సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తాజాగా ఏర్పాటుచేసిన 10 రెవెన్యూ డివిజన్ల కోసం ప్రభుత్వం కొత్తగా 320 పోస్టులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టుల వివరాలు.. స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ - 2, డిప్యూటీ కలెక్టర్ -8, డివిజినల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు -10, డిప్యూటీ తహసీల్దార్లు -30, సీనియర్ అసిస్టెంట్లు-60, జూనియర్ అసిస్టెంట్లు -60, టైపిస్టులు -20, రికార్డు అసిస్టెంట్లు 10, స్టెనోలు -10, అటెండర్లు - 70, డ్రైవర్లు -10, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే -10, చైన్మెన్ -10, ఉప గణాంక అధికారులు -10 పోస్టులు ఉన్నాయి.