
అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్
ప్యాపిలీ: కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలోని పెద్దపూజర్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు గురువారం సీజ్ చేశారు. పెద్దపూజర్లకు చెందిన కమతం భాస్కర్ రెడ్డి, సిద్దరాముడు, లక్ష్మీకాంత రెడ్డి, గోపాల్లకు ఈ ఇసుక అక్రమ దందాలో భాగస్వామ్యమున్నట్లు సమాచారం. దాంతో పాటు భాస్కర్ రెడ్డికి చెందిన రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామానికి భూగర్భ గనుల శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.