
సాక్షి, అమరావతి : కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకై సాధ్యఅసాధ్యాలు పరిశీలించేందుకంటూ కమిటీ వేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. స్టీల్ ఫ్యాక్టరీ విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చించనుంది. గతంలో రెండు నెలల్లోనే స్టీల్ ప్లాంట్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, కాలాయాపన చేసేందుకే కమిటీ అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment