ఏపీఎన్జీవోలు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు | APNGOs provoking telangana people, allegates Eetela Rajendar | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీవోలు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు

Published Wed, Sep 4 2013 12:32 PM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

APNGOs provoking telangana people, allegates Eetela Rajendar

ఏపీఎన్జీవోలు సభల పేరుతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతాంగా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ వేళ విభజిస్తే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల మీడియా కథనాలు వెలువరించింది.

 

ఈ నేపథ్యంలో ఈటెల పై విధంగా స్పందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను శనివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఆ సభకు కిరణ్ సర్కార్ అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు టిఎన్జీవోలు నగరంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement