
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షం తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చకు అమతించాలని కోరగా, ముందు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పష్టం చేశారు. మరోవైపు ఇవాళ ఉదయం 11గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసన మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ సమర్పిస్తారు.