'బాబు నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు' | ap congress leadres meet governer narasimhan today | Sakshi
Sakshi News home page

'బాబు నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు'

Apr 29 2015 12:26 PM | Updated on Aug 18 2018 8:49 PM

'బాబు నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు' - Sakshi

'బాబు నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు'

ఆంధ్రప్రదేశ్ లోఉపాధ్యాయ నియామకాలు, రైతాంగ సమస్యలను చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోఉపాధ్యాయ నియామకాలు, రైతాంగ సమస్యలను చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాగా ఇదే విషయమై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతలు బుధవారం గవర్నర్ నరసింహన్ ను కలిసారు. ఏపీలో సమస్యల పరిష్కారం కోసం జోక్యం చేసుకోవల్సిందిగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కోరారు. అనంతరం రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు పంటబీమా, ఇన్పుట్ సబ్బిడీ చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. బాబు సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement