
నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతకే భృతి
ఈ సంవత్సరం ఐదు కోట్లతో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించనున్నట్లు కార్పొరేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఏపీలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి చర్చించారు. గత ఏడాది రూ.178 కోట్లతో రాష్ట్రంలోని 8,300 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మించామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది తమ సంస్థ లక్ష్యమని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్సీ)తో కలిసి పనిచేయబోతున్నామని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి.రవి తెలిపారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.