ఆటో-టిప్పర్ ఢీ : 8 మందికి గాయాలు | 8 injured in road accident at kurnool distirict | Sakshi
Sakshi News home page

ఆటో-టిప్పర్ ఢీ : 8 మందికి గాయాలు

Published Tue, Feb 3 2015 10:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

ఆగి ఉన్నఆటోను టిప్పర్ ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి.

కర్నూలు: ఆగి ఉన్నఆటోను టిప్పర్ ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన  జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం వద్ద మంగళవారం జరిగింది. ఆథోని నుంచి ఎమ్మిగనూరు వస్తున్న ఆటో చెన్నాపురం క్రాస్‌రోడ్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగింది. ఆ సమయంలో ఆటోను వెనక వైపు నంచి వేగంగా వచ్చిన టిప్పర్  డీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి.  స్తానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(ఎమ్మిగనూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement