హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా | AP Health Minister Kamineni Srinivas visits Old Government Hospital in vijayawada city | Sakshi

హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా

Dec 17 2014 11:12 AM | Updated on Aug 18 2018 8:10 PM

హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా - Sakshi

హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం విజయవాడలోని పాత ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం విజయవాడలోని పాత ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యులు సమయానికి ఆసుపత్రి రావడం లేదన్న విషయాన్ని కామినేని గుర్తించారు. ఈ విషయంపై ఆసుపత్రి ఆర్ఎంవోను నిలదీశారు. దాంతో ఆయన నీళ్లు నమిలారు.

దీంతో ఆగ్రహించిన కామినేని ఇలాంటి చర్యలు పునరావృతమైతే క్షమించేది లేదని మండిపడ్డారు.  మొత్తం 13 మంది వైద్యుల్లో 9 మంది విధులకు హాజరుకాలేదని మంత్రి కామినేని గుర్తించారు. వారందరికి ఛార్జి మెమో ఇవ్వాలని ఆర్ఎంవోను ఆదేశించారు. రికార్డులను కూడా కామినేని తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement