కడే నిర్వహిస్తారని లెక్కలు వేశారు. కానీ పవన్ ఎన్నికల తర్వాత ఎక్కడా గాజువాక ప్రస్తావన కూడా తేలేదు. -
గాజువాక టు హైదరాబాద్
అత్తాపూర్: ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్న ముఠాను ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 132 కిలోల గంజాయి, రూ. 1.85 లక్షల నగదు, ఇండికా కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. గురువారం డీసీపీ ప్రకాష్రెడ్డి, ఏసీపీ అశోక చక్రవర్తి నిందితుల వివరాలను వెల్లడించారు. ధూల్పేటకు చెందిన శుభంసింగ్ (24) విశాఖ జిల్లా గాజువాక నుంచి వెంకట్ అనే వ్యక్తితో గంజాయిని నగరానికి చేరుస్తుంటాడు. శుభంసింగ్కు వరుసకు తమ్ముడు సతీష్సింగ్ (30) ఎలక్ట్రిషన్, నల్లగొండకు చెందిన నరేష్ (29) ట్రాక్టర్ డ్రైవర్, నవీన్(19), ధూల్పేటకు చెందిన సునైనా(18), కార్వాన్కు చెందిన రోహినిదేవి(19) ముఠాగా ఏర్పడి జల్పల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక నుంచి వచ్చిన గంజాయిని ప్యాకింగ్ మెషిన్ల సాయంతో 12 గ్రాముల ప్యాకెట్లను తయారు చేస్తుంటారు. తయారు చేసిన ప్యాకెట్లను నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. పక్కా సమాచారంతో.. గంజాయి సరఫరా జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆరాంఘర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా అంగీకరించారు. దీంతో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యుల నుంచి 132 కిలో గంజాయి, రూ. 1,85,240 నగదు, ఒక ఇండికా కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ ప్రకాష్రెడ్డి, ఏసీపీ అశోక్ చక్రవర్తిలు తెలిపారు. -
నాగబాబు బూతు బుసలు
పనికిమాలిన సన్నాసులు.. అడ్డగాడిదలు.. వెధవలు.. రాస్కెల్స్.. ఒరేయ్..!!ఇవన్నీ జనసేన అధినేత పవన్కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ నరసాపురం లోక్సభ అభ్యర్ధి, సినీ నటుడు.. ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ ఫేమ్ నాగబాబు అలియాస్ నాగేంద్రబాబు నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు..రాజకీయాలన్న తర్వాత విపక్ష, అధికారపక్ష నేతలు మాటలు విసురుకోవడం.. ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం సహజమే.. కానీ ప్రత్యర్థి పార్టీల నేతలనుద్దేశించి నోటికొచ్చినట్టు దారుణమైన పదజాలం వాడిన నాగబాబు వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మేడే సందర్భంగా గాజువాకలో నిర్వహించిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇది జరిగి నాలుగురోజులైనా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ బూతు పురాణంపై వివాదం నలుగుతోంది. విపక్షనేతల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన నాగబాబు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజకీయాల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు, ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజమే. కానీ వ్యక్తిత్వ హననానికి తెగబడుతూ నోటికొచ్చినట్టు బూతుమాటలు, పరుష పదజాలం ఆ మధ్య తెలంగాణ ఎన్నికల్లో కొంత కనిపించింది. కానీ ఏపీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి దాదాపుగా ఎదురుకాలేదు. పవన్కల్యాణ్ ఊగిపోతూ చేసిన ఆవేశపూరిత ప్రసంగాల్లో అరుపులు, కేకల మధ్య అడపాదడపా హద్దులు దాటినా.. అవి పెద్దగా ఎవరికీ వినిపించలేదు. ఎవరూ పట్టించుకోలేదు కూడా. కానీ ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఆయన సోదరుడు నాగబాబు చేసిన దారుణమైన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి. మేడే నాడు.. బుధవారం పవన్కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నాగబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి జేడీ అలియాస్ వీవీ లక్ష్మీనారాయణ సహా జనసేన నేతలంతా హాజరై పవన్కల్యాణ్పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇందులో తప్పేమీ లేదు. ఎవరికీ అభ్యంతరాల్లేవు. వారి అధినేతను వారు ప్రశంసలు, అభినందనలతో ముంచెత్తడం వారిష్టం. కానీ అదే సమావేశంలో పవన్ సోదరుడు నాగబాబు అదుపుతప్పి చేసిన వ్యాఖ్యలు, విపక్ష నేతలనుద్దేశించి పఠించిన తిట్ల పురాణాలపై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబూ.. ఇదేనా జనసేన విలువల రాజకీయం నా తమ్ముడు కల్యాణ్బాబును విమర్శించినోళ్ళు పనికిమాలిన సన్నాసులు, అడ్డగాడిదలు, వెధవలు, రాస్కెల్స్.. అని నాగబాబు నోటికొచ్చినట్టు మాట్లాడారు. విపక్ష పార్టీల తరఫున ప్రచారం చేసిన నటులంతా పెయిడ్ ఆర్టిస్టుగాళ్ళు అని నోరుపారేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే దుమారం రేగుతోంది. సోదరుడిగా పవన్ కల్యాణ్ గురించి నాగబాబు గొప్పగా చెప్పుకున్నారు. తాను ఎలా పోయినా ఫర్వాలేదని, తమ్ముడు పవన్ కల్యాణ్ వందేళ్ళు బతకాలని కోరుకున్నారు. ఇండియాలోనే పవన్ గొప్ప నాయకుడని చెప్పుకున్నారు. ఇలా తన తమ్ముడి గురించి ఎంతసేపు, ఎన్ని మాట్లాడుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ విపక్ష నేతలనుద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడటమే ఇప్పుడు చర్చకు తెరలేపింది. నేను చదువుకున్నాను.. హిస్టరీ స్టూడెంట్ను.. అని అదే ప్రసంగంలో చెప్పుకున్న నాగబాబు విజ్ఞత, సంస్కారం ఇవేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్పై రాజకీయంగా విమర్శలు చేసిన వారికి బదులుగా నాగబాబూ కూడా విమర్శలు చేసుకోవచ్చు. ఆరోపణలు చేయొచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాలు మండిపడుతున్నాయి. రాజకీయాలు మార్చేస్తామంటున్న జనసేన సిద్ధాంతం ఇలా బండబూతులు తిట్టడమేనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నాగబాబూ.. నోరు అదుపులో పెట్టుకో.. ‘చంద్రబాబునాయుడు ప్యాకేజీలకు అమ్ముడుపోయిన మీ తమ్ముడికి, మీకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలను విమర్శించే నైతిక హక్కు లేదు.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్గాంధీ హెచ్చరించారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతే స్పందించిన పవన్ కల్యాణ్, ఆంధ్రాలో నారాయణ, చైతన్య స్కూల్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదని విమర్శించారు. నగరంలోని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో పవన్, వీవీ లక్ష్మీనారాయణ ఓడిపోతారనే భయంతోనే జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్పై పెట్టిన తప్పుడు కేసులేవీ నిలబడవని, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. చంద్రబాబు ప్యాకేజీల కోసమే పవన్కల్యాణ్ ఎన్నికల సీన్లో నటించారని, ఎన్నికల అనంతరం ఏసీ రూమ్ల్లో గడుపుతూ ప్రజాసమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రజాసంకల్పయాత్రలో వేల కిలోమీటర్లు నడిచి అశేష ప్రజాదరణ పొందారని గుర్తుచేశారు. త్వరలో ఆయనను ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని చెప్పారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై జగన్, విజయసాయిరెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేశారని, ఎన్నికల్లో అవకతవకలు, రీ ఎలక్షన్, ఈవీఎంలు, వీప్యాడ్ తదితర వాటిపై పవన్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో రిలీజ్ కాకుండా చంద్రబాబు రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్, చంద్రబాబు, నాగబాబుల విమర్శల తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రామరాజ్యం జగనన్నతోనే సాధ్యమని ప్రజలు భావించి వైఎస్సార్సీపీని ఆదరించారని, అధిక మెజార్టీతో జగన్ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కారుకూతలు మానుకోవాలి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాగబాబు ఎంతో ప్రజాదరణ ఉన్న జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయం. నాగబాబుతో పాటు ఆయని సోదరులు చిరంజీవి, పవన్కల్యాణ్లు అమ్ముడుపోయే రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు. చంద్రబాబు గెలుపుకోసం అమాయక అభిమానుల మనోభావాలను వీరు తాకట్టు పెట్టారు. కేవలం ప్యాకేజీల కోసం రాష్ట్రంలో వీరు రాజకీయాలు చేస్తున్నారు. నరస్సాపురంలో తన ప్రత్యర్థి పోటీదారులు ఎవరో కూడా నాగబాబుకు తెలియని పరిస్థితి. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్కు పోటీ చేయడం అక్కడి ప్రజల దురదృష్టం. నాగబాబుకి జగన్ను విమర్శించే నైతికహక్కులేదు. హుందా రాజకీయాలు ఆయన నేర్చుకోవాలి. మతిస్థిమితం లేని ఇలాంటి వారిని ప్రజలు రాకీయాలకు దూరంగా ఉంచాలి. – కొయ్య ప్రసాద్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సాఆర్సీపీ జబర్దస్త్ షో అనుకున్నావా.. బాబూ నాగబాబూ.. రాజకీయాలంటే నువ్వు టీవీల్లో చేసే జబర్దస్త్ షో అనుకున్నావా.. నువ్వు నటుడై ఉండి.. మీ సకుటుంబ సపరివారమంతా నటీనటులై ఉండి.. సాటి నటులను పెయిడ్ ఆర్టిస్టుగాళ్ళు అంటావా.. అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జాన్ వెస్లీ ప్రశ్నించారు. నటులంతా మీ వెంటే తిరగాలా.. రాజకీయంగా వారికి వ్యక్తిగత ఇష్టాలు, పార్టీలు ఉండకూడదా.. అని ప్రశ్నించారు. తనకు నచ్చని విధానాలపై, పార్టీలపై నాగబాబుకు విమర్శించే హక్కుంది. కానీ ఇలా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడటం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేట్టు మాట్లాడటం అతని స్థాయిని బయటపెట్టింది. వెంటనే నాగబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి.. అని జాన్వెస్లీ డిమాండ్ చేశారు. - జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
ఫేక్ న్యూస్ వైరల్.. గాజువాకలో తోపులాట
సాక్షి, విశాఖపట్నం: సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని అధికారులు, పోలీసులు ఎంత చెప్పినప్పటికీ ప్రజల్లో మాత్ర మార్పు రావడం లేదు. వాట్సప్లో వైరల్ అవుతున్న ఏ వార్తలైనా గుడ్డిగా నమ్మి పోరపాటుపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల కారణంగా గాజువాక జీవీఎంసీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున తోపులాట జరిగింది. గాజువాక నియోజకవర్గంలో ఓటులేని వాళ్లు ఫారం 27 నింపి ఓటు హక్కుని వినియోగించుకోవచ్చని సోషల్ మీడియాలో ఓ వార్త నిన్నటి నుంచి హల్చల్ చేస్తోంది. దీంతో ఓటు హక్కులేని ఓటర్లు జీవీఎంసీ కార్యాలయానికి భారీగా క్యూకట్టారు. వందల సంఖ్యలో కార్యాలయం వద్ద గుమ్మిగూడారు. ఈరోజు ఉదయం నుంచి సాయంతం 5 గంటల వరకు సమయం కేటాయించిందని పోస్ట్లు రావడంతో ఓటర్లు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అధికారులు చేతులేత్తేసారు. అయితే ఫారం 27 అనే అంశం లేదని.. అందంతా ఫేక్ అని కొంత మంది కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం పట్టించుకోవడంలేదు. కాగా ఫేక్ వార్తలను షేర్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశంఉంది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా మూడు లక్షలకు పైగా ఓట్లతో గాజువాక మొదటి స్థానంలో నిలిచింది. -
గాజువాక బహిరంగ సభలో వైఎస్ జగన్
-
బాబు పాలనలో ఐటీరంగం రివర్స్ గేర్లోకి వెళ్లింది
-
యాక్టర్కు లోకల్ హీరోకు పోటీ : వైఎస్ జగన్
సాక్షి, గాజువాక (విశాఖపట్నం) : ‘గాజువాకలో పోటీ ఓ యాక్టర్కు... లోకల్ హీరోకు జరుగుతోంది. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. 9 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నాం.. ప్రతి ధర్నా చేశాడు.. ప్రతి నిరహార దీక్ష చేశాడు. ప్రతిసారి మీకు అండగా ఉన్నాడు. మీ కోసం కేసులు పెట్టించుకున్నాడు. ఈ మనిషిని లోకల్ హీరో అంటాం. కానీ మరోవైపు యాక్టర్ ఉన్నాడు. ఆ యాక్టర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన నామినేషన్ సందర్భంగా పచ్చజెండాలు కనిపిస్తాయి. ఆయన నాలుగేళ్లు టీడీపీ చంద్రబాబునాయుడితో కలసి కాపురం చేస్తాడు. ఎన్నికలకు ఒక ఏడాది ముందు విడాకులు తీసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తాడు. జగన్ అనే వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే.. 22 కేసులు పెట్టారు. కానీ ఇదే యాక్టర్ పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏడాది నుంచి బిల్డప్ ఇస్తూ ఉంటుంటే.. ఒక్క కేసు నమోదు కాలేదు. వాళ్లంతా కలిసి కట్టుగా ఎలా కుట్రలు పన్నుతున్నారో అర్థం చేసుకోమని కోరుతున్నా.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖజిల్లా గాజువాకలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని, ఖాళీగా ఉన్న రెండు లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు చేసే కుట్రలను గమనించాలని, ఆయన ఐదేళ్ల పాలనపై ఒకసారి ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిప్పల నాగిరెడ్డి , విశాఖపట్నం లోక్సభ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. వైఎస్సార్ పాలనను గుర్తు తెచ్చుకోండి.. విశాఖపట్నం, గాజువాక గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొమని ప్రాధేయపడుతున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుతెచ్చుకోమని కోరుతున్నా. ఆయన ఐదేళ్ల మూడునెలల పాలనను చూడమని అడుగుతున్నా. విశాఖలో స్టీల్ ప్లాంట్ను నెలకొల్పారు. ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్ విస్తరణ ఆయన హయాంలోనే జరిగింది. మూతపడ్డ బీహెచ్పీ, బీహెచ్ఎల్ను కలిపి వందల కుటుంబాలను ఆదుకున్నారు. షిప్యార్డ్, రక్షణశాఖను విలీనం చేసి మూతపడకుండా చేశారు. అచ్యుతాపురం, ఐటీ కారిడార్, ఫార్మాసిటీ ఇవన్నీ కూడా విశాఖపట్నంకు తీసుకొచ్చి కొన్ని వేళ ఉద్యోగాలు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయం కూడా అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆయన హయాంలోనే జరిగింది. వర్షం పడితే విశాఖ విమానాలు టేకాఫ్ అయ్యేవి కాదు.. దానిని పునరుద్దరణ చేశారు. ఈ ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారో బేరిజు వేసుకోమని కోరుతున్నా. చంద్రబాబు సీఎం అయ్యారు.. స్టీల్ ప్లాంట్ అంపశయ్యపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములు, కొండలతో సహా లక్షల కోట్ల భూకుంభకోణాలు చేశారు. మంత్రులు, నాయుకులు, కొడుకును కాపాడటానికి తూతుమంత్రంగా సిట్ వేసి.. ఆ నివేదికను చెత్తబుట్టలో వేశారు. ఐటీరంగం రివర్స్ గేర్లోకి.. బినామీలకు కారుచౌకగా వేల కోట్ల విలువ చేసే భూమలను కేటాయించారు. బీచ్రోడ్డులో వేయ్యికోట్ల విలువ చేసే స్థలాన్ని ఓ ఫైవ్స్టార్ హోటల్కు దారాదత్తం చేశారు. భాగస్వామ్య సదస్సులతో రూ.150 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు. ఈ సదస్సులతో 40 లక్షల ఉద్యోగాలు.. 20 లక్షల కోట్ల పెట్టుబడులున్నారు. వచ్చాయా ఉద్యోగులు? ఈ ధ్యాస హోదాపై పెట్టుంటే ఇప్పటికి వచ్చేది కదా..! ఉద్యోగాలు వచ్చేవి కావా? ఇదే విశాఖలో ప్రత్యేకహోదాకు అనుకూలంగా జగన్ అనే ప్రతిపక్ష నేతను ధర్నాకు రాకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నా. ప్రతిపక్షనేతపై వీఐపీ లాంజ్లోనే దాడి చేయించారు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ ఐటీ రంగం పరుగులు పెడితే.. ఇదే చంద్రబాబు హయాంలో ఐటీరంగం రివర్స్ గేర్లోకి వెళ్లింది. వైఎస్సార్ హయాంలో 16 వేల ఐటీ ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 12వేలకు తగ్గిపోయాయి. ప్రయివేట్ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు చరిత్ర కలిగిన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ఎలా నిర్విర్యం చేస్తున్నారో మీ అందరికి తెలుసు. అక్కడ ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయరు. గీతం యూనివర్సిటీకి వెళ్లేలా ఇలా చేశారు. వైఎస్సార్ 1130 పడకల కేజీహెచ్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆయన మరణాంతరం 21 సూపర్ బ్లాక్లకు 8 బ్లాక్లే పూర్తయ్యాయి. అక్కడ ఒకే మంచంపై ఇద్దరు రోగులను పడుకోబెట్టే పరిస్థితి ఏర్పడింది. గాజువాకలో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు. స్టీల్ ప్లాంట్లో 50శాతం స్థానికులకే ఇవ్వాలని వైఎస్సార్ చట్టం తీసుకొచ్చారు. నాలుగు లక్షల జనాభా ఉన్న గాజువాకలో డంపింగ్యార్డ్ సమస్య ఉంది. పారిశ్రామికంగా గాజువాక ఎంతో ముందుంది. కానీ కనీసం ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ లేదు. సీఎంగా చంద్రబాబు హామీ ఇచ్చినా దిక్కులేకుండా పోయింది. డిగ్రీ కాలేజీ కూడా లేదు. ఇక్కడికి రోజుకు కొన్ని వేల ట్రక్కులు వస్తూ ఉంటాయి. వారికోసం ఒక్క ట్రక్కు బే పెట్టలేదు. 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో ఏ గ్రామానికి, పట్టణానికి వెళ్లినా.. అన్నా.. ఉద్యోగం లేదన్నా.. అనే మాటలే వినిపించాయి. ప్రభుత్వ స్కూల్స్లో టీచర్లను.. జాబు రావాలంటే బాబు రావాలని ఆనాడు చంద్రబాబు అన్నారు. రాష్ట్రం విడిపోయేనాటికి రాష్ట్రంలో లక్ష 42వేల ఉద్యోగాలను ఖాళీగా ఉన్నాయని కమల్నాథ్ కమిటీ చెప్పింది. వీటికి మరో లక్ష కలిపి మొత్తం రెండు లక్షల 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ స్కూల్స్లో టీచర్లను భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు. అందరూ చంద్రబాబు బినామీ నారాయణ స్కూల్కు వెళ్లాలని దిక్కుమాలిన ఆలోచనతో ఇలా చేశారు. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే.. రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తానన్నాడు. ఐదేళ్లలో రూ.లక్ష 20వేలు ఎగ్గొట్టాడు. ఉద్యోగాలు రాలేదు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. నిరుద్యోగభృతి.. కేవలం ఎన్నికల ముందు మూడు లక్షల మంది వెయ్యి రూపాయలు ఇచ్చాడు. బాబు వచ్చాడు.. వర్క్ ఇన్స్పెక్టర్లు, గోపాల మిత్రలు, ఆయూష్, సాక్షర భారత్, మధ్యాహ్నం భోజనంలో పనిచేస్తున్న అక్కాచెల్లమ్మల ఉద్యోగాలు పోయాయి. కాంట్రాక్ట్లో ఉద్యోగం చేస్తున్నవారి జీతాలు పెంచమంటే పోలీసుల చేత కొట్టించారు. నా పాదయాత్రలో ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులను చూశా.. పిల్లలకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల ఆవేదనను విన్నా.. మీ అందరికి నేనున్నాననే భరోసా ఇస్తున్నాను. ప్రతి గ్రామానికో సెక్రటేరియట్ .. అధికారంలో రాగానే చేసే మొట్టమెదటి పని ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా నోటీఫికేషన్లు వేస్తాం. ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలండర్ రిలీజ్ చేస్తాం. ఇవాళ ఏ సంక్షేమ పథకం పొందాలన్నా.. జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వందే ఏ పని జరగడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి వార్డు.. ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ తీసుకొస్తాం. చదువుకున్న 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి.. అక్కడినే కూర్చోపెడ్తాం. పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా.. ఆర్జీ పెట్టిన 72 గంటల్లోనే మంజూరు అయ్యేట్టు చూస్తాం. ఇది ఇచ్చేటప్పుడు కులం, మతం, పార్టీలు చూడం. ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటరీగా నియమించి గౌరవ వేతనంగా రూ.5వేలు అందిస్తాం. వాళ్లకు ఇంకా మెరుగైన జీతాలు వచ్చేవరకు వారంతా గ్రామ వాలంటరీలుగా సేవలు అందిస్తారు. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకొని గ్రామ సెక్రటరియేట్తో అనుసంధానమై పనిచేస్తారు. సంక్షేమ పథకాలు సంబంధించి ఈ 50 ఇళ్లకు పూర్తి బాధ్యత ఆ వాలంటీర్దే. ప్రధాని ఎవడన్నా కానీ.. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా.. శాసనసభలో చట్టం తీసుకొస్తాం. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్లు తీసుకునే సర్వీసులు చాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులను కాంట్రాక్టులకు ఇస్తున్నారు. వీటిని కేశినేని, జేసీ బ్రదర్స్ నడుపుతున్నారు. వీటన్నిటిని మార్చేస్తాం. ఇలా ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకే ఇచ్చేలా చేస్తాం. పెట్టుబడుల కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. నామినేషన్ పద్దతిలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పిస్తాం. 25కు 25 ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటే.. పక్క రాష్ట్రం 17 మంది ఎంపీలు మనకు మద్దతిస్తాం అంటున్నారు. మొత్తం 42 మంది కలిస్తే ప్రత్యేకహోదా సాధించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని ఎవరవుతారో తెలియదు.. ప్రధాని ఎవడన్నా కానీ.. 42 మంది ఒక్కసారి అడిగితే హోదా వస్తుంది. ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలు, హాస్పిటల్స్, హోటల్స్ వస్తాయి. హోదా వస్తే జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. చంద్రబాబు కుట్రలు చూస్తూనే ఉన్నారు. ఆయన పరిపాలనపై ఒకసారి ఆలోచన చేయండి. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్దం. రాబోయే రోజుల్లో చంద్రబాబు మూటలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. ఓటుకు మూడు వేలు ఇస్తాడు. మీ అందరికి చెప్పేది ఒక్కటే గ్రామాల్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు.. అన్నను సీఎంను చేసుకుందామని చెప్పండి. నవరత్నాలు, మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వివరించండి. అన్న సీఎం అయితే మన బతుకులు బాగుపడ్తాయని వివరించండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
రాజకీయ తెరపై పవన్ కల్యాణ్ కామెడీ...
జాతీయ పార్టీలకు గులాంగిరీ చేయకండి.. బానిసత్వంతో నడుం వంగిపోయాలా మోకాళ్ల దండాలు పెట్టకండి.. రాష్ట్ర ప్రజల మనోభవాలను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి..సముద్రం ఒకరి కాళ్ళ వద్ద కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు..ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగోడూ జీ హుజూర్.. జీహూజూర్... అని గులాంగిరీ చేయడు.. కట్ చేస్తే.. అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు అభిశంసించిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి కాళ్లకు మొక్కడం..ఒక్కసారి కాదు.. ఎయిర్పోర్ట్లో కారు ఎక్కేటప్పుడు.. కారు దిగిన తర్వాత.. బహిరంగసభలు పెట్టిన ప్రతిచోటా వంగివంగి దండాలు పెట్టడం.. ఈ ట్రాక్ రికార్డంతా ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించే.. ఆయన నిలకడ లేని మనస్తత్వం.. రెండుమూడేళ్ళకు మారిపోయే మాటల సంగతి ప్రస్తావిస్తే.. ఇప్పుడు చాంతాడంత అవుతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే చివరికి ఆయన పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అంతే గందరగోళంగా ఉన్నాయి. ఏమాత్రం పొంతన లేకుండా.. స్థానిక సమస్యలపై కనీస అవగాహన లేకుండా ఇచ్చిన, ఇస్తున్న హామీలు చూసి గాజువాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. గాజువాక ప్రజకే 2 లక్షల ఉద్యోగాలు ఎలా వచ్చేస్తాయి. అలాగైతే ఎన్ని కంపెనీలు పెట్టాలి. అగనంపూడి రెవిన్యూ డివిజన్ ఎలా సాధ్యం. అభాసుపాలవుతున్న అజ్ఞాతవాసి హామీలు . ఆ ప్రాంత సమస్యలపై అవగాహన లేకుండా సినిమాలు డైలాగుల మాదిరి హామీలు. ఆ హామీల సంగతి ఏమిటో చూద్దాం రండి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నాకు కొద్దిగా తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. గబ్బర్ సింగ్ సినిమాలోని ఈ డైలాగ్.. ఇప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానుల్లో నానుతూనే ఉంటుంది. ఇప్పుడు గాజువాకలో ఆయన ఇచ్చిన హామీలు చూస్తే సరిగ్గా ఆ డైలాగ్ను తిప్పి చదువుకోవాల్సిందే. ఏమాత్రం లెక్క లేకుండా... నియోజకవర్గ సమస్యలపై కనీస అవగాహన లేకుండా ఆయనిచ్చిన హామీలు నవ్వులు పూయిస్తున్నాయి. వెండితెరపై డైలాగులతో ఈలులు వేయించిన పవన్కల్యాణ్.. రాజకీయ తెరపై మాత్రం కామెడీని పండిస్తున్నారనే విమర్శలకు ఆయన గాజువాకకు ఇచ్చిన హామీలు ఊతమిస్తాయి. గాజువాకకు సంబంధించి ఆయన ఇప్పటికే లెక్కలేనన్ని.. మళ్ళీ గట్టిగా ఆయన్ను అడిగినా కూడా చెప్పలేనన్ని వాగ్దానాలు చేసేశారు. వాటన్నిటి గురించి వదిలేసి ఒకటి రెండు ప్రధానమైన వాగ్దానాలనే తీసుకుందాం. గాజువాక ప్రజలకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ పదే పదే చెప్పుకొస్తున్నారు. గాజువాకలోని పరిశ్రమల్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటే.. కనీసం దానికైనా అర్ధం ఉంటుంది. కానీ ఏకంగా 2 లక్షలమంది గాజువాక ప్రజలకే ఉద్యోగాలు ఇచ్చేస్తానని పవన్ ఊదరగొట్టేస్తున్నారు. అసలు.. ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్నే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. గాజువాకలో ఓటర్లు మూడు లక్షలు కాగా.. జనాభా మొత్తంగా మూడున్నర లక్షలమంది. ఇందులో ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య .. సంఘటిత, అసంఘటిత రంగాలను కలిపితే లక్షన్నర మందికిపైగానే ఉంది. మిగిలిన వారిలో వృద్ధులు, పిల్లలు, గృహిణులు ఉంటారు. మరి ఈ లెక్కన గాజువాకలో రెండులక్షల ఉద్యోగాలు ఎవరికిస్తారు.. అది ఎలా సాధ్యం అన్న ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవంగా లెక్క వేస్తే రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ప్లాంట్లోనే 11వేలమంది పర్మినెంట్ ఉద్యోగులుండగా, 15వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ లెక్కన పవన్ చెబుతున్న 2లక్షల ఉద్యోగాలు రావాలంటే స్టీల్ప్లాంట్ వంటి పరిశ్రమలు ఎన్ని పెట్టాలో.. వాటికి ఎన్నేళ్లు పడుతుందోనన్న వాదనలు బయలుదేరాయి. సొంత గనులు, నీటి సరఫరా వంటి సమస్యలతో స్టీల్ప్లాంట్ ఉనికే ప్రశ్నార్ధకమైన పరిస్థితుల్లో ఏనాడూ ఆ సమస్యలపై స్పందించకుండా.. ప్రస్తుత పరిశ్రమల్లో ఉన్న సమస్యలపై కనీస అవగాహన లేకుండా.. రెండులక్షల ఉద్యోగాలు తెచ్చేస్తాను.. అన్న పవన్ ప్రకటనపై ఉద్యోగసంఘ నేతల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగనంపూడి రెవెన్యూ డివిజన్ ఎలా సాధ్యం పవన్ కల్యాణ్ ప్రకటించిన మరో అంశం.. అగనంపూడి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానన్న హామీ. రెవెన్యూ డివిజన్ అంటే పది నుంచి పదిహేను మండలాలకు కేంద్రంగా అందుబాటులో ఉండే పెద్ద ప్రాంతాన్ని ఆ మండలాలకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది. అగనంపూడి పరంగా చూసుకుంటే.. ఈ ప్రాంతం విశాఖ రెవెన్యూ డివిజన్లో ఉంది. పైగా ఇదంతా మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో అంతర్భాగం. దీనికి తోడు సమీపంలో పరిపాలనపరంగా ఇబ్బంది పడుతున్న మండలాలు కూడా లేవు. ఆ పక్కన చూస్తే.. 20 కి.మీ. దూరంలోనే అనకాపల్లి డివిజన్ కేంద్రం ఉంది. ఈ రెండింటి మధ్యలోనూ మండలాలు లేవు. అలాంటప్పుడు అగనంపూడి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యం?.. పోనీ దీనికి సంబంధి ప్రతిపాదనలు గానీ.. ప్రజల నుంచి డిమాండ్లు గానీ ఉన్నాయా.. అంటే అవీ లేవు. మరి ఏం ఆలోచించి తలాతోకా లేని అగనంపూడి రెవెన్యూ డివిజన్ అంశాన్ని పవన్ తన ప్రణాళికలో ఎలా చేర్చేశారో?.. ఇందులో ఆయన లెక్కేమిటో??.. ఆయనకే తెలియాలి. -
మరోసారి బయటపడ్డ పచ్చ కుట్ర
-
గాజువాకలో టీడీపీకి షాక్..!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా మారిన గాజువాక నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత దొడ్డి రమణ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు సమక్షంలో ఆయన ఆదివారం పార్టీలో చేరారు. ఆయనతోపాటు నాలుగు వేలమంది కార్యకర్తలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయంగా కనిపిస్తుండటం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మల్యేలతోపాటు పలు పార్టీల నేతలు సైతం వైఎస్సార్సీపీలోకి క్యూ కట్టారు. -
గాజువాకలో టీడీపీ, జనసేన కుమ్మక్కు
సాక్షి, గాజువాక: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తోన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ, జనసేనలు కుమ్మక్కు అయ్యాయి. పవన్ కల్యాణ్ను గెలిపించడానికి మరోసారి పచ్చ కుట్ర జరుగుతోంది. పవన్ కల్యాణ్ను గెలిపించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను బలి పశువు చేస్తున్నారంటూ పల్లా శ్రీనివాస రావు మదనపడిపోతున్నారు. గాజువాకలో ప్రచారానికి రాకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెలికలు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బాబు ప్రచారానికి రాకపోతే ఎలా అని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస రావు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న హర్షవర్ధన్తో కలిసి పల్లా శ్రీనివాస రావు, చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలిసింది. పవన్ కల్యాణ్ గెలుపు కోసమే చంద్రబాబు గాజువాక ప్రచారానికి రావడం లేదని పల్లా శ్రీనివాస రావు స్పందించినట్లుగా తెలిసింది. తనకు ఎవరు ప్రచారం చేయకపోయినా ఫర్వాలేదని, తన సొంత సైన్యంతోనే గెలుస్తా అంటూ బాబుపై అలిగి వెళ్లినట్లుగా సమాచారం అందింది. పల్లా శ్రీనివాస రావును చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంతో తెలుగు దేశం కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. -
అరె సాంబా... రాసుకో...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన తాజా కబురు ఏమిటో తెలుసా.. పవన్కల్యాణ్ గాజువాక అరుదెంచారట... ఇక్కడే అద్దెకు ఇల్లు తీసుకున్నారట. ఏం సంబంధముందని గాజువాకలో పోటీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పవన్ ఇక్కడే బస చేసేందుకు ఇల్లు తీసుకున్నారని జనసేన పార్టీ వర్గాలు శనివారం సాయంత్రం పత్రికా ప్రకటన చేశాయి. ఎన్నికల ప్రచా ర గడువు ఇంకా పదిరోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇల్లు తీసుకోవడం ఏమిటన్నదే ప్రశ్నార్ధకంగా ఉంది. పోనీ గెలిచినా, ఓడినా ఇక్కడే ఉంటారన్న ప్రకటనైనా పవన్ నుంచి వస్తుందా అంటే.. అది అసాధ్యంగానే ఉంది. అనంతపురం, ఏలూరు, పిఠాపురం, విజయవాడ సెంట్రల్.. ఇలా ఎన్నో నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేయొచ్చొని తెరపైకి తెచ్చినప్పటికీ కుల లెక్కల ప్రాతిపదికన గాజువాకను ఎప్పుడో ఎంచుకున్నారనేది స్పష్టంగా తెలిసిపోతోంది. కనీసం గాజువాకలో పోటీ చేయాలని భావించినప్పుడైనా ముందుగా పవన్ కల్యాణ్ ఇల్లు తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం స్వయంగా జనసేన వర్గాల నుంచే వినిపిస్తోంది. గత ఏడాది కాలంలో నాలుగైదుసార్లు జిల్లాకు వచ్చినప్పుడు పవన్ .. బీచ్రోడ్లోని సాయిప్రియ రిసార్ట్స్లో బస చేసేవారు. కనీసం అప్పుడైనా గాజువాక కేంద్రంగా ఇల్లు తీసుకుని ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలు చేసుంటే కొంతైనా స్థానికత వచ్చేదన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. పోనీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత,.. కనీసం నామినేషన్ సందర్భంలోనైనా ఇల్లు తీసుకుని ఉంటే బాగుండేదని. ఇప్పుడు సరిగ్గా పదిరోజులు కూడా ప్రచార గడువు లేని పరిస్థితుల్లో ఇల్లు.. అది కూడా అద్దె ఇల్లు తీసుకుంటే ఏం ప్రయోజనమన్న వాదన ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. స్థానికులకే గాజువాక ప్రజ ఆదరణ ఇక కుల లెక్కలు ఎలా ఉన్నా.. గాజువాక ప్రజ మొదటి నుంచి స్థానిక నేతలకే పట్టం కడుతోందన్నది నాలుగు దశాబ్దాల ఎన్నికల చరిత్ర తీస్తే అర్ధమవుతుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు.. ఆ తర్వాత కూడా ఇక్కడ నివాసం ఉంటున్న నేతలనే ప్రజాప్రతినిధులుగా గాజువాక ప్రజలు ఎన్నుకుంటూ వస్తున్నారు. 1978లో గాజువాక అంతర్భాగంగా ఉన్న పెందుర్తి నియోజకవర్గ తొలి శాసనసభ్యునిగా గుడివాడ అప్పన్న ఎన్నికయ్యారు. 1980లో గుడివాడ అప్పన్న మరణంతో ద్రోణంరాజు సత్యనారాయణ పోటీ చేసి గెలిచారు.1983 ఎన్నికల్లో పెతకంశెట్టి అప్పలనర్శింహం, 1985 ఎన్నికల్లో ఆళ్ళ రామచంద్రరావు, 1989లో గుడివాడ గురునాధరావు, 1994లో మానం ఆంజనేయులు, 1999లో గణబాబు, 2004 ఎన్నికల్లో తిప్పల గురుమూర్తిరెడ్డి గెలుపొందారు. వీరంతా ఈ ప్రాంతవాసులే. ఇక్కడే పుట్టి పెరిగారు. 2009 పునర్విభజనతో ఏర్పాటైన గాజువాక నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా చింతలపూడి వెంకట్రామయ్య ప్రజా రాజ్యం అభ్యర్థిగా గెలుపొందారు. వాస్తవానికి తూర్పు గోదావరి జిల్లా అయినవల్లికి చెందిన వెంకట్రామయ్య మూడు దశాబ్దాల క్రితమే వైజాగ్ వచ్చి స్థిరపడ్డారు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. ఆయన గాజువాకలోని జోగవానిపాలెం గ్రామ నివాసి. ఇలా నాలుగు దశాబ్దాల చరిత్ర చూస్తే.. స్థానికులకే గాజువాక ప్రజ పట్టం కడుతున్నారనేది స్పష్టమవుతోంది. ఈ లెక్కన పవన్ కల్యాణ్ను ఇక్కడి ప్రజలు ఆదరించడమనేది అనుమానంగానే ఉంది. కేవలం అభిమానుల కోలాహలం, సామాజికవర్గ సమీకరణాలు వేసుకుని గాజువాకకు దిగుమతి అయిన పవన్కు ఇప్పుడు వాస్తవ లెక్కలతో సినిమా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే అర్జంట్గా ఇల్లు తీసుకున్నారని అంటున్నారు. కొసమెరుపు సరే గాజువాకలో అద్దె ఇల్లు తీసుకున్నారు.. అంతవరకు బాగానే ఉందనుకుందాం. మరి భీమవరంలో పరిస్థితి ఏమిటి.. అక్కడా ఇల్లు తీసుకోవాలి కదా?... అక్కడ ఎన్ని రోజులు ఉంటారు.. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు. మరోవైపు అమరావతిలోనూ ఇల్లు కొన్నారు కదా?.. హైదరాబాద్లో సొంతిల్లు ఉంది కదా??.. వీటిలో దేన్ని పర్మినెంట్ అని చెప్పుకుంటారు???.. తనను కలసి సమస్యలు చెప్పాలనుకునే వారిని ఎక్కడికని రమ్మంటారు!.. ఎన్ని చోట్లకు తిరగమంటారు. కాపులు అంత అమాయకంగా కనిపించారా.. అసలు గాజువాకతో పవన్కల్యాణ్ ఏం సంబంధం ఉందని పోటీ చేస్తున్నారని కాపునాడు జేఎసీ సభ్యురాలు, ఉత్తరాంధ్ర కాపునాడు నాయకురాలు పీలా వెంకటలక్ష్మి ప్రశ్నించారు. కేవలం కాపుల సంఖ్య ఎక్కువగా ఉంటే చాలా.. స్థానికత, అర్హత, ఇక్కడి సమస్యలపై అవగాహన ఏమీ అక్కర్లేదా... అని ఆమె నిలదీశారు. గాజువాకలో తమ సామాజికవర్గం ఎక్కువగా ఉందని పవన్ పోటీ చేస్తున్న విషయం బహిరంగ రహస్యమేనని లక్ష్మి అన్నారు. తన సినీగ్లామర్ చూసి కాపులు మోజుతో ఓట్లు వేస్తారని పవన్ భావిస్తున్నారని. కానీ వారిలోనూ చైతన్యం వచ్చిందన్నారు. తమ ప్రాంత సమస్యలపై ఎవరు పోరాడుతున్నారో తెలుసుకుంటున్నారన్నారు. అందుకే పవన్ను గాజువాకలో తమ సామాజికవర్గ ఓటర్లు ఆదరించరని స్పష్టం చేశారు. కాపు వర్గీయుల సమస్యలపై ఏనాడైనా పవన్ స్పందించారా అని నిలదీశారు. వారికి చేసిన మేలు ఒక్కటైనా చెప్పగలరా అని సవాల్ చేశారు. – పీలా వెంకటలక్ష్మి, కాపునాడు జేఏసీ సభ్యురాలు -
గాజువాకలో బేజారైన జనసేన.. వైఎస్సార్సీపీపై విష ప్రచారం
సాక్షి, గాజువాక : విశాఖ జిల్లా గాజువాక ఎన్నికల ప్రచారంలో దారుణంగా వెనుకబడ్డ జనసేన పార్టీ అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగిరెడ్డిని ఎదుర్కోలేక ఆయన పార్టీపై బురద జల్లుతూ అడ్డదారులు తొక్కుతోంది. ఇంటి అద్దెను బకాయిపడ్డ ఓ కుటుంబ సమస్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఆ పార్టీని అప్రదిష్టపాల్జేసేందుకు బరితెగించింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారానికి ఆ కుటుంబంలోని వారు రానన్నారన్న సాకు చెబుతూ ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించడానికి అద్దెకున్న వారిపై దాడిచేసినట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో బీజేపీకి పనిచేసిన ఆ ఇంటి యాజమానికి వైఎస్సార్సీపీ నాయకుడనే ముద్రవేసి కుట్ర పన్నారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జేబు సంస్థ అయిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలు వైఎస్సార్సీపీపై విష ప్రచారానికి పూనుకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఇంటి యజమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఊరు ఊరంతా కదిలివచ్చి యజమాని కుటుంబానికి అండగా నిలిచింది. వైఎస్సార్సీపీపై బురదజల్లిన జనసేనను, బురదజల్లిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తీరును వారు ఎండగట్టారు. ఇదీ సమస్య.. స్థానికుల కథనం ప్రకారం..నెమలిపురి సిద్ధు, నాగమణి దంపతులు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని పెదగంట్యాడ నిర్వాసిత కాలనీ నెల్లిముక్కు గ్రామానికి చెందిన పిట్టా నాగేశ్వరరావు ఇంట్లో మూడేళ్ల క్రితం అద్దెకు దిగారు. స్టీల్ప్లాంట్లో అసంఘటిత కార్మికుడిగా పనిచేస్తున్న సిద్ధు గడిచిన ఎనిమిది నెలలుగా ఇంటి అద్దె సరిగ్గా ఇవ్వడంలేదు. నాగేశ్వరరావు చిన్న కుమారుడికి కొద్ది రోజుల్లో వివాహం.. పెద్ద కోడలికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. దీంతో తమకు డబ్బులు అవసరమని, ఇంటి అద్దె ఇవ్వాలని ఇంటి యజమాని కోరారు. తమ కుమారుడికి వివాహం ఉన్నందున ఇల్లు కూడా ఖాళీ చేయాలని చెప్పారు. ఫిబ్రవరి 13న తాము ఆధ్యాత్మిక యాత్రకు కూడా వెళ్లాల్సి ఉన్నందున ఆ ముందురోజే తమకు ఇంటి అద్దె బకాయి రూ.18వేలను చెల్లించాలని కోరారు. కానీ, వారు చెల్లించలేదు. నాగేశ్వరరావు కుటుంబం యాత్రకు వెళ్లి వచ్చిన తరువాత సిద్ధు భార్య రూ.8వేలను మాత్రమే చెల్లించింది. పైగా తాము ఇంటికి ఏసీ పెట్టుకుంటామని ఇంటి యజమానితో వారు చెప్పారు. ఏసీ కొనడానికి బదులు ఇంటి అద్దె చెల్లించాలని, తమకు ఇల్లు కూడా అవసరం కాబట్టి ఖాళీ చేయాలని ఇంటి యజమాని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న సిద్ధు ఇంటి యజమానిపై గొడవకు వెళ్లాడు. యజమాని భార్య కనకమహాలక్ష్మి గుండెలపై చేయివేసి తోసేశాడు. వెంటనే సిద్ధు భార్య నాగమణి తన భర్తను లాకెళ్తుండగా మెట్లపై జారిపడింది. నాగమణి ఉదంతాన్ని వివరిస్తున్న స్థానికులు జనసేన మద్దతుతో కుట్ర నాటకీయ పరిణామాల మధ్య ఆస్పత్రికలో చేరిన నాగమణిపై స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆమె ఆస్పత్రిలో చేరిన వెంటనే జనసేన పార్టీ నాయకుడు శివశంకర్ ఆమెను పరామర్శించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యమంటూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టింగ్లు, ఆ వెంటనే ఆంధ్రజ్యోతి ఏబీఎన్లో బ్రేకింగ్ న్యూస్లు రావడంతో ఈ ఘటన వెనుక ఎవరున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. గాజువాకలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేని జనసేన నాయకులు ఈ నీచానికి దిగజారుతున్నారనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. అలాగే, జనసేన పార్టీ నేతల మద్దతుతో ఈ సంఘటన మొత్తాన్ని ఆమె వక్రీకరించిందని, ఏమాత్రం సంబంధంలేని వైఎస్సార్సీపీపై కట్టుకథలు అల్లేందుకు ప్రయత్నిస్తోందని స్థానికులు వివరించారు. తనంతట తాను పడిపోయి ఆ నెపాన్ని ఇంటి యజమానిపై మోపుతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి ఎటువంటి సంబంధంలేని ఒక ఉన్నతాధికారిని పార్టీ పేరుతో రోడ్డుపైకి లాగడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో పోలీసులు నిగ్గు తేల్చాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. నాగేశ్వరరావుకు, వైఎస్సార్సీపీకి సంబంధంలేదు కాగా, పిట్టా నాగేశ్వరరావుకు, వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధంలేదు. ఆయన స్టీల్ప్లాంట్లో ప్రస్తుతం జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. గతంలో పదోన్నతి రావడానికి ముందు బీజేపీలో పనిచేశారు. అనంతరం ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉచిత యోగా క్లాసులు చెప్పడం, సామాజిక అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం తన చిన్న కుమారుడి వివాహం ఉన్నందున ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ, నాగేశ్వరరావు తాగి వచ్చి తనను కొట్టాడంటూ నాగమణి ఫిర్యాదు చేయడంపట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఆయన చాలా సౌమ్యుడని, మద్యం అలవాటులేదని తెలిపారు. వీధిలో ఎవరు కనిపించినా అమ్మా అనే సంబోధనతో పలకరించి వెళ్లిపోవడం తప్ప మాట్లాడటం కూడా తాము చూడలేదని మీడియా ప్రతినిధులకు గ్రామస్తులు వివరించారు. నేను ఏ పార్టీ వాడినీ కాదు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారానికి నేను పిలిచినట్టు, రానన్నందుకు గొడవైనట్టు రాయడం దుర్మార్గం. నేను గతంలో బీజేపీకి కొద్దికాలం పనిచేశాను. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను. కేవలం నాకు ఇవ్వాల్సిన ఇంటి అద్దెను ఎగ్గొట్టడానికే ఇలాంటి డ్రామాలకు దిగారు. వాళ్లను మా సొంత బిడ్డల్లా చూశాం. డబ్బులు ఎగ్గొట్టడానికి మమ్మల్ని రోడ్డుపైకి లాగారు. – పిట్టా నాగేశ్వరరావు, ఇంటి యజమాని 30 సంవత్సరాలుగా మాకు తెలుసు మేం విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి వచ్చి ఇక్కడే 30 సంవత్సరాలుగా ఉంటున్నాం. పిట్టా నాగేశ్వరరావు కుటుంబం అప్పట్నుంచీ మాకు చాలా బాగా పరిచయం. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరు. – నెల్లి రాములమ్మ, స్థానికురాలు -
గాజువాకలో పవన్ కళ్యాణ్ నామినేషన్
-
ఓ ‘కాపు’ కాస్తారనేనా..?
-
కాపు కాస్తారనేనా?
సాక్షి, విశాఖపట్నం: ‘అసలు నేను కాపునే కాదు. కాపుల ఓట్లు నాకు అక్కర్లేదు. నేను ఏమైనా కాపుల మద్దతు అడిగానా? నాకు కులమతాలు లేవు..’ ఇవీ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన మాటలు. కానీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చేసరికి మాత్రం ఆయన ఏరికోరి కాపుల ఓట్లు గణనీయంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాలనే ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి 13 జిల్లాలున్న నవ్యాంధ్రలో ఒకేసారి రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించడం ఓ విచిత్రమైతే.. విశాఖ, ఆ పక్కనే ఉండే గోదావరి జిల్లాల నుంచే ఆ రెండు స్థానాలను ఎంపిక చేసుకోవడం పవన్కే చెల్లింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి తాను పుట్టిపెరిగిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి.. అలాగే పార్టీ ఆవిర్భావ సభ జరిగిన రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేశారు. కానీ పవన్ అటువంటి లెక్కలేమీ లేకుండా.. కేవలం కాపు కుల లెక్కల ప్రాతిపదికన సమీప జిల్లాల నుంచి పోటీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనంత టు గాజువాక వయా లెక్కలేనన్ని స్థానాలు..: జనసేన సభలు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరిగితే.. అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ పవన్ గత ఆరు నెలలుగా చెబుతూ వచ్చారు. అనంతపురంలో పోటీ చేస్తానని ఓ సారి.. కాదు విజయవాడ సెంట్రల్ నుంచి అని మరోసారి.. ఏలూరు, పాడేరు నుంచి పోటీ చేయాలని ఉందని ఇంకోసారి.. ఇలా లెక్కలేనన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఆయన మనసు మాత్రం కాపు కుల లెక్కలవైపే ఉందనే విషయం ఇప్పుడు ఎంచుకున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాలను చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గాజువాకలో ‘గబ్బర్’కు కష్టమే..: కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలోకి దిగుతున్న పవన్కు గెలుపు దక్కే అవకాశం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు వారు గతంలో జరిగిన రెండు ఎన్నికలను ఉదహరిస్తున్నారు. 2009లో గాజువాక నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్, టీడీపీ, పీఆర్పీ.. చతుర్ముఖ పోటీ మధ్య పీఆర్పీ అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య గెలుపొందారు. అయితే ఇక్కడ గెలిచిన వెంట్రామయ్య కంటే కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులకు కలిపి 13 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కేవలం కాంగ్రెస్ తరఫున రెబల్ అభ్యర్థి నిల్చోడంతో ఓట్లు చీలి ఆ ఎన్నికల్లో చింతలపూడి గెలుపొందారన్నది వాస్తవం. ఇక 2014 ఎన్నికకు వచ్చేసరికి చిరంజీవి తన సన్నిహితుడైన నటుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన జీవీ సుధాకర్నాయుడును కాంగ్రెస్ తరఫున పోటీ చేయించారు. జీవీ కోసం చిరంజీవి స్వయంగా గాజువాక వచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. కానీ జీవీ కేవలం రెండున్నర వేల ఓట్లు కూడా సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఇక్కడ వైఎస్సార్సీపీ తరఫున తిప్పల నాగిరెడ్డి బరిలో ఉండగా.. టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. తరతరాలుగా గాజువాక ప్రాంతంలో స్థిరపడ్డ తిప్పల కుటుంబానికి చెందిన నాగిరెడ్డికి కులమతాలకతీతంగా ప్రజలకు సేవలందించే మంచి మనిషిగా పేరుంది. ఇక టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్.. భూ దందాలు, సెటిల్మెంట్లతో ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థిగా పవన్ రంగంలోకి దిగినప్పటికీ.. స్థానిక, గత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే వైఎస్సార్సీపీ అభ్యర్థే ఇక్కడ గెలిచే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భీమవరంలోనూ అదే లెక్క.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని పవన్ పోటీకి నిలవగా.. గత ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ కూడా ఆయనకు కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009లో భీమవరంలో చిరంజీవికి చెందిన ప్రజారాజ్యం పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అప్పట్లో పీఆర్పీ అభ్యర్థిపైనా కాంగ్రెస్ అభ్యర్థికి 23 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. అంతెందుకు పక్క నియోజకవర్గం పాలకొల్లు నుంచి స్వయంగా చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణిపై దారుణంగా ఓడిపోయారు. కానీ పవన్ మాత్రం కాపుల ఓట్లన్నీ గంపగుత్తుగా తనకే వస్తాయన్న ధీమాతో బరిలోకి దిగారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. మూడో అభ్యర్ధిగా పవన్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ ముక్కోణపు పోటీలో కాపులతో పాటు నియోజకవర్గంలో కీలకమైన క్షత్రియ, మత్స్యకార, దళిత వర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. గ్రంథి శ్రీనివాస్కు ఆయా వర్గాల నుంచి పుష్కలంగా మద్దతు లభిస్తోంది. దీంతో ఇక్కడ కూడా ఆయన ‘లెక్క’ నిజమయ్యే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
విశాఖలో ఘోర విషాదం..!
-
విశాఖలో ఘోర విషాదం..!
విశాఖపట్నం : జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఓ డబ్బాలోని గుర్తు తెలియని ద్రావణాన్ని మద్యంగా భావించిన కొందరు వ్యక్తులు దానిని సేవించారు. అది విషతుల్యమైనది కావడంతో ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన గురించి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ మీడియాతో మాట్లాడారు. బాధితులు తాగిన ద్రావణం ఏమిటో తెలియడం లేదని, దాంతో చికిత్సకు విఘాతం కలుగుతోందని అన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించామని తెలిపారు. ఘటనపై ఎక్సైజ్, పోలీస్ అధికారుల దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు. -
గాజువాక శ్రీకన్య కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
గాజువాక(విశాఖ): విశాఖ జిల్లా గాజువాకలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెయిన్రోడ్లోని శ్రీకన్య కాంప్లెక్స్లోని శ్రీకన్య, శ్రీకన్య హెవెన్ థియేటర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో రెండు, మూడు అంతస్తులు దగ్ధమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని థియేటర్ యాజమాన్యం, పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో థియేటర్ల నుంచి పొగలు వస్తున్నట్టు స్వీపర్ చిట్టెమ్మ నుంచి సమాచారం అందుకున్న మేనేజర్ రమణబాబు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే రెండు థియేటర్లలోని ప్రొజెక్టర్లు, తెర (స్క్రీన్)లు, కుర్చీలు, ఏసీ యూనిట్లు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. థియేటర్పైనున్న సెల్ టవర్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. గాజువాక, పారిశ్రామిక ప్రాంత పరిధిలోని పెదగంట్యాడ, గాజువాక ఆటోనగర్ అగ్నిమాపక శకటాలతోపాటు, హెచ్పీసీఎల్, షిప్యార్డు, కోరమాండల్, స్టీల్ప్లాంట్ తదితర పరిశ్రమలకు చెందిన అగ్నిమాపక శకటాలతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను విస్తరించకుండా నిలువరించారు. ఘటనలో సుమారు మూడు కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు థియేటర్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే డీసీపీ ఫకీరప్ప, సౌత్ ఇన్చార్జి ఏసీపీ రంగరాజు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
విశాఖలో అగ్నిప్రమాదం; రెండు థియేటర్లు దగ్ధం
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలోని కన్య, శ్రీకన్య సినిమా హాల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జంట థియేటర్లలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో రెండు థియేటర్లు పూర్తిగా తగలబడిపోయాయి. ఆరు ఫైర్ ఇంజన్లతో అధికారులు మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. థియేటర్పైన సెల్ టవర్స్ కూడా ఉండటంతో వారు మరింత భయాందోళన చెందారు. అక్కడికి చేరుకున్న అధికారులు తొలుత నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత మరో రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగనట్టుగా తెలుస్తోంది. -
ప్రజలతో మమేకమై...
సాక్షి, అగనంపూడి (గాజువాక) : జీవీఎంసీ 55వ వార్డు పెదగంట్యాడ మండల శివారు గ్రామాల్లో రాజ్య సభ సభ్యులు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బైక్ర్యాలీగా వెళ్లి గ్రా మాల్లోని పెద్దలు, మహిళలు, గ్రామ నాయకులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హా మీ ఇచ్చారు. మెడ్టెక్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన పర్యటన మదీనాబాగ్, ఇస్లామ్పే ట, పెదపాలెం, చినపాలెం, పిట్టవానిపాలెం, మరడదాసుడుపేట, దేవాడ, ఒనుముదొడ్డి, యల మంచిలిదొడ్డి, నమ్మిదొడ్డి, ఈసరవానిపాలెం, గొరుసువాని పాలెం, భూసదొడ్డి, పాలవలస, మురిభాయి, చేపలపాలెం (అప్పికొండ) సోమేశ్వరస్వామి గుడి, అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో వరకు సాగింది. ముందుగా మెడ్టెక్ భూ సమస్య, ఉపాధిపై విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎండీ దావూద్, పెదపాలెం, చినపాలెం గ్రామపెద్దలు మదీనా వ ల్లీ, బాదుల్, సన్నా, అన్వర్, ఆదిల్, బాబాలు వినతిపత్రాలు అందించారు. ఇస్లామ్పేటకు చెందిన 162 మంది ఎక్స్సర్వీస్ మెన్లకు చెందిన భూములను మెడ్టెక్ కోసం సేకరించి కనీసం నష్ట పరి హారం కూడా చెల్లించకపోడంపై స్థానికులు ఆవేదన చెందారు. సర్దార్ మాస్టర్, మహమ్మద్ ముస్తాఫాల సారధ్యంలో వీరు వినతిపత్రాన్ని అందించారు. మసీదుకు ట్రాన్స్ఫార్మర్, జనరేటర్లు కావాలని కోరడంతో విజయసాయిరెడ్డి స్పందించి జనరేటర్ను తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇస్లామ్పేట, పెదపాలెం, చినపాలెంకు చెంది న 5380 ఎకరాల వక్ఫ్బోర్డు భూములకు ఈనా మ్ చట్టం ప్రకారం పట్టాలిచ్చి రద్దుచేశారు. పాత రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. పిట్టవానిపాలెంలో ఎన్టీపీసీ ఫ్లయాస్ వల్ల పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు విజయసాయి రెడ్డికి పిట్టా సింహాచలం, బొట్ట అప్పలరెడ్డి, బట్టు వెంకటరెడ్డి, సావిత్రి విజయసాయిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. హిందూజా రైలు పట్టాల కోసం సేకరించిన భూములకు సంబంధించి నష్ట పరిహారం చెల్లించలేదని పి.నాగేశ్వరరావు, వి.వెంకటరావు, సోంబాబు, నౌషద్ తదితరులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. హుద్హుద్ తుఫాన్ వల్ల ఈసరపువానిపాలెంలో సామాజిక భవనం దెబ్బతిందని, నేటికీ వాటిని పునర్నించమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఈసరపు వెంకటరావు, దాకారపు అప్పారావు, జగ్గారావు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. గొరుసువానిపాలెంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలపై మద్ది అప్పారావు, రమణ, అప్పలనాయుడు, కనకరెడ్డి, బసా రమణరెడ్డి తదితరులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరంఎంపీ విజయసాయిరెడ్డిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. భూసదొడ్డిలోని అమ్మవారి ఆలయంలో విజయసాయిరెడ్డి పూజలు చేసిన అనంతరం పాలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా హిందూజా పవర్ప్లాంట్ డ్రైనేజీ తవ్వడంతో వర్షాలకు ఇబ్బందులు పడుతున్నామని మద్ది పైడిరెడ్డి, రావాడ అప్పలరెడ్డి, వెంపాడ పైడిరెడ్డి తదితరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మురుభాయి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో భూములన్నీ స్టీల్ప్లాంట్ ఆధీనంలో ఉన్నాయి. గ్రామం అడుగుపెట్టాలాన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించాలని నాయకులు దేముడు, గౌరేష్, తాతారావు వేడుకున్నారు. అప్పికొండ (చేపలపాలెం)లోని సోమేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. స్టీల్ప్లాంట్ కలుషిత జలాలను సముద్రంలోకి వదిలేస్తుందని, శుద్ధి చేసి నీటిని వదలాల్సి ఉండగా, వ్యర్థ నీటినే వదులుతుండంతో స్థానికులు ¿¶ఆందోళన చెందుతున్నామని నాయకులు పంది అప్పారావు, దాసరి తాతారావు చెప్పారు. తరువాత అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో గ్రామాల్లో పర్యటించారు. వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, 55వ వార్డు సమన్వయకర్త బట్టు సన్యాసిరావు సార«ధ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయ్ప్రసాద్, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కళ్యాణి, జిల్లా నాయకులు బర్కత్ ఆలీ, పక్కి దివాకర్, రవిరెడ్డి, సీఈసీ సభ్యులు పైలా శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు రాము నాయుడు, 56, 57, 60 వార్డుల అధ్యక్షుడు పూర్ణానందశర్మ, దాడి నూకరాజు, దాసరి రాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గెడ్డం ఉమ పాల్గొన్నారు. -
తొలిరోజు టెట్ ప్రశాంతం
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు నగరంలో 11 కేంద్రాలను (షీలానగర్, చినముషిడివాడ, పెదగంట్యాడ, శొంఠ్యాం, కొమ్మాది, బక్కన్నపాలెం, గుడిలోవ, పీఎంపాలెం, గంభీరం, ఏవీఎన్ కాలేజీల్లో) ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సెషన్లో 1990 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1922 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 2840 మందికి 2742 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇలా ఉదయం పరీక్షకు 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 98 మంది వెరసి 166 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు నిబంధన విధించారు. అందుకనుగుణంగానే ఆయా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పెందుర్తి: టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని ఇయాన్ డిజిటల్ జోన్–1, జోన్–2 కేంద్రంగా ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు దాదాపు గంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషాల్లో కేంద్రానికి రావడంతో ఆత్రుతగా పరుగులు తీశారు. ఆయా కేంద్రాల్లో ఈ నెల 19 వరకు జోన్–1లో 6,750 మంది, జోన్–2లో 17,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కిరెడ్డిపాలెం(గాజువాక): షీలానగర్ ఆయాన్ సెంటర్లో టెట్ ఆదివారం మధ్నాహ్నం జరిగింది. ఈ పరీక్షకు 600 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లి అలకండి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి కర్రి స్వాతి టెట్ పరీక్షకు హాజరయ్యారు. -
గాజువాకను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి
సాక్షి, విశాఖపట్నం : గాజువాక ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. సమస్యలు కూడా అలానే వెంటాడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు గడిచినా గాజువాక హౌజింగ్ కమిటీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా శుక్రవారం గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఉక్కు నిర్వాసితులకు చంద్రబాబు మొండిచేయి చూపించారని అన్నారు. ఆర్ కార్డు హోల్డర్లకు వయోపరిమితి దాటిపోయిందని అన్నారు. వారికి రూ. 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినా.. ఇవాళ్లికి చెల్లించలేదని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్ భూముల్లో స్పోర్ట్స్ హబ్ కడతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అది అడియాసే అయిందని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పారు. -
ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు
గాజువాక: ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవెంకటేశ్వర సెక్యూరిటీస్ అండ్ ప్లేస్ మెంట్స్ పేరుతో రైల్వేలో, సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొంత మంది దగ్గర డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. నిందితులు బాధితుల దగ్గర సుమారు రూ.3.3 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. సంస్థ నిర్వాహకులు నంబాల ఆనందకుమార్, మొదలవలస నాగరాజు, ఈశ్వరప్రసాద్ లను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. -
గాజువాక సబ్రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు
విశాఖపట్టణం: గాజువాక సబ్రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో వెంకయ్యనాయుడుకు చెందిన ఆస్తులపై విశాఖ, తిరుపతిలోని ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. గతంలో మధురవాడ సబ్రిజిస్ట్రార్గా ఉన్న సమయంలో కూడా ఆయన ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది. గత మూడేళ్లుగా గాజువాక సబ్రిజిస్ట్రార్గా వెంకయ్యనాయుడు విధులు నిర్వహిస్తున్నారు. -
పెళ్లి పేరుతో ఎగతాళి
⇒ యువతికి అక్రమ సంబంధం అంటగట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ⇒ గాజువాక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ⇒ 50 రోజుల తర్వాత తమ పరిధి కాదన్న పోలీసులు ⇒ మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితురాలి ఆరోపణ ⇒ పెళ్లి కొడుకును అరెస్టు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ గాజువాక : ఒక యువతితో వివాహం కుదుర్చుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కట్నం ఎక్కువ వస్తుందనే దురాశతో మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. పెళ్లి పేరుతో యువతిలో రేపిన ఆశలను అక్రమ సంబంధం అంటగట్టి తుంచేశాడు. అందుకోసం ఒక బినామీ ప్రేమికుడిని సృష్టించాడు. పెళ్లి పెద్దలను సైతం పక్కన పెట్టేశాడు. లగ్న పత్రిక రాసుకున్న తర్వాత ఇలా చేయడం అన్యాయం బాబూ అని వేడుకున్న యువతి తల్లిదండ్రులను దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు. దిక్కులేక ఖాకీలను ఆశ్రయించిన బాధితురాలిని 50 రోజులపాటు తమ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్న గాజువాక పోలీసులు ఇప్పుడా కేసు తమ పరిధిలోకి రాదంటూ చల్లగా సెలవిచ్చారు. ఈ తతంగం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితులు బోరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. ఈ మేరకు గాజువాకలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు వివరించింది. ఆమె కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన దుంగా అప్పలనాయుడు కుమారుడు పాపారావు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. గాజువాక దరి శ్రీనగర్ అఫీషియల్ కాలనీకి చెందిన రెడ్డి పిన్నన్న కుమార్తె వసంత కుమారిని వివాహం చేసుకోవడానికి పెద్దల ద్వారా సంబంధం ఖాయం చేసుకున్నాడు. రూ.9.5లక్షల కట్నం, ఇతర లాంఛనాలు చెల్లించడానికి పిన్నన్న అంగీకరించడంతో వచ్చే నెల 7న వివాహం చేయాలని నిర్ణయించుకొని లఘ్నపత్రిక రాసుకున్నారు. ఇంతలో ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం కుదరడంతో వసంత కుమారిని వదిలించుకునేందుకు పాపారావు ఓ స్కెచ్ వేశాడు. ఆమెకు ఫోన్ చేసి ‘నీకు ఎవరితోనే ప్రేమ వ్యవహారం ఉందని విన్నాను. ఆ వ్యక్తి నాకు మెసేజ్లు పంపుతున్నాడు. అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోన’ని చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాపారావు తల్లిదండ్రులను సంప్రదించారు. వారు కూడా తమ కుమారుడినే సమర్థించి ఈ వివాహం చేసుకోబోమని స్పష్టం చేశారు. పెళ్లి పెద్దలు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడమే కాక సెటిల్మెంట్ చేసుకుందామంటూ మాట్లాడారు. ఎక్కువ కట్నానికి ఆశపడి వేరే యువతితో వివాహం కుదర్చుకున్నారని, ఈ నెల 24న ఆమెతో వివాహం జరగనుందని వసంత కుమారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తమను మోసం చేసిన పాపారావు, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని బాధితులు ఫిబ్రవరి 12న గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పాపారావు, అతడి తల్లిదండ్రులను గాజువాక పోలీసులు స్టేషన్కు పిలిపించారు. విచారణలో ప్రేమ వ్యవహారం అంతా కట్టుకథ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికి 50 రోజులు అయినప్పటికీ బాధితుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. దీనిపై మహిళా చేతన ప్రతినిధులు పది రోజుల క్రితం పోలీసులను నిలదీయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ ఆరు రోజులు తిప్పించుకున్నారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేయడానికి అన్ని అవకాశాలున్నప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడు కార్యాలయం నుంచి వస్తున్న ఫోన్ల వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదని కత్తి పద్మ ఆరోపించారు. పోలీసులు మంత్రి కనుసన్నల్లో నడిచి యువతికి అన్యాయం చేశారన్నారు. పాపారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. సీఐఎస్ఎఫ్ అధికారులు స్పందించి అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
తప్పుడు పత్రాలకు పచ్చజెండా
►ఆక్రమణలకు రెవెన్యూ అధికారి అండ ►విలువైన 4వేల గజాల స్థలం కబ్జాకు యత్నాలు ►నకిలీ పట్టాలతో ప్లాట్ల విక్రయాలకు బేరసారాలు ►అగనంపూడిలో రియల్టర్ అక్రమ దందా ►తెర వెనుక టీడీపీ మాజీ కార్పొరేటర్, ప్రజాప్రతినిధి అనుచరుడు ►గతంలో నమోదైన కేసులు బుట్టదాఖలు? లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి..సొమ్ము చేతులు మారిపోతోంది.. ప్లాట్ల విభజన.. స్థలం చదును కార్యక్రమాలు కూడా చకచకాసాగిపోతున్నాయి.. మొత్తానికి కోట్ల విలువైన నాలుగువేల గజాల ప్రభుత్వ స్థలం.. ప్రైవేట్ ప్లాట్లుగా మారిపోతోంది.. దీని వెనుక పాత్రధారి ఓ రియల్టర్ కాగా.. ఓ టీడీపీ మాజీ కార్పొరేటర్, మరో ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు సూత్రధారులుగా చక్రం తిప్పుతున్నారు.. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన తహసీల్దార్ వారికి వెన్నుకాస్తున్నారు.. తన కింది సిబ్బంది ఆ ఛాయలకు పోకుండా అడ్డుచక్రం వేశారు. గతంలో వారు స్వాధీనం చేసుకున్న జేసీబీని తిరిగి ఇచ్చేయడమే కాకుండా.. అప్పట్లో ఆక్రమణదారులపై నమోదు చేసిన కేసుల జోలికి వెళ్లకుండా అడ్డుగా నిలుస్తున్నారు. ఇదేమిటని అడిగితే వారు చూపిన పట్టాలు నిజమైనవేనని సమర్థించుకుంటున్నారు.. రుజువేమిటంటే తన ఆఫీసులో రికార్డు కాపీలు లేవని సెలవిస్తున్నారు. గాజువాక: గాజువాక మండలం అగనంపూడి సర్వే నంబర్ 42లో ఉన్న సుమారు నాలుగువేల గజాల ప్రభుత్వ స్థలంపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికార టీడీపీ నేతలను ఆశ్రయించాడు. వారి దన్నుతో అక్రమణ పర్వానికి తెర తీశాడు. శనివాడ మూడు రోడ్ల సమీపంలోని వేపచెట్టు జంక్షన్ వద్ద గల ఈ ఖరీదైన స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయించడానికి స్కెచ్ వేశాడు. మార్కెట్ ధర ప్రకారం గజం సుమారు రూ.30 వేలు పలుకుతుండటంతో తొలుత 1200 గజాల స్థలాన్ని తొమ్మిది ప్లాట్లుగా విభజించి నకిలీ పట్టాలు సృష్టించారు. ఒక్కో ప్లాట్ను రూ.15 లక్షలు చొప్పున అమ్మకానికి ఒప్పందాలు కుదుర్చుకొని కొంతమంది నుంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. ప్లాట్లను అభివృద్ధి చేయడానికి జేసీబీతో స్థలాన్ని చదును చేయించే పనులు కూడా ప్రారంభించడంతో స్థానికుల నుంచి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది పనులను ఆపించి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుడిపై దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు సంబంధిత ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దాంతో ఆక్రమణదారుడి తరఫున మాజీ కార్పొరేటర్తోపాటు ప్రజాప్రతినిధి కీలక అనుచరుడు రంగంలోకి దిగి రెవెన్యూ అధికారి దన్నుతో మంత్రాంగం నడిపారు. వారి అడుగులకు మడుగులొత్తిన రెవెన్యూ అధికారి జేసీబీని విడుదల చేశారు. దాదాపు మూడు నెలల విరామం తరువాత ఆక్రమణదారుడు ప్రభుత్వ స్థలంలోని హెచ్చరిక బోర్డును అక్కడ్నుంచి చివరకు జరిపాడు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులుగానీ, సిబ్బందిగానీ అటువైపు కన్నెత్తి చూడటం మానేశారు. ఆక్రమణదారుడికి కొమ్ముకాసిన అధికారి ఆక్రమిత స్థలానికి కబ్జాదారుడు సృష్టించిన పట్టాలు నిజమైనవిగా తహసీల్దార్ ధ్రువీకరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారుడు చూపించిన పట్టాలకు కార్యాలయంలో ఎలాంటి నకళ్లు లభించలేదు. అతడిపై కేసు నమోదైన మూడు వారాల తరువాత గుట్టచప్పుడు కాకుండా ఆ పట్టాలను నిజమైనవిగా నిర్థారిస్తూ ఎండార్స్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఆ స్థలానికి ఆనుకొని వుడా అనుమతి పొందిన ప్రైవేట్ లే అవుట్ ఉంది. ఆ లే అవుట్ ఏర్పాటు సమయంలో ప్రస్తుత ఆక్రమిత స్థలానికి ఆనుకొని 60 అడుగుల రోడ్డు ఏర్పాటు చేశారు. రోడ్డు స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి సంబంధిత నాయకులు, ఆక్రమణదారుడు దాన్ని తమ పట్టాల్లో 40 అడుగుల రోడ్డుగా చూపించారు. ఆ రోడ్డుకు ఆనుకొని జీవీఎంసీ నిధులతో కాలువలు కూడా నిర్మించారు. ఆ కేసుల సంగతేంటో... ఆక్రమణదారుడిపై నమోదు చేసిన కేసుల విషయాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం దాటవేస్తున్నారు. స్థలంలో పని చేస్తున్న జేసీబీని వీఆర్వో శశిధర్ తమ సిబ్బందితో వెళ్లి గత ఏడాది అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. 16న దువ్వాడ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో వారు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడి పెరగడంతో అసలు నిందితుడిని తప్పించిన రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో పని చేస్తున్న కార్మికులపైన, జేసీబీ డ్రైవర్పైన కేసులు నమోదు చేశారు. సెక్షన్ 447, సెక్షన్ 427 రెడ్విత్ 34 ఐపీసీతోపాటు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు సెక్షన్ 3, 4 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇన్ని సెక్షన్ల ప్రకారం నమోదు చేసిన కేసులు ఇప్పుడు బుట్టదాఖలయ్యాయి. దీంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి నిందితులు మళ్లీ పావులు కదుపుతున్నారు. పట్టాలకు ఓసీలను పరిశీలిస్తాం... ఆ సర్వే నంబర్లో కొంతమంది పేదలకు గతంలో పని చేసిన తహసీల్దార్ జ్యోతిమాధవి నివాస పట్టాలు జారీ చేశారు. లబ్ధిదారులు వాటిని తనవద్దకు తెచ్చి చూపగా.. పరిశీలించి నిజమైనవిగా నిర్థారించాను. ప్రస్తుతం వాటికి సంబంధించిన నకళ్లుగాని, ఆఫీస్ కాపీలుగాని లభించడంలేదు. మాది పెద్ద కార్యాలయం. ఫైళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కనిపించలేదు. మళ్లీ మా సిబ్బందితో వెతికిస్తాను. ఆ స్థలాలను లబ్ధిదారులే అనుభవించాలి. ఆ పట్టాలతో వ్యాపారం చేసే కార్యక్రమానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.వి.ఎస్.రవి, గాజువాక తహసీల్దార్ -
‘ఘన’పతి.. ప్రత్యేకత ఇదీ...
గిన్నిస్ రికార్డుపై కన్నేసిన గణనాథుడు గాజువాకలో 78 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం ప్రత్యేక అనుమతులు పొందిన నిర్వాహకులు గాజువాక : గాజువాక వినాయకుడు గిన్నిస్ రికార్డువైపు చూస్తున్నాడు. దేశంలోనే ఎల్తైన విగ్రహంగా రూపుదిద్దుకొంటున్న ఈ ‘ఘన’నాథుడు మొత్తం మట్టితోనే తయారవుతుండటం విశేషం. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు గత ఎనిమిదేళ్లుగా ప్రసిద్ధి పొందిన గాజువాకలో నిర్వాహకులు ఈ ఏడాది లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎల్తైన గణపతి విగ్రహంతోపాటు అత్యంత భారీ సైజులో లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈ విగ్రహం వద్ద నైవేధ్యంగా ఉంచుతున్నారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు... విశాఖ ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (విశ్వ) ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ఈ ఉత్సవాల్లో ప్రతిదీ ఒక ప్రత్యేకతగా రూపుదిద్దుతున్నారు. వినాయక విగ్రహాన్ని దశావతార గణపతిగా రూపొందిస్తున్నారు. – విగ్రహాన్ని 30 అడుగుల వెడల్పు, 78 అడుగుల ఎత్తులో తయారు చేస్తున్నారు. అన్ని అడుగుల ఎల్తైన ఈ విగ్రహం అత్యల్ప బరువుతో ఉండటం విశేషం. దీనికోసం టన్నునర ఎర్రమట్టి, 500 కేజీల ఊక, 500 కేజీల గోనె సంచులను ఉపయోగించడంతోపాటు, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తున్నారు. – ఈ విగ్రహం కోసం దాదాపు 95 నుంచి 100 అడుగుల ఎత్తయిన మండపం నిర్మిస్తున్నారు. వీటికోసం సరుగుడు కర్రలు, వెదురు కర్రలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీనికోసం 150 టన్నుల కలపను ఉపయోగిస్తున్నారు. కేవలం కర్రలను ఉపయోగించి ఇంత ఎత్తయిన మండపం తయారు చేయడం కూడా ఇదే తొలిసారని నిర్వాహకులు చెబుతున్నారు. అందువల్లే ఈ మండపం కూడా ఈసారి గిన్నిస్, లిమ్కాబుక్ల రికార్డుల పరిశీలనకు వెళ్లనుంది. – ఈనెల 5 ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు 21 రోజులపాటు కొనసాగనున్నాయి. విశాలమైన లంకా మైదానంలో ఉత్సవ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విగ్రహాన్ని ప్రతిష్ఠంచినచోటే నిమజ్జనోత్సవం కూడా నిర్వహించనున్నట్టు విశ్వ ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై తొలిపూజతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. – భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంలో కూడా ప్రత్యేకత సంతరించుకొనే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నారు. బాలింతలకు, చిన్నపిల్లలతో వచ్చినవారికి, గర్భిణులకు దర్శనం కల్పించడంలో అసౌకర్యం, ఆలస్యం లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 12.5 టన్నుల లడ్డూ నైవేథ్యం వినాయక ఉత్సవాల్లో స్వామివారికి నైవేధ్యంగా 12.5 టన్నుల లడ్డూను తయారు చేయిస్తున్నారు. ఈసారి కూడా లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లడ్డూను తయారు చేసే బాధ్యతను రాజమండ్రి ప్రాంతానికి చెందిన సురుచి స్వీట్స్ యాజమాన్యానికి అప్పగించారు. రూ.30లక్షల విలువైన ఈ భారీ లడ్డూను సురుచి స్వీట్స్ యాజమాన్యం ఉచితంగా అందజేసేందుకు ముందుకొచ్చింది. వినాయకలడ్డూల తయారీ కోసం స్వీట్స్ తయారీ సంస్థ యజమాని మల్లిబాబుతోపాటు మరో 20 మంది వినాయక మాలను ధరించారు. ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ సైజు... గాజువాకలో తొలిసారిగా 2009లో ఏర్పాటు చేసిన భారీ వినాయక ఉత్సవాల సందర్భంగా లంబోదరుడికి కేవలం 50 కేజీల లడ్డూను మాత్రమే నైవేద్యంగా పెట్టారు. ఆ తరువాత ఏడాది 400 కేజీల లడ్డూ, ఆ మరుసటి ఏడాది 500 కేజీల లడ్డూ నైవేధ్యంగా పెట్టిన నిర్వాహకులు 2014 ఏకంగా ఎనిమిదిన్నర టన్నుల లడ్డూను నైవేధ్యంగా పెట్టారు. అంతవరకు ఖైరతాబాద్ వినాయకునివద్ద ఏర్పాటు చేసిన నాలుగు టన్నుల లడ్డు రికార్డును గాజువాక నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎనిమిదిన్నర టన్నుల లడ్డూ అధిగమించింది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్లో దీన్ని తయారు చేయించారు. గత ఏడాది విశ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన 80 అడుగుల వినాయక ఉత్సవాల్లో పది టన్నుల లడ్డూను ప్రసాదంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదంతా స్వామి అనుగ్రహం... గత ఏడాది మేము వినాయక ఉత్సవాలను నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని ప్రారంభించాం. పదిన్నర టన్నుల లడ్డూను స్వామివారికి నైవేధ్యంగా పెట్టగలిగాం. విగ్రహం రూపు కూడా పూర్తిస్థాయి దైవత్వంతో ఎంతో అందంగా వచ్చింది. ఇదంతా వినాయకుడి అనుగ్రహంవల్లే సాధ్యమైంది. ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించాలని ముందుగా అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని మూడు వారాల క్రితం ప్రారంభించాం. ఆయన అనుగ్రహం ఉండడంవల్లే భారీ ఉత్సవాన్ని నిర్వహించడానికి అన్నీ కుదిరాయి. అంతపెద్ద లడ్డూను స్వామివారికి నైవేధ్యంగా పెట్టడానికి అవకాశం కలిగింది. – పల్లా రమణ యాదవ్, విశ్వ అధ్యక్షుడు ప్రత్యేక అనుమతితో విగ్రహ తయారీ... భారీ విగ్రహాల ఎత్తు విషయంలో హైకోర్టు పరిమితి విధించిన నేపథ్యంలో గాజువాకలో 78 అడుగుల విగ్రహ తయారీకి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్టు విశ్వ అధ్యక్షుడు రమణ యాదవ్ తెలిపారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించినచోట కాకుండా వేరే ప్రాంతానికి తరలించి నిమజ్జనం చేసే విగ్రహాలకు మాత్రమే ఎత్తు విషయంలో పరిమితులున్నాయని చెప్పారు. తాము ప్రతిష్ఠించినచోటే విగ్రహాన్ని నిమజ్జనం కూడా చేస్తామని, అందువల్ల తమకు అనుమతి అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ ఐదు ప్రభుత్వ శాఖలనుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్టు చెప్పారు. -
కలామ్కు విగ్రహం
గాజువాక: భారతీయ క్షిపణి పితామహుడు, భారతరత్న, మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిని తన మదినిండా నింపుకున్న స్థానిక ట్వింకిల్ స్కూల్ కరస్పాండెంట్ ఏకంగా కలామ్ విగ్రహాన్ని తయారు చేయించారు. మిసైల్ మ్యాన్ మొదటి వర్థంతి సందర్భంగా దాన్ని తన పాఠశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంటే కలామ్కు అత్యంత ఇష్టమన్న విషయం తెలిసిందే. అందువల్ల ఆయన స్ఫూర్తిని ప్రతిరోజూ విద్యార్థులకు తెలిసేలా చేయడం కోసం పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద విగ్రహాన్ని ప్రతిషి్ఠంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికోసం మూడు అడుగుల ఎల్తైన పీఠం నిర్మించారు. ఆరు అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. ప్రతిషి్ఠంచిన తరువాత ఇది తొమ్మిది అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. దీనికోసం స్టీల్, సిమెంట్, మార్బుల్ పౌడర్ను ఉపయోగించినట్టు పాఠశాల కరస్పాండెంట్ దొడ్డి శ్యామ్ తెలిపారు. ఇది జిల్లాలోనే తొలి విగ్రహమని పేర్కొన్నారు. గుడి కడదామనుకున్నా... ‘విశాఖ జిల్లాలో కలామ్ తనకు అరుదైన గుర్తింపును ఇచ్చారని శ్యామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘మా స్కూల్కు వచ్చి గంటా రెండు నిమిషాలు మా విద్యార్థులతో గడిపారు. మా స్కూల్కు వచ్చారు కాబట్టి ఆయన జ్ఞాపకాలను శాశ్వతంగా ఉంచుకోవడం కోసం ఈ ప్రయత్నం చేశాను. ఆయన రగిలించిన స్ఫూర్తిని విద్యార్థులందరిలోను రోజూ నింపడానికి ఈ ప్రయత్నం చేశాను. గురువు (కలామ్)కు గుడి కడదామనుకున్నాను. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఆలస్యమైనా ఆలయం మాత్రం కడతాను. ఆయన పేరుమీద 50 మంది పేద విద్యార్థులను చదివిస్తున్నాను. దీనికోసం ఎవరివద్దా ఏ విధమైన సహకారం తీసుకోవడంలేదు. తమిళనాడులో స్మారక స్థూపం కడతామని ప్రకటించి కూడా కట్టకుండా వదిలేశారు. ఇది చాలా బాధగా ఉంద’ని శ్యామ్ పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి
గాజువాక: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ కార్మికుడు మృతి చెందాడు. శనివారం ఉదయం విశాఖ నగరంలోని గాజువాక ప్రాంతంలో బీహెచ్ఈఎల్ సిగ్నల్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు కార్మికులు సైకిళ్లపై వెళుతుండగా హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఓ కార్మికుడిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు ఒడిస్సా కు చెందిన వాడిగా గుర్తించారు. -
వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
అల్లీపురం: విశాఖ పట్నం, గాజువాక ఆర్టీవో కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నరమేష్ ఇంటిపై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో రమేశ్కు సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. విశాఖపట్నంలోని సీతమ్మధార, మురళీనగర్ ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. -
'ఆ మద్యం' అమ్ముతూ పట్టుబడ్డాడు!
గాజువాక : ఏపీలో ఇప్పటికే ఓపెన్ బార్లు, వైన్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. ఇది చాలదన్నట్లు ఓ వ్యక్తి వెరైటీగా మద్యం విక్రయిస్తూ కటాకటాల పాలయిన ఘటన వైజాగ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... గాజువాక బీసీ రోడ్డుకు చెందిన శంకర్రావు అనే వ్యక్తి డిఫెన్స్ మద్యాన్ని విక్రయిస్తున్నాడు. నేవీ ఉద్యోగులకు సరాఫరా చేసే మద్యాన్ని తక్కువ ధరకు శంకర్రావు కొనుగోలు చేసేవాడు. దానిని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిపై ఎక్సైజ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో అతని ఇంటిపై దాడి చేసి 150 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వినాయక మండపం వద్ద విషాదం
గాజువాక (విశాఖపట్నం) : వినాయక మండపం వద్ద విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని పాత గాజువాక ప్రాంతంలోని డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. డ్రైవర్స్ కాలనీకి చెందిన సాయి(20) మండపం వద్ద పూజకు వెళ్లగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. -
దర్గాలో చోరీ
గాజువాక (విశాఖపట్నం) : గాజువాకలోని బీసీ రోడ్డులో గల దర్గాలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు దర్గాలోని హుండీ పగులగొట్టి అందులోని సొత్తుతో ఉడాయించారు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి రూ.40 వేలు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నేత ఇంట్లో 18 సిలిండర్లు స్వాధీనం
గాజువాక (విశాఖ) : అర్హులకు అందాల్సిన సిలిండర్లు పక్కదారి పడుతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో కొందరు టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని 50 వ వార్డుకు చెందిన టీడీపీ నగర కార్యదర్శి దొడ్డి రమణ ఇంట్లో నిరుపేదలకు అందాల్సిన సిలిండర్లు లభ్యమయ్యాయి. అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచారనే సమాచారంతో.. ఆయన నివాసంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 సిలిండర్లు, 21 రెగ్యులేటర్లు, 24 గ్యాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
గాజువాకలో 40 మంది అరెస్ట్
విశాఖపట్టణం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న కేంద్రం వైఖరిపై ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అందులోభాగంగా ఆ పార్టీలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. గాజువాకలో బంద్ నిర్వహిస్తున్న కాంగ్రెస్, సీపీఐ నేతలు, కార్యకర్తలు మొత్తం 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. -
టన్ను రేషన్ బియ్యం స్వాధీనం
గాజువాక: విశాఖపట్టణం నగరం గాజువాక ప్రాంతంలో ఆదివారం రాత్రి టన్నుకు పైగా చౌక బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గాజువాక ప్రాంతంలోని ఓ ఇంట్లో మొత్తం 21 సంచుల్లో 50 కిలోల చొప్పున ఉన్న 1050 కిలోల బియ్యాన్ని వాహనంలోకి ఎక్కిస్తుండగా గస్తీ పోలీసులు గుర్తించారు. ఆ బియ్యాన్ని సీజ్ చేసి, అందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, అధికారులంతా ముఖ్యమంత్రి పర్యటన కారణంగా బిజీగా ఉండటంతో మంగళవారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
నాలుగేళ్ల బాలుడిపై బంధువు దాష్టీకం
-
విషవాయువులు పీల్చి ఏడుగురు కూలీలకు అస్వస్థత
గాజువాక (విశాఖపట్టణం): విషవాయువు పీల్చి ఏడుగురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాక సమీపంలోని రాంనగర్లోని కెమికల్ గోడౌన్లో బుధవారం జరిగింది. వివరాలు.. రసాయనిక పదార్థాల బస్తాలు దించుతుండగా గోడౌన్లో చేరవేస్తుండగా విషవాయువు పీల్చడంతో వారు సొమ్మసిల్లి పడిపోయారు. ఫ్యాక్టరీ యజమానులు వెంటనే వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. -
బాహుబలులు
-
గాజువాక బీహెచ్ఈఎల్లో ప్రమాదం
గాజువాక (విశాఖపట్నం): గాజువాకలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) లో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీహెచ్ఈఎల్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. హెచ్పీవీపీ విభాగంలో ట్యాంకర్ ప్లేట్లు అమరుస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. -
గాజువాక పైడిమాంబ కాలనీలో దొంగలు బీభత్సం
విశాఖపట్నం: విశాఖపట్నం గాజువాకలోని పైడిమాంబ కాలనీలో దోపిడి దొంగలు మంగళవారం అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. టైల్స్ వ్యాపారి ఇంట్లో చోరీ చేసి... 60 తులాల బంగారంతోపాటు రూ. 10 లక్షల నగదు అపహరించి పరారైయ్యారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం గమనించి సదరు టైల్స్ వ్యాపారి పోలీసులకు ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాదచారిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
గాజువాక: విశాఖ జిల్లా గాజువాకలో ఓ ఆర్టీసీ బస్సు నడిచి వెళుతున్న వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో డ్రైవర్గా విధుల్లోకి చేరిన ఓ వ్యక్తి మొదటి రోజే నిర్లక్ష్యంగా బస్సును నడిపి ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. గాజువాక 60 అడుగుల రోడ్డులోని ఓ రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేసే వెంకట నాగేశ్వరరావు (55) శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో పాత గాజువాక జాతీయ రహదారి పైపు వెళుతున్నాడు. అదే సమయంలో ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో ఆర్టీసీ (మరమ్మతులు చేసే) బస్సు ఆగింది. దాని వెనుక నుంచి నాగేశ్వరరావు రోడ్డు దాటుతుండగా సింహాచలం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొంది. రెండు ఆర్టీసీ బస్సుల మధ్యలో నాగేశ్వరరావు నలిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా, బస్సు నడిపిన డ్రైవర్ గురువారమే పరీక్షలో నెగ్గి శుక్రవారం విధుల్లో చేరినట్టు సమాచారం. -
30 కిలోల గంజాయి పట్టివేత
గాజువాక: విశాఖపట్టణం సమీపంలోని గాజువాకలో గంజాయితో సంచరిస్తున్న ఓ హిజ్రాను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడ్ని స్టేషన్కు తరలించారు. అయితే, స్టేషన్కు తీసుకెళ్లిన కొంతసేపటి తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లాలని చెప్పి హిజ్రా పారిపోయినట్టు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు బయటకు వెల్లడించే విషయంలో పోలీసులు తటపటాయిస్తున్నారు. -
శ్రీలంకలో విశాఖ దంపతుల ఆత్మహత్య?
విశాఖపట్నం/కొలంబొ: శ్రీలంకలో విశాఖపట్నంకు చెందిన దంపతులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మృతులు గాజువాక సమీపంలోని శ్రీనగర్ కు చెందిన బొబ్బా పృథ్విరామ్, ఆయన భార్య నాగపోయిన మహలక్ష్మిగా గుర్తించారు. ఈ మేరకు గాజువాక పోలీసులు పృథ్విరామ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొలంబొలోని వెలవెట్టా పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం పృథ్వి, మహాలక్ష్మి మృతదేహాలను కనుగొన్నారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పృథ్విరామ్ మలేసియాలో ఫైనాన్స్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాడు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైనా కారణం వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం
-
భారీ అగ్నిప్రమాదం: 25 పూరిళ్లు దగ్ధం
విశాఖపట్నం: విశాఖపట్నం నగరం గాజువాక మండలం కోరుమన్నపాలెం సమీపంలో యాతపాలెంలో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో బాధితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఈ ప్రమాదంలో 25 పూరిళ్లు దగ్దమైనాయి. రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
‘కూలి’న బతుకులు
గాజువాక: విశాఖలోని గాజువాక పరిధిలోని వడ్లపూడి నిర్వాసిత కాలనీ కణితిలో గోడ కూలిన సంఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఒక సామాజిక భవనం విస్తరణ పనుల కోసం చేపట్టిన పనుల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇదే సంఘటనలో మరో ఇద్దరు కూలీలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కణితి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కనగల ఆర్యవైశ్య సామాజిక భవనం విస్తరణ పనులను మూడు రోజుల కిందట ప్రారంభించారు. మింది దరి గుడివాడ అప్పన్న కాలనీలో నివాసం ఉంటున్న కణితి ఈశ్వరరావు, సాత్రబోయిన అనంతలక్ష్మి , మురళి, రాంబాబు, బంగారమ్మ రెండు రోజులుగా జేసీబీ తవ్విన గోతిలో మట్టిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. వారు ఒక పక్క పని చేస్తుండగా మరోపక్క జేసీబీతో మిగిలిన గొయ్యి తవ్విస్తున్నారు. గొయ్యిని ఆనుకుని ఉన్న పాఠశాల ప్రహరీ కదలడాన్ని కూలీలు గమనించారు. వెంటనే జేసీబీ పని ఆపాల్సిందిగా డ్రై వర్రాముకు కేకలు వేసినప్పటికీ శబ్ధంలో అతడికి వినిపించలేదు. జేసీబీ వైబ్రేషన్కు గోడ మరింత బలహీనపడడంతో కూలీలందరూ గొయ్యి చివరన భాగంలో ఒక మూలకు చేరిపోయారు. గోడ లోపల ఉంటే ప్రమాదమని భావించిన ఈశ్వరరావు, అనంతలక్ష్మి గొయ్యినుంచి బయటకు వచ్చేందుకు గొయ్యి రెండో చివరకు పరుగులు తీశారు. వారు సరిగ్గా గొయ్యి మధ్యకు వచ్చేసరికి పాఠశాల ప్రహరీ ఒక్కసారిగా వారిపై కూలిపోయింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరూ మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఈశ్వరరావు మృతదేహాన్ని స్ట్రెచర్పై బయటకు తీసుకొచ్చారు. అనంతలక్ష్మి మృతదేహం శిథిలాలకింద ఉండిపోవడంతో బయటకు తీయడం సాధ్యం కాలేదు. కొద్దిసేపటికి సంఘటనా స్థలానికి చేరుకున్న జోన్-2 డీసీపీ డాక్టర్ రామ్గోపాల్ నాయక్ దువ్వాడ, గాజువాక సీఐలను ఆదేశించడంతో మరో జేసీబీని తీసుకొచ్చి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజపురానికి చెందిన అతను కూలి పనుల నిమిత్తం ఇక్కడకు వలస వచ్చి అప్పన్న కాలనీలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. అనంతలక్ష్మి స్వస్థలం గుడివాడ అప్పన్నకాలనీగా ఆమె సమీప బంధువులు తెలిపారు. ఆమెకు భర్త, ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఈశ్వరరావు భార్య అర్జునమ్మ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరైంది. రెండుసార్లు స్పృహ తప్పి పడిపోవడంతో బంధువులు ఆమెకు సపర్యలు చేశారు. సంఘటనా స్థలానికి పోలీస్ కమిషనర్ అమిత్గార్గ్, వైఎస్సార్సీపీ నాయకులు అమర్నాథ్, నాగిరెడ్డి చేరుకుని పరిశీలించారు. ఆ ముగ్గురూ మృత్యుంజయులు ఈ గొయ్యిలోనే పని చేస్తున్న మరో ముగ్గురు కూలీలు మృత్యువును జయించారు. ప్రమాదాన్ని గమనించి గొయ్యిలోని ఒక చివర మూలకు వెళ్లిపోయి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నామని ప్రమాదం నుంచి బయట పడిన మురళి, రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు. అప్పటివరకు తమను వెన్నంటే ఉన్న ఈశ్వరరావు, అనంతలక్ష్మి అకస్మాత్తుగా బయటకు పరుగులు తీయడంతో గోడకింద పడిపోయారని, తమకు ఒక్క మాట కూడా చెప్పకుండానే పరిగెత్తి వెళ్లిపోయారని వాపోయారు. -
అగ్రి గోల్డ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
విశాఖపట్నం : విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్డులోని అగ్రిగోల్డ్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో కీలక ఫైళ్లతోపాటు కంప్యూటర్లు కూడా దగ్ధమైనాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించిందని అగ్రిగోల్డ్ యాజమాన్యం తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు
విశాఖపట్నం: విశాఖలో గణపతి లడ్డూ రూ.12.75 లక్షల ధర పలికింది. మాధవధార వద్ద కళింగనగర్లో విజయ వినాయక ఉత్సవ కమిటీ నేతృత్వంలో గణపతి ఉత్సవాలు జరిగాయి. సోమవారం 27 కిలోల లడ్డూను గణపతికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఈ లడ్డూకు వేలం నిర్వహించారు. గాజువాకకు చెందిన వాడపల్లి రమాదేవి, మద్దిలపాలెం ప్రాంత వాసి దువ్వారపు భాస్కరరెడ్డి, పెందుర్తికి చెందిన కర్రి కృష్ణభార్గవ్ ముగ్గురూ కలిసి ఏకంగా వేలంలో రూ. 12.75 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. కాగా, వేలంలో వచ్చిన మొత్తాన్ని సీఎం సహాయ నిధికి, చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్సలకు ఖర్చు చేస్తామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ లక్షల రూపాయల ధర పలకడం విశేషం. -
79 అడుగుల భారీ గణనాధుడు
-
ఆర్నెల్లుగా కదలని రిజిస్ట్రేషన్ల ఫైలు
గాజువాక : స్టీల్ప్లాంట్ నిర్వాసిత కాలనీల్లో ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాలకు సంబంధించిన ఫైలు కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్లో ఉండిపోయింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన జాయింట్ కలెక్టర్ దృష్టి సారించకపోవడంతో ఆర్నెల్లుగా ఆయన వద్దే తిష్టేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా జిల్లా అధికారులు స్పందించకపోవడంతో నిర్వాసిత కాలనీల్లోని స్థల యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అవసరాల నిమిత్తం వాటిని అమ్ముకొందామని నిర్ణయించుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ల పునఃప్రారంభంపై అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సబ్ రిజిస్ట్రార్లకు ఎప్పుడు పంపుతారోనన్న ఆశతో కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం జరిగిన భూసేకరణలో తమ భూములతో పాటు ఇళ్లను కూడా కోల్పోయిన నిర్వాసితులకు అగనంపూడి, వడ్లపూడి, దువ్వాడ, పెదగంట్యాడ, గంగవరం కాలనీల్ల పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఈ కాలనీల్లో స్థలాల కేటాయింపులకు సంబంధించి నకిలీ ఆర ్డర్లు వెలుగు చూడడం, బ్రోకర్లు పెద్ద సంఖ్యలో బయల్దేరిన దరిమిలా స్థలాలపై వివాదాలు చోటు చేసుకోవడం తో అగనంపూడి, దువ్వాడ కాల నీల్లో 2008 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయగా, మిగిలిన పునరావాస కాలనీల్లో 2012 నుంచి నిలిపివేశారు. పునరావాస కాలనీల్లో స్థలాలను విక్రయించరాదని లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లో నిబంధన ఉండడంతో దాని ఆధారం గా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఇళ్లను వదులుకోవడంవల్ల పరిహా రంగా ఇచ్చిన స్థలాలంటూ నిర్వాసితులు నిర్వహించిన ఆందోళనల ఫలితంగా గత ప్రభుత్వం సానుకూలంగా స్పం దించింది. -
విశాఖలో బాలుడి కిడ్నాప్కు యత్నం
విశాఖ : విశాఖ గాజువాకలోని హిమాచల్ నగర్లో బాలుడి కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హేమంత్ అనే బాలుడిని దుండగుడు కిడ్నాప్కు యత్నించగా దీన్ని గమనించిన స్థానికులు అతడి బారి నుండి రక్షించారు. కాగా కిడ్నాపర్ హేమంత్ని చంపేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం గాజువాకలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
గాజువాకలో జగన్ సమైక్య శంఖారావం సభకు పోటెత్తిన జనం
-
గాజువాకలో జగన్ సమైక్య శంఖారావం సభకు పోటెత్తిన జనం
విశాఖపట్నం: గాజువాకలో శనివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం సభకు జనం పోటెత్తారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల రాకతో గాజువాక జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో వైఎస్ఆర్ సువర్ణయుగాన్ని మళ్లీ తెద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ మహానేతపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా క్రాంతి పదం(ఐకెపి) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. ఐకెపి మహిళలు వచ్చి జగన్ను కలిశారు. వారు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. జగన్ వెంటనే స్పందించి 47వేల మంది ఐకెపి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలిరోజునే ఆ ఫైలుపై సంతకం చేస్తానని చెప్పారు. అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సిపి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మలేనని, వారిని తప్పక ఆదుకుంటామని చెప్పారు. విఏఓలు, సంఘమిత్ర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
అక్టోబర్ 4న గాజువాకలో కార్మిక ప్రదర్శన : అశోక్ బాబు
విశాఖపట్నం: సమైక్య రాష్ట్రం కోసం ఏపీఎన్జీవోలు చేస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కార్మికులు మద్దతు తెలిపారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఈరోజు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. తమ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. అందుకు వారు అంగీకరించారు. సమావేశం అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ అక్టోబర్ 4న గాజువాకలో వేలాది మంది కార్మికులతో కార్మిక ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 5న నగరంలో కేంద్ర ప్రభుత్యశాఖ ఉద్యోగుల బహిరంగ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా, సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా కోర్టు ఎదుట కోర్టు ఉద్యోగులు కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిశారు. ఆ తరువాత వారు బ్యాంకులను, కేంద్ర కార్యాలయాలను మూసివేయించారు. -
సమైకాంధ్రాకు మద్దతుగా గాజువాకలోబంద్
విశాఖ : రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోనివ్వమంటూ సీమాంధ్రలో రగిలిన ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ జిల్లా గాజువాకలో బంద్కు వర్తక, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆమరణ దీక్షలకు సిద్ధం అయ్యారు. కాగా విశాఖలో అన్ని ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల బంద్ కొనసాగుతోంది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాఠశాల, ఇంటర్ విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటే జువైనల్ చట్టాన్ని అమలు చేస్తామని డీఈవో, ఆర్ఐఓలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. కాకినాడ పోర్ట్ కార్యకలాపాలను వైఎస్ఆర్ సీపీ స్తంభింప చేసింది. అలాగే జర్నలిస్ట్ సంఘాల జేఏసీ నిరసనలకు దిగారు. కాగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.