‘తొలి కేబినెట్‌ భేటీ బాగా జరిగింది’ | Andhra Pradesh Ministers Speak On First Cabinet Meeting | Sakshi

‘తొలి కేబినెట్‌ భేటీ బాగా జరిగింది’

Published Mon, Jun 10 2019 7:07 PM | Last Updated on Mon, Jun 10 2019 7:14 PM

Andhra Pradesh Ministers Speak On First Cabinet Meeting - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం చాలా బాగా జరిగిందని పలువురు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా భేటీ సాగిందని తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, ముఖ్యమంత్రి ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు.

కేబినెట్‌ సమావేశానికి వచ్చిన మంత్రులు అవంతి శ్రీనివాస్‌, గుమ్మునూరు జయరాం, మాలగుండ్ల శంకరనారాయణ.. సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని బాధ్యతలు తీసుకుంటామని తెలిపారు. చాంబర్స్ కేటాయింపుపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: ఏపీ మంత్రులకు పేషీలు కేటాయింపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement