pilli subhash chandra bose
-
ఏపీలో కూటమి అరాచకాలపై రాజ్యసభలో గళమెత్తిన సుభాష్ చంద్రబోస్
-
ఏపీలో అరాచక పాలనపై కేంద్రం మౌనం సరికాదు: పిల్లి సుభాష్ చంద్రబోస్
సాక్షి, ఢిల్లీ : ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోందని పార్లమెంట్ వేదికగా చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలన్నారు. ఏపీలో విషయంలో కేంద్ర మౌనంగా ఉంటే.. అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే, ఏపీలో బీసీ కులగణన జరగాలన్నారు.రాజ్యసభలో కేంద్ర హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా చర్చలో వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. చర్చలో ఆయన మాట్లాడుతూ..‘తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. తొక్కిసలాట ఘటనపైన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి. సౌమ్యుడైన ఎంపీ మిథున్ రెడ్డిపై, రెడ్డప్పపై దాడి జరిగింది. ఆయన ఇల్లు, కార్లు ధ్వంసం చేశారు. ఇదేం రకమైన పరిపాలన?. దీనిపైన కేంద్రం చర్యలు తీసుకోవాలి.ఏపీలో అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు. 680 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. దీని ఉపేక్షిస్తే కేంద్ర హోంమంత్రి పైన మచ్చ పడుతుంది. పోసాని కృష్ణమురళిపై కేసుల పైన కేసులు పెడుతున్నారు. సీఎంపైన విమర్శలు చేసినందుకు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలి. కేంద్ర మౌనంగా ఉంటే.. అన్యాయం జరుగుతుంది.ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వడం లేదు. వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే డీఓపీటీ ఏం చేస్తుంది?. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారు. కీలక దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర హోం శాఖ పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తమ బలంపై ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉందనే ధైర్యంతో ఏపీలో అనర్ధాలు కొనసాగుతున్నాయి. నా రాజకీయ జీవిత చరిత్రలో ఇన్ని అక్రమ కేసులు ఎప్పుడు చూడలేదు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సరిదిద్దాలి. గుంటూరు మిర్చి రైతులకు మద్దతు ధర కోసం వైఎస్ జగన్ వెళితే సెక్యూరిటీ ఇవ్వలేదు. సెక్యూరిటీని విత్ డ్రా చేశారు. సెక్యూరిటీపైన రాజకీయ క్రీడలు ఆడుతున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
పోలవరం ఎత్తు తగ్గింపుతో రాష్ట్రానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్ణీత ఎత్తును తగ్గించాలన్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి వంటిది. దాని నిల్వ సామర్థ్యాన్ని ఏమాత్రం తగ్గించినా అది రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల ఎత్తు నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే దాని నిల్వ ఏకంగా 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.5,936 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును 2026లోగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. ముందస్తు వరదలు, కోవిడ్ వల్ల వచ్చిన అవాంతరాలతో కొంత ప్రతికూలత ఉన్నా.. సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల్లో గణనీయ పురోగతి జరిగింది. స్పిల్వే, స్పిల్ చానల్, కాఫర్ డ్యామ్ నిర్మాణాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతాంశంగా తీసుకుని పూర్తిచేసేందుకు కృషిచేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో 21,054 ఎంఎస్ఎంఈలురాష్ట్రంలో 21,054 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రిజిస్టర్ అయినట్లు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ⇒ రాష్ట్రంలో లక్షా 90 వేల 777 జల వనరులున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి.. వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొదటి గణన నివేదిక ప్రకారం 3,920 జల వనరులు ఆక్రమణకు గురైనట్టు తెలిపారు. ⇒ విమాన ప్రయాణికులకు సరసమైన ధరలో భోజనాన్ని అందించేందుకు కలకత్తా విమానాశ్రయంలో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్మోహల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.⇒ రాష్ట్రంలో 99.72శాతం మంది తమ తమ ఇళ్లలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకున్నట్టు కేంద్ర జల్శక్తి సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. -
పోలవరం ఎత్తు తగ్గింపు వద్దు: రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని,ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సోమవారం(ఫిబ్రవరి3) రాజ్యసభలో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశం ఇచ్చారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం టీవల నిర్ణయం తీసుకుంది. 135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం. 55 వేల కోట్ల రూపాయల అంచనాలకి ఆమోదం తెలపాలి.పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆయకట్టుకు పూర్తిగా నీరు ఉండదు, విశాఖపట్నానికి నీరు అందించే అవకాశం కోల్పోతాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సుజన స్రవంతి నీరు అందదు.పోలవరం కెనాల్స్కు సరిపడా నీరు అందదు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలవరం ఎత్తును యథాతథంగా ఉంచాలిసూపర్సిక్స్ పేరు చెప్పి చంద్రబాబు మోసం చేశారు..ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని,గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని రాజ్యసభ ఎంపీ వైవీసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘ఏకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెడుతున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు.రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు.ప్రధాని,హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.చంద్రబాబు ఏపీలో మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. సూపర్సిక్స్ పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు.20 లక్షల ఉద్యోగాలు,ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. రైతులకు 20వేలు ఇస్తానన్నారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఎన్నికల సంఘం,సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి.వక్ఫ్ సవరణ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుపై తొందరపాటు తగదు.ఏపీలో ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు.ఏపీలో ప్రత్యేకంగా జనాభా లెక్కల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.వైఎస్సార్సీపీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తి ప్రారంభించబోతోంది. ఉద్యోగుల జీతాలను సైతం చెల్లించలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.సెయిల్లో విలీనం చేయడంలో విఫలమయ్యారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంతగనులు కేటాయించాలి’అని వైవీసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు: రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతులను ఆదుకోవాలిరైతులను ఆదుకునేందుకు నాడు వైఎస్ జగన్ 11 పథకాలు అమలు చేశారుఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందిరైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందిఆదాయాలు ఉన్నా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదునా ప్రసంగానికి అడ్డుపడి, రాజకీయాలకే పరిమితం కాకండిరైతుల సంక్షేమం కోసం రైతు భరోసా సున్నా వడ్డీ, ఉచిత పంట బీమా , జల కళ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారుచంద్రబోస్ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ టీడీపీ ఎంపీలు, మంత్రి పెమ్మసాని -
మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం
-
పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలివే.
-
‘సోషల్ మీడియా నిర్బంధాలపై పార్లమెంట్లో చర్చిస్తాం’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తామన్నారు. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు..గురువారం వైఎస్ జగన్తో వైఎస్సార్సీపీ రాజ్యసభ, లోక్సభ ఎంపీలు గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడమన్నారు. -
జగన్ వెంటే మేమంతా: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, గుంటూరు: మేం పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేం వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీలోనే ఉంటా: పిల్లి సుభాష్ చంద్రబోస్వైస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్తో ఉన్నా.. నా వ్యక్తిత్వం ఏంటో అందరికి తెలుసు. నన్ను వైఎస్సార్ రాజకీయాల్లో ప్రోత్సహించారు. రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావు కూడా రావాల్సి ఉంది. ఇతర కారణాల వలన రాలేకపోయారు. కానీ వారిద్దరు కూడా వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పమన్నారు. జగన్ నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. కానీ నా మీద కూడా ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. నాకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కూడా జగన్ అన్నారు. అంతగా వైఎస్ జగన్ నన్ను గౌరవించారు....కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా వైఎస్సార్ వెంటే ఉన్నాను. అప్పట్లో టికెట్ గురించి కూడా ఎవర్నీ అడిగేవాడిని కాదు. వైఎస్సారే నాకు అర్ధికంగా, రాజకీయంగా అండగా నిలిచారు. ఆ తర్వాత కూడా జగన్ అలాగే అండగా నిలిచారు. ఆర్థికంగా పేదవాడినే అయినా విధేయతలో సంపన్నుడునే. నాకు వ్యాపారల్లేవు, ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను. నా మీద వార్తలు రాసేటపుడు ఒకసారి మాట్లాడితే సరిపోయేది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. ఇలా చేయటం రాజకీయ హననం చేసినట్లే. నైతికత ఉన్న నాయకుడిని నేను...మేము రాజీనామా చేస్తే మరొకరిని నియమించే అవకాశం లేదు. అలాంటప్పుడు మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టే. అలాంటి కృతజ్ఞ హీనులం మేము కాదు. పార్టీని హత్య చేసే పని నేను చేయను. పార్టీ నుండి వెళ్లేవారు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మంచిది. ఏ పార్టీ ఐనా ఓడుతుంది, గెలుస్తుంది. అధికారం శాశ్వతం కాదు, జయాపజయాలు సహజమే. వైఎస్సార్సీపీ ఇవాళ ఓడిపోయినంత మాత్రాన నేను పార్టీ వీడి వెళ్లను. నూటికి నూరుపాళ్లు వైఎస్ జగన్ నాయకత్వంలోనే పని చేస్తా. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్సార్సీపీలోనే ఉంటా’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.ఊహాజనిత కథనాలను ఖండిస్తున్నాం: ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిమాపై కొన్ని మీడియా సంస్థలు ఊహాజనిత కథనాలు రాస్తున్నాయి. పార్టీ వీడుతున్నట్టు వారు రాస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. మేము పార్టీ చెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తాం. ఈ రోజు పార్టీలను నడపటం చాలా కష్టంతో కూడుకున్న పని. రాజకీయ పార్టీలు పటిష్టంగా ఉంటే గట్టి నాయకులు తయారవుతారు. మేము ఎంపీలుగా బాధ్యతతో పని చేస్తున్నాం. జగన్ సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తారు. అందుకే ఆయనతో కలిసి రాజకీయాల్లో నడుస్తున్నాను...పదేళ్ల క్రితమే నేను వ్యాపారాలు మానేశాను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన బాధ పడాల్సిన పనిలేదు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్తోనే నడుస్తాం. మోపిదేవి రమణ అంటే జగన్తో సహా మా అందరికీ ఇష్టం. ఆయన పొజిషన్ ని స్ట్రాంగ్ చేసే పనిలో జగన్ ఉన్నారు. కొందరు పర్సనల్ వ్యవహారాల వలన పార్టీ వీడుతున్నారు. నన్ను కూడా పార్టీలోకి రమ్మని కొందరు ఆహ్వానించారు. కానీ జగన్ని కాదని నేను ఎటూ వెళ్లను. రేటింగ్స్ కోసం మా గురించి ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేయొద్దని మనవి -
వెన్నుపోటు పొడవలేను: ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్
రామచంద్రపురం: ‘నాకు రాజకీయ విలువలు ఉన్నాయి. వైఎస్సార్సీపీని విడిచి వెళ్లి వెన్నుపోటు పొడవలేను. నేను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతాను...’ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడుతూ తనకు కలలో కూడా పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని, వైఎస్సార్సీపీలోనే ఉంటానని స్పష్టంచేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాసి నైతిక విలువలను దెబ్బతీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలను కాçపాడే విధంగా పత్రికలు వార్తలు ప్రచురించాలని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దని హితవుపలికారు. -
ఎన్నికల ఫలితాలపై పిల్లి సుభాష్ చంద్రబోస్ షాకింగ్ రియాక్షన్
-
చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ : చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే రిజర్వేషన్లు కల్పిస్తు న్నారో అదేవిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదే శాల మేరకు మహిళా బిల్లుకు మద్దతిస్తు న్నామ న్నారు. రాజ్యసభలో గురువారం మహిళ బిల్లు పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు కార్యరూపం దాల్చిన ఏడేళ్ల తర్వాత అమలు చేయడం అంటే పంచభక్ష్య పరమాన్నం ముందుపెట్టి ఎప్పుడో తినమన్నట్లు ఉందన్నారు. సామాజిక, విద్య, ఆర్థిక అంశాల్లో వెనుకబాటు తనంతో ఉన్న ఓబీసీలకు రిజర్వే షన్లు ఎందుకు కల్పించరని బోస్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం దీనిపై ఆలోచించి త్వరలోనే ఓబీసీ బిల్లు తీసుకురావాలని ఎంపీ బోస్ విజ్ఞప్తి చేశారు. లింగ వివక్ష తగ్గుతుంది : ఆర్. కృష్ణయ్య చర్చలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మహిళా బిల్లు స్వాగతించదగినదన్నారు. దేశంలో లింగ, కుల వివక్షలు ఉన్నాయని.. మహిళ బిల్లుతో లింగ వివక్ష తగ్గుతుందని.. అయితే, కుల వివక్ష తగ్గించాలంటే బిల్లులో ఓబీసీ సబ్కోటా పెట్టాలని కోరారు. సబ్కోటా కుదరకపోతే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అన్ని రంగాల్లోనూ బీసీల పాత్ర చాలా తక్కువగానే ఉంటోందని కృష్ణయ్య తెలిపారు. రాజ్యాధికారం వస్తేనే వారికి గౌరవం దక్కుతుందన్నారు. -
అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం
రామచంద్రపురం: ‘పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. వైఎస్సార్సీపీ నా సొంత పార్టీలా భావిస్తాను. ఇటీవల కొన్ని పత్రికలు, చానల్స్లో నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నేను వైఎస్సార్సీపీని వీడేది లేదు...’ అని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ స్పష్టంచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అదేవిధంగా తనకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయనే బాధతోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పానని వివరించారు. ఇది బాధాకరమైన విషయమన్నారు. ఈ అంశంపై మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం చెప్పిందని వెల్లడించారు. నియోజకవర్గంలో పరిపూర్ణమైన సర్వేలు జరిగాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. అంతవరకు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించిందని తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ పని చేస్తానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని కోరారు. కార్యకర్తల్లో ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటానన్నారు. పార్టీ నిర్మాణం, ఓదార్పుయాత్రలో తాను ప్రముఖ పాత్ర పోషించానన్నారు. త్వరలోనే తమ పార్టీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ను ముగించాలని మీడియాకు బోస్ విజ్ఞప్తి చేశారు. -
ఎల్లో మీడియాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
-
పిల్లిలంకలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎంపీ బోస్
-
ప్రజల ప్రాణాలను బలితీసుకోవడంలో చంద్రబాబుకు ఆనందం ఉంది: ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్
-
‘వట్టి వసంతకుమార్ నాకు మంచి మిత్రుడు’
ఏలూరు: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. వట్టి వసంత కుమార్ మరణ వార్త తెలుసుకున్న అనంతరం పూళ్ల గ్రామానికి వెళ్లిన సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ వట్టి వసంతకుమార్ నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. దివంగత మహానేత వైఎస్సార్తో అత్యంత సన్నిహిత ఉన్న వ్యక్తి వట్టి వసంత కుమార్. వితౌట్ అపాయింట్ లేకుండా వైఎస్సార్ను కలిసే వ్యక్తుల్లో ఉండవల్లి తరువాత వట్టి వసంత కుమార్ ఒకరు. రాజకీయంలో నా ఎదుగుదలకు ఎంతో సహకరించారు వట్టి వసంత కుమార్’ అని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్ వట్టి వసంత కుమార్ మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్ అని, నాకు అన్నతో సమానమని, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధికి వట్టి ఎంతో కృషి చేశారన్నారు. ఆక్వా రంగంలో ట్యాక్స్ మినహాయింపునకు వసంత కుమార్ చేసిన కృషి మరవలేనిదన్నారు రఘువీరా. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్ వైఎస్సార్కు మంచి స్నేహితుడు వట్టి వసంత కుమార్ అని మంత్రి దాడిశెటట్టి రాజా పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్ అని, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వసంతకుమార్ అంత్యక్రియలు ఏలూరు ఎంఎం పురంలో వట్టి వసంతకుమార్ అంతిమ యాత్రలో మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వాసుబాబు, కాంగ్రెస్ నేతలు, సినీ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వట్టి వసంతకుమార్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ కన్నుమూత -
రాజధానిపై మోసగించింది బాబే
జంగారెడ్డిగూడెం: రాజధాని విషయంలో ప్రజలను, రైతులను మోసగించిన విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్పై నిందలు మోపుతున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు. సీఎం జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికే మూడు రాజధానులను ప్రకటించినట్లు చెప్పారు. బుధవారం జంగారెడ్డిగూడెంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోర్టుకు ఆ అధికారం ఉందా..? రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టుకు ఉన్న హక్కులు ఏమిటి? న్యాయమూర్తుల తీర్పును నేను వ్యతిరేకించడం లేదు. ఒకసారి ఆలోచించాలి. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయమా? కోర్టులు చేసే నిర్ణయమా? రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే. పరిపాలనా విధుల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేదు. మూడు నెలల్లో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించే అధికారం కూడా లేదు. నిధులను బట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ రెండింటిపై విరుద్ధమైన తీర్పులు ఇచ్చాయి. తీర్పుపై కచ్చితంగా కామెంట్ చేస్తాం. న్యాయమా.. కాదా? అని కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. న్యాయమూర్తులను మేము కామెంట్ చేయడం లేదు. తీర్పును మాత్రమే కామెంట్ చేస్తున్నాం. అంబేడ్కర్ చెప్పినట్లు రెండు రాజధానులు, మూడు రాజధానులు పెట్టుకోవడం తప్పేమీ కాదు. అంబేడ్కర్ ఆనాడే దక్షిణాదిలో హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలని సూచించారు. రాజధానుల విషయంలో రాజ్యాంగంలో సవివరంగా పేర్కొన్నారు. 33 వేల ఎకరాలు అవసరమా..? రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరమా? హైదరాబాద్ లాంటి రాజధానిని సుమారు 5 వేల ఎకరాల్లో నిర్వహిస్తుండగా రాష్ట్రంలో రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమా? చంద్రబాబు ఆయన కోటరీకి మేలు చేయడానికి, భూములతో వ్యాపారం చేసేందుకే పెద్ద ఎత్తున సేకరించారు. చంద్రబాబుకు దళితులు, పేదలంటే చులకన. అమరావతి ప్రాంతంలో 29 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని ప్రభుత్వం భావిస్తే అందుకు అడ్డుపడి స్టే తెచ్చారు. బాబు కుటిల రాజకీయాలు.. చంద్రబాబు కుటిల రాజకీయాన్ని ప్రజలు గమనించాలని చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
'వైఎస్సార్సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే'
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతుంది అంటే అందులో కార్యకర్తల కష్టం ఎంతో ఉందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు పాటుపడుతుంది ఆర్మీ అయితే వైఎస్సార్సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే. కార్యకర్తలు ఉన్నారనే మనోధైర్యంతోనే సీఎం వైఎస్ జగన్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దిగ్విజయంగా పాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే ఇవాళ గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్లగలుగుతున్నాం. అద్భుతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సైతం ప్రతిపక్షాలు బురద చల్లడం దారుణం. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి కూర్చోబెట్టేందుకు కృషి చేయాలి అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు వైఎస్సార్సీపీ ఎంపీ, రీజనల్ కో ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆమోదంతోనే 2019లో 151 స్థానాలు గెలవగలిగారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు ఈర్ష్యతో మాట్లాడటం సరికాదు. సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 210 హామీలు ఇచ్చారు.. పదో, పదిహేనో నెరవేర్చి మిగిలినవన్నీ గాలికొదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై చంద్రబాబు రూ.80 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లారు. కోవిడ్లో సైతం ప్రజలకు అన్ని రంగాల్లో సహకారం అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీలకు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అనడంలో సందేహం లేదు అని ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ బీసీ కులాలకు శ్రీరామరక్ష: ఆర్ కృష్ణయ్య) -
పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు: పిల్లి సుభాష్చంద్రబోస్
న్యూఢిల్లీ: ప్రజల విజ్ఞప్తి మేరకే కోనసీమకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారని ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయి. ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేడ్కర్ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలి. బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు. అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం మన అదృష్టం. ఉద్యమకారులు సంయమనం పాటించండి. అంబేడ్కర్ వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లుతోంది. మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన పాకిస్తాన్లో రాజ్యాంగం ఫెయిల్ అయిందని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. చదవండి 👇 ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. స్పందించిన మంత్రి విశ్వరూప్ అమలాపురానికి అదనపు బలగాలు కోనసీమ: అమలాపురంలో విధ్వంసం కొనసాగుతోంది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లాల నుంచి అదనపు బలగాలు తరలిస్తున్నారు. ఇంకా రోడ్లపై వేలాదిమంది ఆందోళనకారులు ఉన్నారు. ఆందోళన విరమించి వెళ్లి పోవాలని నిరసనకారులను పోలీసులు కోరుతున్నారు. చదవండి 👇 (Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి) -
ఈనాడు విషపు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: ఈనాడు విషపు రాతలపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్త హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్బీకే ద్వారా రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఈనాడు కథనం పూర్తి అవాస్తవమని, ఆర్బీకేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ‘పొలమే లేని వ్యక్తి ఆర్బీకేకు ధాన్యం అమ్మడానికి వెళ్లగా తిరస్కరించినట్లు ఈనాడు పత్రిక సృష్టించింది. తనకి పొలమే లేదని, తాను రైతునే కాదని, అదంతా అబద్దమని ఆ వ్యక్తే చెబుతున్నారు. రైతులే కాని వారిని రైతులగా చూపిస్తూ తప్పుడు వార్తలతో విషప్రచారం చేస్తున్నారు. రైతులకి మేలు చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది. ఈనాడు విషప్రచారంపై కోర్టుని ఆశ్రయించనున్నాం. దిగజారుడు వార్తలతో మీ పత్రిక విలువ మరింత దిగజార్చుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలకు.. ఈనాడు వార్తకు సంబంధం లేదు’ అని మంత్రి అన్నారు. ఈ కేవైసీ త్వరగా చేయకపోవడం వల్ల తప్పులు జరిగే అవకాశాలున్నాయని మాత్రమే ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. 68 వేల రైతులు తూర్పుగోదావరిలో ఉంటే 51 వేల మంది నమోదు చేస్తుకున్నారని, ఇంకా 17 వేల మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రత్యేక మేళా ద్వారా ఈ కేవైసీ త్వరగా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేవైసీ నమోదు ద్వారా అక్రమాలకి ఆస్కారం ఉండదన్నారు. మిల్లర్లు, అదికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చంద్రబాబు వల్లే ఖజానా దివాలా..
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఖజానా దివాలా తీయడానికి చంద్రబాబే కారణమని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దిగజార్చడమే బాబు పని అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారని, అలాచేస్తే టీడీపీ బండారమే బయటపడుతుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సీఎం జగన్ ఎంతదూరమైనా వెళతారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మకపాత్ర పోషించాలేగానీ దిగజారుడు వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. గురువారం పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్రామ్, పిల్లి సుభాష్చంద్రబోస్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు, విభజన హామీలతోపాటు పెండింగ్లో ఉన్న అంశాలపై ఉభయ సభల్లోను పార్టీ ఎంపీలు చర్చించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కూడా తీసుకున్నాం. ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ పోలవరం, కడప ఉక్కుపరిశ్రమ, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఇలా అన్ని అంశాలు చర్చిస్తే.. దానిపైనా టీడీపీ దుష్ప్రచారం చేయడం శోచనీయం. బాబు లాంటి ప్రతిపక్ష నేత దొరకడం ప్రజల దౌర్భాగ్యం. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేనాటికే రాష్ట్ర ఖజానా దివాలా తీసిన విషయం ప్రజలకు తెలిసిందే. బాబు స్వప్రయోజనాల కోసం పాలనను అస్తవ్యస్తం చేస్తే కరోనా సమయంలోను జగన్ సంక్షేమ పథకాలు అందించారు. బాబు చేసిన అప్పుల్ని జగన్ తీరుస్తున్నారు.. చంద్రబాబు ఖజానాను ఖాళీచేసి వెళ్తే.. ఆ అప్పులను ప్రభుత్వం తీరుస్తోంది. ఏపీలో ఏవో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయంటూ కేంద్రానికి టీడీపీ ఎంపీలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. బాబు వెళ్తూవెళ్తూ రూ.100 కోట్లు ఉంచి మిగతా ఖజానా అంతా ఊడ్చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామనడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించడం, భోగాపురం పనులు ముందుకు తీసుకెళ్లడం, దక్షిణ కోస్తా జోన్ తీసుకురావడం.. ఇవన్నీ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడికి ఉత్తరాంధ్రకు చేసిన ద్రోహంలా కనిపిస్తున్నాయి. శ్రీలంక తరహాలో ఏపీ ఆర్థికంగా కుప్పకూలిపోతోందని టీడీపీ, పవన్కల్యాణ్ బోగస్ ప్రచారాలు చేస్తున్నారు. ప్యాకేజీల కోసం ప్రత్యేకహోదా తాకట్టుపెట్టిన చంద్రబాబు ముందు ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాట్లాడాలి’ అని వారు పేర్కొన్నారు. -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓబీసీలకు జరుగుతున్న నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీలు బోస్, వెంకటరమణారావు ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయవ్యవస్థలోను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తొలుత బీసీ జనగణన చేయాలని, లేకుంటే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉండదని చెప్పామన్నారు. ఇంకా వారేమన్నారంటే.. ► న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరాం. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 14 హైకోర్టుల్లో 75 ఏళ్లలో ఒక ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తి కూడా లేరు. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాం. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గుర్తింపు రాలేదని తెలిపాం. ► కాకినాడ–అమలాపురం రోడ్డును కత్తిపూడి నుంచి ద్రాక్షారామం, కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు నిర్మించాలని, దీనికి గోదావరిపై వంతెన నిర్మించాలని కోరాం. -
అటు పెగసస్.. ఇటు ‘ప్రెసిడెంట్ మెడల్’
సాక్షి, న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ను ఉపయోగించుకున్నందున చంద్రబాబు చేసింది ముమ్మాటికీ దేశద్రోహమేనని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్ వంటి మద్యం బ్రాండ్లు కూడా చంద్రబాబు హయాంలోనే వచ్చాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, తలారి రంగయ్య, ఎన్.రెడ్డెప్ప మాట్లాడారు. నాటి ఏపీ సీఎం చంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణను తీవ్రంగా పరిగణించాలన్నారు. ‘నాడు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కొనుగోలు చేసిన పెగసస్పై కేంద్రం చూసీచూడనట్టుగా ఉండడం సరికాదు. దేశ అంతర్గత వ్యవహారాలు, భద్రత గురించి ప్రమాదం పొంచి ఉన్న విషయం కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నాం. మమత చేసిన వ్యాఖ్యలు సుమోటోగా స్వీకరించి దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతున్నాం. ఎంపీలందరం ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఈ అంశంపై డిమాండ్ చేస్తాం. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. హైఓల్టేజీ బీరు, బ్రిటిష్ ఎంపరర్ తదితర బ్రాండ్లు కూడా టీడీపీ హయాంలో వచ్చినవే. దేశద్రోహం కింద చంద్రబాబును అరెస్టు చేయాలి. సుమోటోగా తీసుకుని సుప్రీం కోర్టు దర్యాప్తు చేయాలి. పెగసస్ స్పైవేర్ నాడు కొనుగోలు చేయాలని కోరారంటూ తేలుకుట్టిన దొంగలా లోకేశ్ ఇప్పుడు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ జరపాలి. -
రఘురామ రాజీనామా పై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్
-
టీడీపీ నీచ, దుష్ట రాజకీయాలు చేస్తోంది: ఎంపీ సుభాష్ చంద్రబోస్
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి పనులకు టీడీపీ అడ్డుపడుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి రావాల్సిన నిధులను అడ్డుకుని.. టీడీపీ నీచ, దుష్ట రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. పేదల ఇళ్ల స్థలాలకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నీచ రాజకీయాలతో ఏపీలోని పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్కు ధన్యవాదాలు: చిరంజీవి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సైతం సముచిత పాత్ర ఉందని.. నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపుల్ల వేయడమే పనిగాపెట్టుకుందని మండిపడ్డారు. ఇందుకు పావుగా ఎంపీ రఘురామకృష్ణరాజును ఉపయోగించుకుంటున్నారన్నారు. ‘‘హడ్కో రుణాల మంజూరు నిలుపుదల చేయించాలంటూ ఆయనతో ఒక పిటిషన్ పెట్టించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఎలాగైనా ఆపించాలని ప్రయత్నిస్తున్నారు. గృహ నిర్మాణానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన, మనీ సర్క్యులేషన్లో ఉంచడమే. ఇందులో ఎంతమందికి పని కల్పించామన్నదే ముఖ్యం తప్ప, ఎంత పని జరిగిందన్నది ముఖ్యం కాదు. పేదవాడి ఇంటిస్థలాన్ని చదును చేయడానికి ఈ పథకాన్ని ఒప్పుకోకపోవడం దురదృష్టకరం. చంద్రబాబు, రఘురామకృష్ణ రాజు ఇద్దరూ కలిసి పిటిషన్లు పెట్టి స్టే తీసుకొచ్చారు. పేదవారిపై వీరికున్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్థమవుతుందని’’ సుభాష్ చంద్రబోస్ అన్నారు. -
వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. చదవండి: రాజ్యసభలో టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి -
'ఆ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును ఏం చేసినా పాపం లేదు'
న్యూఢిల్లీ: చంద్రబాబు సొంత ఎజెండాతోనే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బాబు తన బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలనే ఆలోచనతో వైఎస్ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదా..?. సీఎం తీసుకున్న నిర్ణయాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. పేదలకు ఇల్లు దక్కకుండా కేసులు వేశారు. సీఎం జగన్ మన ఇల్లు- మన పట్టా ద్వారా న్యాయమైన హక్కు కల్పిస్తామని అంటే దానికి అడ్డుపడ్డారు. ఇంగ్లీష్ మీడియం చదువులు పేదలకు అందకుండా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పేదలపై సామాజిక దాడి చేస్తున్నారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన అహంభావానికి నిదర్శనం. కుప్పం ఎన్నికలలో చంద్రబాబును ఛీత్కరించారు. మూడు లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదని' మోపిదేవి వెంకటరమణ అన్నారు. చదవండి: (రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే పీఆర్సీ: సజ్జల) ప్రజల్ని రెచ్చగొట్టేందుకు రాజధాని పాదయాత్రలు అమరావతిలో పేదలకు పట్టాలు ఇస్తే జనాభాలో అసమతుల్యత జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన బాబును ఏం చేసినా పాపం లేదు. వైఎస్ జగన్ పవిత్రమైన లక్ష్యంతో పరిపాలన చేస్తున్నారు. బాబు ఇకనైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.. భూముల కోసం రాజధాని పెట్టాలా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే అమరావతి. రాజధానికి 33వేల ఎకరాలు అనవసరం. మూడు వేల ఎకరాలకంటే ఎక్కువ అవసరం లేదు. రైతులను మోసం చేసి ముంచిన ఘనుడు బాబు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి విఘాతం కలిగిందని బాబు ఏడుపు. పరిపాలన వికేంద్రీకరణ వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. వికేంద్రీకరణతో మరోసారి రాష్ట్ర విభజన రాదు. ఏపీ ప్రజలను రెచ్చగొట్టేందుకు రాజధాని పాదయాత్రలు చేస్తున్నారు. కార్పొరేషన్లపై రూ.13 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు అప్పుల భారం పెంచారు. దీనిపై వడ్డీలకు వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక మాంద్యం, కరోనా వల్ల రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు. -
బీసీలు పోరాడి సాధించుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ విమర్శించారు. బీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్తో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్, కేశ న శంకర్రావు నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, రెడ్డప్ప, టీడీపీ ఎంపీలు కేశినేని శ్రీనివాస్, రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, రవీంద్రకుమార్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ బీసీల కులగణనతో మాత్రమే బీసీలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీ జనగణన చేపట్టాలని పార్లమెంట్ వేదికగా పోరాడతామని చెప్పారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రాధాన్యం ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, చిన్నచిన్న కులాలకు సైతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతికి ఏపీ ముఖ్యమంత్రి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి, వారికి దశదిశ చూపించే బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీలు బలమైన సామాజికవర్గమని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ అగ్రకులాల వారిని పల్లకిలో మోసిమోసి బీసీల భుజాలు అరిగిపోయాయని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి, జనగణన చేపట్టేవరకు ఏమాత్రం విశ్రమించకుండా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. -
ప్రత్యేక హోదా ఎందుకివ్వరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని మంగళవారం పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లోక్సభలో వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పి.వి.మిథున్రెడ్డి, రాజ్యసభలో పార్టీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని కోరారు. లోక్సభలో డిమాండ్స్, గ్రాంట్స్పై జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతూ యూపీఏ, ఎన్డీయే కలిసి రాష్ట్రాన్ని విభజించాయని గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నాటి ప్రధాని మన్మోహన్, ప్రస్తుత ప్రధాని మోదీ సభలోను, బయట ఇచ్చిన హోదా హామీ నెరవేర్చాలని కోరారు. విభజన సమయంలో తెలంగాణ కన్నా ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. విభజన చట్టం అమలు పదేళ్ల కాలంలో ఇప్పటికి ఎనిమిదేళ్లు ముగిసిందని చాలా హామీలు నెరవేర్చాల్సి ఉందని చెప్పారు. విభజన హామీల అమలు తీరు.. ఒక రాష్ట్రానికి సాయం చేయడానికి ఓ రాజు పలువురు తెలివైనవారి సలహాలు తీసుకుని పులిని చేయబోయి పిల్లిని ఆవిష్కరించినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు, పెట్రోకారిడార్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, వెనకబడిన జిల్లాల గ్రాంటు ఇలా పలు అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. విభజన సమయంలో ఎన్డీయే, యూపీఏ రెండూ రాష్ట్రానికి హామీలిచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పోలవరాన్ని ఇరిగేషన్, తాగునీరు..అంటూ వేరుచేయడం సరికాదు పోలవరం ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 194 టీఎంసీలతో డిజైన్ రూపొందించారని గుర్తుచేశారు. ప్రాజెక్టును విభజన చట్టం రాకముందే మొదలు పెట్టారన్నారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ప్రకటిస్తూ.. కేంద్రమే పూర్తిచేస్తుందని, అన్ని అనుమతులు ఇచ్చి పునరావసం పరిహారం సహా అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు చేయకపోవడం బాధాకరమని చెప్పారు. సవరించిన అంచనాలకు సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపిందని, దీన్ని కేబినెట్ ఆమోదించాలని కోరారు. నాడు ఎన్డీయే ప్రభుత్వం, టీడీపీల మధ్య ఏం జరిగిందో అనవసరమని రాష్ట్రానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తిగాక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇరిగేషన్, తాగునీరు కాంపొనెంట్ అంటూ వేరుచేయడం సరికాదన్నారు. సవరించిన అంచనా రూ.55 వేల కోట్లకు అనుమతించినప్పుడే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్నారు. ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలి ఏపీలో పౌరసరఫరాలకు ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ విషయంలో కాగ్ ఆడిట్ చేసి చెప్పిన విధంగా రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంపై ఇటీవల భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, తక్షణ సాయంగా రూ.వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమను నడిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన 13 వైద్య కళాశాలలకు సాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిమిత్తం సభ్యులకు ఎంపీలాడ్స్ నిధులు పెంచాలని మిథున్రెడ్డి కోరగా పలువురు సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. విభజన హామీల అమలుకు గడువు రెండేళ్లే ఉన్నందున ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం సానుభూతి చూపించాలని ఆయన కోరారు. ఏపీ ఆర్థికంగా నష్టపోయింది రాజ్యసభ జీరో అవర్లో ఎంపీ సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ.. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా నష్టపోయిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. -
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే అడ్డంకులు సృష్టిస్తోంది..
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ దానిని పూర్తి చేసే బాధ్యత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు విమర్శించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన కేంద్రం.. అనేక కొర్రీలు పెడుతూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఏపీ భవన్లో గురువారం ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, వంగా గీత, చింతా అనురాధ, బీశెట్టి సత్యవతిలు మీడియాతో మాట్లాడారు. బోస్ మాట్లాడుతూ ‘పోలవరం ప్రాజెక్టు రూ.55,656 కోట్ల సవరించిన అంచనాలకు ఫైనాన్స్ కమిటీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ కమిటీలు ఆమోదించినా కేంద్రం ఆమోదించడం లేదు. దీనిపై పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసి విన్నవించినా పెండింగ్లోనే పెట్టారు. ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి పనులకు సంబంధించి రూ.4 వేల కోట్ల వ్యయాన్ని తగ్గించారు. తాగునీటికి సంబంధించిన కాంపోనెంట్ను విడదీసి చూస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి మార్చాలని కోరుతున్నా ఆదేశాలివ్వడం లేదు. ఆర్ అండ్ ఆర్ విషయంలో గిరిజనులకు పునరావాస కల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీనే తుంగలో తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును గత ప్రభుత్వాలు రాజకీయ అవసరాలకు వాడుకుంటే.. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో పూర్తి చేస్తోందని, దీనికి కేంద్రం సహకరించాలని గీత విజ్ఞప్తి చేశారు. సత్యవతి మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి ఓ ప్రత్యేకాధికారిని నియమించారని, డీపీఆర్ను రూపొందించి కేంద్రానికి సైతం పంపారని, అపోహలు వద్దన్నారు. -
కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోంది: పిల్లి సుభాష్ చంద్రబోస్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం జాతీయ ప్రాజెక్టు అని కేంద్రానికే ఎక్కవ బాధ్యత ఉంటుందని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఆయన గురువారం పార్లమెంట్లోని మీడియాలో పాయింట్లో మీడియాతో మాట్లాడుతూ.. సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని కోరారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. పోలవరం హెడ్ క్వార్టర్స్ను రాజమండ్రికి మార్చాలని డిమాండ్ చేశారు. పోలవరం బకాయయిలను కేంద్రం తక్షమే విడుదల చేయాలని పేర్కొన్నారు. చదవండి: పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు మినహా ఇతరులు లేరు: సజ్జల -
ఓబీసీ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు
న్యూఢిల్లీ: లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఓబీసీ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఏయే కులాలు వెనకబాటు తనంలో ఉన్నాయో.. రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు ఈరోజు వరకు పూర్తిగా న్యాయం జరగలేదని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఓబీసీల రిజర్వేషన్లను పలుమార్లు కేంద్రం దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. ఓబీసీ బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్ నామమాత్రం బడ్జెట్ అని విమర్శించారు. అదే ఏపీలో సీఎం జగన్ బీసీల అభివృద్ధి కోసం 30 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే..మరి 29 రాష్ట్రాలు ఉన్న కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. సుమారు 67 ఏళ్ల నుంచి ఓబీసీ కేటగిరీ కింద వెనకబడి ఉన్న కులాలకు ఇన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ లోక్సభ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్ర గుర్తించలేని ఓబీసీ కులాలు సుమారు 671 ఉన్నాయని, ఈ బిల్లు ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. -
పోలవరం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలి
-
పార్లమెంట్లో ఇచ్చిన హామీలే అమలుకాకుంటే ప్రజాస్వామ్యానికి విలువేది?
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈరోజు(శుక్రవారం) మధ్యాహ్నం గం. 12.00ల వరకూ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘పోలవరం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్న విషయం కేంద్రం మరిచిపోతోంది. 55 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2వేల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది’అని పేర్కొన్నారు. లోక్సభ సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ను ఆమోదించారు. తిరుపతిలో స్వయంగా ప్రధానే ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలే అమలుకాకుంటే ప్రజాస్వామ్యానికి విలువేది?. పునరావాస ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదు?, గిరిజనులపై కేంద్రానికి ప్రేమ లేదా?’ అని ప్రశ్నించారు. -
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం
-
స్వతంత్ర సర్పంచ్ పైనా ‘పచ్చ’మార్కు!
రామచంద్రపురం రూరల్: ఎంపీ స్వగ్రామంలో టీడీపీ విజయమంటూ వస్తున్న ప్రచారంపై అక్కడి గ్రామస్తులు విస్తుబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం హసన్బాద.. వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ స్వగ్రామం. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి నాగిరెడ్డి సతీష్రావు సర్పంచ్గా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్రావు పది వార్డులున్న ఈ గ్రామంలో కనీసం ఒక్క వార్డులో కూడా తన తరఫున అభ్యర్థులను నిలపలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు పచ్చ మీడియా చేస్తున్న హడావుడి చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం కూడా లేదని సతీష్రావు ఓ ప్రకటనలో తెలిపారు. -
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ: అమిత్ షాను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ప్లాంట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విన్నవించారు. అలానే రాష్ట్రంలో జరిగిన ఆలయాల ధ్వంసం వెనుక టీడీపీ పాత్ర ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాం. స్టీల్ప్లాంట్ను లాభాల బాటలో నడిపేందుకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపాం. ప్రధాని మోదీతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని అమిత్ షా హామీచ్చారు’’ అన్నారు. దేవాలయాల ధ్వంసం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని విన్నవించాం అన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ‘‘అంతర్వేది రథం దగ్ధం, విగ్రహాల విధ్వంసంలో టీడీపీ పాత్ర ఉంది. ఆలయాల ధ్వంసం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. పోలవరం ప్రాజెక్ట్కు నిధులు విడుదల చేయాలని కోరాం’’ అని తెలిపారు. చదవండి: ‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం.. -
అందుకు మేం వ్యతిరేకం: రాజ్యసభలో ఎంపీ బోస్
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజలు పోరాటం చేసి స్టీల్ప్లాంట్ సాధించుకున్నారన్నారు. స్టీల్ప్లాంట్ను మూడు దశల్లో పునరుద్ధరించాలని ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలి. రుణాలను ఈక్విటీగా మార్చాలి. విశాఖ స్టీల్ప్లాంట్కు క్యాప్టివ్ మైన్లను కేటాయించాలి. విశాఖ స్టీల్ప్లాంట్పై లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని’’ ఎంపీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్పై ఎలాంటి ప్రస్తావన లేదని, విశాఖ మెట్రోకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీకి కిసాన్ రైళ్లను ఎక్కువగా నడపాలని కోరారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.సంకుచిత బుద్ధితో టీడీపీ నేతలు ఆలయాలను కూల్చారని, ఆలయాల్లో విధ్వంసంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రవీణ్ చక్రవర్తి మతమార్పిడిలకు పాల్పడ్డారని.. తమ పాలనలో ఆలయాలపై దాడులు చాలా తగ్గాయని’’ ఎంపీ పేర్కొన్నారు. (చదవండి: బాబూ.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో..) కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి! -
సభలో ప్రధాని మాట చట్టంగానే భావిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సభ సాక్షిగా ప్రధాని మాట్లాడిన మాటలు చట్టంగానే భావిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్ర బోస్ అన్నారు. 2014లో అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలుచేయాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు నిందలు మోపుతున్నారని, ప్రధాని మాట నిలబెట్టుకోకపోతే ముఖ్యమంత్రి తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో బోస్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘కరోనా కారణంగా దేశంలో నష్టపోని కుటుంబం అంటూ ఏదీలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో వారికి ఊరటనిచ్చే అంశాలేవీ లేవు. అసంఘటిత, వ్యవసాయ కార్మికులకు సహాయంపై మాట్లాడకపోవడం దురదృష్టకరం. సుమారు 50 కోట్ల మంది దీనావస్థలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు శక్తిమేర ఆదుకున్నాయి. రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. దేశమంటే మట్టి కాదోయ్.. అనే గురజాడ మాటలను ఇటీవల ప్రధాని మోదీ కూడా పలికారు. బాధ్యతగా రాష్ట్రపతితో ఒక్క మాట కూడా చెప్పించలేదు. ప్రజల ఆర్థిక కష్టాలు తీర్చడానికి అమ్ములపొదిలో రెండు ప్రధాన అస్త్రాలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. అవేమిటో రాష్ట్రపతితో చెప్పించి ఉంటే బాగుండేది. ‘హోదా’పై కేంద్రం ఆలోచించాలి ఇక ఏపీ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక హోదా. ఏపీకి ‘హోదా’ ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ పార్లమెంటు సాక్షిగా చెప్పారు. ఆ హామీని ఈ ప్రభుత్వం అమలుచేయడంలేదు. ప్రధాని సభలో మాట్లాడే మాట జీఓ, చట్టంగానే భావిస్తాం తప్ప తర్వాత ప్రధాని వచ్చి దాన్ని పక్కన పెడతారని అనుకోలేం. దీనిపై కేంద్రం ఆలోచన చేయాలని కోరుతున్నా. ఏప్రిల్, 2022 కల్లా పోలవరం పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. సవరించిన అంచనాలను త్వరగా అనుమతిస్తూ ప్రకటన చేయాలి. టీడీపీ నేతలు పార్లమెంటులో అవాస్తవాలు చెప్పడంవల్ల రాష్ట్రం నష్టపోతోంది. వారి హయాంలో 800 పైగా ఆలయాల్లో దాడులు జరిగితే ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు. ఆధారాల్లేకుండా పవిత్రమైన సభలో నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు. కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకురావల్సి ఉంది. మరింత సమయం ఇవ్వండి, మరోసారి ఆయా అంశాలపై మాట్లాడతాం’.. అని బోస్ ప్రసంగాన్ని ముగించారు. -
‘తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు.. కానీ’
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్రం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ల వయస్సున్న బాలుడు లాంటింది. తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు కానీ.. బాలుడ్ని చూసి ఇవ్వరు. ఆర్థికంగా చిన్న రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తే ఆశించిన ప్రయోజనాలు చేకూరవు. జీఎస్టీ, పోలవరం నిధులను కేంద్రం ఎగనామ పెట్టడం ఏపీ ప్రజలకు బాధాకరం. కరోనా కారణంగా మీ పాట్లు మీరు పడండి అని కేంద్రం ఉచిత సలహ ఇస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. ఏ ప్రయోజనాలను ఆశించి ఆంధ్రప్రదేశ్ను విభజించారో.. ఆ ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని’’ సుభాస్ చంద్రబోస్ పేర్కొన్నారు. (చదవండి: గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల) ఆయన స్వార్థం కోసమే పనిచేశారు.. విజయవాడ: నవ నిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు స్వార్థం కోసం పనిచేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతుందన్నారు. ‘‘ఇతర రాష్ట్రాలు ఏపీలో అమలు చేస్తున్న పథకాలపై దృష్టి పెట్టాయి. పొట్టి శ్రీరాములు వంటి మహనీయుని త్యాగాలను నేటి తరాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందో, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమి చేస్తుందో రైతులకు బాగా తెలుసు. టీడీపీకి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. రైతులకు ఇవ్వాల్సిన నిధులు చంద్రబాబు ఎగ్గొట్టితే ఆ బాకీలు వైఎస్ జగన్ చెల్లించారు. ఐదేళ్లలో టీడీపీ రైతుల కోసం కేటాయించిన నిధులు 13000 కోట్లు.. ఏడాదికి రైతు భరోసా కింద సీఎం జగన్ కేటాయించిన నిధులు 13000 కోట్లు. పరిపాలనలో టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అమరావతి, పోలవరంలలో కూడా చంద్రబాబు అవినీతి వల్ల అభివృద్ధి ఆగిపోయింది. చంద్రబాబు, లోకేష్ లకు వైఎస్సార్సీపీ పాలన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని’’ సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. (చదవండి: ఏపీకి పూర్వ వైభవం: ఆళ్ల నాని) -
బోస్ను పరామర్శించిన విజయమ్మ
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ను వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిళ, బ్రదర్ అనిల్ ఫోన్లో పరామర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ను ఫోన్లో పరామర్శించారు. ఇటీవల పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్కు గురికావడంతో ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. (ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం) -
ఎంపీ పిల్లి సుభాష్ ఇంట తీవ్ర విషాదం
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్కు గురికావడంతో ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. కాగా సత్యనారాయణమ్మ అకాల మరణంతో సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యనారాణమ్మ బౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి రామచంద్రాపురం మండలం స్వగ్రామమైన హసనాబాధకు తరలించారు.ఆమె అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం జరగనున్నాయి. సత్యనారాయణమ్మ మరణ వార్త తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున హసనాబాద్కు చేరుకుంటున్నారు. -
రికార్డుల స్వచ్ఛీకరణ సవాలే!
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వేకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తప్పుల తడకగా ఉన్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ రెవెన్యూ శాఖకు అతి పెద్ద యజ్ఞంలా మారింది. ప్రస్తుత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం కేవలం స్వచ్ఛీకరణ కాదని, ఇది రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ అని రెవెన్యూ శాఖ మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన ప్రసాదరావు పలుమార్లు పేర్కొన్నారు. దీనిని పకడ్బందీగా చేస్తే చాలా వరకు భూ వివాదాలు పరిష్కారమవుతాని రెవెన్యూ, న్యాయ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. పక్కాగా, లోప రహితంగా రికార్డులను అప్డేట్ చేయాలంటే రెవెన్యూ ఉద్యోగులు జవాబుదారీతనంతో పని చేయాల్సి ఉంటుంది. కష్టమైన ప్రక్రియే.. ► రాష్ట్రంలో 4 కోట్ల ఎకరాలకు (1.63 లక్షల చదరపు కిలోమీటర్ల) పైగా ప్రభుత్వ, ప్రయివేటు భూములున్నాయి. 17,460 గ్రామాల పరిధిలో 1.96 కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి 90 లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది. ► మొత్తం 3 కోట్ల ల్యాండ్ హోల్డింగ్స్ ఉండగా, వీటిలో ప్రభుత్వానికి చెందినవి 43 లక్షలు. ఇందులో లక్షలాది ఎకరాలు ఆక్రమణదారుల గుప్పెట్లో ఉన్నాయి. ► చాలా చోట్ల భూ అనుభవ రికార్డులు (అడంగల్), భూ యాజమాన్య రికార్డులు (1బి)లను మార్చి వేశారు. అసైన్మెంట్ రిజిష్టర్లను మాయం చేశారు. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం సేకరించిన భూమి చాలా చోట్ల ఇప్పటికీ ప్రయివేటు వ్యక్తుల పేర్లతోనే ఉంది. అక్రమాల పుట్టలు.. ► రెవెన్యూ రికార్డులు అక్రమాల పుట్టలుగా మారాయి. ఏటా జరపాల్సిన రెవెన్యూ జమా బందీ దశాబ్దాలుగా నిర్వహించకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ► ఒకే భూమికి ఇద్దరు ముగ్గురికి దరఖాస్తు (డీకేటీ) పట్టాలు ఇచ్చిన సంఘనటలు కోకొల్లలుగా ఉన్నాయి. కొందరు రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇలా నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడ్డారు. ► ఒక సర్వే నంబరులో 10 ఎకరాల భూమి ఉంటే 20 ఎకరాలకు డీకేటీ పట్టాలు/ అడంగల్స్ ఉన్నవి కూడా చాలా చోట్ల ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు లెక్కే లేదు. దశాబ్దాలుగా మార్పులే లేవు ► ఎప్పటికప్పుడు రికార్డుల్లో మార్పులు చేర్పులు (అప్డేట్) చేయడాన్నే స్వచ్ఛీకరణ (మ్యుటేషన్) అంటారు. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా భూ రికార్డులు అప్డేట్ చేయకుండా వదిలేశారు. దశాబ్దాల కిందట చనిపోయిన వారి పేర్లతో లక్షలాది ఎకరాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాస్తవ భూమి విస్తీర్ణానికీ, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ► ఇలా రికార్డుల్లో తేడా ఉన్న సర్వే నంబర్లలోని భూమి యజమానులతో మాట్లాడి ఒప్పించి ఆయా వ్యక్తుల పేర్లతో ఉన్న భూమి విస్తీర్ణాన్ని ఆర్ఎస్ఆర్ ప్రామాణికంగా తగ్గించడం చాలా క్లిష్టమైన సమస్య. ► తల్లిదండ్రులు చనిపోయినా వారి పిల్లలు భాగపరిష్కారాలు చేసుకోకుండా తలా కొంత దున్నుకుంటున్నారు. రికార్డుల్లో చనిపోయిన తల్లిదండ్రుల పేరుతోనే భూమి ఉంది. ► చాలా చోట్ల భూమి కొన్న వారి బదులు అమ్మిన వారి పేర్లతోనే అడంగల్, 1బీలో భూమి ఉంది. వీటిని సరిచేయాల్సి ఉంది. ► భూమిలేని పేదల పేరుతో ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తోంది. భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసైన్మెంట్ రిజిస్టర్లను మాయం చేసి చాలా మంది ప్రభుత్వ భూములను అసైన్మెంట్ పట్టాలంటూ దున్నుకున్నారు. మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాల ద్వారా అమ్ముకున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి భూ రికార్డులను పకడ్బందీగా, పారదర్శకంగా స్వచ్ఛీకరించాల్సి ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి తొలి విడత రీసర్వే చేపట్టనున్న 6,500 గ్రామాల్లో రికార్డులు ముందు పెట్టుకుని టేబుల్ వెరిఫికేషన్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్, అడంగల్ మధ్య విస్తీర్ణంలో తేడాలు ఇక్కడ చాలా వరకు తేలే అవకాశం ఉంది. భూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఒకపక్క, భూముల సమగ్ర రీసర్వేకు మరో పక్క చకచకా ఏర్పాట్లు చేస్తున్నాం. – వి.ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ఎస్ఆర్ అడంగల్ మధ్య 33.54 లక్షల ఎకరాల తేడా రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్). బ్రిటిష్ కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం భూమిని సర్వే చేసినప్పుడు సర్వే నంబర్ల వారీగా ఎంతెంత భూమి ఉందో ఆర్ఎస్ఆర్లో నమోదు చేశారు. అయితే ఆర్ఎస్ఆర్, అడంగల్ మధ్య 33.54 లక్షల ఎకరాలకుపైగా వ్యత్యాసం ఉండటం రెవెన్యూరికార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయనడానికి నిదర్శనం. అడంగల్, భూమి కొలతల పుస్తకం (ఎఫ్ఎంబీ) మధ్య కూడా ఇలాగే భారీ తేడా ఉంది. భూమి ఎవరిదో రెవెన్యూకే తెలియదు! రాష్ట్రంలో చాలా కుటుంబాలకు వంశ పారంపర్యంగా భూమి సంక్రమించి ఉంటుంది. ఇలాంటి వారిలో కొందరి వద్ద భూమి తమదేననడానికి రాత పూర్వకమైన ఆధారాలు ఉండకపోవచ్చు. రెవెన్యూ శాఖ వద్ద కూడా చాలా వరకు రికార్డులు లేవు. అందుకే వెబ్ల్యాండ్, అడంగల్లో చాలా భూమి అన్సెటిల్డ్ అని, తెలియదు అని ఉంది. ఇలాంటి భూమి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. -
‘పల్లకి మోసే పనులు మాకు.. పల్లకిలో కూర్చునేది మీరు’
సాక్షి, తూర్పు గోదావరి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బీసీల మనస్సుల్లో ఎప్పటికీ స్థానం సంపాదించలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. వెనుకబడిన తరగతులకు ఇవ్వాల్సింది పార్టీ పదవులు కాదని తెలిపిన ఆయన బాబు అధికారంలో ఉండగా ఎప్పుడైనా పేదలైన బీసీలను రాజ్యసభకు పంపిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10% అయినా ఇవ్వగలిగారా అని నిలదీశారు. వివిధ నామినేటెట్ పదవులలో బడుగు బలహీలన వర్గాలకు 50% రిజర్వేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారని ప్రశంసించారు. (‘అమిత్ షా సానుకూలంగా స్పందించారు’) ‘ఇన్నాళ్ళు పల్లకి మోసే పనులు మాకు(బీసీలకు) పల్లకిలో కూర్చునేది మీరు. అందువల్లే ఇవాళ ప్రజలు టీడీపీని చీదరించుకున్నారు. ఒకేసారి బీసీలమైన నన్ను, మోపిదేవిని సీఎం జగన్ దేశంలోనే అత్యున్నతమైన రాజ్యసభకు పంపించారు. ఏపీలో బీసీ, ఎస్సీల సంక్షేమం కోసం రూ.42 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎంజగన్ది. బడ్జెట్లో మాకు ముఖ్యమంత్రి 20% నిధులు కేటాయించారంటే దేశంలోనే అది ఆల్ టైం రికార్డ్. చంద్రబాబుపైకి ఒక మాట చెబుతారు. లోపల భోజనం పెట్టేటప్పుడు దూరంగా గెంటేయడం వంటి పాలన చంద్రబాబు అందించారు. సీఎం జగన్ తన ఏడాది పాలనలో చెప్పినవి.. చెప్పని హామీలను అమలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అర్హులు కారని చంద్రబాబు అప్పటి న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు. అదేనా బీసీపై మీకు ఉన్న ప్రేమ. నమ్మినంతా కాలం బబీసీలు మిమ్మల్ని నమ్మారు. ఇక భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మే పరిస్ధితి లేదు’. అని తేల్చి చెప్పారు. (భారానికి, అధికారానికి తేడా తెలియదా?) -
‘అమిత్ షా సానుకూలంగా స్పందించారు’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశంపై ఆంధ్రజ్యోతి అవాస్తవ కథనాలు రాస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్ అమిత్ షాతో చర్చించారని, ఈ భేటీ సానుకూలంగా జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, ఏపీ విభజన జట్టంలోని అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని పేర్కొన్నారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం వాస్తవాలను వక్రీకరించి, అసత్యాలు ప్రచారం చేస్తోందని, ఇలాంటి రాతల వల్ల పత్రిక ప్రజల్లో పలుచన కావడం ఖాయమని చురకలు అంటించారు. (చదవండి: అమిత్ షాతో రెండోసారి సీఎం జగన్ భేటీ ) ఇక అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. జడ్జీల ప్రవర్తనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానంపై ఉందన్నారు. ఈ పరిణామాలపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా అర్థంకావడం లేదని వాపోయారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారు: మోపిదేవి న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల భేటీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ వికృతంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం అమిత్ షా అపాయింట్మెంట్ కోరి ఢిల్లీకి వచ్చారన్నారు. అమరావతి భూ కుంభకోణం, జడ్జీల వ్యవహారం, ఫైబర్ నెట్వర్క్ తదితర అంశాలను ప్రస్తావించారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను ఆయన వివరించారన్నారు. ఇందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారని తెలిపారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాక్షసానందం పొందుతోందని మండిపడ్డారు. ఇందుకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని మోపిదేవి వెంకటరమణ చురకలు అంటించారు. ఇక మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగిందన్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలను సాధించుకునే దిశగా ముందుకెళుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. -
రాజ్యసభ: అమరావతి అక్రమాలపై విచారణ జరగాలి
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో కోరారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో మాట్లాడుతూ.. 'అమరావతిలో చంద్రబాబు నాయుడు ధనవంతులకే స్థలాలిచ్చారు. అక్కడ పేదలకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నించారు. అలాంటి ప్రయత్నాలను న్యాయస్థానాలు సైతం అడ్డుకోవడం సరికాదు. పేదవాళ్లు, పెద్దవాళ్ల పక్కన నివాసం ఉండడానికి అనర్హులా..?. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు ఇదేనా..?. అందుకే ఆ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. అంతర్వేదిలో దేవుడి రథం విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. (సీఎం జగన్పై వాసుపల్లి గణేశ్ ప్రశంసలు ) అంతర్వేది ఆలయం శిథిలావస్థలో ఉంటే దాన్ని మాజీ సీఎం వైఎస్సార్ అభివృద్ధి చేశారు. మా సీఎం దృష్టిలో అందరూ సమానమే. బడుగు వర్గాలకు చెందిన మేమిద్దరం ఇక్కడ ఎంపీలుగా నిలబడ్డమే అందుకు నిదర్శనం. కొందరు విబేధాలు రెచ్చగొట్టేందుకు ఎవరో కొందరు చేసిన పనిని సీఎంకు ఆపాదించడం దురదృష్టకరం. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరుతున్నాం. న్యాయమూర్తులపై నిందారోపణలున్నాయి. కాబట్టి కచ్చితంగా సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది' అని పిల్లి సుభాస్ చంద్రబోస్ అన్నారు. (స్టేలతో బతుకుతున్న వ్యక్తి చంద్రబాబు) సమగ్ర న్యాయ విచారణ జరగాలి- మోపిదేవి వెంకటరమణ అమరావతి అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా బడుగు బలహీనవర్గాల, పేదల భూములు సేకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ('మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం') నిష్పక్షపాత దర్యాప్తు ఉండాలి- అయోధ్య రామిరెడ్డి రాష్ట్రంలో అన్ని దర్యాప్తులకు మోకాలడ్డుతున్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సిట్, సబ్ కమిటీ ఏర్పాటైంది. అమరావతిలో అవకతవకలు జరిగాయని ఈ కమిటీ ద్వారా వెల్లడైంది. దీనిపైన న్యాయవిచారణ జరగాల్సిందే. నిష్పక్షపాత దర్యాప్తు తప్పనిసరిగా ఉండాలి. -
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్ సీపీ సభ్యుల్లో ముగ్గురు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అక్షర క్రమం ప్రకారం తొలుత ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణం చేయగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి.. వారితో పాటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో కలసి ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఇది ఒక రికార్డు: మిథున్రెడ్డి మరీ వెనుకబడిన తరగతి (ఎంబీసీ)కి చెందినవారు ప్రప్రథమంగా రాజ్యసభలో అడుగుపెట్టడం రికార్డు అని, వైఎస్సార్ సీపీకి ఇది చాలా సంతోషకరమైన రోజు అని మిథున్రెడ్డి పేర్కొన్నారు. ‘రాజ్యసభలో ఒక్క సభ్యుడితో మొదలైన వైఎస్సార్ సీపీ ప్రస్థానం ఈరోజు ఆరుకి పెరిగింది. ఈ పరిణామం రాష్ట్రానికి మరింత మేలు చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్ చలువతో బీసీల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటగా రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. అనారోగ్య కారణాల వల్ల పరిమళ్ నత్వానీ ప్రమాణ స్వీకారం చేయలేదు. వచ్చే వారం ఆయనకు సమయం ఇవ్వాలని పార్టీ ద్వారా రాజ్యసభ చైర్మన్ను కోరాం..’ అని తెలిపారు. బోస్, మోపిదేవి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు(కుడి నుంచి ఎడమకు) కలలోనూ ఊహించలేదు – సుభాష్ చంద్రబోస్ ‘మోస్ట్ బ్యాక్వర్డ్ తరగతులకు చెందిన నాకు, మోపిదేవికి పార్లమెంట్ సభ్యులుగా అవకాశం దక్కడం అరుదు. కలలో కూడా ఊహించనిది జరిగింది. ఇలాంటి మహత్తర అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు. మాపై గురుతరమైన బాధ్యత ఉంది. విభజన హామీలన్నీ ఇంకా అమలు కాలేదు. కోవిడ్ కారణంగా ఆర్థిక ఇక్కట్లలో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సి ఉంది. ప్రధాని ఈ దిశగా సాయం చేస్తారని ఆశిస్తున్నాం..’ అని బోస్ అన్నారు. నాలుగు రంగాలపై దృష్టి : ఆళ్ల ‘ముఖ్యమంత్రి జగన్ మాపై ఎంతో నమ్మకంతో పెద్దల సభకు ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పురోగమించేందుకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి ప్రాధామ్యాలకు అనుగుణంగా పనిచేస్తాం..’ అని ఆళ్ల చెప్పారు. అరుదైన ఘటన: మోపిదేవి ‘నా రాజకీయ జీవితంలో ఇది మరువలేనిఘటన. విశాల రాజకీయ దృక్పథంతో పరిణితి చెందిన నేతలను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్న సీఎం వైఎస్ జగన్ విధానాలకు అనుగుణంగా పనిచేస్తాం. అత్యంత వెనకబడిన కులాలకు చెందిన ఇద్దరికి రాజ్యసభలో ప్రవేశించే అవకాశం కల్పించడం ఏపీ చరిత్రలోనూ, ప్రాంతీయ పార్టీల ప్రస్థానంలో ఒక అరుదైన ఘటన. బీసీ సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు..’ అని మోపిదేవి పేర్కొన్నారు. -
సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు
-
సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు: పిల్లి సుభాష్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన మాకు రాజ్యసభలో చోటు కల్పించడం అరుదైన సన్నివేశం. కలలో కూడా ఊహించనిది జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. మా అందరిపైనా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. విభజన చట్టం లో హామీలు ఇంకా పరిపూర్ణంగా అమలు కాలేదు .విభజన చట్టం అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆంధప్రదేశ్లో రూ.40 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం ఆల్టైమ్ రికార్డు. వ్యవసాయ రంగానికి రూ.19 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. విద్యా, వైద్య రంగాల మీద పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాల హృదయంతో ఏపీని ఆదుకోవాలి’ అని పేర్కొన్నారు. కాగా, వైఎస్సార్సీపీ రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. (మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ) -
రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
-
వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని, మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున సభలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
ఆ రెండు శాఖలూ సీఎం వద్దే
సాక్షి, అమరావతి: రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి పదవికి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామాలు చేయడంతో ఆ రెండు శాఖలు సీఎం పరిధిలోకి వెళ్లినట్లు సీఎస్ నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మంత్రులిద్దరి రాజీనామాలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో వాటిని నోటిఫై చేస్తూ మరో ఉత్తర్వులు ఇచ్చారు. -
ఇద్దరు మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవల రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వీరిద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 22న పిల్లి సుభాష్చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు.(కరోనా నివారణకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు) -
కౌలు రైతులకూ పంట రుణాలు
సాక్షి, అమరావతి: రైతులకు అన్నివిధాలా అండదండలు అందిస్తూనే.. కౌలు రైతులకూ పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పంట రుణాల పక్షోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. రైతుల హక్కులకు భంగం కలగదు: పిల్లి సుభాష్చంద్రబోస్ ► వ్యవసాయ రంగం అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ దృష్టి సారించారు. ► రైతులతో పాటు కౌలుదారులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో నూతన సాగుదారుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ► ఈ చట్టం వల్ల భూ యజమానులైన రైతుల హక్కులకు ఎటువంటి భంగం కలగదు. ► 11 నెలల సాగు అనంతరం కౌలు హక్కులు వీడిపోయేలా చట్టం రూపొందించాం. ► కౌలుదారుల వివరాలను అధికారులకు చెప్పాల్సిన నైతిక బాధ్యత రైతులపై ఉంది. ► కేంద్ర ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే పంట రుణాలిస్తోంది. ఏపీలో రైతులతో పాటు కౌలుదారులకూ రుణాలు అందించాలని సీఎం నిర్ణయించారు. కౌలు రైతులకు రూ.8,500 కోట్ల రుణాలు : కురసాల కన్నబాబు ► రుణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించి పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కార్డులు పొందిన కౌలు రైతులందరికీ పంట రుణాలు అందిస్తాం. ► రాష్ట్రంలో ఇప్పటివరకు 4,02,229 మందికి సీసీఆర్సీ కార్డులు అందజేశాం. మరో లక్షన్నర వరకూ కార్డులు అందిస్తాం. రూ.8,500 కోట్లను కౌలుదారులకు పంట రుణాలుగా అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ► త్వరలో జిల్లాలు, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. అభ్యుదయ రైతు అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ బోర్డులు పంటల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తాయి. ► రైతులకు వడ్డీ లేని రుణ బకాయిల కింద రూ.1,150 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. ► ఈ విషయంలో బ్యాంకర్లు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. రూ.200 కోట్లతో పొగాకు కొనుగోళ్లు ► పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అన్ని ప్లాట్ఫారాల్లో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ► రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 55.5 శాతం అధికంగా కురవటం శుభసూచకం. ఖరీఫ్ పనులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే 32 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. ► సీఎం జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది మే నాటికే 12.61 లక్షల మంది రైతులకు 8.43 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందజేశాం. ఇప్పటికే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేశాం. ► ప్రస్తుత వర్షాల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల నారుమడులు ముంపునకు గురైనట్టు సమాచారం అందుతోంది. వివరాలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించాం. సంబంధిత రైతులను ఆదుకుంటాం. -
‘ఆయనదంతా కృత్రిమ ఉద్యమం’
సాక్షి, తూర్పుగోదావరి: 29 గ్రామాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కృతిమ ఉద్యమాలు చేయిస్తున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పలేదని విమర్శించారు.‘‘మీ పెట్టుబడిదారులు అమరావతిలో 33 వేల ఎకరాలు సేకరించాకే అమరావతిని రాజధానిని చేశారు తప్ప రైతులపై ప్రేమతో కాదు. అమరావతిలో చంద్రబాబు ఒక్క శాశ్వతమైన భవనం ఏమైనా కట్టారా? మండలిలో బిల్లులు పాస్ కాకుండా చంద్రబాబు కుట్రలు చేశారని’’ ఆయన నిప్పులు చెరిగారు. ఆయన కబుర్లు చెప్పడం తప్ప ఏపీకి చేసిందేమీ లేదని సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. (‘ఆయన వ్యాఖ్యల వెనుక ఏ కుట్ర దాగుందో’) -
మంత్రివర్గ విస్తరణ 22న?
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్చంద్రబోస్లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. -
టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి
సాక్షి, కాకినాడ: గత టీడీపీ పాలనలో 108, 104 వాహనాలను నిద్రావస్థలో పెట్టారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరోజైనా 108 వాహనాల పని తీరును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమీక్షించారా? అని ప్రశ్నించారు. వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేతలు నిందలు వేస్తున్నారన్నారని మండిపడ్డారు. (సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం) టీడీపీ నేతలను రాష్ట్ర ప్రజలు క్షమించరని పిల్లి ధ్వజమెత్తారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై సీఎం జగన్ దృష్టి సారించారని, ఆర్థికంగా ఎంతో వెనకపడిన పేద ప్రజలకు సంక్షేమం.. ఆరోగ్య పథకాల విషయాలో ఏపీ విజయకేతనం ఎగురవేస్తోందని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో 108, 104 వాహనాలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయన్నారు. బెంజి సర్కిల్లో జరిగిన ఘటనను దేశ ప్రజలంతా చూశారన్నారన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం ఆయన అన్నారు. -
ఎమ్మెల్చీ పదవికి రాజీనామా చేసిన డిప్యూటీ సీఎం
-
పిల్లి సుభాష్, మోపిదేవి రాజీనామా ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆదే విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ విజయం సాధించి పెద్దల సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు మండలి చైర్మన్కు బుధవారం తమ రాజీనామా లేఖను పంపించగా ఆయన ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరిద్దరితో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఎన్నికైన విషయం తెలిసిందే. -
వారికి కూడా కాపునేస్తం తరహా పథకం
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ ద్వారా కాపులకు ఆర్థిక సహయం అందజేయడం ఆనందకరమని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ వంగా గీతతో కలిసి కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘కాపు సోదరీమణులు ఇళ్ళు దాటి బయట ఎటువంటి పనులకు వెళ్ళరు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం . ప్రస్తుత పరిస్ధితుల వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక భరోసా ఇవ్వాలని సీఎం జగన్ ముందు చూపుతో చేసిన నిర్ణయానికి ధన్యవాదాలు. వచ్చే నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరీమణులకు కూడా ఇటువంటి పథకం అమలు అవుతుంది. ఇప్పటికే కేబినెట్ తీర్మానం కూడా అయిపోయింది. త్వరలోనే ఈ పథకం ప్రారంభించే తేది ఖరారు అవుతుంది. దేశంలోనే బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీలకు సంబంధించిన ఒక గొప్ప పధకాన్ని సీఎం జగన్ అమలు చేయబోతున్నారు’ అని అన్నారు. (కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ ) కాకినాడ ఎంపీ వంగా గీతా మాట్లాడుతూ...‘కాపు కుటుంబాల తరపున సీఎం జగన్కు ధన్యవాదాలు. ఆర్ధిక ఇబ్బందులు, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అర్హత ఉన్న లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రయత్నించేవి. కానీ సీఎం జగన్ పాలనలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాపు, తెలగ, ఒంటరి కులాల్లో మహిళలకు మానిటరీ బెనిఫిట్ అందించడంతో పాటుగా అదనంగా అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా పథకాల ద్వారా సహాయం చేస్తున్నారు. మహిళలకు అందించే ప్రతి రూపాయి కూడా తమ కుటుంబ సంక్షేమానికే ఖర్చు పెడతారు’ అని ఆమె అన్నారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం) -
అప్రజాస్వామికం.. అమానుషం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అప్రజాస్వామికంగా వ్యవహరించి సభ నడిపారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఆదిమూలం సురేష్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బోస్ ఏమన్నారంటే.. ► రూల్–90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒకరోజు ముందే నోటీసు ఇవ్వాలి. చైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా చైర్మన్ రూల్–90ని పరిగణనలోకి తీసుకున్నారు. ► ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ► ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్ట పాల్జేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. ► యనమల రామకృష్ణుడిది పైశాచిక ఆనందం. టీడీపీ సభ్యులు వారి మాట వినకపోతే విధ్వంసం సృష్టిస్తామని బెదిరిస్తున్నారు. సభా సంప్రదాయాలు, నిబంధనలు వారికి అవసరం లేదు. శాసన మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో మంత్రులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు చరిత్రలో దుర్దినం : మంత్రి కన్నబాబు ► టీడీపీ సభ్యులు సభా నిబంధనల్ని ఉల్లంఘించారు. మెజార్టీ ఉందని ఇష్టానుసారం వ్యవహరించారు. చరిత్రలో ఇది దుర్దినం. ► మంత్రి వెలంపల్లి శ్రీనివాస్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్ దాడికి దిగారు. సభలో ఫొటోలు తీసి లోకేష్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ► దీనిపై కచ్చితంగా సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లోకేష్ విధానం సరికాదని చైర్మన్ కూడా చెప్పారు. ► మండలి నిరవధిక వాయిదా వెనుక యనమల ప్లాన్ ఉంది. మెజార్టీ ఉందని సభను అడ్డుకుంటున్నారు. ► డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయం. టీడీపీకి తప్ప ఏ ఇతర పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. ► మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలు కోరాం. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. దాడికి దిగారు: మంత్రి ఆదిమూలపు ► టీడీపీ సభ్యులు సభ నియమ, నిబంధనల్ని తుంగలో తొక్కారు. మంత్రులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ► పాస్ చేయాల్సిన బిల్లులను అడ్డుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీ అడ్డుకుంటోంది. వాయిదా వేయడం శోచనీయం: చీఫ్ విప్ ఉమ్మారెడ్డి ► శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారు. ► కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయం. టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. గత సమావేశాల్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారు. ఇపుడు ఏం జరగనుంది? ద్రవ్య వినిమయ బిల్లు ► ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడంవల్ల మహా అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులు ఒకటి రెండు రోజులు ఆలస్యం కావడం మినహా ఎలాంటి సమస్య ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ► శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను మండలి 14 రోజులు జాప్యం చేయగలదు తప్ప అంతకుమించి ఎలాంటి అధికారం లేదు. ► ‘ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఈనెల 17న ఆమోదించింది. ఇక 14 రోజులు అంటే ఈ నెలాఖరుతో గడిచిపోతాయి. వచ్చే నెల ఒకటి లేదా రెండో తేదీ నుంచి యథా ప్రకారం చెల్లింపులు చేయవచ్చు’ అని నిపుణులు తెలిపారు. సీఆర్డీఏ రద్దు.. వికేంద్రీకరణ ► ఆర్థికేతర బిల్లులను రెండోసారి మండలిలో అడ్డుకోవడంవల్ల నెల రోజులు అవి చట్టరూపం దాల్చ కుండా ఆగిపోతాయి. నెల రోజుల్లో మండలి ఆమోదించినా, తిరస్కరించినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే. ► ఏదైనా బిల్లును శాసనసభ ఆమోదించి మండలికి పంపితే అది మూడు నెలలు మాత్రమే దానిని ఆపగలదు. మూడు నెలల్లో తిరస్కరించినా, వెనక్కు పంపినా మళ్లీ అసెంబ్లీ ఆమోదించి పంపవచ్చు. ఇలా వచ్చిన బిల్లును మండలి నెల రోజుల్లోగా ఆమోదించి పంపాలి. ఒకవేళ ఆమోదించకపోయినా తిప్పి పంపకపోయినా ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లేనని ఆర్టికల్ 197 స్పష్టంగా చెబుతోంది. ► పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, విద్యా హక్కు చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపించి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. వీటిని మండలిలో చర్చకు రాకుండా అడ్డుకున్నంత మాత్రాన ఒరిగేదేమీలేదని,అవి ఆమోదం పొందినట్లేనని న్యాయ నిపుణులంటున్నారు. -
‘దొంగతనం చేశాడు కాబట్టే జైలుకెళ్లాడు’
సాక్షి, అమరావతి : ప్రభుత్వ సొమ్మును దొంగతనం చేశాడు కాబట్టే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లాడని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బుధవారం శాసన మండలిలో అచ్చెన్నాయుడు అరెస్ట్పై టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్లమెంట్ చరిత్రలో.. మీ జన్మలో బీసీలను రాజ్యసభకు పంపించారా?.. టీడీపీ పాలనలో బీసీలకు బడ్జెట్ పెట్టారా? అని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని అన్నారు. -
ఆ రెండు పథకాలే మా పార్టీకి బంగారు ఫ్లాట్ఫామ్
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని తెలిపారు. తొలి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోతే ప్రభుత్వాలు, రాజకీయాలపైన విశ్వాసం సన్నగిల్లిపోతుందని సీఎం జగన్ చెప్పెవారని గుర్తుచేశారు. టీడీపీలా మేము 640 హామీలు ఇచ్చి పదో పదిహేనో అమలు చేసి మిగతా వాటిని గాలికి వదిలేయలేదని విమర్శించారు. చేయగలిగే తొమ్మిది నవరత్నాలను వైఎస్ జగన్ ప్రకటించి అమలు చేశారని అన్నారు. కేవలం నవరత్నాలే కాకుండా ఇంకా కొన్ని పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను పొందారని అన్నారు. ఒకవైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమ పధకాలను సమాంతరంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాకు రూ. 40 వేల కోట్లు బకాయిలు, రూ.3 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారగానే దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టలేదని విమర్శించారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ అద్బుతమైన ఆర్ధిక పాలనను అందిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్కు హై కమాండ్ పెత్తనం ఉండేదని.. అయినా దివంగత నేత వైఎస్ఆర్ నిరంతరం పేదల గురించే ఆలోచించేవారని తెలిపారు. ఆయన ఆలొచనలో సిఎం జగన్ ఇంకో అడుగు ముందుకు వేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ లాంటి సంక్షేమ పధకాలు వైఎస్ఆర్ మానస పుత్రికలని.. ఆ రెండు పథకాలే ఇవాళ మా పార్టీకి బంగారు ఫ్లాట్ ఫామ్ వేశాయని అన్నారు. పేద ప్రజలకు చేయందించి వారి కన్నీరు తుడవగలిగిన వారే పరిపాలకులుగా ఉండాలని సీఎం జగన్ తన పాలన తీరుతో చూపించారని పేర్కొన్నారు. -
వ్యవసాయ పరిశ్రమలను సందర్శించిన మంత్రులు
సాక్షి, తూర్పు గోదావరి: లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. జిల్లాలోని రూరల్ వ్యవసాయ అనుబంధ సంస్థలను మంత్రితో పాటు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ వంగా గీతా తదితరులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు.. ఆ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఆటంకం కలిగించ వద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. అవసరమైతే ఇతర జిల్లాలకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులకు కూడా అనుమతించమని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు. ఆక్వా, ఫౌల్ట్రీ రంగాలకు ఎటువంటి మద్దతు ఇచ్చామో...ఉద్యానవన ఉత్పత్తులు...దాని అనుబంధ పరిశ్రమలకు కూడా అదే విధంగా మద్దతు ఇస్తామన్నారు. (తప్పుడు సమాచారమిస్తే కేసులు తప్పవు) మామిడి ధరలు పడిపోకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. మే15 నుంచి రెండవ సంవత్సరం రైతు భరోసా పథకం అమలు చేయడానికి ప్రణాళిక సిద్దం చేశామని, దీనికి సంబంధించి సోషల్ ఆడిట్ను కూడా ఆదేశించామని చెప్పారు. ప్రతి గ్రామా సచివాలయంలో అర్హులైన లబ్థిదారుల పేర్లు ప్రచురిస్తున్నామని, కరోనా వంటిఇబ్బందికర పరిస్ధితులలో కూడా రైతులకు మేలు చేయడం కోసం సిఎం జగన్ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయడం లేదని పేర్కొన్నారు. అంతేగాక అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హోం క్వారంటైన్లో ఉండి గడప దాటి బయటకు రాకుండా ఇంట్లో కుర్చుని ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. గీతా కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని భ్రమ కల్పించేందుకు బాబు ట్వీట్ చేశారని ఆయన మండిపడ్డారు. మూడు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు కొంచమైన జ్ఞానాన్ని ప్రదర్శించాలా లేదా అని ఆయన మండిపడ్డారు. (కరోనా టెస్టులు: దేశంలోనే ప్రథమ స్థానం..) కాకినాడ రూరల్లో గత 30 ఏళ్ళుగా ఏపీఐసీసీలో ఉన్న రైతుల సమ్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని, దాదాపు103 ఎకరాలు రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి ఇప్పిస్తే.. దాన్ని ఇళ్ల స్థలాల కోసం సేకరించామని చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. అలా సేకరించిన భూములను ఇళ్ళ స్ధలాలకు కేటాయించేందుకు ఆ భూముల్లోని తాడిచెట్లను అధికారులు తొలగించినందుకు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న గీతా కార్మికుల ఉపాధిని సీఎం జగన్ దెబ్బతీసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాల సారవంతమైన భూమలను సేకరించి.. పండ్ల తోటలు, కొబ్బరి, తాడి చెట్లను, వేలాది వృక్షాలను చంద్రబాబు నాశనం చేశారని, అమరావతి పేరుతో దుఖానం పెట్టినప్పుడు ఈ చెట్లు ఏం చేద్దామనుకున్నారని ప్రశ్నించారు. తాడిచెట్లు తీయకుండానే అమరావతిలో భవనాలు నిర్మించారా చెప్పండి ? ఐదు వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని కొన్ని తాడిచెట్లు తొలగిస్తే చంద్రబాబుకు ఏం నొప్పికలుగుతుందని మండిపడ్డారు తాడిచెట్ల తొలగింపుపై చంద్రబాబు చెప్పేది అభూతకల్పన అని మంత్రి పేర్కొన్నారు. -
అందరికీ అందుబాటులో నిత్యావసరాలు
-
‘క్రిమి చిన్నదైనా పెద్ద సైన్యంతో పోరాడాలి’
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నగరాలు, పట్టణాల్లో నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. 'కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా నగరాల్లో పాజిటివ్ కేసులు పెరుగుదల ఎక్కువగా ఉంది. అవసరమైన మేరకు వ్యవసాయ సంబంధిత సరకుల రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనమంతా కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. క్రిమి చిన్నదైనా పెద్ద సైన్యంతో మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైన వారికి రాజమండ్రి లాంటి నగరాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సంస్థలను సమన్వయ పరిచి అవసరమైన వారికి సదుపాయాలు అందించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో ప్రాసెసింగ్ సిబ్బంది మధ్య కూడా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆహారం లేకుండా ఎవరూ ఇబ్బందిపడకూడదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా కారణంగా ఏప్రిల్ 4న ప్రతి పేద కుటుంబానికి రూ.1000 అందజేస్తాం' అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
ఆక్వారైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-
‘ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది’
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నియమించిన ప్రక్రియ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీసీలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు స్థానాలు బీసీలకు.. రాష్ట్ర అభివృద్ధి కోసం నత్వానికి.. పారిశ్రామిక అభివృద్ధి కోసం అయోధ్య రామిరెడ్డికి సీటు ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాయకులను చంద్రబాబు నాయుడులా వాడుకొని వదిలేయడం సీఎం జగన్కు తెలియదు. చంద్రబాబు నాయకులను కరివేపాకుల వాడి వదిలేస్తారు. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రధమ స్థానంలో సీఎం జగన్ ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ పదవులు వస్తాయని అనుకోలేద’ని అన్నారు. ( సీఎం జగన్ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు ) ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారు : అయోధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా మేకిన్ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్ జగన్ రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉంది : నత్వాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి పరిమల్ నత్వాని అన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై తమ ఛైర్మన్ అంబానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించారని తెలిపారు. -
సీఎం జగన్ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణరావులు సీఎం జగన్తో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పాల్గొన్నారు. (సగం బీసీలకే; బోస్, మోపిదేవిలకు అవకాశం) -
బోస్కు సముచిత స్థానం
సాక్షి, రాజమహేంద్రవరం: నైతిక విలువలు కోల్పోయి కలుషితమైన రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి విశ్వసనీయతకు పెద్ద పీట వేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హఠాన్మరణం తరువాత నమ్మిన సిద్ధాంతం కోసం మంత్రి పదవినే తృణప్రాయంగా విడిచిపెట్టేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్కు సీఎం పెద్దల సభకు పంపించేందుకు నిర్ణయించారు. అధిష్టానం అంటే వైఎస్సేనంటూ పదవులపై వ్యామోహం లేదంటూ రాజశేఖరరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి వెన్నంటి నిలిచిన బోస్కు సముచిత స్థానం లభించింది. రాజకీయాలలో తొలినాళ్ల నుంచి మహానేత రాజశేఖర్రెడ్డి నమ్మిన వారిలో ఒకరిగా బోస్ గుర్తింపుపొందారు. (కీలక ఘట్టం; సగం బీసీలకే) వైఎస్ మరణానంతరం కూడా ఆయన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిస్తూవచ్చారు. 2010లో మారిన రాజకీయ పరిణామాల్లో బోస్ వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియానే ధిక్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించినప్పటి నుంచీ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోను 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లోను బోస్ రామచంద్రపురంనుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నాటి ఎన్నికల్లోనే సముచిత స్థానం కల్పిస్తానని జగన్ ప్రకటించారు. ఆ తరువాత 2016లో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారందరినీ పక్కనబెట్టి బోస్కే కేటాయించి రాజకీయాల్లో చాలా అరుదుగా వినిపించే విశ్వసనీయత, విలువలు, ఇచ్చిన మాటకు కట్టుబడటమనే పదాలకు జగన్ నిదర్శనంగా నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టిక్కెట్ను కేటాయించి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో బోస్ ఓటమి చెందినప్పటికీ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తొలి కేబినెట్లోనే స్ధానం కల్పించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. అంతటితోనే ఆగకుండా కీలకమైన రెవెన్యూశాఖను కూడా కేటాయించి మండలి నేతగా కూడా ప్రాతినిధ్యం కల్పించారు. వికేంద్రీకరణ, మూడు రాజధానులను అడ్డుకునే ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ శాసన మండలిని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేయగా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న బోస్ తన పదవి పోతుందనే ఆలోచన కూడా లేకుండా శాసన మండలిని రద్దు చేయాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి సంచలన నిర్ణయాన్ని తీసుకుని జగన్మోహన్రెడ్డికి విధేయుడిగా నిలిచారు. శెట్టిబలిజలకు సముచిత స్థానం రాష్ట్ర విభజనకు ముందు విభజన తరువాత ఏపీలో బీసీలలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి తొలిసారి పెద్దల సభకు అవకాశం ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. జిల్లాలో బీసీలను ఓటుబ్యాంక్గానే పరిగణించిన టీడీపీ ఈ స్థాయి ఆ సామాజిక వర్గానికి ఎప్పుడూ కల్పించలేకపోయింది. జిల్లా నుంచి తొలిసారి రాజ్యసభకు కాపు సామాజిక వర్గం నుంచి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత ప్రాతినిధ్యం వహించారు. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్చంద్రబోస్ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రాజ్యసభకు నామినేట్ చేయటంలో బీసీ వర్గాలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీలకు సముచిత స్ధానం కల్పిస్తామని చెప్పటమే కాకుండా ఏకంగా రాజ్యసభకు బోస్ను పంపించేందుకు నిర్ణయించడంపై ఆ సామాజికవర్గంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. విశ్వసనీయతకు విలువనిచ్చిన సీఎం ముఖ్యమంత్రి విశ్వసనీయతకు విలువ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంతటి స్థాయి కల్పిస్తారని ఎప్పుడూ ఊహించ లేదు. బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎప్పుడూ చెబుతుండే సీఎం దానిని కార్యచరణలో చూపించారు. (వైఎస్సార్సీపీలోకి డొక్కా, రెహమాన్) -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరిద్దరినీ రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమల్ను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థులను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం వీరు మాట్లాడుతూ... ‘ఈనెల 6వ తేదీన రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అభ్యర్థులను ఖరారు చేశాం. 50 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలను రాజ్యసభకు నామినేట్ చేశాం. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశాం. ఇక నాలుగో సీటు పరిమల్ నత్వానికి ఇవ్వనున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు ఏపీ నుంచి పరిమల్కు ఇవ్వడం జరిగింది. పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.’ అని వెల్లడించారు. పరిమల్ నత్వానీ వైస్సార్ సీపీ అభ్యర్ధే... పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ అభ్యర్ధన మేరకే నత్వానీకి టిక్కెట్ కేటాయించామని, అయినా ఆయన్ని తమ పార్టీ అభ్యర్థిగానే భావిస్తుస్తాని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. రాజ్యసభ టిక్కెట్లు దక్కించుకున్న ఇద్దరు మంత్రులు ఇప్పుడే రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారని ప్రకటించి.. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజీనామా చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు ఈనెల 7న ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. మార్చి 6 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
దుర్మార్గులు దొరికారు
సాక్షి, మండపేట: పట్టణంలో సంచలనం సృష్టించిన దళిత విద్యార్థినిపై లైంగికదాడి ఘటనలో నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని బైపాస్రోడ్డులో నిందితులు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్టు చేసినట్టు రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. సంఘటన వివరాలను శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. మండపేటలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థిని ఈనెల 3వ తేదీన కళాశాలకు వెళ్లి సాయంత్రం స్నేహితుడి మోటారు సైకిల్పై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో బైపాస్ రోడ్డులోని సంఘం కాలనీ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు బండిని ఆపి పోలీసులమంటూ రికార్డులు చూపాలని అడిగారు. అందులో ఒక వ్యక్తి యువతి స్నేహితుడిని పక్కకు తీసుకువెళ్లగా మరో వ్యక్తి మరో ఇద్దరికి ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురు కలిసి విద్యార్థినిని పక్కనే పంట పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహికంగా లైంగికదాడికి పాల్పడినట్డు డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. స్పృహ కోల్పోయిన ఆమె కొద్దిసేపటి తర్వాత తేరుకుని స్నేహితుల సాయంతో ఇంటికి చేరుకుంది. భయపడి జరిగిన సంఘటనను ఇంట్లో చెప్పలేకపోయింది. మరుసటి రోజు జరిగిన అన్యాయం గురించి తన సోదరుడితో చెప్పి అతడి సాయంతో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: సామూహిక అత్యాచారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ ఎ.నాగమురళి నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా రాజగోపాలరెడ్డి దర్యాప్తు చేపట్టారు. లైంగికదాడికి పాల్పడిన నలుగురు నిందితులు బైపాస్ రోడ్డులో ఉన్నట్టు గురువారం సాయంత్రం సమాచారం అందడంతో సీఐ నాగమురళీ, ఎస్సై రాజేష్కుమార్ దాడిచేసి మధ్యవర్తుల సమక్షంలో వారిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున నిందితులను మీడియా ముందుకు తీసుకురాలేమని, అలాగే వారి పేర్లను ఇంకా వెల్లడించలేమని డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థలం ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం పట్టణానికి చెందిన వల్లూరి మురళీకృష్ణ, సుంకర వెంకన్న, మొలకల వీరబాబు, చామంతి మధులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. తొలుత ప్రధాన నిందితుడు వల్లూరి మురళీకృష్ణ విద్యార్థినిపై ఘాతుకానికి ఒడిగట్టగా, ఆ తర్వాత సుంకర వెంకన్న లైంగికదాడికి పాల్పడ్డాడు. ములకల వీరబాబు సంఘటన స్థలంలోనే ఉండి యువతి కాళ్లను గట్టిగా పట్టుకుని వారికి సహకరించాడు. వదిలిపెట్టమని విద్యార్థిని ఎంత ప్రాధేయపడినా పట్టించుకోకుండా అత్యంత పాశవికంగా వారు లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. రాత్రి ఎనిమిది గంటల సమయం కావడం, రోడ్డు నుంచి పొలాల్లోకి దూరంగా తీసుకువెళ్లిపోవడంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. విడిపించుకునే ప్రయత్నం చేసినా ఆమెపై దాడిచేయడంతో పాటు పరుష పదజాలంతో దూషిస్తూ కాళ్లు కదలకుండా తొక్కిపెట్టి అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డారు. స్పృహలేకుండా పడి ఉన్న ఆమెను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ఫోన్ రింగవుతున్నా తీయలేని నిస్సత్తువలో పాక్కుంటూ ఫోన్ తీసుకుని స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఇంటికి చేర్చే సరికి రాత్రి 9 గంటలైంది. జరిగిన దారుణం గురించి ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చెప్ప లేక, సోదరుడికి చెప్పే ధైర్యం చేయలేక తీవ్ర క్షోభను అనుభవించింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ధైర్యం తెచ్చుకుని మరుసటి రోజు సోదరుడికి చెప్పి అతడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి పూర్తి న్యాయం చేస్తాం డిప్యూటీ సీఎం బోస్ కాకినాడ సిటీ: సభ్యసమాజం తలదించుకునేలా మండపేటలో దళిత యువతిపై జరిగిన లైంగికదాడి ఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తానని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శుక్రవారం రాత్రి పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబు తదితరులతో కలసి ఆయన పరామర్శించారు. ∙బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమెకు భరోసానిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని చూశానని, నిర్భయ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. విశాఖపట్నంలో ఉన్న తన దృష్టికి రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి సంఘటన వివరాలను తీసుకురాగా నిందితులు ఎంతటి వారైనా, ఎటువంటి ఒత్తిళ్లు వచ్చిన తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. బాధితురాలికి నష్టపరిహారం అందించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం బోస్ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి జయశ్రీ, కొవ్వాడ అప్పన్నబాబు, అడ్డూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం తనిఖీ
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం కోసం సోంత భవనం ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి, మధ్యవర్తుల దోపిడిలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఆన్లైన్ విధానం అమలు చేస్తామని తెలిపారు. గతంలో మధురవాడ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసి తప్పుడు ఆరోపణలు చేశాయని, అందుకే తాను ఆకస్మిక తనిఖీకి వచ్చానని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఏసీబీ దాడులపై సబ్ రిజిస్టర్ సిబ్బందితో ఆయన చర్చించినట్లు చెప్పారు. కాగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్ పనితీరు బాగుందని, రిజిస్ట్రేషన్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ తారకేష్ను ఆయన అభినందించారు. రిజిస్ట్రేషన్లపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఈ ప్రాంతం దేశంలోనే రెండో ఆర్ధిక రాజధానిగా ఎదగడానికి అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘వారిది తప్ప.. అందరి మద్దతు ఉంది’
సాక్షి, సింహాచలం: మూడు ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుతో కలిసి ఆయన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రెండు రాజధానులు అనే ప్రక్రియ బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడిన 29 గ్రామాల ప్రజలు మినహా ప్రజలందరూ మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు. పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నాం.. ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే భారీస్థాయిలో ఇళ్ల పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అని తెలిపారు. 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రపంచ రికార్డు అని పేర్కొన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీకి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. టీడీపీ నేతల విమర్శలు దారుణమన్నారు. పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం కన్నీళ్లు తుడిచే ప్రభుత్వమే కానీ.. కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం కాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో నిబంధనలకి విరుద్దంగా వ్యవహరించటం లేదని సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తమ వైఫల్యాలను ప్రభుత్వం రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా..? విచక్షణాధికారాల పేరుతో మండలి చైర్మన్ నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే తప్పనిసరిగా ఓటింగ్ జరగాలన్నారు. అలా కాకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం కుదరదన్నారు. ఈ నిబంధనలు తెలియకపోతే యనమల మరోసారి రూల్స్ బుక్ చదువుకోవాలని సూచించారు. ఉద్యోగులను బెదిరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయని ఉద్యోగులందరికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సింహాచలంలో ఎస్టీ కమిషన్ పర్యటన రాష్ట్ర ఎస్టీ కమిషన్ కమిటీ సభ్యులు మంగళవారం సింహాచలం కొండపై పర్యటించారు. సింహాచలంపై ఉద్యోగాల రిజర్వేషన్ అమలుపై ఏపీ ఎస్టీ శాసన సభా కమిటీ చైర్మన్ బాలరాజు, సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ ఆరా తీశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు, రిజర్వేషన్ల అమలుపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో రోస్టర్ విధానంలో ఎస్టీ రిజర్వేషన్ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇసుక పాలసీ అధికారులపై ఆగ్రహించిన డిప్యూటీ సీఎం!
సాక్షి, తూర్పు గోదావరి: ఉచిత ఇసుక పాలసీ అమలు అధికారులపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో శనివారం అధికారులతో ఏర్పాటు చేసిన మంత్రుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంతోపాటు, పినిపే విశ్వరూప్, కలెక్టర్ మొరళీధర్రెడ్డిలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక పంపిణీలో అధికారుల వైఫల్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానంతో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, దీనిని అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలు శాఖల అధికారులపై పిల్లి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. -
‘దీంతో టీడీపీ నేతల అసలు స్వరూపం బయటపడింది’
సాక్షి, తూర్పు గోదావరి: ఐటీ దాడులతో టీడీపీ నేతల అసలు స్వరూపం బయట పడిందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు అధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసేందుకే యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెర లేపారని విమర్శించారు. అయిదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. బాబు నయవంచక యాత్రను ప్రజలు తిప్పికొట్టాలని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడానికి రామచందద్రాపురం తొలిమెట్టు కావాలన్నారు. తొమ్మిది నెలల్లో సీఎం జగన్ నవరత్నాలతో పాటు అనేక రకాల పథకాలను ప్రజల అందించారని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం తోట త్రిమూర్తులు అధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. కాగా ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు డిప్యుటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంతత్రులు కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి -
భూ వివాదాలకు చెక్ పెట్టేందుకే..
సాక్షి, జగ్గయ్యపేట: భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ల పాడు గ్రామంలో రాష్ట్ర మంత్రులు మంగళవారం ప్రారంభించారు. క్రాస్ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్నినాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, రక్షణ నిధి, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, భూ రికార్డుల శాఖ డైరెక్టర్ డా.ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం నిర్ణయం చారిత్రాత్మకం.. డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వందేళ్ల క్రితం సమగ్ర భూసర్వే జరిగిందని.. భూములను రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. న్యాయస్థానాల్లో 60 శాతం పైగా భూ వివాదాలే నడుస్తున్నాయని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో కూడా భూ వివాదాలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. భూ వివాదాలకు చెక్ పెట్టడమే భూముల రీ సర్వే ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. భూ సర్వే పెద్ద యజ్ఞం.. ‘రాష్ట్రంలో 3.31లక్షల ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉంది. ఆధునిక పరిజ్ఞానం వినియోగించినా భూముల రీసర్వే చేసేందుకు రెండేళ్లు పడుతుంది. భూములను రీసర్వే చేయడమంటే పెద్ద యజ్ఞం. భూమి ఉన్న యజమానికి భద్రత లేని పరిస్థితి ఉంది. సుపరిపాలన అందించడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన భూ హక్కుల పరిరక్షణ చట్టం దేశంలోలో ఎక్కడా లేదు. ఈ చట్టం ప్రకారం మీ భూమి ని ఎవరైనా దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. కచ్చితమైన భూ రికార్డులు ఉంటేనే చట్టం సమర్థంగా అమలు చేయడం సాధ్యపడుతుంది. భూముల రికార్డులను సక్రమంగా, పటిష్టంగా నిర్వహించడమే భూముల రీసర్వే ముఖ్య లక్ష్యం’ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు రీసర్వేతో రైతులకు భద్రత.. మున్సబుల కాలంలో ఏటా జమాబందీ నిర్వహించి భూ రికార్డులు సక్రమంగా నిర్వహించేవారని.. తర్వాత కాలంలో భూముల రికార్డుల నిర్వహణను గాలికి వదిలేశారని చెప్పారు. భూ రికార్డులను సమర్థంగా తయారు చేసి రైతులకు భద్రత, ప్రయోజనం కల్పించడమే భూముల రీసర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. రీసర్వే సమగ్రంగా జరిపేందుకు సహకరించాలని రైతులను ఆయన కోరారు. 0.1 శాతం కూడా తేడా లేకుండా సరికొత్త రికార్డులు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. ఇనాం భూముల పరిరక్షణ చట్టాన్ని రాబోయే శాసన సభ సమావేశాల్లో తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. భూముల రీసర్వే పూర్తయితే యజమానులకు వారి భూములపై సంపూర్ణ భద్రత వస్తుందని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం: మంత్రి పేర్ని నాని రెవెన్యూ రికార్డుల తయారీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చూడబోతుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. భూములు కొనుగోలు చేయడం సులువేనని.. కానీ ఎమ్మార్వో కార్యాలయంలో పాస్ బుక్కులు తీసుకురావడం చాలా కష్టమన్నారు. ముందు వీఆర్వోకు నచ్చాలి. తర్వాత ఆర్ఐ, తహసిల్దారు వద్ద ఎక్కడా రిజెక్ట్ కాకుండా ఆమోదించుకోవాల్సి ఉందన్నారు. సర్వే చేయించడం సహా పాస్ పుస్తకాలు సంపాదించాలంటే తల ప్రాణం తోకకి వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. ‘భూముల సర్వే చేయించుకోవాలంటే రైతులకు శిరోభారంగా మారింది. రైతుల కష్టాలు తీర్చడం సహా వారికి ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. భూముల రీసర్వే ద్వారా అందరికీ మంచి ప్రయోజనాలు దక్కుతాయి. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తోందని’ పేర్ని నాని పేర్కొన్నారు. -
ఇక ఆమోదం పొందినట్లే!
సాక్షి, అమరావతి: మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతోపాటు సీఆర్డీఏ రద్దు బిల్లు కూడా తమ దృష్టిలో శాసనమండలిలో ఆమోదం పొందినట్లేనని మండలిలో అధికార పక్ష నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ‘14 రోజులు గడిచాయి. సెలక్ట్ కమిటీల ఏర్పాటు పూర్తి కాలేదు. ఇక దానికి చెల్లు చీటి పడినట్లే’నని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులకు ఆమోదించడం, తిరస్కరించడం లేదంటే పరిశీలన పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడం లాంటి మూడు ప్రత్యామ్నాయాలే ఉంటాయని సుభాష్చంద్రబోస్ చెప్పారు. ‘ఈనెల 22న బిల్లులను మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేదు, బిల్లులను మండలి తిరస్కరించలేదు. ఈ నేపధ్యంలో మండలిలో బిల్లులు ఆమోదం పొందినట్టే’ అని పేర్కొన్నారు. శాసనసభలో, మండలిలోనూ ఆమోదం పొందిన ఈ బిల్లులను తదుపరి చర్యగా గవర్నర్కు పంపే విషయాన్ని అసెంబ్లీ అధికారులు చూసుకుంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. నిబంధనలను పాటించలేదు.. ‘సెలెక్ట్ కమిటీ నియామకంపై ఏ ఒక్క నిబంధనను మండలి చైర్మన్ అనుసరించలేదు. 5(9) (5) నిబంధన ప్రకారం ఏదైనా బిల్లు మండలిలో ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్ కమిటీకి పంపాలని అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఈ రెండు బిల్లుల విషయంలో అది జరగలేదు. మండలి చైర్మన్ నిర్ణయం వెలువరించే సమయంలోనూ తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు చైర్మన్ విచక్షణాధికారంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు’ అని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి తమతో భేటీకి ముందే సెలక్ట్ కమిటీ అంశానికి సంబంధించిన ఫైల్ను తిప్పి పంపారని ఉమ్మారెడ్డి, సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, సస్పెండ్ చేస్తామంటూ అసెంబ్లీ కార్యదర్శిని టీడీపీ నేతలే బెదిరిస్తున్నారని చెప్పారు. ఆరు దశల ప్రక్రియ జరగలేదు... బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మండలి చైర్మన్ దీనిపై మరో ఆరు దశలలో తదుపరి ప్రక్రియ చేపట్టాలని నిబంధనలు పేర్కొంటున్నాయని సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి తెలిపారు. – మొదటి దశగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని తాను తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యమేనా? అని చైర్మన్ సభను అడిగి తెలుసుకోవాల్సి ఉంది. –రెండోదశగా మూజువాణి ఓటుతోనైనా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై సభ అభిప్రాయం తెలుసుకోవాలి. – అలాంటి సమయంలో ఆ నిర్ణయంపై ఎవరైనా ఓటింగ్ కోరితే నిర్వహించాలి. –సెలెక్ట్ కమిటీకి పంపాలని సభలో నిర్ణయం జరిగితే సభ్యుల సంఖ్య ఆధారంగా ఎంతమందితో ఏర్పాటు చేస్తున్నారనే అంశాన్ని సభలోనే వెల్లడించాలి. – ఒకవేళ 8 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే పార్టీల వారీగా ఎంతమందితో ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించాలి. – సభలో వివిధ పార్టీల సభాపక్ష నాయకుల నుంచి ఆయా కమిటీలకు ప్రతిపాదించే సభ్యుల పేర్లను సేకరించాలి. ఆ తరువాత సంబంధిత సభ్యుల నుంచి అంగీకారం తీసుకోవాలి. – మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసే అంశంలో ఇవేమి చేయలేదు. –సెలక్ట్ కమిటీల ఏర్పాటు, సభ్యుల పేర్లను మీడియా ద్వారా ప్రకటించడం సభా హక్కుల ఉల్లంఘనే. – విచక్షణాధికారం ఉందని మండలి చైర్మన్ ఒకరికి ఉరి వేయమని ప్రకటించి అమలు చేయమంటే అధికారులు పాటించాలా? -
‘బాబు దురుద్దేశాన్ని ప్రజలు ప్రశ్నించాలి’
సాక్షి, అమరావతి: రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసిందని, ఆ సూచనలను గతంలో చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ ఆరోపించారు. సానుభూతి కోసమే రాజధాని పేరిట చంద్రబాబు భిక్షాటన అంటూ నాటకమాడుతున్నారంటూ విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ది విషయంలో చంద్రబాబుకు ఉన్న దురుద్ధేశాన్ని ప్రజలు ప్రశ్నించాలన్నారు. ఇక నిబంధనల బుక్ పట్టుకొని తిరిగే యనమల రామకృష్ణుడు ఆ నిబంధనలు పాటించాలని తెలియదా అని ప్రశ్నించారు. యనమల తప్పుడు సలహాలతో టీడీపీ గోతిలో పడిందన్నారు. ‘రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిస్తే.. ఆ భూములు అమ్ముకోమని చంద్రబాబు సలహాలు ఇస్తున్నారు. సెలెక్ట్ కమిటీని చూసి తాము భయపడాల్సిన అవసరం లేదు. రూల్ 71 వర్తించదని మండలి సమావేశాల్లో స్పష్టంగా చెప్పాం. అయితే ఛైర్మన్ విచక్షణాధికారాలతో అనుమతించామని అన్నారు. ఛైర్మన్ ఆదేశాలను గౌరవించాలనే 71పై చర్చించాం. పాలసీ కాకుండా రూల్ 71ను వర్తింపజేయలేం. ఏదైనా విషయం సందిగ్దంలో ఉన్నప్పుడే విచక్షణాధికారం ఉపయోగించాలి. ఓటింగ్ ద్వారా ఏ కమిటీ వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. బాల్ కొట్టకుండానే రిఫరీ పాయింట్ ఇచ్చినట్లుగా ఉంది. ఛైర్మన్ తన అధికారాలను దుర్వినియోగం చేసినట్లే. ఓటింగ్ జరపాలని అసెంబ్లీ రూల్స్ చెబుతున్నాయి. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. గ్యాలరీలో కూర్చుని కను సైగలతో ఆదేశాలిచ్చారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏం ఉంటుంది?. అసెంబ్లీ సెక్రటరీని సస్పెండ్ చేసే అధికారం టీడీపీకీ లేదు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో యనమల ఉన్నారు’అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
రాజధాని కోసం గ్రామాలే ఖాళీ చేయించారు
-
ఏపీలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు అమలు కానున్నాయి. ఆటో మ్యుటేషన్ సేవల పోస్ట్ర్ను మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విడుదల చేశారు. దీంతో భూయాజమాన్య హక్కుల మార్పిడి(మ్యుటేషన్) ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్టయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులకు చెందిన క్రయ, విక్రయ భూమి వివరాలు రిజిస్ట్రేషన్ చేయబడినప్పటి రెవెన్యూ రికార్డులలో మార్పుల కోసం తహసీల్దారు కార్యాలయం, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగవలసి వచ్చేది. ఈ ప్రక్రియ వల్ల రైతులకు ఆసౌకర్యం కలుగడమే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేయబడిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో సత్వరం మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యుటేషన్ సేవలను అందుబాటులోకి తీసుకోచ్చింది. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్బుక్ చట్టం- 1971 ను సవరించడం ద్వారా భూ బదలాయింపు వివరాలు రికార్డు చేయడం కోసం రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారులను తాత్కాలిక(ప్రొవిజనల్) రికార్డింగ్ అధికారులుగా గుర్తించారు. వీరి నియామక అధికారం సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల ఆన్లైన్ భూమి బదలాయింపు కోసం ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా (ఆర్ఓఆర్ –1బీ, అడంగల్) వివరాలు ఆన్లైన్ ద్వారా రెవెన్యూశాఖకు పంపబడతాయి. అలాగే ఈ భూ మార్పిడి వివరాలను మీభూమి పబ్లిక్ పోర్టల్ (www.meebhoomi.ap.gov.in) లో సరిచూసుకునే సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది. కాగా, కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆటో మ్యుటేషన్ సేవలను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రభుత్వం.. దానిని విజయవంతంగా అమలు చేసింది. ఈ క్రమంలో ఆటో మ్యుటేషన్ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆటో మ్యుటేషన్ వల్ల ఉపయోగాలు భూ రిజిస్ట్రేషన్ మొదలు, ఈ - పాసుబుక్ జారీ వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో జరగనుంది. ఇకపై పట్టాదారులు ఆన్లైన్ భూ బదలాయింపు కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశకు సంబంధించిన అప్డేట్ పట్టాదారు మొబైల్ నంబరుకు సంక్షిప్త సమాచారం ద్వారా అందనుంది. 30 రోజుల్లో తహసీల్దార్ ధ్రువీకరణ, తర్వాత రెవెన్యూ రికార్డుల నందు ఆర్ఓఆర్-1బీ లో శాశ్వత నమోదు అనంతరం ఈ - పాసుబుక్ వెంటనే పొందే అవకాశం -
గ్యాస్ లీకేజీ ఘటన: పీఎఫ్హెచ్ కంపెనీపై కేసు నమోదు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామం వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ ఘటనపై రాష్ట్ర మంత్రులు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, కొండేటి చిట్టిబాబు, కలెక్టర్ మురళీధర్రెడ్డి, ఎస్పీ అద్నాం నయీం, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు. (కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్) ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కోనసీమలో 5 చోట్ల లీకేజీలు జరిగాయని, ఈ నివేదిక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, పార్లమెంటరీ పార్టీ ఇంచార్జి విజయసాయిరెడ్డికి అందజేస్తామని తెలిపారు. అపారమైన గ్యాస్, చమురు నిల్వలు ఉన్నా.. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి కోనసీమదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉప్పుడి గ్యాస్ప్రమాద సంఘటనపై పీఎఫ్హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీపై నెగ్లిజెన్సీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామని ఎస్పీ ఆద్నాం నయీం పేర్కొన్నారు. ఉప్పూడి గ్యాస్ బావి వద్ద మరోసారి కార్యకలాపాలు ప్రారంభిస్తే అడ్డుకుంటామని ఉప్పుడి గ్రామస్తులు కలెక్టర్కు తెలిపారు. చదవండి : ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్ లీక్ ‘గ్యాస్ నిర్వహణకు సీఎం జగన్తో చర్చిస్తాం’ -
ఇక ఆటోమేటిక్ మ్యుటేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆటోమేటిక్ మ్యుటేషన్ను పక్కాగా అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే రెవెన్యూ అధికారులే వారి పేరుతో రికార్డులను సవరించటాన్ని ఆటోమేటిక్ మ్యుటేషన్ అంటారు. తద్వారా కొనుగోలుదారులు రెవెన్యూ రికార్డుల్లో సవరణ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్నాళ్లూ మీ–సేవే శరణ్యం ప్రస్తుతం భూములను కొన్నవారే రెవెన్యూ రికార్డుల్లో తమ పేరుతో మార్చాలని కోరుతూ నిర్దిష్ట రుసుము చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు, ఇతర పత్రాలను స్కాన్చేసి ఆధారాలుగా చూపాల్సి ఉంటుంది. అయితే ఇలా మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసినా రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముడుపులిస్తేనే మ్యుటేషన్లు చేస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ నుంచి రోజూ వివరాలు.. అవినీతి రహితంగా, ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మార్గనిర్దేశం మేరకు రెవెన్యూ శాఖలో ఆటోమేటిక్ మ్యుటేషన్ దిశగా కసరత్తు ఆరంభమైంది. ఆటోమేటిక్ మ్యుటేషన్, ఇతర అంశాలపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆటోమేటిక్ మ్యుటేషన్కు ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలను సబ్ రిజిస్ట్రారు కార్యాలయం ఏ రోజుకారోజు సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపుతుంది. తహసీల్దారు దీన్ని పరిశీలించి నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తారు. గ్రామ సచివాలయాల్లోనే 63 సర్టిఫికెట్ల జారీ ప్రజలకు ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ లాంటి 63 రకాల సర్టిఫికెట్లను గ్రామ సచివాలయాల్లోనే జారీ చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు సర్టిఫికెట్ల కోసం తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేశారు. చుక్కల భూముల పరిస్థితిపై కూడా ఆమె సమీక్షించారు. -
పైప్లైన్ పగిలి భారీగా గ్యాస్ లీక్
-
‘గ్యాస్ నిర్వహణకు సీఎం జగన్తో చర్చిస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి, కాకినాడ: జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఆదివారం ఓఎన్జీసీ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్ పెద్ద శబ్దంతో ఎగసిపడిన విషయం తెలిసిందే. అయితే ఉప్పూడి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రదేశాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకవుతున్న గ్యాస్ ఫైర్ అయ్యే అవకాశం లేదన్నారు. సోమవారం సాయత్రం వరకు లీక్ అవుతున్న గ్యాస్ను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ లీక్ను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. చడవండి: కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్ ఉప్పుడి గ్యాస్ సంఘటన మానవ తప్పిదం వల్లే జరిగిందని మంత్రి విశ్వరూప్ అన్నారు. నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. ఓఎన్జీసీ అధికారులు గ్యాస్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రెండు పద్ధతుల్లో గ్యాస్ను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మూడు నాలుగు గంటల్లో అదుపు చేయడానికి అవకాశం ఉందని విశ్వరూప్ చెప్పారు. కోనసీమలో గ్యాస్ తవ్వకాలు, నిర్వహణకు సంబంధించి సీఎం జగన్మోహన్రెడ్డితో చర్చిస్తామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. -
‘రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నాం’
సాక్షి, అమరావతి: శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సభలో నేను సభ్యుడినైనా మండలి రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ గతంలో మండలిని చాలా స్వల్పకాలిక ప్రయోజనం కోసం రద్దు చేశారు. ఈనాడు రామోజీరావు కోసం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం రద్దు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెబితే.. చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరం. శాసనసభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయ కుట్రలకు దాన్ని వేదికగా చేసుకున్నారు. అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలే గానీ.. స్వార్థం కోసం కాదు. ఆటలో రిఫరీ నిష్పక్షపాతంగా ఉండాలి. బాల్ కొట్టకుండానే పాయింట్ ఇవ్వడం ఎంతవరకూ సమంజసం. మండలిలో చైర్మన్ చేసిన తప్పు అలాంటిదే. మండలి చైర్మన్ ఒక పార్టీ పట్ల పక్షపాతంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. సభాపతులుకున్న నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఒక కమిటీ వేయాలని కోరుతున్నా. మండలిలో జరిగిన దాని గురించి అసెంబ్లీలో చర్చించకూడదని కొందరు అంటున్నారు. జరిగిన తప్పును చర్చించకపోతేనే తప్పు అవుతుంది. చర్చించకపోతే ఇంకా తప్పులు చేస్తారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే’అని పిల్లి సుభాష్చంద్రబోస్ పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తా ‘మండలిలో సభ్యులుగా ఉన్న నేను, నా సహచర మంత్రి సుభాష్ చంద్రబోస్ పదవులను తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పెద్దల సభగా పిలిచే శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నాం. పాలకులు ప్రజల కోసం ఈ సభలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై పెద్దల సభలో మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. గడచిన నాలుగు రోజుల్లో చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే బిల్లులను అపహాస్యం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఆ చట్ట సభల్లోని సభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా టుడే సర్వేలో దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా దక్షత ఉన్న ముఖ్యమంత్రుల్లో నాలుగో స్థానంలో ఉన్న ఘనత జగన్ది. మా పార్టీ నుంచి మండలికి నామినేట్ అయిన సభ్యులు ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన వ్యక్తులు. చంద్రబాబు దోపిడీదారులను మండలికి నామినేట్ చేశారు’ అని మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వ్యాఖ్యానించారు. చదవండి: ప్రజా ప్రయోజనాల కోసమే.. శాసనమండలి రద్దు -
దటీజ్ జగన్..!
సాక్షి, అమరావతి : ‘పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. వారు నాకోసం ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలు భరించారు. వారికి ఎప్పటికీ అన్యాయం చేయను, జగన్ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు... దటీజ్ జగన్...’ అని కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నట్లు తెలిసింది. శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ‘ప్రజా మద్దతుతో ఎన్నికైన మన ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం బిల్లుల్ని రూపొందించి శాసనమండలికి పంపితే అక్కడ అడ్డుకుంటున్నారు. సుభాష్ చంద్రబోస్, వెంకటరమణారావు ఇద్దరూ పదవులు కోల్పోతున్నందుకు నేను బాధ పడుతున్నాను. అయితే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు’ అని భేటీలో సీఎం పేర్కొనట్లు తెలిసింది. ఇదే సందర్భంలో ఎల్లో మీడియా పత్రికలు, చానళ్లలో మండలికి సంబంధించిన వార్తా కథనాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనం ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నట్లు.. ఫిరాయిస్తే ఒక్కొక్కరికి ఐదారు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినట్లు అనుచిత కథనాలు ప్రచారం చేస్తున్నాయి. నిరాధారమైన ఇలాంటి వార్తలు, కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయి’ అని మంత్రివర్గ సహచరులతో ప్రస్తావించారు. మనం అనుమతిస్తే పది మందికిపైగా ఎమ్మెల్సీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఓ మంత్రి చెప్పగా.. ముఖ్యమంత్రి జగన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అలాంటి పనిచేస్తే... ఇక మనకూ చంద్రబాబుకూ తేడా ఏముంటుందని అన్నట్లు సమాచారం. రాజకీయాల్లో అందుకు తాను పూర్తి విరుద్ధమని.. అలాంటి అనైతిక చర్యలకు ఫుల్స్టాప్ పెట్టేందుకే శాసనమండలి రద్దు నిర్ణయానికి వచ్చామని చెబుతూ రద్దు నిర్ణయాన్ని ప్రతిపాదించారు. అందుకు మంత్రిమండలి సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థిస్తూ ఆమోదం తెలిపారు. 35 నిమిషాల సేపు జరిగిన ఈ సమావేశంలో మండలి రద్దుకు దారి తీసిన పరిస్థితులను మంత్రివర్గ సహచరులకు జగన్ వివరించారు. -
కదం తొక్కిన జనం
-
మండలిలో టీడీపీ తీరు దురదృష్టకరం
-
రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం..
సాక్షి, అమరావతి: రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదు. నారాయణ కమిటీ వేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని’ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరమన్నారు. సభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మండలిలో తీర్మానం మూవ్ కాలేదని చైర్మన్ స్వయంగా చెబుతున్నారని.. విస్తృత అధికారులు ఉన్నాయని సెలెక్ట్ కమిటీకి పంపడం సబబా అని ప్రశ్నించారు. ప్రజాసంపద అన్ని ప్రాంతాలకు సమానంగా ఖర్చు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం చేసిన చట్టాలను కూడా మండలిలో అడ్డుకున్నారన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని.. లేకుంటే ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందన్నారు. మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే.. సీఎం జగన్ తీర్మానాన్ని సమర్థిస్తున్నానని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
ఉగాఇ నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు: పిల్లి
-
‘పార్లమెంట్ ఆమోదిస్తే మండలి రద్దవుతుంది’
సాక్షి, తూర్పుగోదావరి : శాసన మండలి రద్దు అంశంపై సోమవారం పునః సమీక్ష చేసి తమ నిర్ణయాన్ని పార్లమెంటుకు పంపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే శాసన మండలి రద్దు అవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగాది నాటికి పేదలందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని చంద్రబోస్ వెల్లడించారు. పేదలకు ఇచ్చే ప్రతి ఇంటి స్థలం మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 21.34 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందిస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 26,136 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని చెప్పారు. మరో 12,219 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. అసైన్డ్ భూములు, దేవస్థానం, వక్ఫ్ బోర్డ్ భూములు సేకరించకూడదని చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. -
‘మండలిని రద్దు చేయండి’
సాక్షి, అమరావతి : శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అసహనం వ్యక్తం చేశారు. మండలిని రద్దు చేయాలని ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపాదిస్తున్నానని అన్నారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై గురువారం శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. చట్టాలు చేసే సభలో సభాపతులు వ్యవహరించిన తీరుపై చర్చించడం దారుణమన్నారు. బుధవారం మండలిలో జరిగిన చర్చలో మంత్రుల సలహాలను చైర్మన్ పట్టించుకోలేదని ఆరోపించారు. కావాలనే బిల్లులను అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ను ప్రభావితం చేశారని ఆరోపించారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే పెద్దల ఉందన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేసే సభాధిపతులే.. చట్టాలను అతిక్రమిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. ‘మంచి ఆలోచనలతో రాజ్యాంగ నిర్మాతలు పెద్దల సభ పెట్టారు. శాసన సభకు విద్యావంతులు రాకపోవడం, ధన బలం ఉన్నవాళ్లు ఎన్నికవ్వడం జరగవచ్చు. అలాంటి సమయంలో వారికి ఇష్టం వచ్చిన చట్టాలు తెచ్చి ప్రజలను ఇబ్బంది కలిగిస్తారనే భయంతో పెద్దల సభ ఏర్పాటు చేశారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే ఈ సభ ఏర్పాటైంది. కానీ నేడు అది రాజకీయాలకు కేంద్ర బిందువైంది. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యానికే మచ్చగా మారాయి. టీడీపీ నేతలు నేరుగా చైర్మన్ దగ్గరకు వచ్చి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపమని సలహాలు ఇచ్చారు. చైర్మన్ తప్పు చేశానంటునే విచక్షణాధికారంతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. తప్పు చేసిన వారికి విచక్షణాధికారం ఎలా ఉంటుంది? రూల్ 71 ఎప్పుడు ఉపయోగించాలో తెలియకుండా చర్చించారు. సభాపతే చట్టాలను ఉల్లంఘిస్తే మేం ఎవరికి చెప్పుకోవాలి? ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చోని చైర్మన్ను ప్రభావితం చేశారు. టీడీపీ సభ్యుల సలహా మేరకు చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనికంటే ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే గౌరవంగా ఉండేది. మండలి సభ్యునిగా ముఖ్యమంత్రి, స్పీకర్కు ప్రతిపాదిసున్నా.. సభను వెంటనే రద్దు చేయండి. రాజకీయాలకు ఉపయోగపడే సభ నిష్ర్పయోజనం. రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే ప్రజాస్వామ్యం కొనసాగుతుంది’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
షరీఫ్కు చైర్మన్గా కొనసాగే అర్హత లేదు : డిప్యూటీ
సాక్షి, అమరావతి : శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. తక్షణమే ఆ పదవికి రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేశారు. విచక్షణాధికారం పేరుతో అసహ్యంగా వ్యవహరిచారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇంకా వెళ్లలేదని, చైర్మన్ మళ్లీ సభను నిర్వహించాలని అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపాలనన నిర్ణయంపూ ఓటింగ్ జరగకపోతే అది చెల్లదని, టీడీపీ నాయకులు సంకలు గుద్దు కోవడంలో అర్థం లేదన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే అర్హత కోల్పోయాడని అన్నారు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు తెలియమని, చట్ట సభలను దారుణంగా అవమానించారని దుయ్యబట్టారు.(‘మండలి చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’) మండలి నిబంధనలను చైర్మన్ ఉల్లఘించారు శాసన మండలి చైర్మన్ క్షమించరాని నేరం చేశారని చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. సభను రాజ్యాంగానికి అనుగుణంగా నడపడం చేతకనప్పుడు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేకశారు. విచక్షణాధికారాన్ని సభలో డోలాయమనం ఉన్నప్పుడు వాడాలని, అంతే కాని ఇలా నిబంధనలను అతిక్రమించడానికి విచక్షణను వాడకూడదని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, మండలి నిబంధనలను మండలి చైర్మన్ ఉల్లఘించారని మండిపడ్డారు. అసలు సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఆస్కారమే లేదని, టీడీపీ కార్యకర్తలా చైర్మన్ చంద్రబాబు ఆదేశాలను అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీని ప్రకటించాలని, సభ ఆమోదం పొందాలని తెలియకపోతే ఎలా అని శ్నించారు. ఒక్క నిమిషం కూడా చైర్మన్కి ఆ స్థానంలో ఉండే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. చదవండి : సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ మండలికి కళంకం తీసుకు వచ్చారు శాసన మండలి వ్యవస్థను చైర్మన్ నీరు గార్చారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. చట్ట విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారని, శాసనమండలిలో నిన్న జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అభివర్ణించారు. మోషన్ మూవ్ చేయకుండానే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపండం సరికాదని సూచించారు. ఇష్టం లేకుండానే సెలెక్ట్ కమిటీకి పంపామని చైర్మన్ చెప్పడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేవడమే అని పేర్కొన్నారు. గ్యాలరీలో ఉన్న చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు చైర్మన్ని తప్పుదోవ పట్టించి.. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ చర్యను తీవ్రంగా ఖండింస్తున్నామన్నారు. -
‘బాబు పాలనలో 150 రహస్య జీవోలు ఇచ్చారు’
సాక్షి, అమరావతి : సాంకేతిక సమస్య వల్లే మండలి ప్రత్యక్ష ప్రసారాలకు అంతరాయం ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ప్రత్యక్ష ప్రసారాలను ఇద్దరు మంత్రులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. టీవీ ప్రసారాలను ఆపే సంస్కృతి టీడీపీ నాయకులదేనని అన్నారు. టీడీపీ పాలనలో 150 రహస్య జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. బిల్లులపై చర్చలను అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోతే.. రాజ్యాంగ సంక్షోభం వచ్చినట్లుగా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఎద్దేవా చేశారు. బిల్లులపై సజావుగా చర్చ కొనసాగించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో.. సాంకేతిక సమస్య పరిష్కారానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. (చదవండి : ఏ ఎమ్మెల్సీని బెదిరించానో నిరూపించండి) రెండు బిల్లులు.. 3 గంటల చర్చ వాయిదా అనంతరం తిరగి ప్రారంభమైన శాసనమండలిలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై చర్చ ప్రారంభమైంది. ఈ రెండు బిల్లులపై మూడు గంటలపాటు చర్చించాలని మండలి నిర్ణయించింది. ఒక్కొక్క సభ్యుడికి మూడు నిముషాల పాటు మాట్లాడేందుకు వైస్ చైర్మన్ అవకాశమిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు 27 నిమిషాలు, టీడీపీ సభ్యులకు 84 నిమిషాలు, గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు 24 నిమిషాలు, పీడీఎఫ్ సభ్యులకు 15 నిమిషాలు, బీజేపీ సభ్యులకు 6 నిముషాలు, స్వతంత్ర సభ్యులకు 9 నిమిషాలు కేటాయిస్తున్నట్టు వైఎస్ చైర్మన్ వెల్లడించారు. అవసరమైన పక్షంలో మరో గంటపాటు అదనంగా చర్చిద్దామని ఆయన స్పష్టం చేశారు. (చదవండి : బిల్లులపై మండలిలో రగడ) -
‘అమ్మ ఒడి’ అధిక లబ్ధి ఈ జిల్లాకే
సాక్షి, కాకినాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కులమత,పార్టీలు చూడకుండా ఫీజు రీయింబర్స్మంట్ అమలు చేస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు అడుగులు ముందుకేసి అమ్మఒడి ప్రవేశపెట్టారని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక కుటుంబ పోషణ కోసం పిల్లలను పాఠశాలలకు పంపకుండా పనులకు పంపుతున్న తల్లిదండ్రుల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. కాకినాడలో గురువారం ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. గురువును గౌరవించనివాడు పైకి రాడు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘అమ్మ ఒడి పథకం అమలు ఓ సాహసోపేత నిర్ణయం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం అమల్లో లేదు. ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. పేదరికానికి చదువు అడ్డు కాదు. రంగురంగుల బట్టలు, బిల్డింగ్లు చూసి ప్రైవేటు స్కూల్ల మోజులో పడకండి. పిల్లలు చదువుకునే సమయంలో టీవీలు చూడమని తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేసుకోండి. ‘అమ్మ ఒడి’ పథకంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రధానమైంది. సమాజ స్థితిగతులను మార్చే శక్తి ఉపాధ్యాయులకే ఉంది. గురువును గౌరవించని వ్యక్తి జీవితంలో పైకి రాడు. ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా విద్యార్థులకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయకపోతే మనం లక్ష్యాన్ని సాధించలేము’ అని పేర్కొన్నారు. అధిక లబ్ధి తూర్పు గోదావరికే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ‘అమ్మఒడి పథకం ఒక చరిత్ర. సీఎం జగన్ సంకల్పం వృథా కాకూడదు. అమ్మ ఒడి డబ్బులతో మీ పిల్లలను శ్రద్ధగా చదివించండి. 43 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మ ఒడి పథకం అందుతుంది. రాష్ట్రంలో అమ్మఒడి ద్వారా అత్యధికంగా లబ్ధిపొందే జిల్లా తూర్పు గోదావరి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే రూ. 685 కోట్లు లబ్ధిదారులకు అందుతాయి. పాదయాత్రలో బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్ వారి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల లోపు కిడ్నీ బాధితుల నుంచి ఆటో డ్రైవర్ల వరకు సీఎం అందరినీ ఆదుకున్నార’ని తెలిపారు. చదవండి: వాటే విజన్ బాబ్జీ!: విజయసాయి రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ -
కౌలు రైతులు, చేనేత సంఘాలకు రుణ సాయాన్నిపెంచండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటిపై కూడా బ్యాంకర్లు దృష్టి సారించాలన్నారు. కౌలు రైతులకు సహకారాన్ని అందించాలని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాలకు రుణ సహాయాన్ని పెంచాలన్నారు. చిన్న పరిశ్రమల పునరుద్ధరణ కోసం వైఎస్సార్ నవోదయం కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బ్యాంకర్లను కోరారు. దీనికోసం బ్యాంకర్లు, పరిశ్రమల శాఖ మధ్య మరింత సమన్వయం, పర్యవేక్షణ అవసరమన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. దీనిపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించాం ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించామని, ఇందుకు సహకరించిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి ధన్యవాదాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) చైర్మన్ పకీరిసామి చెప్పారు. వార్షిక రుణప్రణాళిక మేరకు సెప్టెంబర్ 2019 నాటికి వివిధ ప్రాధాన్య రంగాల్లో నిర్దేశించిన రూ.1,69,200 కోట్లకు గాను రూ.94,531 కోట్లు (55.87 శాతం) రుణాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఇదే కాలానికి వ్యవసాయ రంగంలో రూ.1,15,000 కోట్లకు గాను, రూ.65,577 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈ కింద నిర్దేశించిన రూ.36 వేల కోట్ల లక్ష్యానికి గాను రూ.25,020 కోట్ల (69.60 శాతం) రుణాలు ఇచ్చామని వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతోదాస్ తెలిపారు. కౌలు రైతులకు రుణాలు ఆశించినంతగా ఇవ్వలేదని, అనుకున్న లక్ష్యం మేరకు ఇవ్వాల్సిందేనని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కౌలు రైతుల చట్టాన్ని తెచ్చిందని, బ్యాంకులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన వెంటనే ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని అందించాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను నెల రోజుల్లో రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. కాగా, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖల్లో అనుకున్న దానికన్నా రుణాలు తక్కువగా ఇచ్చారని, బ్యాంకులు దీనిపై దృష్టిపెట్టాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ కోరారు. -
భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం
సాక్షి, అమరావతి/మండపేట: రాష్ట్రంలో దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భూముల సమగ్ర రీ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో భూముల రీ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్ను సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి బుధవారం విడుదల చేశారు. జగ్గయ్యపేట మండలంలోని మొత్తం 25 గ్రామాల పరిధిలోగల 66,761 ఎకరాల భూములను రీసర్వే చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో భూముల రీసర్వేకు సంబంధించి అధికారిక ప్రక్రియ ప్రారంభమైనట్లే. రీసర్వేకు బడ్జెట్లో నిధుల కేటాయింపు రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూహక్కుల కల్పన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ విభాగాల అధికారులు సర్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆధునిక సర్వే యంత్రాలను కొనుగోలు చేశారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ చేపట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి భూముల సమగ్ర రీసర్వే ప్రారంభించాలని నిర్ణయించి, నోటిఫికేషన్ జారీ చేశారు. బ్రిటిష్ సర్కారు హయాంలో... దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో భూములను సర్వే చేశారు. రాష్ట్రంలో 120 ఏళ్ల క్రితం భూములను సర్వే చేసి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్) రూపొందించారు. తర్వాత కాలంలో తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం, జనాభా పెరగడం, భూములు చాలామంది చేతులు మారడం, భూకమతాల సైజు తగ్గడం వంటి వాటితో సబ్డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూ వివాదాలు సైతం పెరిగాయి. ఈ తరహా సమ్యల పరిష్కారానికి, భూ రికార్డుల సమగ్రతకు రీసర్వే చేపట్టాలని నిపుణులు సూచించినా గత పాలకులు పట్టించుకోలేదు. జగ్గయ్యపేట మండలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఈ అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే నిర్వహించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రైతులపై నయా పైసా కూడా భారం పడకుండా.. లోపభూయిష్టంగా మారిన భూ రికార్డులను ప్రక్షాళన చేసి, భూ యజమానులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూముల సమగ్ర రీసర్వేను ప్రారంభిస్తోందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు అమలుకు రూ.2,000 కోట్ల వ్యయం అవుతున్నప్పటికీ రైతులు, భూ యజమానులపై నయాపైసా కూడా భారం పడకుండా మొత్తం ప్రభుత్వమే భరించనుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సర్వే, సరిహద్దుల చట్టం–1923 కింద భూముల సమగ్ర సర్వే కోసం సర్వే డైరెక్టర్ తయారు చేసిన నోటిఫికేషన్ను పిల్లి సుభాష్ చంద్రబోస్ బుధవారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి 30 ఏళ్లకోసారి రీసర్వే చేయాల్సి ఉండగా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించాం అమెరికా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో వినియోగించిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు పిల్లి సుభాష్చంద్రబోస్ తెలిపారు. భూ యజమానులకు కచ్చితత్వాన్ని అందించే విధంగా క్రాస్ నెట్వర్క్ ద్వారా రీ సర్వే చేస్తారన్నారు. సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ద్వారా 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించి, వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. 2022 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి, పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామని స్పష్టం చేశారు. -
డిప్యూటీ సీఎం పిల్లి సుబాష్ చంద్రబోస్తో స్ర్టెయిట్ టాక్
-
రైతుల భూములకు పూర్తి భద్రత
నెల్లూరు (అర్బన్): రాష్ట్రంలో భూ రికార్డులను ల్యాండ్ ప్యూరిఫికేషన్ (భూ రికార్డుల ప్రక్షాళన) చేసి వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్చంద్రబోస్ చెప్పారు. శనివారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతికతతో వెబ్ ల్యాండ్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీనివల్ల రైతుల భూముల రికార్డులు పక్కాగా ఉంటాయని తెలిపారు. జూలై నుంచి మూడు నెలల పాటు భూములకు సంబంధించి ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో భూ రైతు యాజమాన్య హక్కు చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెస్తున్నారన్నారు. తద్వారా రైతుల భూమికి పూర్తి భద్రత కలుగుతుందని చెప్పారు. ఇంటి స్థలాలు కోరుతూ 28 లక్షల దరఖాస్తులు గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం సుమారు 28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12 లక్షల ఇళ్లు మంజూరు చేయనుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ చుక్కల భూములు, సీజేఎఫ్ఎస్ డీ ఫాం పట్టా భూముల్లో నివాసముంటున్న వారి పేరిట సంబంధిత భూములను క్రమబద్ధీకరించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. సమావేశంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
వికేంద్రికరణపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం హర్షదాయకం
-
చంద్రబాబుకు స్టేట్ కన్న రియల్ఎస్టేట్ మీదనే ప్రేమ
-
స్టేట్ కన్న రియల్ఎస్టేట్ మీదే చంద్రబాబుకు ప్రేమ
సాక్షి, కాకినాడ: అధికార వికేంద్రీకరణతో ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్రబోస్ శనివారం అన్నారు. జిల్లాలో నిర్వహించిన వైఎస్సార్ నేతన్న నేస్తం ఆవిష్కరణ మహోత్సవాలు కార్యక్రమంలో ఆయన పాలల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా రెండో రాజధానిని హైదరాబాదులో పెట్టాలని ఆనాడు డా. బి.ఆర్. అంబేద్కర్ చెప్పారని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం, మొగలాయి రాజ్యం రెండు రాజధానులను ఏర్పాటు చేసుకున్నాయని సుభాస్చంద్రబోస్ గుర్తు చేశారు. గతంలో కర్నూలు, హైదరాబాదు విషయంలో రెండు పర్యాయాలు మన భావోద్వేగాలు బంగపడ్డాయని ఆయన తెలిపారు. సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఒక సామాజిక వర్గం వారే చేస్తున్నారని సుభాస్ చంద్రబోస్ విమర్శించారు. జీఎన్. రావు కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. ప్రజలు విజ్ఞనతో ఆలోచించాలని కోరుతున్నట్టు డీప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్రబోస్ పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు కేవలం ఒక వర్గం.. కొన్ని కుటుంబాలకు మేలు చేసే విధంగా రాజధానిని ఏర్పాటు చేయాలి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఆ రాజధానిని పూర్తి చేయకుండా మసిపూసి మారేడుకాయ చేశారని కన్నబాబు దుయ్యబట్టారు. బహుబలి సినిమాలా గ్రాఫిక్స్ చేసి కథ నడిపించారని ఆయన ఎద్దేవా చేశారు. జీఎన్.రావు ఇచ్చిన నివేదిక మీద సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై సానుకూత లభిస్తోందని కన్నబాబు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అందరు అధికార వికేంద్రీకరణ కోరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షిస్తున్నారని కన్నబాబు పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని ఆయన తెలిపారు. చంద్రబాబు అనుకూల, రియల్ ఎస్టేట్ వర్గాలు చాల విచారం వ్యక్తం చేస్తున్నాయని కన్నబాబు మండిపడ్డారు. పేదల పొట్ట కొట్టి వారి పంటలు తగల బెట్టిన వారికే గొంతులో వెలక్కాయ పడినట్లయిందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన అమలులోకి వస్తే విశాఖపట్నం దేశంలోనే రెండవ ఆర్ధిక రాజధానిగా మారబోతుందని కన్నబాబు తెలిపారు. చంద్రబాబుకు రియల్ స్టేట్ మీద కన్న.. రియల్ ఎస్టేట్ మీదనే ప్రేమ అని ఎద్దేవా చేశారు. అమరావతి మీద ప్రేమ ఉంటే చంద్రబాబు హైదరాబాదులో ఎందుకు ఇళ్లు కట్టుకున్నాడని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తీరంలో అపార వనరులు ఉన్న నేపధ్యంలో పరిశ్రమల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ను కోరతామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. -
భూ వివరాల్లో చాలా తేడాలున్నాయి: పిల్లి సుభాష్
సాక్షి, అమరావతి: వెబ్ల్యాండ్ లెక్కలకు ఆర్ఎస్ఆర్ లెక్కలకు భూ వివరాల్లో చాలా తేడాలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సోమవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లో మునసబులు, కరణాల కాలంలో రెవెన్యూ రికార్డులు కచ్చితంగా ఉండేవని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రికార్డుల్లో తేడాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇక తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో భూ సర్వేలు నిర్వహిస్తుందని, రెవెన్యూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి, జూన్ నుంచి జమాబంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో లాగా ఆర్టీసీ బస్సులను, టాక్సీలను తమ ప్రభుత్వం వాడుకోవటం లేదని, అలాంటి అవసరం తమ ప్రభుత్వానికి లేదని టీడీపీని విమర్శించారు. దాదాపు 2,24,160 మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున చెల్లించామని పేర్కొన్నారు. రాజకీయాలు పూర్తిగా దిగజారాయని, రాజకీయ అవసరాల కోసం కాకి బట్టలను అడిగి తెచ్చి బురద జల్లే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. అలాగే గత ప్రభుత్వంలో రవాణా శాఖలో ఏం జరిగందో అందరికి తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, వారి పట్ల టీడీపీకి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. రుణమాఫీ చేయకపోవడం మా చేతకానితనమని టీడీపీ సభ్యులు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్లీనరీలో రైతు భరోసా పథకాన్ని ప్రకటించగా రైతుల ఇబ్బందులు చూసి 4 సంవత్సరాల పథకాన్ని 5 సంవత్సరాలకు పెంచారని ఆయన వివరించారు. రైతులకు ఇచ్చే సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500లకు పెంచామని పేర్కొన్నారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని, రైతులకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని మంత్రి హితవు పలికారు. -
పేదలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వరం లాంటిది: పిల్లి సుభాష్
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చక్కగా సాగుతోందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరులో సోమవారం సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లాలో పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. పేదవారికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వరం లాంటిదని ప్రశంసించారు. వైద్య విధానంలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ముఖ్యమని తెలిపారు. వైద్యంలో పేదలకు మనోధైర్యాన్ని తెచ్చేందుకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని సీఎం జగన్ తీసుకు వచ్చారన్నారు. ఈ పథకం దేశంలోనే వినూత్నమైన సంస్కరణ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ పాలనలో ఆర్యోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. మళ్లీ ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ బలోపేతం చేశారని ఆయన స్పష్టం చేశారు. -
ఇళ్ల స్థలాలకు భూసేకరణ వేగవంతం
సాక్షి, అమరావతి: ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలన్న లక్ష్యంతో రెవెన్యూ శాఖ చకచకా కసరత్తు చేస్తోంది. గ్రామ, వార్డు వలంటీర్లు అందించిన సమాచారాన్ని విశ్లేషించి ఇప్పటికే 22.78 లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసింది. నవరత్నాల అమల్లో భాగంగా వచ్చే ఉగాది రోజు 25 లక్షల మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను సాకారం చేసే దిశగా రెవెన్యూ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నివాస స్థల పట్టాలు ఇవ్వడానికి భూమిని సమకూర్చుడం మహా యజ్ఞంలా మారింది. అందువల్ల ఈ అంశపైనే రెవెన్యూ శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22,850 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాలు ఇవ్వడానికి గుర్తించిన భూమి పోనూ ఇంకా 19 వేల ఎకరాలు అవసరమని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేసింది. ఈ భూసేకరణ నిమిత్తం రూ.10 వేల కోట్లు అవసరమని రెవెన్యూ శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. చకచకా కసరత్తు నిధుల విడుదలకు సీఎం సమ్మతి తెలపడంతో నివాస స్థలాల కోసం భూసేకరణ కసరత్తును రెవెన్యూ శాఖ వేగవంతం చేసింది. పట్టణ, నగర ప్రాంతాల్లో భూమి విలువ అధికంగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని జీ ప్లస్ త్రీ తరహాలో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి తర్వాత గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో భూముల కొరత, అధిక ధరలను పరిగణనలోకి తీసుకుని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సైతం జీ ప్లస్ త్రీకి అనుమతించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరగా ప్రభుత్వం ఆమోదించింది. మూడు దశల్లో నిధుల విడుదలకు సీఎం ఆదేశం భూసేకరణకు రూ.10 వేల కోట్ల నిధులు అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మౌఖికంగా నివేదించామని రెవెన్యూశాఖ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ‘సాక్షి’కి తెలిపారు. ‘రూ.3 వేల కోట్ల చొప్పన మూడు విడతల్లో రూ. 10 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న భూమి పోనూ గ్రామీణ ప్రాంతాల్లో 8000 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 11000 ఎకరాలు కలిపి మొత్తం 19000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వ్యయ నియంత్రణలో భాగంగా సాధ్యమైనంతవరకూ భూసేకరణను తగ్గించి ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నాం. ఇదే లక్ష్యంతో ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉంటే గుర్తించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించాం’ అని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. -
నవరత్నాల్లో ముఖ్యమైనది ఇది: మంత్రి
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టామని వాటిలో మొదటిది పేదలందరికి ఇళ్లు, రెండవది భూ రికార్డుల ప్రక్షాళన అని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం విలేకరుల సమావేశంలో డిప్పూటీ సీఎంతో పాటు మంత్రి పేర్ని నాని, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... పేదల ఇళ్లు, భూ రికార్డుల ప్రక్షాళనను అధికారులు సవాలుగా తీసుకోని, గ్రామ వాలంటీర్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి ప్రభుత్వ స్థలాల గుర్తింపు జరిగిందని... ప్రైవేటు స్థలాల గుర్తింపు జరుగుతోందని తెలిపారు. పశ్చిమ, కృష్ణ జిల్లాల కలెక్టర్లు రికార్డుల నిర్వహణలో ముందంజలో వున్నారని, గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. గత కొంత కాలంగా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళనకు నోచుకోలేదని, రికార్డులు సరిగా లేకపోవడంతో ప్రభుత్వానికి నష్టం వస్తుందని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నాన్ రెవెన్యూ పనుల్లో సైతం వినియోగించుకోవాలని అన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జమాబందీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనులు త్వరితగతిన జరగవనే విమర్శ ఉందని, రికార్డుల ప్రక్షాళన జరిగాక అత్యంత మంచిపేరు తెచ్చుకునే శాఖగా రెవెన్యూ శాఖ ఉంటుందని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ.. ఉగాది నాటికి పేదలందరికి ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇస్తామని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలపై రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో 9 జిల్లాలో 3 లక్షల మందికి ఇళ్లు కావాల్సి ఉన్నట్లు వెల్లడించారు. ఇక నవరత్నాల్లో ముఖ్యమైనది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే అని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద వాడికీ ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన అన్నారు. అలాగే మార్చి నాటికి 13 లక్షల ఇళ్లు కేంద్రం నుంచి పొందేలా చర్యలు చేపడుతున్నామని, వీలైనన్ని మండలాలను యుడీఐ కిందకు తెచ్చెలా అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు. ఇక రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. 25 లక్షల ఇళ్లు పేదవారికి ఇవ్వబోతున్నామని, తమ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు, ఇళ్ల స్థలాలు దాదాపు 70శాతం మంది అత్యంత పేద వర్గానికి చెందిన వారి కోసమేనని తెలిపారు. ఇళ్ల బిల్లులు మంజూరు చేసేటప్పుడు అధికారులు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోవద్దని, ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. డబ్బులు తీసుకునే క్రమంలో పై అధికారులకు కూడా ఇది చెడ్డపేరు వస్తుందని.. ఇలాంటివి జరగకుండా ఉన్నతాధికారుల దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. -
‘జగనన్న మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు’
సాక్షి, ముమ్మిడివరం: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 శాతం హామీలను అమలు చేశారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ మట్లాడుతూ.. ఇచ్చిన హామీని అమలు చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి సీఎం జగన్ అని ప్రశంసించారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునన్నారని గుర్తు చేశారు. మత్స్యకార కుటుంబ్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని, అందులో భాగంగానే మత్స్యకార కుంటుంబాలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తమను ఎవ్వరూ పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకున్నారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకంతో మత్స్యకార కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోందని పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇచ్చినట్టుగానే మిగతా మత్స్యకారులకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారని కోరారు. జగనన్న మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడన్న నమ్మకం తమకుందని ఎమ్మెల్యే సతీష్ అన్నారు. -
త్వరలో పట్టాదారు కార్డులు
సాక్షి, అమరావతి: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలకు చెక్ పెట్టేందుకు ప్రతి రైతు/భూ యజమానికి ఏటీఎం కార్డు తరహాలో పట్టాదారు కార్డులు అందజేయాలని రెవెన్యూ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత కార్డు పాన్కార్డు పరిమాణంలో ఉండి.. దానిపై భూ యజమాని పేరు, చిరునామా ఉంటుంది. చిన్న డిజిటల్ చిప్ అమర్చడం వల్ల కార్డును స్వైప్/స్కాన్ చేస్తే సదరు రైతుకు ఏ గ్రామం/పట్టణంలోని ఏయే సర్వే నంబర్లలో ఎంత భూముందో కనిపిస్తుంది. భద్రత ప్రమాణాలతో కూడిన పట్టాదారు కార్డు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇది ఎలా ఉండాలి? ఒక్కో దానికి ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై రెండు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు పొందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నకిలీలకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూ శాఖలో భూ రికార్డులు తప్పుల తడకలుగా ఉన్నందున ప్రక్షాళన చేయాలని రెవెన్యూ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలిచ్చింది. వచ్చే ఏడాది మే నెలాఖరుకి రికార్డుల్ని పూర్తిగా స్వచ్ఛీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తైన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం స్థానంలో కార్డులు ఇస్తారు. నకిలీలకు, ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఇసుక దోపిడీలో ఆయన జిల్లాలోనే ‘నంబర్ వన్’
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బురద చల్లుడు రాజకీయాలు మానుకోవాలని డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక దోపిడీలో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచిన వ్యక్తి వేగుళ్ల జోగేశ్వరరావు అని..అటువంటి వ్యక్తి ఇవాళ ఇసుక కోసం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనను ఇసుక దోపిడీ సంఘానికి అధ్యక్షుడిగా పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. జిల్లాలోని టేకి గ్రామంలో ఒక వ్యక్తి తన వ్యక్తిగత కారణాల వల్ల మరణిస్తే...ఇసుక లభించక మృతిచెందాడని వేగుళ్ల బుద్ధిహీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బురద చల్లాలనే తాపత్రయం తప్ప..వాస్తవ పరిస్థితులు చెప్పడంలేదని ధ్వజమెత్తారు. ‘ఇద్దరం కలిసి టేకి గ్రామం వెళదామని..ఇసుక కోసమే అక్కడ వ్యక్తి మరణిస్తే బహిరంగ క్షమాపణలు బెబుతామని..లేకపోతే జ్ఞానోదయం వచ్చిందని ప్రకటించాలని వేగుళ్ల జోగేశ్వరరావుకు సుభాష్ చంద్రబోస్ సవాల్ విసిరారు. -
‘ద్వారంపూడిని విమర్శించే హక్కు ఆమెకు లేదు’
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి గురువారం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ.. రబీ పంటకు జిల్లాలో 4,36,533 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రబీకి గోదావరి నుంచి కాలువలకు డిసెంబరు 1వ తేదిన సాగునీరు విడుదల చేసి.. వచ్చే ఏడాది మార్చి 31న కాలువలు మూసివేయనున్నట్లు వెల్లడించారు. మళ్లీ ఖరీఫ్ సీజన్కు 2020 జూన్ 6న గోదావరి నుంచి కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గోదావరి డెల్లా పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా కాలువలను పరిరక్షించి డ్రైయిన్లను ప్రక్షాళన చేయాలని స్పష్టం చేశారు. కాలువల్లో పూడికతీతలో కాంట్రాక్టర్లు పాల్పడుతున్న అవకతవకలపై దృష్టి సారించాలని సూచించారు. మరోవైపు.. మేయర్ పావని తీరుపై కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చంద్రకళా దీప్తీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తప్పుబట్టారు. నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డ్డిని విమర్శించే అర్హత మేయర్ పావనికి లేదంటూ మండిపడ్డారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఉద్యమాలు చేసి ద్వారంపూడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. మున్సిపల్ అధికారుల ఫైల్స్ నేరుగా చూసే అధికారం మేయర్కు లేదని, ఒక వైపు గౌరవ వేతనంతీసుకుంటూ కారు అద్దె తీసుకోవడం మేయరుకు సరికాదని హితవు పలికారు. -
‘గోదావరి జిల్లాలో పుట్టిన పవన్కు అది తెలియదా’
సాక్షి, ప్రకాశం : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మంగళవారం జిల్లాలో మంత్రులు పిల్లి సుభాష్, శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలపై అద్యయనం చేసి అక్రమాలకు చెక్ పెట్టేలా ఆన్లైన్లో కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. పేదలకు అర్బన్లో ఒక సెంట్.. రూరల్లో ఒకటిన్నర సెంట్ స్థలాన్ని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలను ఆడపడుచుల పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించనున్నామని అన్నారు. గోదావరి జిల్లాలో పుట్టిన పవన్ కల్యాన్కు వరదలు వచ్చిన సమయంలో ఇసుక సమస్య తలెత్తుందని తెలియాదా అని ప్రశ్నించారు. -
‘ప్రమోషన్ కోసం ఠాకూర్ మమ్మల్ని ట్రాప్ చేశారు’
సాక్షి, విజయవాడ : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకుల మెప్పు కోసం ఆర్పీ ఠాకూర్ తమను ట్రాప్ చేసి అక్రమ కేసులు పెట్టారని బాధితులు ఆరోపించారు. నగరంలోని ప్రెస్క్లబ్లో ఏసీబీ అక్రమ కేసుల బాధితుల మీడియా సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బాధితుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఠాకూర్ డీజీ నుంచి డీజీపీ ప్రమోషన్ కోసం అక్రమంగా కేసులు పెట్టారని ఆయన వాపోయారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అన్యాయంగా కేసులు పెట్టిన వాటిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఠాకూర్ పెట్టిన అక్రమ కేసులకు మనస్తాపానికి గురై కొందరు ఉద్యోగులు ఆతహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి రీ పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నామని వెంకటేశ్వరావు అన్నారు. మిగిలిన వారికి పోస్టింగ్ ఇవ్వాలి.. 3 ఏళ్లుగా అన్యాయనికి గురైన వారిలో కొందరికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏసీబీలో లోపాలను ఎత్తి చూపిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మా కృతజ్ఞతలు. ఠాకూర్ కేసుల బాధితులందరికీ న్యాయం చేయాలి. విచారణకు వెళ్లేముందు కేసులు పునర్ పరిశీలించమని కోరుతున్నాము. -బాధితుడు పయ్యావుల శ్రీనివాసరావు -
ఏసీబీ అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్
-
వాళ్లను చూస్తుంటే అసహ్యం వేస్తోంది
సాక్షి, అమరావతి: మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ కేసు వ్యవహారంలో విశాఖపట్నంలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఏ రవీంద్రనాథ్ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్ర బోస్ ఆదేశంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమని వాపోయారు. కొంతమంది ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీ, హోం మంత్రితో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. కేసు విషయంలో విచారణే అవసరం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయని ఆయన వెల్లడించారు. తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. లంచాల కోసం తప్పులు చేసే ఏసీబీ అధికారులపై కూడా అటువంటి కేసులు పెట్టాలన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని తెలిపారు. లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా? ఏపీపీఎస్సీ నుంచి నేరుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. (చదవండి: సబ్ రిజిస్ట్రార్ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’) -
డీఐజీ రవీంద్రనాథ్పై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఏ రవీంద్రనాథ్ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ కేసు వ్యవహారంలో ఆయన అధికారులతో కుమ్మకైనట్టు రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశంతో రవీంద్రనాథ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సందర్భంగా పిల్లి సుభాష్చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమని అన్నారు. ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీ, హోం మంత్రితో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. ఈ కేసు విషయంలో విచారణ అవసరం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయని ఆయన వెల్లడించారు. తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. లంచాల కోసం తప్పులు చేసే ఏసీబీ అధికారులపై కూడా అటువంటి కేసులు పెట్టాలన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు. ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్, ఆ కార్యాలయ ఉద్యోగులను అవినీతి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ దృష్టికి వెళ్లడంతో.. తీవ్రంగా స్పందించిన ఆయన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఈ వ్యవహారం రిజిస్ట్రేషన్, అవినీతి నిరోధక శాఖల్లో కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. ఈ నెల 9న మధ్యాహ్నం మధురవాడ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ బృందం వెళ్లింది. ఆ సమయంలో పర్మిషన్పై ఇంటికి వెళ్లిపోతున్న సబ్ రిజిస్ట్రార్ టి.తారకేష్ను ఏసీబీ సీఐ గఫూర్ ఆపి.. కార్యాలయంలో కూర్చోబెట్టారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అక్కడకు చేరుకుని బయట గేటును మూయించివేసి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ తర్వాత సీఐ గఫూర్ బయటకు వెళ్లి రూ.61,500 నగదును తీసుకొచ్చి రికార్డు రూమ్లోని రికార్డులో పెట్టి అక్కడే దొరికినట్లు కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఏసీబీ తీసుకొచ్చిన మధ్యవర్తులు తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించడంతో కేసు పెట్టడం వీలు కాలేదు. ఏసీబీ సీఐ బయట నుంచి డబ్బు తెచ్చి రికార్డుల్లో పెట్టినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ సొమ్ముతో లంచం తీసుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని బెదిరించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. ఇందుకోసం విచారణల పేరుతో వేధించారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీపై ఒత్తిడి తెచ్చి సబ్ రిజిస్ట్రార్ తారకేష్ను మధురవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేయించారు. ఆ తరువాత తారకేష్ను డీఐజీ యథాస్థానానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ సీసీ కెమెరాలోని ఫుటేజిని సాక్ష్యాలుగా తీసుకుని మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ను కలిశారు. సీసీ ఫుటేజిని వీక్షించిన ఉప ముఖ్యమంత్రి తప్పు చేసిన ఏసీబీ అధికారులపై విచారణ జరిపించి.. డీఎస్పీ రంగరాజు, సీఐ గఫూర్, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్కు లేఖ రాశారు. సీసీ ఫుటేజి సాక్ష్యాలను, సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదును ఏసీబీ డైరెక్టర్ జనరల్కు పంపించారు. ఏసీబీ అధికారుల ఒత్తిడికి తలొగ్గి సబ్ రిజిస్ట్రార్ను బదిలీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖపట్నం డీఐజీని సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. -
‘సీఎం జగన్ మరో రికార్డు సాధిస్తారు’
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలిచ్చేందుకు లబ్ధిదారులను గుర్తిస్తున్నామని.. ఇప్పటివరకు 13 జిల్లాల్లో 20.50 లక్షల లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని.. గ్రామాల్లో 8.5 లక్షలు, పట్టణాల్లో 7 లక్షల లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులను 5 లక్షల మందికి పైగా గుర్తించామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కోసం రూరల్ ప్రాంతాల్లో 19 వేలు, పట్టణాల్లో 2,500 వేల ఎకరాలను గుర్తించామని..ఇంకా 19వేల ఎకరాలు భూమి అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. దాదాపు 10వేల ఎకరాల్లో భూమిని సమీకరిస్తున్నామని వెల్లడించారు. ఒకేసారి లక్షల సంఖ్యలో పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అవుతుందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కచ్చితంగా రికార్డు సాధిస్తారని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
నాణ్యమైన విద్య, ఆరోగ్యమే లక్ష్యంగా..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అటు విద్య..ఇటు ఆర్యోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. జిల్లాలో ఏడు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రేపటి తరం కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, కళ్ల అద్దాలు ఇస్తుందని...అవసరమైతే కంటి ఆపరేషన్ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, పంచాయితీ, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా: పెనమలూరు నియోజకవర్గం కానూరు జడ్పీ హైస్కూల్లో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కంటి పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి,ఎంపీటీసీ ఛాన్బాషా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురంలోని లెనిన్ హైస్కూల్లో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో సుమారు లక్షా 60 వేల మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థి, విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా: కల్లూరు మండలం జెడ్పీ హైస్కూలులో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్ తరాల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో కంటి వెలుగు పథకాన్ని సీఎం ప్రారంభించడం అభినందనీయమని కాటసాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకానికి రూ.5లక్షల విరాళం.. అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ కంటి వెలుగు పథకానికి జంగాలపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున రెడ్డి రూ.5 లక్షలను విరాళంగా ఇచ్చారు. గురువారం అనంతపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. -
ఆధునిక టెక్నాలజీతో భూముల రీ సర్వే..!
సాక్షి, కాకినాడ: వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశమని.. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని డిప్యూటి సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గురువారం ‘నవరత్నాలు-పేదలందిరికీ ఇళ్లు’ సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి ఎంత ఉందో సేకరించి.. దాని కోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎంటువంటి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంకు ముందు నుంచే రాష్ట్రంలో గ్రామపాలన ఉండేదని తెలిపారు. భూములు, చెరువులకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండేవన్నారు. కానీ 1984లో గ్రామపాలన రద్దు చేయడంతో రెవెన్యూ రికార్డులకు చెదలు పట్టి క్షీణ దశకు చేరాయన్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. కాగా రెవెన్యూ వ్యవస్థ మీద చాలా శాఖలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. దీంతోపాటు ఆధునిక పరిజ్ఞానంతో భూముల రీ సర్వే చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు. దానికోసం 1,158 సర్వేయర్లను నియమించామన్నారు. మూడు గ్రామాలను ఒక యూనిట్గా ఏర్పాటు చేసి అధికారులు భూములు సర్వే చేయాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల ఆ శాఖ అధికారులు చెడ్డపేరు తెచ్చుకున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్ఎస్ఆర్, అడంగళ్కు సుమారు 2,60,000 ఎకరాల వ్యత్యాసం ఉందని తెలిపారు. అందువల్ల భూములు రీ సర్వే చేసి రెవెన్యూ రికార్డులను సక్రమంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. గతంలో లాండ్ సీలింగ్ భూములను వెనక్కి తీసుకుని.. తిరిగి ఆ భూములనే దాని యాజమానికే మళ్ళీ లీజుకు ఇచ్చిన రిటైర్డు అధికారులు ఉన్నారని తెలిపారు. భూస్వాముల వద్ద ల్యాండ్ సీలింగ్, భూదానోద్యమ భూములు ఉండడానికి వీలులేదని పేర్కొన్నారు. అలాంటి భూములను వెనక్కి తీసుకుని పేదలకు ఉపయోగించాలని సుభాష్ చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి కో ఆర్డినేటర్ శివరామ సబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి రాజమండ్రి మంజీరా ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు అమృతవల్లి, శ్రీరంగనాథ్లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ భరత్, కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు హాజరయ్యారు. తణుకులో సందడి వాతావరణం.. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం తణుకులో అంగరంగ వైభవంగా జరుగుతోంది. తణుకు బెల్ వెదర్ స్కూల్ అవరణలో జరుగుతున్న ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు భారీగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు రాజకీయ ప్రముఖులతో తణుకు సందడి వాతావరణం నెలకొంది. -
టెండర్ల ఫైళ్లను మీడియా ముందుంచిన డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏపీటీఎస్ టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు. అదే విధంగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసరమైన నిబంధనలను పక్కన పెడతామని... చిన్న చిన్న కారణాలతో ఇళ్ల స్థలాల లబ్దికి అనర్హులని ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భూ రికార్డుల సర్వే టెండర్ల ఖరారు విషయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. అధికారులు కష్టపడి పని చేస్తుంటే ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా భూముల రీ-సర్వేకు సంబంధించిన టెండర్ల ఫైళ్లను సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఉంచారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా 3.31 కోట్ల ఎకరాల భూమి ఉంది. రీ సర్వే చేస్తున్నాం. టెండర్ల ఫైలును మీ ముందు పెడుతున్నాం... అంతా పరిశీలించుకోవచ్చు. బహుశా ఫైళ్లను మీడియా ముందు పెట్టడం ఇదే తొలిసారి అనుకుంటా’ అని ఆయన పేర్కొన్నారు. సమాచారం సేకరిస్తున్నాం ‘పేదలకు.. వివిధ వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ వేశాం. వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలతో సమావేశమయ్యాం. గత ప్రభుత్వం కొందరు ఐఏఎస్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా.. ఇంకొందరికి ఇవ్వాల్సి ఉంది. అలాగే ఎంత మంది ఉద్యోగులకూ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంపై అంచనా వేయాలని సంబంధిత అధికారులను కోరాం. అలాగే అర్చకులు, ఇమామ్లు, ఫాస్టర్లు, హైకోర్టు అడ్వకేట్లు, జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ వర్గాలకు సంబంధించి ఎంత మంది అర్హులు ఉంటారన్న వివరాలను అధికారులను అడుగుతున్నాం’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి(ఏలూరు): నేను చూశాను.. నేను విన్నాను..నేను ఉన్నాను అనే మాటకు కట్టుబడి, చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకానికి శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. ఇచ్చిన మాట చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టడం విశేషం. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి చలించిన వైఎస్ జగన్ ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ల ఫిట్నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘వైఎస్సార్ వాహనమిత్ర’పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున అందుకోనున్నారు. గురువారం ఉదయమే ఏలూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తొలుత ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధి పొందే వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ‘వైఎస్సార్ వాహన మిత్ర’పథకంతో తమకు చేయూతనిచ్చిన సీఎం వైఎస్ జగన్కు ఆటో డ్రైవర్లు పుష్ప గుచ్ఛాలు, గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి ఈ పథకం ప్రారంభించినందకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘2018, మే 14న పాదయాత్రలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీ అమలు చేశాం. ఆటో కార్మికులను కష్టాలను కళ్లారా చూశా. అందుకే వైఎస్సార్ వాహన పథకాన్ని రూపొందించాం. ఈ పథకం కింద కింద ఆటో డ్రైవర్లకు రూ. 10 వేల చొప్పున.. ఐదేళ్లలో రూ. 50 వేలు జమ చేస్తాం. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతీ అర్హుడికి ఈ పథకం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఆర్థిక సహాయం అందిస్తాం. ఇప్పటివరకు వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఈ రోజు నుంచే పథకం అమలుకానుంది. ఇంకా అర్హులు ఎవరైన ఉంటే వారికి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నాం. వారికి వచ్చే నెల నుంచి నగదును అందిస్తాం. ఇలాంటి ఆర్థిక సహాయం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి బృహత్తర పథకాలు అమలవుతున్నందుకు గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో పథకాలతో ప్రతీ పేదవాడిని ఆదుకుంటామని మాట ఇస్తున్నాను. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చాం. ఏ గ్రామంలో బెల్టు లేకుండా రద్దు చేశాం. మద్యం దుకాణాలను 4,380 నుంచి 3,500కు తగ్గించాం. అంతేకాకుండా మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నాం. మద్యం షాపుల పక్కన పర్మిట్ రూమ్లను రద్దు చేశాం. అయితే గాంధీ జయంతి రోజు మద్యం షాపులు తెరిచారని ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు చెప్పండి గాంధీ జయంతి రోజు ఎక్కడైనా మద్యం దుకాణాలు తెరిచి ఉన్నాయా?(ప్రజల నుంచి లేదు.. లేదు అంటూ సమాధానం). రాష్ట్రంలో మంచి జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు. అయితే వారు చేస్తున్న విమర్శలను నేను ఏమాత్రం పట్టించుకోను. పేద ప్రజల ముఖంపై చిరునవ్వు కోసం తమ ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. -
దమ్మున్న నాయకుడు జగన్
సాక్షి, కాకినాడ: కౌలు రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించేందుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కరప గ్రామానికి వెళ్లిన విషయం తెలసిందే.. ఈ క్రమంలో కరప గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో ఉపముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇచ్చిన మాట జవదాటని నేత దివంగత మహానేత వైఎస్సార్ అయితే.. ఇచ్చిన మాట నెరవేర్చి వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచారని ప్రశంసించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి అత్యధికంగా పండిస్తూ రాష్ట్రానికే కాక దేశానికి అన్నం పెడుతున్న ఈ రెండు జిల్లాలను ఆ రోజు వైఎస్సార్ ఆదరించారని గుర్తు చేశారు. ఈ రోజు సాగు చేస్తున్న రైతుల పట్ల వైఎస్ జగన్ కరుణ చూపిస్తున్నారని ఉపముఖ్యమంత్రి సుభాష్ కొనియాడారు. రైతులకు సీఎం జగన్ భరోసా కల్పిస్తూ, భూ యజమానులకు, కౌలు రైతులకు న్యాయం చేస్తున్నారన్నారు. ఉదారంగా రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా రైతులు ఉత్సాహంగా సాగు చేసేవారని, ప్రస్తుతం వారు నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులు దాదాపు 5 లక్షల మంది వలస వెళ్లారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. అందరికీ సాయం చేసేందుకు ముందుకువచ్చిన వైఎస్ జగన్ను అభినందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోనే 2.60 లక్షల మంది వాలంటీర్లుగా, 1.30 లక్షల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించారని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ దమ్మున్న నాయకుడు: కురసాల ప్రతి పనిలో చిత్తశుద్ధి, పారదర్శకతతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. నాలుగు నెలల పాలనలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శప్రాయుడిగా సీఎం జగన్ మారారన్నారు. 2019 ఎన్నికల శంఖారావాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచే వైఎస్ జగన్ పూరించారన్నారు. దేశం మొత్తం చూసేవిధంగా ఎన్నికల ఫలితాల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు సాధించి, నాయకుడు అంటే ఈయనేనని వైఎస్ జగన్ దేశానికి చూపించారని పేర్కొన్నారు. ఒక వ్యవస్థను రూపొందించి దాన్ని అమలు చేయడానికి దమ్ముండాలని, అలాంటి దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని మంత్రి కన్నబాబు కొనియాడారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, కానీ చంద్రబాబు హయాంలో ఎవరికీ ఒక్క జాబు కూడా రాలేదని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత యువత అంతా జగనన్న వచ్చాడు. జాబు ఇచ్చాడని నినదిస్తోందని తెలిపారు. ప్రజల ముందుకు నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని, దశలవారీగా మద్య నిషేధం మంగళవారమే ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇంతటి సుపరిపాలనలో భాగస్వాములు అయినందుకు గర్వపడుతున్నానని మంత్రి కన్నబాబు అన్నారు. దేశమంతా ఆంధ్ర రాష్ట్రవైపు చూస్తుంది. గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయమని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీర్వాదాలు సీఎం వైఎస్ జగన్కు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం మాటను నిజం చేస్తూ వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారని అన్నారు. ఉద్యోగం వచ్చిన కుటుంబాలు నా బిడ్డకు జగనన్న ఉద్యోగం ఇచ్చాడని ఆనందపడుతూ సీఎంను ఆశీర్వదిస్తున్నారన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని మాత్రమే కాకుండా నేను ఉంటాను.. మీకు అన్నీ చేస్తానని సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారని కొనియాడారు. సీఎం జగన్కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘గొప్ప వ్యవస్థకు సీఎం జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు’
సాక్షి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2న గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టనుంది. ప్రతి గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుందని వెల్లడించారు. ‘ప్రజాసమస్యలు తీర్చడానికి 11 రకాల ఉద్యోగులు ఒకే ప్రదేశంలో పనిచేయడానికి ఒక కార్యాలయం ఉండటం అనేది దేశ చరిత్రలోనే ప్రథమం. గ్రామ వాలంటీర్లు ప్రజాసేవకు అంకితం అవడం ఆహ్వానించదగింది. ఇలాంటి గొప్ప వ్యవస్థకు సీఎం జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు’అని డిప్యూటీ సీఎం అన్నారు. మరో కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. దేశంలోనే విప్లవాత్మకమైన వ్యవస్థకు నాంది పలికిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. అలాంటి మంచి అవకాశం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కింది. సీఎం వైఎస్ జగన్ మానసపుత్రిక వంటి ఆలోచనే ఈ గ్రామ సచివాలయాలు. నిజమైన గ్రామ స్వరాజ్యానికి అద్దం పట్టే ఈ వ్యవస్ధకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరప గ్రామం నుంచి సీఎం జగన్ స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. గ్రామ సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో పరిపాలనా తీరు తెన్నులు మారిపోబోతున్నాయి’ అని చెప్పారు. -
రాజకీయాలకు అతీతంగా పేదలకు స్థలాలు, ఇళ్లు
సాక్షి, నంద్యాల: రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలను వచ్చే ఉగాది నాటికి ఇస్తామని, పక్కా గృహాలు సైతం మంజూరు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ తెలిపారు. శనివారం నంద్యాలలోని వైఎస్సార్ సెంటినరీ హాలులో రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, హౌసింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న దృఢసంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1.29 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 1.10 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అర్హులను అధికారులు గుర్తించారన్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో 700 ఎకరాలు, అర్బన్ ప్రాంతాల్లో 83 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ల్యాండ్ సీలింగ్ ఉన్న భూములు, కోర్టులో పెండింగ్ ఉన్న వాటిని గుర్తించాలని, వాటికి త్వరగా పరిష్కారం చూపి ప్రజలకు ఇచ్చేందుకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్)ను రెవెన్యూ అధికారులు స్పెషల్ డ్రైవ్గా చేపట్టాలన్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడం, అడంగల్లో కొందరు అధికారులు తప్పుగా నమోదు చేయడం వల్ల రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనివల్ల రెవెన్యూ శాఖకు చెడ్డపేరు రావడంతో పాటు నిజమైన రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ చూపండి పేదలకు నివాసయోగ్యమైన చోట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు రెవెన్యూ, హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆదేశించారు. భూపరిరక్షణ చట్టం మేరకు భూములన్నింటినీ రీసర్వే నిర్వహించి రికార్డుల స్వచ్ఛీకరణకు శ్రీకారం చుట్టాలన్నారు. డోన్, బేతంచర్ల ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 1,117 తప్పుడు పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించడంతో పాటు 4,300 ఎకరాల పొలం సాగులో లేనట్లు చూపారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పాలనలోనే లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశారని కొనియాడారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏ సమస్య వచ్చినా, ఉన్నా వలంటీర్లకు తెలియజేస్తే వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని చెరువుల కింద ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయవద్దని అధికారులకు సూచించారు. అడంగల్లోని పేర్లు, రిజిస్ట్రేషన్ రికార్డులలో వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటున్నాయని, ఇలాంటివి సరిదిద్దాలని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలోని భూముల వివరాలను 2016 నుంచి ఆన్లైన్లో తారుమారు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ పార్కుకు భూములు కోల్పోయిన రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. పందిపాడు దగ్గర ఇళ్ల పట్టాలు పొందిన వారికి గృహనిర్మాణాలను ఉపాధి హామీ పథకం కింద చేపట్టేందుకు అనుమతించాలన్నారు. శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొరకొట్టాల సమీపంలో 1,200 ఎకరాల భూమిని సొసైటీకి ఇచ్చారని, దాన్ని సంబంధిత రైతులకు ఇచ్చి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రెవెన్యూ రికార్డులలో పేర్లు మార్పు చేసి, ఫోర్జరీ సంతకాలతో భూములను కొందరు ఆక్రమించుకున్నారని, అలాంటి వాటిని అధికారులు గుర్తించాలని సూచించారు. ఇల్లు, ఇంటి స్థలం కావాలంటే రేషన్కార్డు అడుగుతున్నారని, తమ నియోజకవర్గంలో చాలా మందికి కార్డులు లేవని, కొత్తవి మంజూరు చేయాలని కోరారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ సమీపంలోని నందమూరినగర్, వైఎస్సార్నగర్, శిల్పానగర్లో ఇళ్ల స్థలాలను కొందరు నాయకులు పంచుకున్నారన్నారు. అధికారులు గతంలో రాజకీయ ఒత్తిళ్లకు గురై ఒకే ప్లాట్ను ఇద్దరికి, ముగ్గురికి ఇవ్వడం వల్ల ప్రతిరోజూ అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. ఇళ్ల స్థలాలపై సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్ మాట్లాడుతూ అర్బన్ అథారిటీ కింద ఉన్న 9 మండలాల పరిధిలోని 132 గ్రామాల్లో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి డిసెంబర్గా నివేదికలు ఇస్తే వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. పట్టణాల్లో జీప్లస్3 కింద గృహాలు నిర్మించి పేదలకు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ జిల్లాలో భూరికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రవి పట్టన్శెట్టి భూరికార్డుల స్వచ్ఛీకరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్–2 ఖాజామొహిద్దీన్, డీఆర్ఓ వెంకటేశం, కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, బాలగణేశ్, హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిల్లులు త్వరలోనే చెల్లిస్తాం కర్నూలు జిల్లాలో 27,100 పక్కాగృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటికి రూ.52 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. త్వరలోనే బిల్లులు చెల్లించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో బినామీ పేర్లతో గృహాలకు బిల్లులు తీసుకున్నారని విమర్శించారు. జిల్లాలోని 54మండలాల్లో 9 మినహా అన్ని మండలాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. గృహ నిర్మాణాలకు పావలా వడ్డీ కింద రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. వితంతువులు, ఒంటరిమహిళలు, దివ్యాంగులకు హౌసింగ్ శాఖ ద్వారానే గృహాలు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూ వివరాలను సంబంధిత శాసన సభ్యుల దృష్టికి తీసుకెళ్లి.. భూసేకరణలో వారినీ భాగస్వాములు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
వైఎస్ జగన్ పాలనలో ఏ ఒక్కరికి నష్టం జరగదు
సాక్షి, వైఎస్ఆర్ : ప్రభుత్వ భూములు ఆక్రమించిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. కడప జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులకు సంబంధించి గురువారం కలెక్టరేట్లో మంత్రులు శ్రీ రంగనాథరాజు, జిల్లా ఇంచార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ 'ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం. ప్రతి పేదవాడికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జిల్లాలో దాదాపు 1.20 లక్షల మంది ఇళ్ల స్థలాలకి అర్హులుగా అధికారులు గుర్తించారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కుల, మత భేదాలు చూడకుండా ప్రతీ ఒక్క పేద కుటంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఇప్పటిదాకా మనం ఎక్కడా చూడలేదు. 1983 నుంచి భూరికార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అక్టోబర్ 2న గ్రామసచివాలయాల ద్వారా 11 వేల మంది సర్వేయర్లను నియమిస్తున్నాం. వీరిని ఉపయోగించుకుని భూ రికార్డులు పక్కాగా ఉండేలా చూస్తాం. వైఎస్ జగన్ పరిపాలనలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ పథకాలు వెళ్లాలన్నదే' ముఖ్యమంత్రి ధృడసంకల్పమన్నారు. గృహ నిర్మాణ శాఖా మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ జియో ట్యాగింగ్ యాప్ ద్వారా సర్వే చేసి, భూ కబ్జాదారులపై కఠిన చర్యలకు అదేశాలు ఇవ్వడం జరిగింది. కడప విమానాశ్రయం పక్కన ఉన్న స్థలంలో ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మంత్రిని కోరారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మాట్లాడుతూ 'పేదలందరికి ఇల్లు అనేది నవరత్నాలలో భాగంగా ప్రజలకు ఇచ్చిన వరమన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 90 శాతం మేర ఇప్పటికే అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే బడ్జెట్లో నవరత్నాలకు అధిక ప్రాధాన్యత కల్పించాం. ప్రజలకు ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసి చూపించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. సామాన్య మానవునికి అవసరమైన ప్రతి కార్యక్రమాన్నిఅత్యంత పారదర్శకతతో చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. అమ్మఒడి కార్యక్రమం ద్వారా దేశంలో విన్నూత్న పథకానికి శ్రీకారం చుట్టాం. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరచి ప్రస్తుత ప్రభుత్వంపై నిందలు వేస్తోంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలలో దూసుకుపోతోంది. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం చెల్లిస్తాం. రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా 13జిల్లాల అభివృద్ధిపైనా దృష్టి సాధించాం. రాజన్న పాలనను అందించడానికి తపన పడుతున్న ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు' గర్వంగా ఉందని పేర్కొన్నారు. -
ప్రక్షాళన చేయండి: డిప్యూటీ సీఎం
భూ యజమానుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తీరును గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, విప్ కాపురామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఆర్ఎస్ఆర్ తో పోలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి వ్యత్యాసం చాలా ఉందన్నారు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. సాక్షి, అనంతపురం : ‘ప్రభుత్వ భూమి ప్రతి ఎకరమూ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. లేదా ప్రజావసరాలకు వినియోగించబడాలి, పేదల వద్దనైనా ఉండాలి. అంతే తప్ప పెద్దలు, సంపన్నల వద్ద ప్రభుత్వ భూమి ఉందంటే దానిని వెంటనే స్వాధీనం చేసుకోండి. బలవంతుడైన ముఖ్యమంత్రి మీ వెనుక ఉన్నాడు. ఎవరికీ తలవంచకండి’ అంటూ అధికారులకు డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాలతో కూడిన పిలుపునిచ్చారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డులు స్వచ్ఛీకరణ తీరును గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా మంత్రి శంకరనారాయణ, విప్ కాపురామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో వారు సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ భూమి బలవంతులు, సంపన్నులు చేతిలో ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. 1983 వరకు అమలులో ఉన్న జమాబందీ విధానం వల్ల భూ రికార్డులు సక్రమంగా ఉండేవని గుర్తు చేశారు. ఆ విధానం రద్దు అయిన తర్వాతే వ్యవస్థ గాడితప్పిందన్నారు. భూ యజమానుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో రికార్డులను ప్రక్షాళన చేయడంతోపాటు పాత విధానాన్ని కొనసాగించే సాహసోపేత నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు పోతోందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది. గృహ నిర్మాణానికి ఉపయోగపడేది ఎంత. ఇంకా ఎంత అవసరం ఉంది, ఇందుకు నిధులు ఎంత అవసరం అనేదానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మూడు గ్రామాలను యూనిట్గా తీసుకోండి మూడు గ్రామాలను యూనిట్గా తీసుకుని భూ రికార్డుల స్వచ్ఛీకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఒక వీఆర్వో, సర్వేయర్తో కలిపి రికార్డులను పరిశీలించి తప్పులు సరిచేయాలన్నారు. జిల్లాలో ఆర్ఎస్ఆర్తో పోలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి వ్యత్యాసం చాలా ఉందన్నారు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ భూ పరిపాలనలో నిమగ్నం కావాలని సూచించారు. ఆర్డీఓల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఉగాది నాటికి సంతృప్తి స్థాయిలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం అందిన 1.89 లక్షల దరఖాస్తులను విచారణ చేసి అర్హులను గుర్తించాలన్నారు. ఒక కుటుంబం తెల్లకార్డులో తండ్రితో పాటు అతని పిల్లలు ఉంటారన్నారు. వారిలో ఒక కుమారునికి వివాహం జరిగి సంతానం కూడా ఉంటారని, అయితే వారికి వేరే కార్డు ఉండదన్నారు. ఈ క్రమంలో ఉదారంగా వ్యవహరించి వివాహం జరిగిన కుమారునికి కూడా ఇంటి పట్టా మంజూరు చేయాలన్నారు. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేల సహకారంతో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. గతంలో జిల్లాలో 57 వేల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.91 కోట్లు బిల్లులు చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. వీటిపై విచారణ చేసి నివేదిక ఇస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నగర పాలక కమిషనర్ ప్రశాంతి, పెనుకొండ సబ్కలెక్టర్ టి.నిశాంతి, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న హౌసింగ్ మినిస్టర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిఇవ్వాలనేది నవరత్నాల్లో ప్రధామైన అంశమన్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికార యంత్రాగం అంకితభావంతో పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హాయంలో కొండలు, గుట్టలు, వంక పోరంబోకు స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని, సమగ్ర విచారణ చేసి వాటికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలన్నారు. రెవెన్యూ రికార్డులు సరిచేసి భూ వివాదాలు లేకుండా చూడాలన్నారు. నిబంధనలు సడలించండి కరవును దృష్టిలో ఉంచుకుని ఇళ్ల పట్టాల మంజూరులో నిబంధనలు సడలించాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కోరారు. 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట అర్హతగా తీసుకునేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సూచించారు. శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలి చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవని, అధికారులు గుర్తించి తక్షణమే స్థలాలు కేటాయించాలని ఎంపీ గోరంట్ల మాధవ్ సూచించారు. కియా పరిశ్రమకు, ఎన్పీకుంట సోలార్ హబ్కు భూములు ఇచ్చిన రైతుల్లో కొందరికి పరిహారం అందలేదని వారందరికీ పరిహారం ఇవ్వడంతో పాటు ఆయా కుటుంబాల్లోని వారికి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసిల్దారు కార్యాలయం అవసరం నగర పరిధిలో 3 లక్షల జనాభా, రూరల్ పరిధిలో 2 లక్షల జనాభా ఉన్నా.. ఒకటే తహసీల్దారు కార్యాలయం ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అదనంగా మరో తహసీల్దారు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంతకల్లును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, చుక్కల భూముల సమస్యలకు ముగింపు పలకాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నగర పరిధిలో 2014 వరకు 14 వేల ఇళ్లకు బిల్లులు బకాయిలో ఉన్నాయని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చుక్కల భూముల సమస్యలు అలాగే ఉన్నాయి చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో ఇళ్లను పొందిన వారు కూడా ప్రస్తుతం ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేస్తున్నారని, ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్ల పట్టాలు అనర్హుల చేతిలోకి వెళ్లకూడదని సూచించారు. మైనారిటీలకు కాలనీలు ఏర్పాటు చేయాలి అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో పేద మైనారిటీలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సూచించారు. 2014 నుంచి 2019 వరకు భూ అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని, ఐదారు వేల ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగులు, సంపన్నులకు కట్టబెట్టిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి త్వరితగతిన భూ రికార్డులను సరిచేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేయాలన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలో వ్యవస్థ కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలో రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి విమర్శించారు. ఇష్టానుసారంగా ఆన్లైన్లో భూముల వివరాలను వారు మార్చేస్తున్నారన్నారు. తప్పుడు పనులు చేస్తున్న ఆపరేటర్లను తొలగించాలన్నారు. లక్ష లోపు జనాభా ఉండే పట్టణాల్లో అపార్ట్మెంట్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగత (ఇండిపెండెంట్) ఇళ్లను కేటాయించాలని సూచించారు. సాహసోపేత నిర్ణయం రెవెన్యూ భూ రికార్డుల స్వచ్ఛీకరణ అనేది సాహసోపేత నిర్ణయమని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూముల సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా స్వచ్ఛీకరణ సక్రమంగా చేయాలని అధికారులకు సూచించారు. క్రాస్ చెకింగ్ సిస్టం ఉండాలన్నారు. పాస్పోర్ట్ తరహా పట్టా పాసు పుస్తకం విధానం తీసుకొస్తే భూముల వివరాలు మార్పు సాధ్యం కాదని సూచించారు. ఇళ్ల పట్టాల కోసం సేకరిస్తున్న భూమి ఆయా గ్రామల ప్రజలకు నివాసయోగ్యమా కాదా అనేది నిర్ధారించుకోవాలని, లేదంటే పథకం నిరుపయోగమవుతుందని హెచ్చరించారు. వేల ఎకరాలకు పట్టాలిచ్చారు తహసీల్దార్లు బదిలీపై వెళుతూ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చేశారని మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వా మి తెలిపారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలన్నారు. ‘ఎస్ఈజె డ్ కోసం 1,600 ఎకరాల భూమిని రైతుల నుంచి 2014లో సేకరించారు. 1బిని రద్దు చేశారు. అయితే 600 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చి, మిగిలిన భూమి ఇవ్వలేదు. దానికీ పరిహారం ఇవ్వాలి’ అని కోరారు. బీఎస్సీ అగ్రికల్చర్ కళాశా లకు, అమరాపురంలో ఐటీఐ ఏర్పాటుకు, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి భూములు కేటాయించాలన్నారు. -
ముఖ్యమంత్రి గదిలో అవే కనిపిస్తాయి!
సాక్షి, వైఎస్సార్ : ‘సచివాలయంలోని ముఖ్యమంత్రి గదిలోకి వెళ్లగానే ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన ‘నవరత్నాలు’ హామీలే కనిసిస్తాయి. అనునిత్యం వాటిని గుర్తుపెట్టుకొని కార్యాచరణ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నదే వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని’ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధ్ రాజుతో కలిసి వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేసి నెరవేరుస్తున్నారని ప్రశంసించారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కుల, మత భేదాలు చూడకుండా ప్రతీ ఒక్క పేద కుటంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో రాక్షస పాలన చేసినందునే ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారని గర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ విభేదాలు పక్కనపెట్టి కృషి చేయాలని, అంబేద్కర్, గాంధీల మధ్య ఎన్ని అభిప్రాయభేదాలున్నా ప్రజా సంక్షేమం కోసం అంబేద్కర్తో రాజ్యాంగాన్ని రాయించారని తెలిపారు. మంత్రి రంగనాధ్ రాజు మాట్లాడుతూ.. మహానేత ఆశయాల కొనసాగింపుగా బడుగు, బలహీన వర్గాలకు 25 లక్షల ఇళ్లు కట్టించాలని నవరత్నాలలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాజన్న పాలనను అందించడానికి తపన పడుతున్న ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. -
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం
సాక్షి, అనంతపురం: ప్రభుత్వ భూములు ఆక్రమించిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులకు సంబంధించి గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మంత్రులు శంకర నారాయణ, శ్రీ రంగనాథరాజుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆడిటింగ్ నిర్వహిస్తామని, భూ క్రయవిక్రయాలు సరళతరం చేస్తామని చెప్పారు. 1983 తర్వాత భూ ప్రక్షాళన జరగలేదని.. భూ సంస్కరణల చట్టాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిందన్నారు. భూ యాజమానుల హక్కులను కాపాడతామని, భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తామని వెల్లడించారు. అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ల నిర్మాణం, బిల్లుల మంజూరుపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తామన్నారు. రీవెరిఫికేషన్ ద్వారా నకిలీ దరఖాస్తులు గుర్తిస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
‘ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్లు’
సాక్షి, అనంతపురం: అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ వెంటనే స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులను సమూల ప్రక్షాళన చేయాలని తెలిపారు. అదేవిధంగా పెండింగ్ కేసులన్నీ వెంటనే పరిష్కరించాలని, భూ ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉందని ఏపీ ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దన్నారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో బుధవారం నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. బోస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డ వారికి 3 సెంట్ల భూమి ఇచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి కె.నారాయణస్వామి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ప్లాస్టరింగ్ చేయించుకోలేని స్థితిలో పలువురు పేదలున్నారని, ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నవరత్నాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, నవాజ్ బాషా, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కలెక్టర్ నారాయణ భరత్గుప్తా, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి గారూ... ఆలకించండి
తిరుపతి డివిజన్లోని అకారంపల్లె రెవెన్యూ దాఖలాల్లో గొల్లవానిగుంట పరిధిలో మాజీ సైనికుడికి 1993లో 72/12 సర్వే నంబర్లో మూడు సెంట్ల ఇంటి పట్టా ఇచ్చారు. టీడీపీ పాలనలో ఓ వ్యక్తి దొంగపట్టాలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేశాడు. ఈ సమస్యపై బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందనలో అర్జీని జూలై 22న అందజేశారు. అయితే ఇప్పటివరకు వారి సమస్య సమస్యగానే ఉంది. రెవెన్యూ సమస్యలను పరిశీలించి పరిష్కరించాలన్న సదుద్దేశంతో ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ నెల 24వ తేదీన జిల్లాకు విచ్చేశారు. ఈ నెల 25న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆయన దృష్టికి జిల్లాలోని రెవెన్యూ శాఖలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ ఇస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరు రూరల్ మండలంలోని బండపల్లె గ్రామానికి చెందిన రైతు రామయ్య తన భూమికి సరిహద్దులు కొలవాలని దరఖాస్తు చేసుకున్నాడు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయంలోని సర్వేయర్ ఆ రైతు భూమిని కొలవకుండా అలసత్వం చేస్తూనే వచ్చాడు. రైతు ఒత్తిడి తెచ్చేసరికి ప్రభుత్వ సర్వేయర్ అసిస్టెంట్గా పెట్టుకున్న ప్రైవేటు సర్వేయర్ను రైతు గ్రామానికి పంపి సరిహద్దులు కొలిపించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజలకు సేవలు అందించాల్సిన రెవెన్యూ ఉద్యోగి బినామీ ఉద్యోగులతో కుమ్మకైఇలాంటి పనులు చేయ డంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్రస్థాయిలో ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా అందే సేవలను పారదర్శకంగా అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పదే పదే అధికారులకు సూచిస్తున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ సేవలు పొందాలంటే ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని, ఎవరైన లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్ను ప్రారంభించారు. సమస్యల పరిష్కారంపై అలసత్వం ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలో జరిగిన స్పందన కార్యక్రమాలకు రెవెన్యూ సమస్యలపై 10,242 అర్జీలను ప్రజలు అందజేశారు. అందులో అధికారులు 35 శాతం వరకు మాత్రమే సమస్యలను పరిష్కరించారు. మిగిలిన 65 శా తం సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉద్యోగుల విచారణ కేసులు పెండింగ్ జిల్లాలోని రెవెన్యూశాఖల్లో చిన్న చిన్న ఆరోపణలతో సస్పెండైన రెవెన్యూ ఉద్యోగుల విచారణ కేసులు సంవత్సరాల కొద్ది పెండింగ్లో ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 122 వరకు ఉద్యోగుల సస్పెండ్ కేసుల విచారణ పూర్తి కాని పరిస్థితి. అస్తవ్యస్తంగా రికార్డులు రెవెన్యూ శాఖలో భూమి రికార్డులను సరిగ్గా నిర్వహించలేకపోతుండడంతో భూ సమస్యలు రోజురోజుకు అధికమవుతున్నాయి. రికార్డులను డిజిటలైజేషన్ చేసినప్పటికీ సమగ్ర సమాచారం లేకపోవడంతో బోగస్ పట్టాలు పుట్టుకొస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల మృతి చెందిన పట్టాదారులు ఇప్పటికీ పట్టాదారులుగానే చెలామణి అవుతున్నారు. వెబ్ల్యాండ్, మ్యూటేషన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే రైతులకు, పౌరులకు మేలు జరుగుతుందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. ఆరోపణలు వచ్చినా.. చర్యలు శూన్యం రెండు నెలల క్రితం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎ త్తున ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతులు, వీఆర్వో, వీఆర్ఏల బదిలీలను నిర్వహించారు. ఈ బదిలీలను కలెక్టరేట్ అధికారులు నిబంధనల ప్రకారం నిర్వహించకపోవడంతో పలు ఆరోపణలు వెలువెత్తాయి. వీఆర్వో, వీఆర్ఏ బదిలీల్లో కలెక్టరేట్ లోని ఓ అధికారి చేతివాటంతో ఇష్టానుసారం బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైనప్పటికీ ఉన్నతాధికారులు నోరుమెదపని పరిస్థితి. నిబంధనల ప్రకా రం బదిలీలు చేసి ఉంటే ఆ కొరత ఉండేది కాదు. -
ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక
సాక్షి, అమరావతి: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. గ్రామ, వార్డు వలంటీర్లు అర్హుల జాబితాను రూపొందించి, సమర్పించిన తర్వాత దానిని గ్రామసభలో చదివి వినిపించాలని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హులను తొలగించాలని, అర్హుల పేర్లు లేకపోతే గ్రామసభలో చర్చించి చేర్పించాలని పేర్కొన్నారు. ఇందుకు షెడ్యూల్ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ‘‘లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ 25వ తేదీలోగా పూర్తి చేయాలి. 30వ తేదీలోగా ఎక్కడ ఎంత భూమి కావాలో ఖరారు చేసి, తదనుగుణంగా నివేదికలు రూపొందించాలి. ఇప్పటికే ఇల్లు లేదా ఇంటి స్థలం పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేస్తే తిరస్కరించాలి. డూప్లికేషన్ను నివారించడానికి ఆధార్ను జత చేయడం తప్పనిసరి చేయాలి’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. నేటి నుంచి ఉప ముఖ్యమంత్రి సమీక్షలు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని సజావుగా పూర్తి చేయడానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు నేటి నుంచి తేదీ నుంచి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజుతో కలిసి జిల్లాల్లో పర్యటించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్ణయించుకున్నారు. జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేస్తారు. ‘‘నిష్పక్షపాతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. ఇంత తక్కువ కాలంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేదల పట్ల ఉన్న అభిమానానికి, ముందుచూపునకు ఇది నిదర్శనం’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. 30,152.73 ఎకరాల భూమి గుర్తింపు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా 30,152.73 ఎకరాల భూమిని గుర్తించారు. రాష్ట్రంలో 1,45,72,861 కుటుంబాలుండగా, 1,26,26,879 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ, వార్డు వాలంటీర్లు సేకరించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 25,64,897 కుటుంబాల వారు ఇళ్ల స్థలాలు పొందడానికి అర్హులని తాత్కాలికంగా నిర్ణయించారు. 1,00,61,982 కుటుంబాల వారు నివాస స్థలాలు పొందడానికి అనర్హులని తాత్కాలికంగా తేల్చారు. మిగిలిన కుటుంబాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాగానే గ్రామసభలు నిర్వహించి, లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇందులో అనర్హుల పేర్లు ఉన్నట్లు తేలితే తొలగిస్తారు. అర్హుల పేర్లు జాబితాలో చేరలేదని తేలితే పునఃపరిశీలిస్తారు. అర్హులని తేలితే జాబితాలో చేరుస్తారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరూ ఉండరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూమిని సమకూర్చే పనిని వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీనాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి 25న ఉగాది సందర్భంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. -
సీనియర్ నేత మరణించాడనే బాధ కూడ టీడీపీ నేతలకు లేదు
-
వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు సీఎం గ్రీన్సిగ్నల్
సాక్షి, రాజమహేంద్రవరం : అందరి నోటా ఒకటే మాట.. గోదావరికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కావాల్సిందే.. మూడున్నరేళ్లలో పూర్తి చేయాల్సిందే.. ప్రతి ఇంటికీ శుద్ధిచేసిన కుళాయి నీటిని సరఫరా జరగాల్సిందే.. సూచనలు, సలహాలకు అనుగుణంగా లోటుపాట్లు సమీక్షించుకొని ముందుకు వెళదాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై జరిగిన సమీక్షలో వ్యక్తమైన ఏకాభిప్రాయం ఇదీ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుగా వాటర్గ్రిడ్ను గోదావరి జిల్లాల్లోనే ప్రయోగాత్మకంగా అమలు చేయాలనుకోవడం ఈ ప్రాంత ప్రజలపై ఆయనకున్న ప్రత్యేక అభిమానాన్ని స్పష్టం చేస్తోందని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు. చివరకు టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల, మంతెన కూడా ప్రాజెక్టును స్వాగతించారు. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన సుమారు 5 గంటలపాటు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై సుదీర్ఘ చర్చ జరిగింది. రెండు జిల్లాలకు కలిపి రూ.8,500 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టుపై మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒకే మాట చెప్పారు. ప్రజాప్రతినిధులకు అవగాహన తొలుత ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు గాయత్రీదేవి, రాఘవయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు డీటైల్డ్ రిపోర్టుపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించాలనే ముఖ్యమంత్రి బృహత్ సంకల్పంలో అంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, ఆళ్ల నాని సూచించారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం, ఐ.పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో ఇన్టేక్ పాయింట్ల ఏర్పాటుపై చర్చ సాగింది. పేపర్ మిల్లు కాలుష్యం, నల్లా చానల్ కాలుష్యం ఉన్న ప్రాంతాల నుంచి గోదావరి ముడినీటిని (రావాటర్)ను సరఫరా చేయడమా లేక, ఎక్కడికక్కడ పంట కాలువల్లో నీటిని ఫిల్టర్చేసి సరఫరా చేయడం మంచిదా అనేది అధ్యయనం జరగాలని మంత్రులు పినిపే విశ్వరూప్, కన్నబాబు, శ్రీరంగనాథరాజు సూచించారు. తాను ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉండగా కోనసీమకు మంజూరు చేసిన మంచినీటి ప్రాజెక్టును ఈ సందర్భంగా విశ్వరూప్ వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువుల కాలుష్యంతో మంచినీటి కష్టాలను సోదాహరణంగా మంత్రి బోస్ వివరించి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇందుకు సరైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని గుర్తిం చాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రధాన కాలువల్లో నీటిని తీసుకుంటే ఎలా ఉంటుందనేది అధ్యయనం చేయాలని మంత్రి రంగనాథరాజు సూచించారు. ఇన్టేక్ పాయింట్ వద్దనే ఫిల్టరైజేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలా, నాలుగైదు నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్ పరిధి, మండల స్థాయిలో.. వీటిలో ఎక్కడ స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేయాలి, ఫిల్టరైజేషన్ ఎక్కడ చేయాలి తదితర అంశాలపై ఎంపీలు వంగా గీత, అనురాధ, భరత్రామ్, రఘురామకృష్ణంరాజు పలు సూచనలు చేశారు. వాటర్గ్రిడ్ ప్రాజెక్టుతో ఇప్పుడున్న సీపీడబ్లు్యసీ, ఫిల్టరైజేషన్ ప్లాంట్లు ఎక్కడా వృథాకాకుండా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని మంత్రి బోస్ నొక్కిచెప్పారు. గోరంట్లకు కన్నబాబు చురకలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును తమ ప్రభుత్వంలోనే రూపొందించామని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి గొప్పలకు పోయే ప్రయత్నాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తిప్పికొట్టారు. చంద్రబాబు ఈ వాటర్ గ్రిడ్కు కన్సెల్టెన్సీ పేరు చెప్పి రూ.38 కోట్లు ఖాళీ చేసిన విషయాన్ని గుర్తుచేసి మంత్రి కన్నబాబు గోరంట్లకు చురకలంటించారు. అటువంటి కన్సెల్టెన్సీల ప్రమేయం లేకుండానే ఆర్డబ్ల్యూఎస్ అధికా రుల సమర్థతపై నమ్మకంతో ప్రాజెక్టు నివేదిక రూపొందించే బాధ్యత అప్పగించిన ముఖ్య మంత్రి నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు స్వాగతించారు. ఈ విషయంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధర్రెడ్డి, ముత్యాలరాజు కృషిని మంత్రులు అభినందించారు. ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పాలకొల్లు వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భూ సమస్యల భరతం పడదాం
రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకంలోని భూ విస్తీర్ణం కంటే అడంగల్లో16 లక్షల ఎకరాలకు పైగా అధిక భూమి ఉంది.అంటే లేని భూమి ఉన్నట్లు నమోదు చేశారు. ‘రెవెన్యూ రికార్డుల్లో తప్పులు వెతకడమంటే గొంగళిలో వెంట్రుకలు వెతకడం లాంటిదే. అందుకే వీటిని స్వచ్ఛీకరించడం అనడం కంటే ప్రక్షాళన చేయాలనడం సబబుగా ఉంటుంది’ అని రెవెన్యూ నిపుణులు చెబుతున్న మాటలు ఈ శాఖలో కుప్పలు తెప్పలుగా ఉన్న లోపాలకు అద్దం పడుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకలుగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన (స్వచ్ఛీకరించి) చేసి, లోప రహితంగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్లిష్టమైన ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేయాలని సర్కారు నడుం బిగించింది. ఇందులో భాగంగా ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి రాష్ట్రంలోని మొత్తం 670 మండలాల్లోని 670 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలెట్) తక్షణమే అమలు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్రామాల్లో రికార్డుల అప్డేషన్లో వచ్చే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవస రమైన మార్పులు చేర్పులతో రెండు నెలల్లోగా రాష్ట్రమంతటా రికార్డుల ప్రక్షాళన/ స్వచ్ఛీకరణ యజ్ఞాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేసింది. ఈ నెలాఖరులోగా 670 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి.. తద్వారా వచ్చిన అనుభవాలు, మార్పుచేర్పులపై నివేదికను రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్కు పంపించాలని ఆదేశించింది. సులభంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం కోసం ఆరు రకాల నమూనా పత్రాలను కూడా తహసీల్దారు కార్యాలయాలకు పంపింది. గ్రామసభలు పెట్టి అందరితో చర్చించి రికార్డులు, ఆధారాలు పరిశీలించి ఈ నమూనా పత్రాలను నింపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను నియమించింది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఇవీ.. – వారసత్వంగా తమ తండ్రి నుంచి తమకు రావాల్సిన భూమిని కూడా తమకు ఆన్లైన్, మ్యుటేషన్ చేయడం లేదని కొందరు.. తమ తండ్రి భూమిని వేరేవారు అక్రమంగా నకిలీ పాసుపుస్తకాలతో ఆక్రమించారని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు. – కొన్ని ప్రాంతాల్లో చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఆన్లైన్ కావడంలో ఇబ్బందులు, పాసు పుస్తకం చేతికి అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. – మరి కొద్దిమంది అయితే.. నమ్మకంతో రిజిస్ట్రేషన్ లేకుండానే కేవలం అగ్రిమెంటు ప్రకారం భూమిని కొనుగోలు చేశారు. దీనిని సాధారణంగా సాదాబైనామాగా పేర్కొంటారు. అయితే, తమ పేరు మీద చట్టప్రకారం రిజిస్ట్రేషన్ కాకపోవడంతో పాసుపుస్తకం రాక ఇబ్బందులు పడుతున్న వారు మరికొందరు. – కొన్ని ప్రాంతాల్లో ఉన్న భూమి సబ్డివిజన్ చేసి పంపకాలు జరిగి ఉంటాయి. అయితే, ఇవి రికార్డుల్లోకి ఎక్కకుండా కేవలం నోషనల్గానే ఉన్నాయి. అయితే, రికార్డుల్లోకి ఎక్కకపోవడంతో ఆన్లైన్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. – కొన్నిచోట్ల ఒకే పేరు మీద వివిధ ఖాతా నంబర్లు ఉంటున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి ఒకే ఖాతా నంబరు ఉండాలి. సదరు వ్యక్తికి ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉన్నప్పటికీ ఖాతా నంబరు మాత్రం ఒక్కటే ఉండాలి. అయితే, అనేక ప్రాంతాల్లో డూప్లికేట్ ఖాతా నంబర్లతో ఒకే భూమికి ఇద్దరు, ముగ్గురు పేర్లతో దొంగ పాసుపుస్తకాలు పుట్టించుకుని నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – అన్నింటికీ మించి.. రెవెన్యూ సిబ్బంది మాయతో అనేక ప్రాంతాల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే అదనంగా పాసుపుస్తకాల్లో భూమి రికార్డు అయ్యింది. తద్వారా వెబ్ల్యాండ్లో ఉన్న భూ విస్తీర్ణానికి, ఆర్ఎస్ఆర్ (రెవెన్యూ సర్వీసు రికార్డ్)కు మధ్య వ్యత్యాసం వస్తోంది. – ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా, ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో రికార్డులున్న సంఘటనలు అనేకం. – వివిధ కారణాల వల్ల భూ యాజమాన్య హక్కు పత్రాలు లేకుండానే వంశపారంపర్యంగా భూములను అనుభవిస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆరు నమూనా పత్రాలతో మార్గదర్శకాలు 1. వారసుల పేరుతో మార్పు (చనిపోయిన పట్టాదారు పేరు, ఇతర వివరాలకు సంబంధించి మొత్తం పది కాలంలు పెట్టారు. ఈ నమూనా పత్రం ప్రకారం మృతుల పేర్లతో ఉన్న భూములను వారి వారసుల పేర్లతో మ్యుటేషన్ చేస్తారు.) 2. భూమి కొనుగోలు చేసిన వారి పేరుతో మార్పు (అమ్మిన వ్యక్తి పేరుతో ఉన్న భూమిని కొనుగోలు చేసిన వారి పేరుతో మార్చడం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా గ్రామంలో విచారించి కొనుగోలుదారుల పేర్లతో అడంగల్, 1బీలో మార్పులు చేస్తారు. ఇందుకోసం గత అయిదేళ్లలో జరిగిన క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ వివరాలను తహసీల్దార్లకు పంపించాలని ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే గత 20 ఏళ్ల రిజిస్ట్రేషన్ డేటా కూడా పంపాలని కూడా ఆదేశించింది. ఈ వివరాల ప్రకారం విచారించి మ్యుటేషన్లు చేస్తారు.) 3. వారసత్వం, రిజిస్ట్రేషన్ ద్వారా కాకుండా ఇతరత్రా మ్యుటేషన్లు (ఆధారాలను పరిశీలించి గ్రామసభలో చర్చించి అనుభవదారు/ పిటిషనర్ పేరుతో భూమిని మ్యుటేషన్ చేస్తారు. సాదాబైనామా కింద అంటే.. రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం అగ్రిమెంట్ ద్వారా జరిగిన భూ లావాదేవీలను పరిష్కరించడం.) 4. ఒక వ్యక్తి పేరుతో ఒకే ఖాతా (ఒక వ్యక్తి పేరుతో రెండు మూడు ఖాతాలు ఉంటే తొలగించి ఒకే ఖాతాగా మార్పు చేస్తారు. గ్రామ సభలో చర్చించి పట్టాదారుకు నోటీసు జారీ చేసి, నిబంధనల ప్రకారం డూప్లికేట్ ఖాతాలను తొలగిస్తారు.) 5. శాశ్వత ఖాతాలుగా మార్పు (వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో 10 లక్షలకు పైగా తాత్కాలిక (నోషనల్) ఖాతాలు ఉన్నాయి. వీటిని శాశ్వత ఖాతాలుగా మారుస్తారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులందరూ తమ పరిధిలోని గ్రామాల్లో తాత్కాలిక ఖాతాలన్నింటినీ శాశ్వత ఖాతాలుగా మార్చడానికి తహసీల్దారుకు ప్రతిపాదనలు ఇవ్వాలి. అనంతరం తహసీల్దారు వీటిని శాశ్వత ఖాతాగా మార్పు చేస్తారు.) 6. భూ విస్తీర్ణం తేడాల్లో మార్పు (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), వెబ్ల్యాండ్ అడంగల్/ మాన్యువల్ అడంగల్ మధ్య భూమి విస్తీర్ణం చాలా సర్వే నంబర్లలో తేడా ఉంది. దీని ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తహసీల్దారుకు నివేదిక ఇచ్చిన అనంతరం సరిచేస్తారు.) గ్రామ సభల్లో ఇలా.. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఆరు రకాల నమూనా పత్రాలను పంపిన ఉన్నతాధికారులు గ్రామసభల్లోనే వీటిని పూరించాలని పేర్కొన్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను స్పష్టంగా వివరించారు. ఏ తేదీన ఏ రెవెన్యూ గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తారో ముందుగా తెలియజేస్తారు. రెవెన్యూ రికార్డులను ఆ గ్రామానికి తీసుకెళ్లి సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, అది ఎవరి పేర్లతో ఉందో చదువుతారు. మార్పులు, చేర్పులు ఎవరైనా కోరితే వారి వద్ద ఉన్న ఆధారాలు తీసుకుని గ్రామ సభలో చర్చిస్తారు. అనంతరం ఆర్ఎస్ఆర్లో ఉన్న భూ విస్తీర్ణానికి, వెబ్ల్యాండ్లో ఉన్న భూ విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం లేకుండా వాస్తవ భూ విస్తీర్ణానికి అనుగుణంగా రికార్డులను సరిచేస్తారు. ఈ గ్రామ సభలకు గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దారు/ తహసీల్దారు హాజరవుతారు. పైలెట్ ప్రాజెక్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేప్పుడు తహసీల్దార్ నేతృత్వంలో ఒక బృందం, డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన మరో బృందం వేర్వేరు గ్రామాలకు వెళతాయి. – వైస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం 15–20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఇప్పటికీ అడంగల్లో ఈ భూమి ప్రైవేట్ వ్యక్తి పేరుతోనే ఉంది. – గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో వందలాది ఎకరాల పట్టా భూములు ప్రైవేట్ వ్యక్తులవి అయినప్పటికీ అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు. – వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం అనంత సముద్రం గ్రామంలో ఒకే సర్వే నంబరులోని ఒకే భూమికి ఓబుల గంగిరెడ్డి (పట్టా నంబరు 514), హెచ్.చంగమ్మ (పట్టా నంబరు 537) పట్టాదారులుగా ఉన్నారు. – రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకంలోని భూ విస్తీర్ణం కంటే అడంగల్లో 16 లక్షల ఎకరాలకు పైగా అధిక భూమి ఉంది. అంటే లేని భూమి ఉన్నట్లు నమోదు చేశారు. – శ్రీకాకుళం జిల్లాలోని 95 గ్రామాల్లో అధికారులు సర్వే చేయగా ఒక్కో గ్రామంలో 40 నుంచి 80 శాతం వరకు తప్పులు ఉన్నట్లు తేలింది. – రాష్ట్రంలో మొత్తం భూ కమతాలు, సబ్ డివిజన్ల మధ్య 77 లక్షల భారీ వ్యత్యాసం ఉంది. కష్టమైనా సరే చేయాల్సిందే.. భూముల సమగ్ర రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాలంటే ముందుగా భూ రికార్డులు సరిదిద్దాలి. ఇందుకోసమే ప్రక్షాళన చేయాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశాం. దశాబ్దాలుగా బూజుపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సులభమైన ప్రక్రియ కాదు. కానీ, ఎంత కష్టమైనా ప్రజల కోసం ఈ మార్పు చేయాలనుకున్నాం. రాష్ట్రమంతా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. క్షేత్ర స్థాయిలో వచ్చే సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలతో ముందుకెళ్లేందుకే ఒక్కో మండలంలో ఒక్కో రెవెన్యూ గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆ తర్వాత రాష్ట్రమంతటా రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ చేపడతాం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. – పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి -
8,500 కోట్లతో గోదావరి జిల్లాలకు వాటర్ గ్రిడ్
సాక్షి, తూర్పుగోదావరి: ఉభయగోదావరి జిల్లాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 8,500 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వాటర్ గ్రిడ్ విధివిధానాలపై చర్చించేందుకు ఉభయగోదావరి జిల్లాల మంత్రులు మంగళవారం రాజమండ్రిలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా వాటర్ గ్రిడ్ పూర్తయ్యాలా చర్యలు తీసుకోవాలని.. వాటర్ గ్రిడ్ అమలులో పూర్తి బాధ్యత అధికారులదేనని తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకానికి కన్సల్టెన్సీల పేరుతో రూ.38 కోట్లు వృధా చేసిందని విమర్శించారు. అనుభవజ్ఞులైన అధికారులతో వాటర్ గ్రిడ్ పనులు సమర్ధవంతంగా చేపడతామని వెల్లడించారు. 2051 సంవత్సరం వరకూ సరిపడేలా స్వచ్ఛ మైన గోదావరి జలాలు అందించడమే లక్ష్యంగా పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది జిల్లాలకు డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబాబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, అనురాధ, జక్కంపూడి రాజా, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధర్రెడ్డి, ముత్యాలరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం.. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బాధిత కుటుంబానికి పది కేజీల వంతున బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలు చేపట్టిందన్నారు. -
ఇది చంద్రబాబు కడుపు మంట
పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, యువతకు ఉద్యోగాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? – టీడీపీకి ఉప ముఖ్యమంత్రుల ప్రశ్న సాక్షి, అమరావతి : చెరువులో చేప ఒడ్డున పడితే ఎలా గిలగిల లాడుతుందో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్చంద్ర బోస్, పాముల పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని, కళత్తూరు నారాయణస్వామి, షేక్ బేపారి అంజాద్ బాషలు మండిపడ్డారు. ప్రజా రంజకంగా సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై కరపత్రం విడుదల చేసి లేని పోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అర్ధంతరంగా పారిపోయి వచ్చిన తుగ్లక్ చంద్రబాబు అని, ఆయన ప్రకటించిన చార్జిషీటులో నిజాలేమైనా ఉన్నాయా? అని నిలదీశారు. అధికారం పోయిందన్న కడుపు మంట చంద్రబాబుకు ఎంత ఉందో వారి కరపత్రం చూస్తే తెలుస్తోందన్నారు. ‘నా ఇల్లు ముంచేశారు.. నేను కట్టిన ప్రజా వేదికను కూల్చేశారు..’ అనే రెండు మాటలే మూడు నెలలుగా చంద్రబాబు నోట వెలువడుతున్నాయన్నారు. టీడీపీ కరపత్రం మొదట్లోనే అక్రమ కట్టడాన్ని కూల్చిన ఫొటో వేశారని వారు తప్పు పట్టారు. అందులోని అంశాల వారీగా స్పందిస్తూ శనివారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ఏడాది కూడా శ్రీశైలం, నాగా ర్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండలేదన్న నిజాన్ని కరపత్రంలో ఇవ్వకుండా దాచారని తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికులకు జగన్ ప్రభుత్వం మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని పేర్కొ న్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ లంచాల కోసం చంద్రబాబు విద్యుత్ సంస్థలకు దాదాపు రూ.20 వేల కోట్లు నష్టం తీసుకు వచ్చాడన్న విషయాన్ని మీడియా ఎందుకు రాయడం లేదని వారు ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లకు చంద్రబాబు ప్రభుత్వం పైసా విడుదల చేయలేదని స్పష్టీకరించారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? అమ్మ ఒడి స్కీం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఐదేళ్లలో బాబు ఏ తల్లికి అయినా రూపాయి ఇచ్చారా? అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు నిలిపివేశారన్నారే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1500 కోట్లని చెప్పిన చంద్రబాబు మిగతా సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018కే గ్రావిటీపై నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న మాట ఏమైంది? టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం నిజం కాదా? చంద్రబాబు తన అవినీతి బయటపడుతుందని రివర్స్ టెండరింగ్ విధానాన్ని వ్యతిరేకించారు. పోలవరం డ్యాం భద్రత ప్రశ్నార్థకం అయ్యిందని చార్జిషీటులో రాశారు. సిమెంటు, ఇనుముతో చంద్రబాబు పునాదుల నుంచి సవ్యంగా కడితే దాని భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదు. మరి ఆ డబ్బు తినేసి బూడిదతో కట్టారా? 2014 జూన్ 8నే రుణమాఫీ చేసేశామని చంద్రబాబు చెప్పారు కదా? రుణ మాఫీ చేసి ఉంటే బకాయిల ప్రస్తావన ఎందుకొస్తుంది? రూ.87,612 కోట్ల అప్పులను రూ.24,500 కోట్లకు కుదించి చివరకు అందులోనూ రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టడం వాస్తవం కాదా? మీరు నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించడం నిజం కాదా? వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏకంగా 4.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుండటం నిజం కాదా? అసెంబ్లీ సమావేశాలు పూర్తికాకుండానే అమెరికా పారిపోయిన చంద్రబాబు తనకు మైకు ఇవ్వలేదని ఎందుకు మాట్లాడుతున్నారు? పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు వంద శాతం ఫీజు రియింబర్స్మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్కు సంబంధించిన జీవోను పట్టుకుని బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేసే వ్యూహం అంటూ ప్రచారం చేయడం దిగజారుడుతనం కాదా? ఉప ముఖ్యమంత్రుల ప్రతికా ప్రకటన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే’
సాక్షి, అమరావతి : ల్యాండ్ సర్వే సక్రమంగా లేని కారణంగా అనేక వివాదాలు నెలకొంటున్నాయని, రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బిల్డింగ్ న్యూ ఇండియా లేవరేజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీ వర్క్షాప్లో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ 111 సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం సర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరణాల వ్యవస్థ ఉన్నప్పుడు భూమి రికార్డ్స్ సక్రమంగా ఉండేవని, 1983 ఎన్టీఆర్ హయాంలో కరణం వ్యవస్థ రద్దు కారణంగా రికార్డుల నిర్వహణ నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెవెన్యూశాఖ ద్వారా భూములు ఎన్ని ఉన్నాయనే దానిపై సర్వే చేస్తున్నామని, సర్వే చేసిన వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని తెలిపారు. ‘సాక్ డిపార్ట్మెంట్ ద్వారా భూములు సర్వే చేస్తున్నాం. వ్యవసాయరంగానికి ఈ సర్వే ఉపయుక్తంగా ఉంటుంది. భూగర్భజలాలు పెంపొందించుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఐటీ శాఖ ఈ సర్వేకి సహకారం అందిస్తోందని’ మంత్రి వివరించారు. -
ఇళ్ల స్థలాల కేటాయింపుపై మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లు, జర్నలిస్టులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం పల్లి సుభాష్ చంద్రబోస్ను నియమించింది. సభ్యులుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జోవో జారీ చేసింది. పుజారులు, ఇమామ్లు, పాస్టర్లకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాల్సిందిగా ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశించింది. -
పరిష్కార సూచిక... డీఆర్సీ వేదిక
సాక్షి, కాకినాడ : చాలా కాలం తరువాత జిల్లాలో కీలకమైన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి విధానపరంగా తీసుకున్న మౌలిక నిర్ణయాలకు డీఆర్సీ వేదికైంది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కసారి కూడా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేసిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు తిరగకుండానే తొలి డీఆర్సీని నిర్వహించడం విపక్ష సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ అధికార, ప్రతిపక్ష సభ్యులు తీసుకువచ్చిన సమస్యలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన డీఆర్సీ సుదీర్ఘంగా తొమ్మిది గంటలపాటు సాయంత్రం 6.30 గంటల వరకు జరగడం ఒక రికార్డే. శాఖల సమీక్ష అంటే మొక్కుబడిగా నిర్వహించే గత టీడీపీ సర్కార్ సంస్కృతికి భిన్నంగా ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన ప్రతి అంశంపై లోతుగా చర్చించి నిర్దేశిత గడువులోగా పరిష్కార మార్గాన్ని కూడా మంత్రులు సూచించడంతో విపక్షం నోరెత్తలేని పరిస్థితి కనిపించింది. తొలిసారి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలపై డీఆర్సీలో గళం వినిపించేందుకు పోటీపడ్డారు. విపక్షాలకు అవకాశం ఇస్తూ... సమస్యలపై చర్చలో పాల్గొనే అవకాశాన్ని కోరినంత సేపు విపక్ష టీడీపీ సభ్యులకు కూడా ఇవ్వడం ద్వారా తమది పూర్తి పారదర్శక ప్రభుత్వమనే విషయాన్ని మంత్రులు నొక్కి చెప్పారు. పది శాఖలను అజెండాలోకి తీసుకువచ్చారు. శుక్రవారం ఎలాగూ వైద్య ఆరోగ్యశాఖపై రోజంతా సమీక్ష ఉండటంతో ఆ శాఖ సమీక్షను డీఆర్సీ నుంచి మినహాయిస్తున్నట్టు జిల్లా ఇన్చార్జి మంత్రి నాని ముందుగానే సభ్యుల దృష్టికి తీసుకు వచ్చారు. మిగిలిన వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, గృహనిర్మాణం, సాంఘిక సంక్షేమం, జిల్లా గ్రామీణాభివృద్ధి, మైనింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా, పౌర సరఫరాలు తదితర శాఖలపై లోతైన సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా జరిగిన పంట నష్టంపై ఎకరాకు రూ.25 వేలు డిమాండ్ చేస్తున్న చంద్రబాబు తీరును మంత్రి కన్నబాబు తూర్పారబట్టారు. రూ.2469 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు ఇప్పుడు ఇలా మాట్లాడటాన్ని మంత్రి నిలదీశారు. పంటలు ఆలస్యం కావడంతో ముందస్తు రబీపై ఆలోచన చేయాలనే అంశాన్ని చర్చించారు. స్థానిక రైతులు సంతృప్తి చెందాకనే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలని వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు సూచనతో రైతులకు ఎంతగానో మేలు జరగనుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీపై అవగాహన కలిగిన మంత్రి సుభాష్చంద్ర బోస్ వేమగిరిలో నిల్వ ఉన్న 16 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకపై చర్చ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డికి విష్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇసుక విశాఖలో నేవీకని చెప్పి అనుమతి కోసం తన వద్దకే కొందరు రావడం, తాను తిరస్కరించిన విషయాలను ఎక్కడా దాచుకోకుండా సమావేశం దృష్టిలో పెట్టడం విశేషం. ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఆర్సీకి పిలవలేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమావేశం దృష్టికి తీసుకువచ్చినప్పుడు డీఆర్సీనే నిర్వహించలేదని టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గత సర్కార్ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. అందుకే ఐదేళ్లు మీ ప్రభుత్వంలో దుర్మార్గమైన పాలన సాగించారని, మూడు నెలలు తిరగకుండానే వైఎస్సార్సీపీ డీఆర్సీ నిర్వహిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ టీడీపీ ఎమ్మెల్యేలకు చురక అంటించారు. కమీషన్ల కోసం పర్యావరణ అనుమతి లేకున్నా లెక్క చేయకుండా రూ.2,600 కోట్లతో చంద్రబాబు చేపట్టిన పురుషోత్తపట్నం పథకంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు తీరుపై అధికారపక్షం దాడిని కనీసంగా టీడీపీ సభ్యులు నిలువరించలేక చేతులెత్తేయక తప్పింది కాదు. మీలా కాదండీ... మండలి డిప్యుటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వైఎస్సార్ రైతు భరోసా పథకంలో ఇచ్చే రూ.12,500 రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందా అని ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. వాస్తవాలే చెబుతాం, మీలా కేంద్ర నిధులతో నడిచే 27 పథకాలకు చంద్రబాబు పేర్లు పెట్టుకోలేదంటూ మంత్రులు నాని, కన్నబాబు, విశ్వరూప్లు దీటుగా బదులిచ్చారు. తమ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏ పథకానికి ని«ధులు ఇస్తే వాటికి మాత్రమే రైతుల గుండె చప్పుడైన మహానేత వైఎస్ పేరు పెట్టిన విషయాన్ని తెలియచేయడం ద్వారా విపక్ష టీడీపీ నేతల మాటలకు ముకుతాడు వేశారు. ఆళ్ల నాని తొలిసారి మంత్రి అయినప్పటికీ ఇంత పెద్ద జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా జిల్లా సమీక్షా మండలి సమావేశాన్ని సమయస్ఫూర్తితో నిర్వహించారు. నానితో కలిసి జిల్లా మంత్రులు, ప్రభుత్వ విప్ హోదాలో తొలిసారి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా డీఆర్సీని సమన్వయంతో ముందుకు నడిపించి ప్రతిపక్ష సభ్యుల విమర్శలను దీటుగా తిప్పికొట్టి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను వివరించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా డీఆర్సీ సమావేశ లక్ష్యం నెరవేరినట్టయ్యింది. ప్రధానంగా ఎత్తిపోతల పథకాలు, శివారు భూములకు సాగునీరు, డ్రైన్లు ఆధునికీకరణ వంటి అంశాలపై నీటిపారుదలశాఖా మంత్రితో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. కాలువల క్లోజర్ పనులు చేయాలంటే ఇప్పుడు ముందస్తు రబీకి వెళ్లడమే మేలనే అభిప్రాయం వచ్చింది. హాస్టళ్ల నిర్వహణపై గత టీడీపీ సర్కార్కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని మంత్రి విశ్వరూప్ గణాంకాలతో వివరించడంతో అప్పటి వరకూ హాస్టళ్లపై విమర్శలు చేసిన విపక్షానికి నోటమాట రాలేదు. ఇసుక విధానం వెలువడే వరకూ జిల్లాలో సీజ్ చేసిన ఇసుకను స్థానిక ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని, దొంగ పర్మిట్లతో ఇతర ప్రాంతాలకు తరలించే మాఫియాను నిరోధించాలని అధికార, విపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మురళీథర్రెడ్డికి డీఆర్సీ వేదికగా పలు సూచనలు చేశారు. -
రెండు నెలల్లో రికార్డుల ప్రక్షాళన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తప్పుల తడకలుగా ఉన్న భూ రికార్డులను రెండు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్ నుంచి బుధవారం జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులందరికీ ఉగాది రోజున నివాస స్థల పట్టాల పంపిణీ, భూముల సమగ్ర రీసర్వే అనేవి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యమైన పథకాలని ఉప ముఖ్యమంత్రి వివరించారు. భూముల రీసర్వే చేయడానికి ముందే భూ రికార్డులను పూర్తిగా అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), వెబ్ల్యాండ్ మధ్య భూముల విస్తీర్ణంలో భారీ తేడా ఉందని, చాలా చోట్ల చనిపోయిన వారి పేర్లతోనే భూములు ఉన్నాయని వివరించారు. కొన్నిచోట్ల వాస్తవ విస్తీర్ణానికి, రికార్డుల్లో ఉన్న గణాంకాలకు పోలిక లేదన్నారు. రీసర్వే చేయాలంటే వీటన్నింటినీ ముందుగా సరిదిద్దాల్సి ఉంటుందని తెలిపారు. రికార్డుల స్వచ్చికరణకు మార్గదర్శకాలతో (ఫార్మట్తో సహా) రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి నెల రోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మండలాలకు ఒకటి చొప్పున ఆధునిక స్టోరేజీ గదుల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రికార్డులు స్వచ్ఛీకరించేప్పుడు తప్పులు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే మార్పులు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్, సీసీఎల్ఏ కార్యదర్శి చక్రవర్తి ఆదేశించారు. -
అర్హులకు ఏదీ దక్కనివ్వలేదు..!
సాక్షి, తూర్పుగోదావరి: కుల, మత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హామీ ఇచ్చారు. జిల్లాలోని మండపేటలో ఆదివారం జరిగిన గ్రామ వలంటీర్ల సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీలు చాలా అరాచకాలు చేశాయని విమర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు ఫించను, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ సదస్సులో మంత్రి వెంట ఎంపీ చింత అనురాధ ఉన్నారు. -
వరద బాధితులను ఆదుకున్న మంత్రులు
సాక్షి, పశ్చిమగోదావరి : అసలే గోదావరి నది.. ఆపై జూలై, ఆగస్టు నెలలు వచ్చాయంటే వరద గోదావరిగా మారుతుంది. ఈ ఏడాది అదే జరిగింది. వరద గోదావరి నదీ పరీవాహ ప్రాంతాలను ముంచెత్తింది. అయితే ఎప్పటిలానే వరదను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నాయకులు కదిలారు. కానీ గతంలో చేసిన ఏర్పాట్లకంటే భిన్నంగా... ఎన్నడూ చేయని విధంగా ప్రభుత్వం కదిలింది. వరద బాధితులను ఆదుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధితులకు మేమున్నామంటూ అండగా నిలబడ్డారు. జూలై 30వ తేదీ అర్ధరాత్రి గోదావరి ఉగ్రరూపం దాల్చనుందని జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. 31వ తేదీ ఉదయమే జిల్లా అధికారులు స్పందించారు. వరదను ఎప్పటికప్పుడు అంచాన వేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరద హెచ్చరికలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఈ విపత్తు ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రతి గ్రామానికి ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రత్యేకాధికారులు వరద వచ్చే ప్రాంతాలకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. స్పందించిన నాయకులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన రోజే వర్షంలోనే ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, స్థానిక శాసన సభ్యులు తెల్లం బాలరాజులతో కలిసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ ముంపు ప్రాంతాలకు గోదావరిలో పడవలపై ప్రయాణించారు. ముంపునకు గురయిన కుటుంబాలను అధైర్యపడొద్దు అంటూ, అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అప్పటికప్పుడే బియ్యం, కిరోసిన్, పంచదార, కందిపప్పు అందచేశారు. వారికి కావాల్సిన మందులు, జనరేటర్లు, టార్ఫాలిన్లు సిద్ధం చేశారు. వశిష్టగోదావరి వరదకు ఆచంటలోని లంకగ్రామాలు ముంపునకు గురై తే గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రోజూ లంక గ్రామాలకు వెళ్లా రు. ప్రభుత్వం ఇస్తున్న సాయానికి అదనంగా సొంత డబ్బుతో కుటుంబానికి 10 కిలోల బి య్యం చొప్పున 180క్వింటాళ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి తక్షణ స్పందన గోదావరి వరదపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణం స్పందించారు. ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా పోలవరం చేరుకుని ఏరియల్ సర్వే చేశారు. రాజమండ్రి విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.5వేలు పరిహారం ప్రకటించారు. తక్షణం బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు. అధికారులు అక్కడే కలెక్టర్ రేవు ముత్యాలరాజు ముంపు గ్రామాల్లో పర్యటించారు. జేసీ వేణుగోపాల్రెడ్డి నిత్యం పర్యవేక్షించారు. ఐటీడీఏ పీఓ ఆర్వీ సూర్యనారాయణ రోజూ ఏర్పాట్లు పరిశీలించారు. ఆర్డీఓ శివ నారాయణరెడ్డి ఏర్పాట్లు చేశారు. డెల్టాలో నరసాపురం ఆర్డీఓ సలీంఖాన్ ముంపు గ్రామాల్లో పరిస్థితులు చక్కబెట్టారు. కలెక్టర్, జేసీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులు, వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండి నిరంతరం పర్యవేక్షించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. సహాయం మరువలేనంత బాధితులకు ప్రభుత్వం రూ.5వేల సహాయంతో పాటుగా తక్షణమే కిరోసిన్, బియ్యం, టార్పాలిన్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పామాయిల్, ఉప్పు, మంచినీటి ప్యాకెట్లు అందించింది. ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. -
అదనంగా రూ.5,000
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా మరో రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. వరద ప్రాంతాల్లో గిరిజన గ్రామాలే అధికంగా ఉన్నందున వారి జీవనోపాధి దెబ్బతినడంతో అదనంగా సాయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న సాయంతోపాటు అదనంగా రూ.5 వేలను అందచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అదనంగా అందచేస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచే నేరుగా హెలికాప్టర్లో పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని పరిశీలించారు. దేవీపట్నం, పోలవరం తదితర గిరిజన గ్రామాలతోపాటు గోదావరి పరీవాహక లంక గ్రామాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం సహాయక చర్యలపై రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు అదనంగా ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం తెలిపారు. కూలిన ఇళ్లు, పంట నష్టానికి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు అదనంగా ఐదు వేల రూపాయల చొప్పున సాయం కూడా అందించనున్నట్లు ప్రకటించారు. నష్టపరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు ముంపు ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలున్నాయని, వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బ తిన్నందున మానవతా దృక్పథంతో అదనంగా ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ చెప్పారు. వరదల వల్ల సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలకు వెంటనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు కూడా సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన పంటలు వరదల కారణంగా దెబ్బతింటే వాటికి కూడా పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. వేగంగా పునరావాస కార్యక్రమాలు.. ధవళేశ్వరం ఎగువన ఉన్న దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గోదావరిలో 10 నుంచి 11 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేది కాదని, ఈసారి మాత్రం ముంపు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు పెరిగిందని మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా పోలవరం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదలకు గురయ్యే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం నియమించిన ఐఏఎస్ అధికారి తక్షణమే బాధ్యతలు చేపట్టి పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్కుమార్ యాదవ్, రంగనాధరాజు, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెల్లుబోయిన వేణు, శ్రీనివాసరావు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు డి.మురళీధర్ రెడ్డి, ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాల్లో పర్యటన అనంతరం తిరిగి 4 గంటల సమయంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంను ఇంటి వద్ద కలిశారు. సాయం ఇలా.. పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు అదనంగా రూ.5 వేల చొప్పున సాయం. కూలిన ఇళ్లు, పంట నష్టానికి నిబంధనల ప్రకారం పరిహారంతోపాటు అదనంగా ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం. ముంపు గ్రామాల్లో వెంటనే నిత్యావసర సరుకుల పంపిణీ పంటలు కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు పోలవరం కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన వారికి కూడా పరిహారం, ఉచితంగా విత్తనాల సరఫరా -
త్వరలోనే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులేవి సరిగా లేవు.. వాటి ప్రక్షాళనతో పాటు భూముల రీ-సర్వే కూడా చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ రికార్డుల వ్యవస్థ జీవచ్ఛవం అయిందన్నారు. దానిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భూముల రీ-సర్వేకు అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. రీ-సర్వే చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రీ-సర్వేకు ఎంత ఖర్చయిన ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్గా రీ-సర్వేను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి మొదలు పెడతామని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ‘వ్యవసాయ సాగుదారుల హక్కు చట్టం’ వల్ల భూ యజమానులకు కానీ, కౌలుదార్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు సుభాష్ చంద్రబోస్. ఇది యజమానులకు, కౌలుదారులకు మేలు చేకూర్చే చట్టమని తెలిపారు. త్వరలోనే వ్యవసాయ శాఖ సమన్వయంతో ఈ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ తెచ్చామన్నారు. దీన్ని పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి నివాస స్థలాలివ్వడం తమ ప్రభుత్వ లక్ష్యమని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పేదల ఇళ్ల కోసం ఎంత స్థలం కావాలో వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమని సేకరిస్తాం.. అవసరమైతే కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. -
వరదపై ఆందోళన వద్దు
మండపేట/సాక్షి, అమరావతి బ్యూరో: గోదావరి వరదపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ తెలిపారు. రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 13 వేల మందికి పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. పోలవరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 26 మీటర్లు ఉందని, 35 మీటర్ల వరకూ పెరిగినా ఇబ్బంది లేదని చెప్పారు. రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న దేవీపట్నం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. రాకపోకలకు వీలు లేని గ్రామాల ప్రజలకు ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, పప్పులు, పంచదార, నూనె, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముంపు సమస్య తలెత్తకుండా గోదావరి జిల్లాల్లోని డ్రైన్లలో యుద్ధప్రాతిపదికన గుర్రపుడెక్క తొలగించాల్సిందిగా అధికారులను ఆదేశించా మన్నారు. సోమవారం సాయంత్రానికి వరద తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వరదపై పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలు ముమ్మరం హోంమంత్రి మేకతోటి సుచరిత గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది బేసిన్లోకి వస్తున్న వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపుకు గురైనట్లు వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీలోకి 13,43,836 క్యూసెక్కుల నీరు వస్తే అదే స్థాయిలో కిందికి వదులుతున్నామని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేసినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్ అధికారులను ముంపు ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. శాటిలైట్ ఫోన్లు, డ్రోన్ కెమేరాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 17,632 మందిని 32 పునరావాస కేంద్రాలకు తరలించామని, 35,264 భోజనం ప్యాకెట్లు, 1,61,056 మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. పశ్చిమ గోదావరిలో 36,004 టన్నుల బియ్యం, 7,420 లీటర్ల కిరోసిన్, 3,710 కిలోల కంది పప్పు, 3,710 లీటర్ల పామాయిల్, 3,710 కిలోల ఉల్లిపాయలు, 3,710 కిలోల ఆలుగడ్డలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రతిదానినీ రాజకీయ కోణంలో చూడవద్దని మాజీ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. -
పుకార్లు నమ్మొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది!
సాక్షి, తూర్పుగోదావరి: దేవీపట్నం వరద బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించామని.. ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆయన ఆదివారం జిల్లాలోని మండపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు వరదలపై ఎటువంటి భయాందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. ఎటువంటి పుకార్లు నమ్మవద్దని.. వరద ప్రభావిత ప్రాంతాలకు సరుకులు, బియ్యం, పప్పులు, కిరోసన్, మెడిసిన్ అందజేస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు.. రెవెన్యూ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా పోలవరం డ్యాం దగ్గర ఇరవై ఆరు మీటర్ల వరకు వరద నీరు ఉందని వెల్లడించారు. దీంతో రేపటివరకు వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. దీంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.