విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం | Ashram School Top Roof Collpase in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Wed, Dec 19 2018 12:46 PM | Last Updated on Thu, Jan 3 2019 12:14 PM

Ashram School Top Roof Collpase in Visakhapatnam - Sakshi

కింద పడిన శ్లాబు పెచ్చులను పరిశీలిస్తున్న ఎంఈవో అమృత్‌కుమార్‌

విశాఖపట్నం , నాతవరం(నర్సీపట్నం): మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల  భవనం శ్లాబుపెచ్చులూడి పడ్డాయి. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. వివరాలు ఇలా ఉన్నాయి  ఈ పాఠశాల భవనాలు చాలా కాలంగా  శిథిలావస్థలో ఉన్నాయి.శిథలమైన  భవనంలో   తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ  ఆశ్రమ పాఠశాలలో   201 మంది విద్యార్థులు చదువుతున్నారు.  పెథాయ్‌ తుపాను కారణంగా   రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా  మంగళవారం శ్లాబు పెచ్చులూడి కిందపడ్డాయి. తరగతులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంఈవో తాడి అమృత్‌కుమార్‌ పాఠశాలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. శిథిలమైన భవనాల్లో   తరగతులు నిర్వహించరాదని హెచ్‌ఎం మణిగోల్డ్‌కు అదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడతూ 1977లో ఈ పాఠశాల భవనాలు నిర్మించారని, అవి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. కొత్త భవనాల కోసం పాడేరు ఐటీడీఏ పీవో ప్రతిపాదించినట్టు  చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement