Skill Development Center
-
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ.. మీ ప్రతిభకు తోడుగా జగనన్న ప్రభుత్వం
-
‘కాగ్’ నివేదికలోనూ.. ‘చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ ‘స్కిల్’ సిత్రాలు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ముసుగులో సాగిన కుంభకోణాన్ని రాజ్యాంగ ప్రతిపత్తిగల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు చెందిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కూడా నిగ్గుతేల్చింది. యువతకు నైపుణ్యాభివృద్ధి ముసుగులో సీమెన్స్ కంపెనీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం నడిపించిన ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలను కడిగిపారేసింది. 2015 నుంచి 2018 వరకు సాగిన ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు రికార్డులను కాగ్ 2018 మే 29 నుంచి జూన్ 22 వరకు పరిశీలించింది. అందులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండిపడిందని తేల్చింది. కాగ్ ప్రధానంగా లేవనెత్తిన అభ్యంతరాలివే.. రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లుగా.. సీమెన్స్ కంపెనీ పేరిట ప్రాజెక్టు నివేదిక రూపకల్పనలోనే చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆ ప్రాజెక్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ఆ ఒప్పందం విలువ రూ.370కోట్లు మాత్రమే. ప్రైవేటు కంపెనీ సరఫరా చేస్తామని చెప్పిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లను పరిశీలిస్తే ఆ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లుగానే లెక్కతేలిందని పేర్కొంది. కానీ, అది రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా భ్రమింపజేసేలా అంచనాలను అమాంతంగా పెంచేసి నివేదికను రూపొందించారు. దాంతోనే ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఆస్కారం ఏర్పడింది. ఇంతవరకూ లెక్కాపత్రం లేదు ఇక ప్రాజెక్టు ఒప్పందంలో భాగంగా సరఫరా చేసిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విలువ ఎంత అన్నది కనీసం నిర్థారించలేదు. నిపుణులైన ఏజెన్సీలతో నిర్థారించాలని 2017, నవంబరు 25న నిర్వహించిన ఏపీఎస్ఎస్డీసీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. కానీ, ఆ మేరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డిజైన్టెక్ కంపెనీ సరఫరా చేసిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్కు సంబంధించిన కొనుగోలు ఆర్డర్ కాపీని ఆడిట్ కోసం అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. ఖజానాకు రూ.355 కోట్ల గండి నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు రూపకల్పన, నిధుల విడుదలతో మొత్తం రూ.355 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ప్రాజెక్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రాజెక్టు విలువలో ప్రభుత్వం 10శాతం నిధులు కేటాయించాలి. అంటే, ప్రాజెక్టు వాస్తవ విలువ రూ.370 కోట్లుగా చూపించి ఉంటే.. ప్రభుత్వం రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. కానీ.. అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి.. ప్రభుత్వ వాటా 10 శాతంతో పాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలుపుతూ ఏకంగా రూ.370 కోట్లు విడుదల చేశారు. అలా రూ.333 కోట్లు కొల్లగొట్టారు. అంతేకాదు, ఒక ఏడాది ముందే.. అది కూడా ప్రాజెక్టు మొదలుకాకుండానే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం గమనార్హం. దాంతో రూ.22 కోట్ల వడ్డీ రూపంలో రావల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లింది. నకిలీ ఇన్వాయిస్లతో రూ.241కోట్లు కొల్లగొట్టారు ఇక షెల్ కంపెనీలు సరఫరా చేసినట్లుగా నకిలీ ఇన్వాయిస్లు చూí³ంచి కనికట్టు చేశారు. ఆ విధంగా రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో టీడీపీ పెద్దలకు ఆ నిధులు చేరాయని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఒప్పందంలో కాలేజీలకు భాగస్వామ్యం లేదు అలాగే, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం చేసుకున్నామని చెబుతున్న ఈ ఒప్పందంలో సంబంధిత కాలేజీలను భాగస్వాములను చేయనేలేదు. దాంతో ఆ కాలేజీలకు ఎలాంటి పాత్రా లేకుండాపోయింది. వాటిల్లో నెలకొల్పిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఏర్పాటుచేసిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విలువ ఎంతన్నది మదింపు చేయనేలేదు. ఆ కాలేజీల యాజమాన్యాలకు కూడా ఆ విషయంపై ఎలాంటి అవగాహనలేదు. -
స్కిల్ మస్తు.. జాబ్ పక్కా.. యువతకు ఉద్యోగాల వెల్లువ
మార్కాపురం(ప్రకాశం జిల్లా): డిగ్రీ పట్టా ఉంటే చాలదు.. ఉద్యోగం సాధించాలంటే టెక్నాలజీకి అవసరమైన నైపుణ్యం అవసరం.. ఆ దిశగా రాష్ట్ర పభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నియోజకవర్గానికో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి ద్వారా స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. నిరంతరం జాబ్మేళాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో 7,147 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఐదేళ్లపాటు ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థను పటిష్టపరచడం, సంస్థ సేవలను విస్తృతం చేయడం ద్వారా పెద్ద పెద్ద నగరాల్లోని ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అధికారులు జిల్లాలో 10 స్కిల్ హబ్లు, ఒంగోలు నగరంలో 2 శిక్షణ కేంద్రాలతో పాటు స్కిల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అదనపు అర్హత లేకపోయినా డిగ్రీ పాసై ఉంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో మొత్తం 23,853 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో 7,147 మంది నెల్లూరు, చిత్తూరు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర పట్టణాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఒక నియోజకవర్గంలో మెగా జాబ్మేళా, మూడో మంగళవారం మినీ జాబ్మేళా నిర్వహిస్తున్నారు. స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతున్నారు. ఒంగోలు నగరంలో బాలురు, బాలికల ఐటీఐల్లో రెండు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. బాలికల ఐటీఐలో ప్రత్యేకంగా మహిళల కోసం హౌసింగ్, ఎల్రక్టీషియన్ కోర్సులు నిర్వహిస్తున్నారు. మరో కేంద్రంలో ఇండ్రస్టియల్, పిట్టర్ ఎరోకేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. గిద్దలూరులో సెక్యూరిటీ గార్డు, టెలీకాలర్స్, కొండపిలో రిటైల్ అసిస్టెంట్, అసిస్టెంట్ బ్యూటీషియన్, దర్శి, మార్కాపురంలో ఇండ్రస్టియల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. సంతనూతలపాడులో సీయింగ్ వెకేషన్, బ్యూటీథెరపిస్టులో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులో 90 మందితో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెండుగా ఉపాధి అవకాశాలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి యువతకు శిక్షణ ఇస్తున్నాం. స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలను అమలు చేస్తున్నాం. ప్రతి నెలా 15 నుంచి 25 కంపెనీలతో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నాం. 8 నియోజకవర్గాల్లో 10 స్కిల్ హబ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇండ్రస్టియల్ ఎల్రక్టీ షియన్, ఫిట్టర్, ఫ్యాబ్రికేషన్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. త్వరలో ఒంగోలులో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. – లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా నా పేరు శేషుకుమారి. మాది రామసముద్రం. పీజీ చదివాను, జాబ్మేళాలో పాల్గొని ఉద్యోగానికి ఎంపికయ్యాను. ప్రస్తుతం చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నా. నెలకు రూ.14 వేల జీతం. హ్యాపీగా ఉన్నాను. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించిన జాబ్మేళాలో ఈ అవకాశం దక్కింది. – జే శేషుకుమారి ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నా నా పేరు జీ రమేష్. మాది పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామం. గుంటూరులో బీటెక్ చేశా. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాకు హాజరై బైజూస్ సంస్థలో ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా ఎంపికయ్యా. ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీ. – జీ రమేష్ -
తెలంగాణలో అతిపెద్ద స్కిల్డెవలప్మెంట్ సెంటర్.. ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా నగరానికి ఆనుకుని యాదాద్రి జిల్లా పరిధిలోని దండుమల్కాపురం (ఎన్హెచ్– 65) వద్ద టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ నిర్మిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్డీసీ) డిసెంబరులో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతంలో సుమారు 547 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొల్పిన ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పరిశ్రమల పార్క్కు ఎస్డీసీ తలమాణికం కానుంది. ఈపార్క్లో దశలవారీగా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 20–30 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఎస్డీసీపై కేటీఆర్ ట్వీట్.. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై సామాజిక మాధ్యమం ట్విటర్లో ట్వీట్ చేశారు. టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన.. రాష్ట్రంలోనే అతిపెద్ద స్కిల్డెవలప్మెంట్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్ ఇదేనని పేర్కొన్నారు. దండుమల్కాపురం పార్క్లో సుమారు 589 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కొలువుదీరనున్నాయన్నారు. సుమారు 20–30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ పార్క్ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, ఉద్యోగులను తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమైన శిక్షణనిస్తుందన్నారు. ఇటీవల హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సైతం తమ స్టడీటూర్లో భాగంగా ఈ కేంద్రాన్ని, పార్క్ను సందర్శించి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. కాగా ఈపార్క్లో సుమారు 60 శాతం స్థలాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించారు. ఈ పార్క్లో టౌన్షిప్ ఏర్పాటు ద్వారా వాక్టు వర్క్ కాన్సెప్ట్ను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ పార్క్లో సుమారు 200 పరిశ్రమలు తమ కంపెనీలు నెలకొల్పే పనులు చేపట్టడం విశేషం. వచ్చే ఏడాది జూన్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆయాసంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 30 పరిశ్రమలు ఈ పార్క్లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాయి. మిగతా పరిశ్రమలు కూడా తమ కంపెనీల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాయి. పలు పారిశ్రామిక పార్క్ల పరిశీలన తర్వాతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక వాడలను పరిశీలించిన అనంతరమే టీఎస్ఐఐసీ, టీఐఎఫ్ సంస్థలు ఈ పార్క్ను అభివృద్ధి చేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ఇదేనని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రూ.236 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్, మంచినీరు, రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్క్లో అంతర్భాగంగా 194 ఎకరాల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయడంతోపాటు ఇందులో పాఠశాలలు, కమర్షియల్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్క్కు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థనుంచి పలు అంశాల్లో ప్రశంసలు దక్కినట్లు పేర్కొన్నాయి. ఈ పార్క్లో సుమారు 40 వేల మొక్కలు నాటి హరితహారానికి చర్యలు తీసుకున్నామన్నాయి. (క్లిక్ చేయండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!) -
ఈ ఏడాది నుంచే స్కిల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 26 స్కిల్స్ కాలేజీలు అందుబాటులోకి రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) వెల్లడించింది. కొత్త కాలేజీల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చేవరకూ తాత్కాలికంగా 26 స్కిల్ కాలేజీలను తక్షణమే ప్రారంభించబోతున్నట్లు సంస్థ ఎండీ ఎస్. సత్యనారాయణ తెలిపారు. స్కిల్ కాలేజీల నిర్మాణాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాల్లో ఏమాత్రం నిజంలేదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే పులివెందులలో మొదటి స్కిల్ కాలేజి నిర్మాణం ప్రారంభమైందని.. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఇక వీటికి అదనంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో స్కిల్ హబ్ను కూడా ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 86 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 89 స్కిల్ హబ్స్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారని.. వీటి ఏర్పాటుకు 194 పరిశ్రమలను సంప్రదించి డిమాండ్కు అవసరమైన 185 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధంచేశారని పేర్కొన్నారు. ఈ శిక్షణా కేంద్రాల మ్యాపింగ్, పరిశ్రమల్లో ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉంది అన్న అంశాలపైనా సర్వే కూడా పూర్తయిందన్నారు. కోర్సుల ఎంపిక, సిలబస్ రూపకల్పన, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, అసెస్మెంట్, ధృవీకరణ పత్రాల అందజేత లాంటి విషయాల్లో నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్)కు అనుగుణంగానే కోర్సులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఇందులో పరిశ్రమలు, వివిధ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్, విద్యారంగ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఇటీవలే విజయవాడలో ఒక సదస్సు నిర్వహించామని సత్యనారాయణ చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా శిక్షణ ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు నిలిచిపోయాయంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని సత్యనారాయణ ఖండించారు. కోవిడ్ సమయంలో శిక్షణా కార్యక్రమాలకు బ్రేక్ పడిందని.. కానీ, ఇప్పుడు తిరిగి శ్రీకారం చుట్టినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. గడచిన రెండేళ్లలో 13 లక్షల మంది నైపుణ్య శిక్షణ పొందారన్నారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ ద్వారా రెండు లక్షల మంది లబ్ధిపొందారని వివరించారు. కోవిడ్ సమయంలోనూ శిక్షణ ఇచ్చినందుకుగాను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుతో ఏపీఎస్ఎస్డీసీకి గుర్తింపు లభించిందన్నారు. ఇక ఈ ఏడాది జనవరి 4 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువత ఏడు బంగారు, నాలుగు వెండి, రెండు రజతాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన కేటగిరిలో నాలుగు.. మొత్తం 17 పతకాలు సాధించారని సత్యనారాయణ గుర్తుచేశారు. అలాగే, గతంలో స్కిల్ ఇండియా పోటీల్లో 13వ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది 5వ స్థానంలో నిలిచిందన్నారు. -
Career pedia: నేర్చుకుంటే సాధించవచ్చు
గతంతో పోల్చితే ఈ రోజుల్లో చదువుకున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. మంచి కంపెనీలలో ఉద్యోగమూ సంపాదిస్తున్నారు. ‘కానీ, ఆ ఆనందం వారిలో కొన్నాళ్లలోనే ఆవిరైపోతుంది..’ అంటున్నారు జ్యోత్సా్నరెడ్డి. నైపుణ్యాల లేమి కారణంగా నవతరం ఎదుర్కొంటున్న ఒత్తిడిని గమనించి, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. కాలేజీలలో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. ‘ప్రపంచానికి ఇప్పుడు మార్కులు, పర్సెంటేజీలు కాదు నైపుణ్యాలు కావాలి’ అని చెబుతున్న ఈ కెరీర్ గైడ్ హైదరాబాద్లోని మాదాపూర్లో ‘కెరీర్ పీడియా’ ద్వారా తన సేవలను అందిస్తున్నారు. మల్టిపుల్ కంపెనీలలో ఉద్యోగం చేసిన అనుభవం సొంతం చేసుకున్న జ్యోత్స్న తను తీసుకున్న నిర్ణయం గురించి, యువతరం ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, వాటి పరిష్కారాల దిశగా తాము చేస్తున్న ప్రయాణం గురించి వివరించారిలా... ‘‘ఎంబీయే పూర్తయ్యాక బెంగళూరు, హైదరాబాద్లో అనేక కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. అక్కడ గమనించిన వాటిలో ముఖ్యమైనది యువత ఎంత ఎక్కువ శాతంలో ఉద్యోగంలో చేరుతున్నారో.. అంతే శాతంలో రిజెక్ట్ కూడా అవడం. కారణం... వారు చదువుకున్న కాలేజీలలో పాఠ్యాంశాలే తప్ప ఇతర నైపుణ్యాలు నేర్పించరు. విద్యార్థులు కూడా వాటి మీద దృష్టి పెట్టరు. కొందరు మాత్రమే రాణించడానికి, మిగతావాళ్లు వెనకబడటానికి గల కారణాలేంటో కొన్నాళ్లు గమనించాను. ఉద్యోగంలో చేరినా.. పని సకాలంలో పూర్తిచేసే సామర్థ్యం చాలా మందిలో ఉండటం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, టెక్నికల్ నాలెడ్జ్ అంతంత మాత్రమే. ఇలాంటప్పుడు కంపెనీలపై కూడా వీరి వల్ల ఒత్తిడి ఉంటుంది. కొన్నాళ్లు కొత్తగా చేరిన ఉద్యోగుల పనితీరును గమనించి, వారి ఫైల్స్ పక్కన పెట్టేస్తుంటారు. ఒక్క ఐటీ రంగమే కాదు, ఇతర రంగాల్లోనూ నైపుణ్యాల లేమి అనే సమస్య ఉంది. దీనికి కోవిడ్ కూడా ఒక అడ్డంకి అయ్యింది. కంపెనీలు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ను ఎడాప్ట్ చేసుకున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ లేవు. దీంతో విద్యార్థుల్లో సంస్థలకు కావల్సిన క్వాలిటీ శాతం బాగా తగ్గింది. సంస్థలు ఇప్పుడు క్వాలిటీ ఎంప్లాయీస్ కోసం అన్వేషిస్తున్నాయి. ఉద్యోగులకు నైపుణ్యాలు కల్పిస్తే కంపెనీలకు కావాల్సిన టెక్నికల్ మాన్ పవర్ను అందించగలం అనుకున్నాం. మావారు రాహుల్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. మా ఇద్దరిదీ ఒకే రంగం అవడం వల్ల తీసుకున్న నిర్ణయాలను త్వరగా అమలు చేయగలుగుతున్నాం. మార్కులు కాదు ముఖ్యం.. నిజానికి ఇదొక ప్రయోగాత్మక కార్యక్రమమనే చెప్పవచ్చు. విద్యార్థులు–సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనుకున్నాను. అయితే, ఇందుకు కావల్సిన వనరుల గురించి కూడా ఆలోచించాం. అప్పటికే మాకున్న మాతృసంస్థ ‘ఇన్ప్రాగ్’ ద్వారా ఆర్థికసాయం తీసుకుంటున్నాం. పేద విద్యార్థులకు ఉచిత సేవలు అందించడానికి, అలాగే ఇతరులకూ నామమాత్రపు ఫీజుతో స్కిల్స్లో శిక్షణ ఇవ్వడానికి సాధ్యమయ్యింది. ‘చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకున్నారు’ అని తెలిసిన వారంటుంటారు. కష్టమైనా ఇష్టంతో చేస్తున్న పని. ఎంతో మందికి ఉపయోగపడే పని’ అని చెబుతుంటాను. అత్యాధునిక నైపుణ్యాలకు అన్ని రంగాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. అందుకని విద్యార్థులు ముందుగా స్పెషలైజేషన్లో భాగంగా వారి నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని వివరించారు ఈ కెరీర్ప్లానర్. చదువుకుంటూనే నైపుణ్యాలు ‘ఇది కొంచెం కష్టమైన పనే. కానీ, విద్యార్థులు తమ డిగ్రీ స్థాయిలోనే నైపుణ్యాలను అలవర్చుకుంటే, తర్వాత ఉద్యోగావకాశాలకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇది గుర్తించి కాలేజీల్లో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాం. డిగ్రీస్థాయివారి మాత్రమే కాదు ఇతర డిప్లొమా కోర్సులు చేసిన వారికి కూడా వారి కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా విద్యార్థి డిగ్రీ నాలుగేళ్లలోనే స్కిల్స్ పెంచుకుంటే, నేరుగా సంస్థల్లో తమ నైపుణ్యాలను చూపవచ్చు. విద్యార్థులు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సంపాదన మొదలుపెట్టడానికి ఫ్రీలాన్స్ అవకాశాలను కూడా సెట్ చేస్తున్నాం. ఇందుకు ఆన్లైన్ను వేదికగా చేసుకున్నాం.’ – నిర్మలారెడ్డి -
ఎల్బీ శాస్త్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటైన ఎల్బీ శాస్త్రి ట్రస్టు హైదరాబాద్లో నైపుణ్యాభివృద్ది సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్రస్టు చైర్మన్, ఎల్బీ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో మంగళవారం బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. సింగపూర్కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) భాగస్వామ్యంతో ఈ సంస్థను నిర్వహిస్తామని అనిల్ శాస్త్రి ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు విద్యారంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ.. రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం వివిధ కోర్సులను ఈ సంస్థ ద్వారా అందిస్తామని, తమ కార్యకలాపాలకు హైదరాబాద్ అనువైనదిగా గుర్తించామని అనిల్ శాస్త్రి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సాయం అందిస్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు కానుండటంపట్ల సీఎస్ హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ట్రస్టు బాధ్యులు శ్రీవాస్తవ, పాండురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతకు 'కార్పొరేట్' నైపుణ్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యం కావడానికి దేశీయ కార్పొరేట్ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టేందుకు వీలుగా పలు సంస్థలతో జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ఎన్. బంగార్రాజు ‘సాక్షి’కి వివరించారు. దీంతో ఐబీఎం, ఒరాకిల్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, అపోలో, బయోకాన్, హెచ్సీఎల్ వంటి 24 కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా మరికొన్నింటితో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే కొన్ని కోర్సులు ప్రారంభించామని, మిగిలిన వాటికి ప్రణాళికలు సిద్థంచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు కూడా.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ► అమెరికాకు చెందిన వాధ్వాని ఫౌండేషన్, బ్రిటన్కు చెందిన లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ యూనివర్సిటీ, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్, జీఐజెడ్ వంటి అంతర్జాతీయ సంస్థలు నైపుణ్య శిక్షణనివ్వడానికి ముందుకొచ్చాయి. ► లాభాపేక్ష లేని వాధ్వాని ఫౌండేషన్ రాష్ట్రంలోని 100 కాలేజీల్లో విద్యార్థులు ఉద్యోగానికి ఎలా సిద్ధం కావాలి, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూలు ఎదుర్కోవడమెలా వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. ► లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ సైన్స్ ఆసుపత్రులకు చెందిన ఐసీయూ, ఆక్సిజన్ ప్లాంట్, జనరల్ డ్యూటీ అటెండెన్స్, నర్సింగ్ అసిస్టెంట్ వంటి కోర్సులు అందించనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో ఈ కోర్సులు నిర్వహించడానికి స్థలాలను కేటాయిస్తున్నామని, సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న ఈ కోర్సులు చాలా వరకు ఉచితంగా అందిస్తున్నట్లు బంగార్రాజు తెలిపారు. హైఎండ్ సర్టిఫైడ్ కోర్సులకు కొన్ని సంస్థలు నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నాయని, ఈ కోర్సుల్లో చేరాలా వద్దా అన్నది పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్య శిక్షణకు ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు ► వాధ్వాని ఫౌండేషన్ ► సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్పీఐ) ► లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ► జీఐజెడ్ ► డెల్ టెక్నాలజీస్ ► ఐబీఎం ఇండియా ► టెక్ మహీంద్రా ఫౌండేషన్, ► ఓరాకిల్ అకాడమీ ► డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ► టీసీఎస్ ఐయాన్ ► ఎల్ అండ్ టీ ఎడ్యు స్కిల్స్ ► అపోలో మెడి స్కిల్స్ ► హెచ్సీఎల్ ఫౌండేషన్ ► స్నైడర్ ఎలక్ట్రిక్ ► ఎల్వీప్రసాద్ ఫిల్మ్ అకాడమీ ► జేబీఎం ఇండియా లిమిటెడ్ ► ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ► నేషనల్ సాŠట్క్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) అకాడమీ ► సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ ► దాల్మియా భారత్ ఫౌండేషన్ ► గ్రీన్కో టెక్నాలజీస్ ► బయోకాన్ అకాడమీ ► సేల్స్ఫోర్స్ ఇండియా ► ఎస్ఎంసీ కార్పొరేషన్ చదువు పూర్తికాగానే ఉపాధి ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తికాగానే ఉపాధి లభించే విధంగా టాప్ ఎండ్ ఐటీ సర్టిఫైడ్ కోర్సులను ఈ కార్పొరేట్ సంస్థలు అందిస్తున్నాయి. ► వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఐబీఎం 150, 200 గంటల వ్యవధి ఉండే హై ఎండ్ కోర్సులను అందిస్తుండగా.. ఓరాకిల్ అకాడమీ తొలి విడత కింద 50 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ నెలలో సర్టిఫికేషన్ కోర్సులను అందించనుంది. ► అలాగే, ఎల్ అండ్ టీ నిర్మాణ రంగానికి చెందిన వివిధ కోర్సులను అందించడానికి ముందుకు వచ్చింది. ► పాత సినిమాల పునరుద్ధరణ, రీ ప్రొడక్షన్, ఫిల్మ్ ఎడిటింగ్ వంటి సినిమా సంబంధిత స్కిల్స్ను ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అకాడమీ అందించనుంది. ఈ సంస్థ తొలుత ఆంధ్రా యూనివర్సిటీలో తన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోందని, ఆ తర్వాత వివిధ జిల్లాల్లో పదిచోట్ల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బంగార్రాజు తెలిపారు. ..ఇలా వివిధ కోర్సుల డిమాండ్ను బట్టి ప్రతీ కోర్సు నుంచి 10వేల నుంచి 30 వేల మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఏపీఎస్ఎస్డీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
నైపుణ్య కాలేజీలకు వేగంగా స్థల సేకరణ
సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల వద్ద ఉన్న మిగులు భూములను సేకరించి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో నైపుణ్య కళాశాల నిర్మాణం కోసం ఐదెకరాలు సేకరిస్తున్నట్టు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఎన్.బంగారురాజు చెప్పారు. 25 కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంతో జూలై నెలాఖరులోగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి గరిష్టంగా రూ.20 కోట్లు వ్యయం చేయడానికి అనుమతిస్తూ మే 30న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, నాలుగు ట్రిపుల్ ఐటీలతో పాటు పులివెందులలో మరో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. కాలేజీల్లో వసతులివి.. స్థానిక పరిశ్రమలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు. ఇందుకోసం పరిశ్రమల శాఖ చేపట్టిన సమగ్ర పారిశ్రామిక సర్వే నివేదికను ఏపీఎస్ఎస్డీసీ వినియోగించుకుంటోంది. ప్రతి నైపుణ్య కళాశాలలో ఆరు తరగతి గదులు, రెండు ల్యాబ్లు, వర్క్షాప్ నిర్వహణకు ప్రాంగణం ఉండేలా వీటిని నిర్మిస్తారు. స్థానికంగా ఉండే ఒకటి లేదా రెండు పరిశ్రమలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాలను వీటిలో ఏర్పాటు చేస్తారు. ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టి కోర్సు పూర్తికాగానే నేరుగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటారు. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలలు ఉండేలా చూస్తున్నారు. -
ఏపీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ మణిహారం..
అమరావతి: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, తన చరిత్రలో మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఆరంభించింది. రాష్ట్రంలోని విద్యావంతులైన యువతకు డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచి, నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తున్న సంస్థలు, కంపెనీలకు ఒక చిరునామాగా ఏపీని తీర్చిదిద్దే బృహత్ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, ఉన్నత విద్యారంగంలో తీసుకొస్తున్ విప్లవాత్మక మార్పులు మైక్రోసాఫ్ట్ సంస్థను ఆకట్టుకుంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శుక్రవారం వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, సీఎం కార్యాలయ విదేశీ విద్యావ్యవహారాల అధికారి డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య కో ఆర్డినేట్ డాక్టర్ కుమార్ అన్నవరపు, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ముందుకు రావడం ముదావహమన్నారు. రాష్ట్రంలోని విద్యా యువతకు మైక్రోసాఫ్ట్ అందించరే డిజిట్ నైపుణ్య సాధన ఎంతో ఊతమిస్తుందాని, ఈ శిక్షణ పొందడం ద్వారా యువత ఉద్యోగం పొందే అవకాశాలు తప్పకుండా వస్తాయన్నారు. డిజిటల్ కనెక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ చేరువ కానుందని, దాదాపు 80 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ సంస్థలో జరిగిన ఈ అవగాహన ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు వృత్తి విద్యా కశాళాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోకరంగా ఉంటుందన్నారు. కళాశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ముందగానే మైక్రోసాఫ్ట్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడం సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా వారు మంచి అవకాశాలు పొందడానికి మార్గం సుగమమవుతుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని, ఉన్నత విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను యువతకు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలకు ఇప్పడు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు జతకలవడం మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు 42 రకాలకు పైగా నైపుణ్య శిక్షణలు ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగై వారు మంచి అవకాలు పొందడానికి ఇది ఊతమిస్తుంది అన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయడానికి తాము ఎంతో ఉత్సుకతతో ఉన్నామన్నారు. దేశంలో డిజిటల్ ఎకానమీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే ఈ డిజిటల్ స్కిల్లింగ్ అనేది ఒక పునాదిలాగా పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి వారు మంచి ఉద్యోగావకాశాలు పొందడానికి సహకరించేలా పనిచేయడానికి తాము కంకణబద్ధులైనామని తెలిపారు. ఏపీతో కలిసి పనిచేయడానికి తమకు సహకరించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏమిటీ కోర్సులు మైక్రోసాఫ్ట్ సంస్థ తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి వినూత్న విప్లవాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లోని విద్యార్థులకు వివిధ రకాల నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనుంది. సమకాలీన ప్రపంచంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలకు పదునుపెట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకించి 42 రకాల కోర్సులను విద్యార్థులకు అందించనుంది. 1.60లక్షల మందికిపైగా ఈ కోర్సులు అందించనున్నారు. మొత్తం 42 రకాల కోర్సులుంటాయి. కోర్సులను బట్టి మొత్తం 40 గంటల నుంచి 160 గంటల వ్యవధి శిక్షణ ఇస్తారు. మైక్రోసాఫ్ట్కు చెందిన ఏడు రకాల అజ్యూర్ (Azure DevOps)టెక్నాలజీ కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365, పవర్ యాప్ ఫండమెంటల్స్, అజ్యూర్ డాటా అనలిటిక్స్, డాటాబేస్ తదితర 42 రకాల సాంకేతిక నైపుణ్య కోర్సులు ఇందులో ఉంటాయి. వీటికి మైక్రోసాఫ్ట్ నుంచి సుశిక్షితులైన నిపుణుల ద్వారా ఆన్లైన్, ఆఫ్ లైన్ శిక్షణా తరగతులను అందిస్తారు. అలాగే ఉద్యోగాలకు జరిగే ఇంటర్వ్యూలకు ఎలా సంసిద్ధం కావాలి, వేష భాషలతో పాటు, నైపుణ్యాలపైనా శిక్షణ ఇస్తారు. ఈ తరగతుల నిర్వహణకు సంబంధించిన స్థానికంగా వనరుల సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థి ప్రొఫైళ్లను లింక్డిన్లో అప్డేట్, అప్లోడు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ నైపుణ్యాలున్న వారికోసం అన్వేషిస్తున్న సంస్థలకు లింక్డిన్ ద్వారా ఈ ప్రొఫైళ్లను పంపి, తద్వారా విద్యార్థులు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి ఉద్యోగాలు పొందే వీలు కల్పిస్తారు. 75 శాతం ఉద్యోగాలు నైపుణ్యులకే రోజురోజుకీ సాంకేతిక ప్రపంచం కొత్తపుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. పోటీతత్వం పెరిగిపోతోంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ సంస్థలను, పరిశ్రమలను నైపుణ్యమున్న మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల విద్యార్హతలకంటే వారిలోని నైపుణ్యార్హతలకే సంస్థలు పెద్దపీఠవేస్తున్నాయి. సాంకేతిక మానవ వనరుల కొరతైతే మరింత తీవ్రంగా ఉంది. రాబోయే పది సంవత్సరాల్లో సంస్థలు, పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే అవసరం. ప్రస్తుత అవసరాలకు సరిపడా నైపుణ్యాలున్న మానవ వనరులు కనీసం 50శాతం మంది కూడా లభించడం లేదు. ఇందులోనూ 71 శాతం స్టెమ్ జాబ్స్ అన్నీ కూడా కంప్యూటింగ్ రంగంలోనే ఉన్నాయి. ఈ డిమాండును కేవలం 8శాతం కంప్యూటింగ్ పట్టభద్రులు మాత్రమే పూర్తి చేయగలుగుతున్నారు. దీన్ని బట్టీ రంగంలో నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఎంతటి డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎంతో మేలు మైక్రోసాఫ్ట్ చేపట్టబోయే ఈ కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయి. పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు ముందుండే అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ కల్పించనుంది. కోర్సులు నిర్వహించడమే కాకుండా కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహిస్తారు, అనంతరం విద్యార్థికి మైక్రోసాఫ్ట్ సంస్థ సర్టిఫికెట్ అందజేస్తుంది. ఈ సర్టిఫికెట్ కలిగి ఉండటమనేది ఉద్యోగాలు పొందడానికి ఆ విద్యార్థికి అదనపు అర్హతవుతుంది. ఉద్యోగాలకు నిర్వహించే ఎంపిక ప్రక్రియలో ఈ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులకు సంస్థలు అత్యధిక ప్రాధాన్యమిస్తాయి. ప్రతి విద్యార్థికీ వంద డాలర్ల బహుమతి ఈ కోర్సులు చేసే ప్రతి విద్యార్థికీ మైక్రోసాఫ్ట్ సంస్థ వంద డాలర్ల బహుమతి కూడా అందించనుంది. దానికి సంబంధించి ప్రతి విద్యార్థికీ బహుమతి కూపన్ ఇవ్వనుంది. దీనిద్వారా వారు తమ నైపుణ్యాలను మరింత లోతుగా పదునుపెట్టుకోవడానికి వీటిని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. -
ఏపీఎస్ఎస్డీసీతో ఎస్పీఐ కీలక ఒప్పందం
సాక్షి అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య కళాశాలల్లో భాగస్వామ్యం అవడానికి ప్రముఖ ఐటి సంస్థ ఐబీఎం, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్( ఎస్పీఐ), ఎల్వీప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్ఎస్డీసీ) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము సమక్షంలో ఆన్ లైన్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఎపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఐబీఎం ఇండియా డైరెక్టర్ జగదీశభట్, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేనల్ (ఎస్.పి.ఐ) సంస్థ డైరెక్టర్ జార్జినా ఫువా, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఎండీ జి.కమలవర్థన్ రావు, ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ డైరెక్టర్ ఎ.సాయిప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐబీఎం ఇండియా ఐటీ రంగంలో ఏర్పాటు చేయబోయే “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”లో ఐటి రంగంలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు అందించే సాప్ట్ వేర్ కోర్సుల సంబంధించిన కోర్సులకు అయ్యే ఖర్చులను ఐబీఎం భరిస్తుంది. ఒప్పందంలో భాగంగా కోర్సులు, పాఠ్యాంశాలు, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గెస్ట్ లెక్చర్స్, ఐటి డొమైన్ లై హైఎండ్ ట్రైనింగ్స్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్చెయిన్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, బిగ్ డేటా మరియు ఫుల్ స్టాక్ విభాగాల్లో శిక్షణ ఇస్తుంది. ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ విశాఖపట్నంలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీ.ఓ.ఈ)ని ఏర్పాటు చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ ముందుకు వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా కోర్సులు మరియు పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తారు. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, 2డీ యానిమేషన్ బేసిక్ ట్రైనింగ్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ లో బేసిక్స్, వీఎఫ్ఎక్స్ అండ్ డిజిటల్ రిస్టోరేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గెస్ట్ లెక్చర్స్, నేషనల్ అప్రెంటీస్ షిప్ ప్రోగ్రామ్ (న్యాప్స్) కింద అప్రెంటీస్ సపోర్ట్ ఇస్తారు. సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేనల్ (ఎస్.పి.ఐ) అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ & ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ విభాగాల్లో అంతర్జాతీయస్థాయి పరిశ్రమల నేతృత్వంలోని కోర్సులను నైపుణ్య కళాశాలల్లో అందించడానికి అవసరమైన సాంకేతిక సహకారం, నిర్వహణకు సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్.పి.ఐ) ముందుకు వచ్చింది. ఈ మేరకు వారు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా ల్యాబ్స్, కోర్సులను అభివృద్ధి చేయడం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, ప్రతిపాదించిన కోర్సుల్లో ఎపిఎస్ఎస్డిసితో కలిసి సర్టిఫికేషన్, అక్రిడేషన్ ఇవ్వడం, టీచింగ్, లెర్నింగ్ మాడ్యూల్స్ ఫ్రేమ్వర్క్ను మరింత అభివృద్ధి చేస్తారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) హాస్పిటాలిటీ సెక్టార్లో ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు చేయబోయే “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”కు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా హాస్పిటాలిటీ రంగంలో కోర్సులు మరియు పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను ఐటిడిసి రూపొందిస్తుంది. హాస్పటాలిటీ ట్రేడ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ ఆపరేషన్స్, ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ లో ఎపిఎస్ఎస్డిసి ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థులు / నిరుద్యోగ యువతకు ఐటిడిసి శిక్షణ ఇస్తుంది. నైపుణ్య శిక్షణ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో రాష్ట్రాన్ని అత్యుత్తమస్థాయిలో ఉన్నత ప్రమాణాలను పెంపొందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటి వరకు 13 సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం మన రాష్ట్రానికి ఉంది. ఇక్కడ టూరిజం, హాస్పటాలిటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి. - చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపీఎస్ఎస్డీసీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్ కాలేజీల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలతో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. -జి. అనంతరాము, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
'ఐఎస్బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి'
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై శనివారం అధికారులతో మంత్రి గౌతమ్రెడ్డి సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్ట్ 5న ఐఎస్బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జరగనుందన్నారు. ఐఎస్బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం లభించనుందని తెలిపారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్బీ కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించేందుకు ఐఎస్బీ తోడ్పాటు అందించనుందని తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు ఐఎస్బీ సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ కల్లా నైపుణ్య కాలేజీల ఏర్పాటు అంతకముందు నైపుణ్య కాలేజీల ఏర్పాటుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్లో నైపుణ్య కాలేజీలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో ఏ అవకాశాన్ని వదలకూడదన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు రుణాలందించడానికి ఏయే బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆరా తీశారు. దీనికి సంబంధించి బ్యాంకులు ఎంత మొత్తంలో రుణాలందించేందుకు సుముఖంగా ఉన్నాయో ఎండీ అర్జా శ్రీకాంత్ మంత్రికి వివరించారు. ప్రభుత్వ పూచికత్తుతోనే మరిన్ని నిధులు సాధ్యమని నైపుణ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము మంత్రికి వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ కాలేజీ ఏర్పాటు అవుతున్నందున స్థానిక ఎంపీల నిధుల నుంచి కొంత సాయం పొందవచ్చని ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. యువత భవిష్యత్ ను మార్చే స్కిల్ కాలేజీల ఏర్పాటులో ప్రతీ రూపాయి అవసరమేనని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరాలని గౌతమ్రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి మరింత లోతుగా చర్చిద్దామని మంత్రి మేకపాటి అధికారులతో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. -
'నైపుణ్య కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ'
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్పై గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ యునివర్సిటీ ఏర్పాటు, భవనాల నిర్మాణం, ప్రవేశ పెట్టాల్సిన కోర్సులపై చర్చించారు. కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ఐటీఐ, డిప్లమో, ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సులు పూర్తిచేసినవారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలన్నారు. (విద్యార్థుల మృతదేహాలను రప్పించండి) ఇప్పటికే ఆ తరహా కోర్సులు చేస్తున్న వారికి ఏడాది అప్రెంటిస్ ఇవ్వడమే యూనివర్శిటీ, నైపుణ్య కేంద్రాల ప్రధాన ఉద్దేశం అని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నైపుణ్య కేంద్రంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ తదితర కోర్సుల విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ది చేయడంతో పాటు జీవనోపాధి కోసం ఇతరులకు చిన్న చిన్న పనులు నేర్పించడానికి శిక్షణా తరగతులు నిర్వహించాలని వెల్లడించారు. ఈ మొత్తం కార్యక్రమాలను ఎన్ఐసీ ద్వారా నిర్వహించాలని జగన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో ఫ్యాకల్టీలో ప్రముఖ సంస్థల భాగస్వామ్యాలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ఈ కోర్సులకు మరింత విలువ ఉంటుందని, వైద్య రంగంలో అందించే సర్వీసులకు కూడా ఈ నైపుణ్య కేంద్రాల్లోనే శిక్షణ అందించాలని తెలిపారు. హై ఎండ్ స్కిల్స్ కోసం విశాఖలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని జగన్ అధికారులను కోరారు. ఏ కోర్సుకైనా కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలన్నారు. ఇప్పటివరకూ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ లాంటి వివిధ కోర్సులు చదువుతున్న వారే కాదు, కోర్సులు పూర్తైన వారు కూడా ఈ కేంద్రాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అధ్యాపకులను అప్గ్రేడ్ చేసేందుకు వారికి సంబంధించిన శిక్షణా తరగతులు కూడా నైపుణ్య కేంద్రాల్లోనే నిర్వహించాలని జగన్ వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గౌతంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రతిభా శిక్షణ
‘జనాభాతో పాటు దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది..’ఈ వాక్యం మనం తరచూ వింటున్నాం. చదువుతున్నాం. తిరిగి మన పనుల్లో మనం పడిపోతున్నాం. ప్రతిభ పులిజాల అందరిలా ఆ వాక్యాన్ని వదిలేయలేదు. నిరుద్యోగ సమస్యనే తన ఉద్యోగంగా మలుచుకుంది. ఖాళీగా ఉన్నవారు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ రంగంలో తగు శిక్షణ ఇస్తుంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇప్పిస్తుంది. చదువులేనివారికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన లేనివారి దగ్గరకు వెళ్లి వాటి గురించి వివరిస్తుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకొని మెరుగైన జీవనం పొందేలా సహాయం చేస్తుంటుంది. ఇరవై ఏళ్లుగా దాదాపు డెబ్భై ఐదు వేల మందికి పైగా వారెంచుకున్న రంగంలో నైపుణ్యం పెంచి, శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రతిభ. తన మొదటి అడుగు నుంచీ ఇప్పటి వరకు సాగించిన పయనం గురించి ఇలా వివరించారు... ‘‘నిన్న ఉదయం రిసీవ్ చేసుకున్న ఓ ఫోన్ కాల్ గురించి చెబుతాను. ‘మేడమ్.. బాగున్నారా! ఏడాది క్రితం నేను మీ ఇంట్లో పనిచేసిన అనితను’ అంటూ పలకరించింది ఓ అమ్మాయి. ఇప్పుడు తను జూబ్లీ హిల్స్లోని ఓ పేరున్న బ్యూటీ స్పాలో మేనేజర్గా విధులు నిర్వర్తిస్తు్తన్నానని చెప్పింది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనికారణంగా ఏడవ తరగతితో చదువు ఆపేసిన అనిత తన తల్లితో కలిసి ఇళ్లలో పనులు చేసేది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగామ్లో చేరి, బ్యుటీషియన్గా పనులు నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఇలా జీవితాన్ని మెరుగుపరుచుకున్నవారి గురించి తెలిసినప్పుడల్లా చాలా ఆనందపడుతుంటాను. చదువు లేని వారే కాదు చదువున్నవారు కూడా తమ కెరియర్ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువు తర్వాత సాఫ్ట్వేర్లోనో.. మరేదైనా కంపెనీలోనో విద్యార్హతతో జాబ్లో చేరుతారు. ఆ తర్వాత సరైన నైపుణ్యం లేదని ఆ కంపెనీలు ‘రిజక్ట్’ చేసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అక్కణ్ణుంచి వెనక్కి వచ్చేస్తే జీవితంలో ఇంకా వెనకబాటుకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితి నుంచి యువతను తప్పించడానికే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో మా ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో ఏయే ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కౌన్సెలింగ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుంటాను. వారంలో అన్ని రోజులూ శిక్షణాకార్యక్రమాల కోసం తిరుగుతూ ఉంటాను. చిన్న చిన్న బస్తీలు మొదలుకొని కాలేజీ క్యాంపస్ల వరకు నా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన దేశంలో చదువు ఉంది. కానీ, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాప్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్న దృశ్యం ఇరవై ఏళ్లుగా.. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లిష్ లిటరేచర్లో పీజీ పూర్తి చేశాను. రెండేళ్లు లెక్చరర్గా ఉద్యోగం చేశాను. అప్పుడే అర్ధమైంది చదువుకు కొదవ లేదు, నైపుణ్యాలకు సంబంధించిన లోటు అంతటా ఉందని. అప్పుడే ‘కెరియర్ హైట్స్’పేరుతో కౌన్సెలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాను. ఇక్కడ నుంచే విద్యార్థులకు జాబ్ ప్లేస్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. అక్కణ్ణుంచి ఆలోచనా విస్తృతి పెరిగింది. కొన్ని ఫార్మా కంపెనీలు, జీడిమెట్ల ప్రాంతంలో ఉండే ఫ్యాక్టరీలకు వెళ్లినప్పుడు అక్కడి యాజమాన్యం పనివాళ్లను వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం గమనించాను. దాంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న జనాభా గురించి వాకబు చేశాను. పనిలేకుండా ఖాళీగా ఉండేవారి సంఖ్యను బేరీజు వేసుకున్నాను. వారిని కలిసి, సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి శిక్షణ ఇచ్చాను. ఫలితంగా అక్కడి కంపెనీలలో ఆ ప్రాంతంలో నివాసం ఉన్నవారికే పని అవకాశాలు పెరిగాయి. గతంలో ఇళ్లలో పనులు చేసుకునేవారు సైతం ఇప్పుడు పేరున్న కంపెనీలలో పనిచేసే స్థాయికి చేరినవారున్నారు. ఇలాగే మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశాను. ప్రభుత్వంతో కలిసికట్టుగా.. ప్రపంచంలో మన దేశాన్ని స్కిల్ క్యాపిటల్గా మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అన్ని రంగాలకు అవసరమే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచి నిరుద్యోగ యువతకు సరైన పని కల్పించాలన్న లక్ష్యంతో స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ప్రభుత్వమూ నిర్వహిస్తుంది. అయితే వాటి గురించిన అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సౌత్ రీజియన్ అడ్వైజర్గా ప్రభుత్వంతో కలిసి వర్క్ చేస్తున్నాను. మీడియా, సినిమా, ఫొటోగ్రఫీ, బ్యూటీ, ఫ్యాషన్ డిజైనింగ్.. ఇలా 14 రంగాలలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కౌన్సెలింగ్ చేస్తున్నాను. కుటుంబ ప్రోత్సాహం పుట్టి పెరిగింది, చదువుకున్నది హైదరాబాద్లోనే. నాన్న లింగయ్య వైమానిక దళ ఉద్యోగి. అమ్మ ఫణిబాయి. ఇద్దరు అన్నయ్యలు. మా పెంపకంలో ఎక్కడా వివక్ష లేదు. తాతయ్య పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, నాన్న ఎయిర్ఫోర్స్లోనూ పనిచేయడంతో స్వీయ క్రమశిక్షణతోపాటు సమాజం పట్ల బాధ్యత కూడా చిన్నతనం నుంచే అలవడింది. మా వారు దినేశ్ డెంటిస్ట్. అత్తింటివారూ బాగా చదువుకున్నవారు కావడంతో నా తపనకు ఎక్కడా ఆంక్షలూ, అడ్డంకులూ లేవు. మనం చేసే పని పదిమందికి ఉపయోగపడాలన్నదే మా కుటుంబం నుంచి వచ్చిన మాట. అదే నన్ను ఎంతోమందిని కలిసేలా, ఎన్నో విషయాలు నేర్చుకునేలా, మరెన్నో విషయాలు నలుగురికి తెలియజేప్పే అవకాశాన్ని ఇచ్చింది. స్వచ్ఛత – శుభ్రత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం మురికివాడలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, పరిస్థితులు చాలా బాధ కలిగించాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా.. ఈ టెక్నాలజీ యుగంలోనూ కనీస వసతులు లేకుండా జీవిస్తున్న దుర్భరమైన జీవితాలను చూసినప్పుడు ఇదేనా మనం సాధించిన ప్రగతి అన్న ఆవేదన కలిగింది. స్వచ్ఛభారత్ అంటున్న కేంద్రప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని గమనించాను. పారిశుద్ధ్య కార్మికుల్లోనూ వృత్తి నైపుణ్యాలు పెంచడంతో పాటు వారి సంక్షేమం గురించీ ఆలోచించాను. వారికీ శిక్షణ ఇవ్వాలని, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ముందుగా నేను ట్రెయిన్ కావాలని ‘సఫాయి కర్మచారి’ సర్టిఫికెట్ కోర్సు చేశాను. ఫండ్స్ కోసం 5కె, 10 కె రన్స్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. అప్పుడు జీహెచ్ఎంసి కమిషనర్ను కలిసి నా ఆలోచన చెప్పాను. వారి సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటిగా ‘కర్తవ్య ఫౌండేషన్’ ఏర్పాటు చేసి చందానగర్ ఏరియాలో మూడువందల మందికి శిక్షణ ఇచ్చాం. వారికి నా పనితీరు, నిబద్ధత నచ్చడంతో ఆ తర్వాత ‘సాఫ్ హైదరాబాద్ – షాన్దాన్ హైదరాబాద్’, ‘వాటర్ లీడర్షిప్ కన్జర్వేషన్’లో భాగస్వామిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. దేశం మారాలంటూ పథకాలు రూపొందిస్తే ఫలితం ఉండదు ఆయా పథకాల ద్వారా దేశం ప్రగతి పథంలో పయనించాలంటే మార్పు అనేది అట్టడుగు స్థాయి నుంచి మొదలు కావాలి’ అని వివరించారు ప్రతిభ పులిజాల. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ దిశగా సాగుతున్న శిక్షణాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు మురికివాడల్లో పరిశుభ్రమైన జీవనం కోసం, స్వచ్ఛమైన పరిసరాల కోసం కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.– నిర్మలారెడ్డిఫొటోలు: అనీల్కుమార్ -
ఎస్టీపీఐ సహకారంతో విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం: పల్సస్
సాక్షి, విశాఖపట్నం: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సహకారంతో విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పల్సస్ గ్రూప్ తెలియజేసింది. పల్సస్ హెల్త్టెక్కు హైదరాబాద్తో పాటు చెన్నై, విశాఖ, గుర్గావ్లో కేంద్రాలున్నాయి. విశాఖలో డిజిటల్ మార్కెటింగ్కు సంబంధించి నైపుణ్యాలను అభివృద్ధి పరిచే శిక్షణ ఇవ్వటానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. ‘‘డిజిటల్ మార్కెటింగ్తో ఆన్లైన్లోనే వినియోగదారుల దగ్గరకు వస్తువులు వెళుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలో ఉన్నవారికి ఇక్కడి నుంచే మనం ఉత్పత్తిని ప్రజెంట్ చేయొచ్చు. మా సంస్థ ఇప్పటికే 50కి పైగా దేశాల్లో మెడికల్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తోంది. మా ఓపెన్ యాక్సెస్ హెల్త్ జర్నల్స్ ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులకు, వర్సిటీ విద్యార్థులకు అందుతున్నాయి. వీటి ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం. అందుకే విశాఖ కేంద్రంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశాం. శిక్షణ పొందిన వారిలో చాలామందికి మేమే ఉద్యోగాలు కల్పిస్తాం. విశాఖలో దశల వారీగా 25 వేల మందికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళిక వేస్తున్నాం. రాబోయే పదేళ్లలో ఐటీని మించి ఉద్యోగాలు కల్పించే స్థాయి డిజిటల్ ప్లాట్ఫామ్కు మాత్రమే ఉంది’’ అని పల్సస్ గ్రూప్ సీఈఓ శ్రీనుబాబు గేదెల చెప్పారు. సెంటర్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు తెలియజేశారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎం.ఫార్మా కోర్సులు చేసినవారు డిజిటల్ ప్లాట్ఫామ్పై రాణించడానికి అవకాశం ఉందన్నారు. -
కడప జైలులో దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, వైస్సార్ కడప: రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పనిచేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జైళ్లలో ఖైదీలకు సన్న బియ్యం కావాలని అడుగుతున్నారని, ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామమని చెప్పారు. కడప కారాగారంలో స్కిల్ డెవవలప్మెంట్ సెంటర్ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. (చదవండి : చంద్రబాబు తీరుపై పోలీసుల సంఘం ఆగ్రహం) డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాస్, కలెక్టర్ హరి కిరణ్, జైళ్ల డీజీ మొహమ్మద్ అషన్ రజా, ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను హోంమంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘4 కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్కు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ స్విట్జర్లాండ్లో మాత్రమే ఉంది. దేశంలోనే మొదటిసారిగా కడప జైలులో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాం. జైలులో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లిన తరవాత స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉన్నత జీవితం గడపాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. (చదవండి: ఇద్దరు కుమార్తెలతో బావిలో దూకి తండ్రి ఆత్మహత్య) ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు బహిరంగ మార్కెట్లోని వస్తువులతో పోటీ పడుతున్నాయి. జైళ్లలో నాణ్యతతో కూడిన వస్తువులు తయారు చేస్తున్నారన్న గుర్తింపు వచ్చింది. కడప జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్లో క్వాలిటీ పెట్రోల్ లభిస్తోందని చెబుతున్నారు. జైలులో ఇప్పటికే డైరీ యూనిట్, బ్రిక్స్ తయారీ, ఫినాయిల్, సోప్, డిటర్జెంట్స్, బేకరీ ఫుడ్ ఐటమ్స్, టైలరింగ్, అగరబత్తీలు తయారు చేస్తున్నారు’అని హోంమంత్రి పేర్కొన్నారు. -
సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా..
ముషీరాబాద్: టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. సోమవారం ముషీరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సతీమణి కోవ ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అక్షర స్కిల్ డెవలప్మెంట్’సంస్థను లక్ష్మణ్తో కలిసి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాల తో నిండి ఏమాత్రం సామాజిక చైతన్యం లేని టీవీ సీరియళ్లను చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అదే సమయంలో ఆర్థిక చేయూతనిచ్చే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ తీసుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని మహిళలను కోరారు. మహిళలపై ఉన్న గౌరవంతో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కోవలోదే ‘బేటీ పడావో, బేటీ బచావో’కార్యక్రమమన్నారు. గతంలో మహిళలకు ఉద్యోగాలంటే సూపర్ బజార్లలో, రిసెప్షనిస్టులుగా ఉండేవని కానీ నేడు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు.ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతిలో పెట్టడమనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే పరేడ్కు ఒక మహిళ నేతృత్వం వహించడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధి శేఖర్, అప్సా ప్రతినిధి ప్రవీణ్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ప్రమోద్, రామానందతీర్థ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. -
విద్యా వ్యవస్ధలో సంస్కరణలు
-
యువతకు ఉపాధి కల్పించడమే సీఎం ఆకాంక్ష
సాక్షి, విజయవాడ: క్రీస్తు రాజపురంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ మంగళవారం ప్రారంభించారు. టైమ్స్ గ్రూప్, ఏపీఎన్ఆర్టీ సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏపీఎన్ఆర్టీతో టైమ్స్ గ్రూప్ ఎంఓయూ కుదుర్చుకుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఏపీలో టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మొదటి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించడం శుభపరిణామన్నారు. తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో సైతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను టైమ్స్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కోరారు. -
ఉద్యోగార్థులకు నైపుణ్య సోపానం
చేతిలో పట్టా ఉంది.. కానీ తగినంత నైపుణ్యం లేదు.. ఇదీ స్థానిక నిరుద్యోగ యువత ఆవేదన. సరిగ్గా ఇదే కారణంతో పరిశ్రమల యాజమన్యాలు స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నాయి. ఇప్పటివరకు జరుగుతున్న ఈ తతంగం స్థానిక యువతను నిరుద్యోగులుగానే మిగిల్చేస్తోంది. ఈ దుస్థితిని గమనించిన వైఎస్ జగన్ సర్కార్ దేశంలోనే సంచలనాత్మకమైన.. ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అదే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు.. నిర్ణయం తీసుకున్నదే తడవుగా అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి చట్టబద్దం చేసింది. అది సరే.. నైపుణ్యం లేకుండా స్థానికులను ఉద్యోగాల్లోకి ఎలా తీసుకుంటారు?.. దీని వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా పోతాయన్న ప్రతిపక్షం వాదనను ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతో తిప్పికొట్టింది. నోటమాట రాకుండా చేసింది. అదే నియోజకవర్గానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం(స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు.. ఇలా ఏర్పాటు చేసే కేంద్రాల్లో సాంకేతిక, ఇతరత్రా అర్హతలున్న నిరుద్యోగులు ఆయా రంగాల్లో తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశం కల్పించి.. వారిని పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యేలా సహరించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విశాఖ జిల్లాలో 15 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. విశాఖ లాంటి పారిశ్రామిక జిల్లాలోని నిరుద్యోగులకు ఈ చర్యలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని.. ఉద్యోగాలు పొంది స్థానికంగానే నిలదొక్కుకునేందుకు దోహదపడుతాయని యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేతగా... ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్రలో ఏవైతే హామీలిచ్చారో... వాటిని పక్కాగా అమలు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ఈ క్రమంలో యువతకు ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఓవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధితో పాటు వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యం పొందేందుకు అవసరమైన శిక్షణ తీసుకునే ఏర్పాట్లు చేస్తుండటంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉన్న నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే గ్రామ వలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇది కాకుండా రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు అందించే బిల్లు కూడా ప్రవేశపెట్టారు. పోటీ ప్రపంచంలో యువతకు చదువు మాత్రమే సరిపోదని, తగిన నైపుణ్యాలు ఉన్నప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని గుర్తించి ప్రతి నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఉపాధి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అధిక శాతం విఫలమవుతున్నారు. నిరుద్యోగ యువతకు సరైన మార్గనిర్దేశం చేసేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను పకడ్బందీగా నడిపేందుకు దృష్టి సారించింది. యువత భవితకు భరోసా.. నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు వివిధ యూనివర్సిటీలు, సంస్థలతో కలిసి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంపొందింపజేయడమే కాకుండా వారి దృక్పథం లో మార్పును తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్మేళాలు నిర్వహించి, స్కిల్ కనెక్ట్, ఎంఎన్సీడ్రైవ్ ద్వారా ఉపాధి కల్పించనున్నారు. ఇవి కాకుండా యువతీ, యువకులకు వారి ఆసక్తి మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తారు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తూ, రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగం పొందేందుకు అవసరమైన కోర్సులను అందించే విధంగా పథకానికి రూపకల్పన చేస్తున్నారు. శిక్షణ కేంద్రాలకు వివిధ కంపెనీల ప్రతినిధులను రప్పించి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇకపై పీపీసీ ప్రాజెక్టుల క్రింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. స్కిల్స్ లేక ఇబ్బందులు.. డిగ్రీ పట్టా చేతిలో ఉంది. దానికి అనుబంధంగా మరికొన్ని క్వాలిఫికేషన్లు ఉంటేనే ఉద్యోగం ఇస్తామని చాలా కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికో స్కిల్ డెవలప్సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో మాకు కొత్త ఊపిరి పోసినట్లయింది. – కె. బాలు, డిగ్రీ విద్యార్థి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు ఉత్తరాంధ్ర యువతకు అన్ని అర్హతలున్నా.. సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ లేక చతికిల పడిపోతున్నారు. ఫలితంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరుద్యోగుల కష్టాల్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయనకు మా నిరుద్యోగులందరి తరఫున ధన్యవాదాలు. – శ్యామ్, పీజీ విద్యార్థి. -
‘నై’పుణ్యాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిలో ఎస్సీ కార్పొరేషన్ వెనుకబడింది. నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రాయితీ రుణకల్పనతో పాటు విద్యార్హతలకు తగిన నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోటాలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ యువత కోసం భారీమొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఈక్రమంలో గత ఐదేళ్లలో పెద్ద మొత్తంలో నిధులిచ్చినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 2,463 మందికి మాత్రమే వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్న వారి సంఖ్య మూడోవంతు కూడా లేకపోవడం గమనార్హం. వ్యయం ఎక్కువ... లబ్ధి తక్కువ... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు రంగంలో అవకాశాలున్న కేటగిరీలను ఎంపిక చేసుకుని గతంలో శిక్షణలు ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పించేవారు. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఉపాధి కల్పించడం కత్తిమీద సాములా మారింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణతో పాటు కచ్చితంగా ఉపాధి క ల్పించాల్సి ఉంది. దీంతో లక్ష్యసాధన ఆశాజనకంగా లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఐదేళ్ల కాలంలో రూ.7.06 కోట్లు ఖర్చు చేసి ఏకంగా 6,992 మందికి శిక్షణతో కూడిన ఉపాధిని కల్పించారు. రాష్ట్రఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రూ.10.40 కోట్లు ఖర్చు చేసి కేవలం 2,463 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఉద్యోగాలు దక్కించుకున్న వారి సంఖ్య తక్కువే. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబాటు నమోదవుతుండటంతో ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ కార్యక్రమాల్లో వేగం పెంచుతోంది. ఇటీవల సేవల రంగంలో ఆరోగ్య సహాయకులు, ఎయిర్హోస్టెస్ కేటగిరీలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఉపాధి అవకాశాలు అతి తక్కువ మందికే దక్కాయి. మరికొన్ని కేటగిరీల్లో శిక్షణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తోంది. -
పని కావాలంటే..‘పని’ రావాలి!
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం రావాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవని, నైపుణ్యం కూడా ముఖ్యమని ‘టైమ్స్జాబ్స్’ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. కంపెనీలకు పనితనమే ప్రధాన కొలమానం అని తేలింది. స్వాతంత్య్రానంతర ఉద్యోగ నియామక ధోరణులపై జరిగిన ఈ సర్వే విద్యార్హత కన్నా నైపుణ్యమే మిన్న అనే విషయాన్ని రుజువు చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలో నైపుణ్యాల స్థాయి మెరుగుపడింది. నైపుణ్యం ఉంటే నౌకరీ దక్కుతుందని 53 శాతం మంది మానవ వనరుల (హెచ్ఆర్) విభాగ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. ఉద్యోగపరంగా పరిగణనలోకి తీసుకునే అంశాల్లో విద్యార్హతను వారు ఆఖరికి నెట్టేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఉద్యోగం సంపాదించాలంటే ప్రొఫెషనల్ డిగ్రీ లేదా సర్టిఫికెట్ కోర్సు అవసరమని 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. విశ్లేషణా సామర్థ్యమే ముఖ్యం.. ‘టైమ్స్జాబ్స్’ తన సర్వేలో భాగంగా మొత్తం వెయ్యి మందికి పైగా హెచ్ఆర్ మేనేజర్ల అభిప్రాయాలు సేకరించింది. సర్వే ప్రకారం విశ్లేషణా నైపుణ్యాలకు సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇక మేధోజ్ఞానం, సామాజికాంశాలపై పట్టు, ఈఐ (ఎమోషనల్ ఇంటెలిజెన్స్) వంటి వాటిని ద్వితీయాంశాలుగానే పరిగణిస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు ఉద్యోగ కల్పనలో ముందున్నాయి. దేశానికి మరిన్ని బహుళ జాతి కంపెనీలు తరలిరావడం వల్ల ఉద్యోగావకాశాలు పెరిగాయని అత్యధికులు (49 శాతం) అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో పెట్టిన పెట్టుబడులు (24 శాతం), ఉద్యోగాల కల్పన దిశగా చేపట్టిన సంస్కరణలు (14 శాతం) ఉపాధికి దోహదపడ్డాయని కొందరు భావిస్తున్నారు. నైపుణ్యం ఉన్నా మానవ వనరులు అందుబాటులోకి రావడం కూడా ఉద్యోగాలు పెరిగేందుకు దోహదపడిందని ఆరు శాతం మంది భావిస్తున్నారు. మరో ఆరు శాతం మంది ఇతర కారణాలు చూపుతున్నారు. ఇక వృత్తి సంబంధిత పోటీ తీవ్రమైనట్లు సర్వేలో వెల్లడైంది. నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవడం, ‘కెరీర్ రొటేషన్’ (వివిధ రకాల విధులు చేపడుతుండటం) వంటి అంశాలను ప్రస్తావించింది. గత 71 ఏళ్లలో ఉద్యోగాల కల్పనపరంగా, విస్తృతిపరంగా జాబ్ మార్కెట్ మెరుగైందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్వాతంత్య్రానంతరం భారత్ మరిన్ని ఉద్యోగావకాశాలను ఇచ్చిందని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. స్త్రీల పట్ల అనుకూలత.. స్త్రీలకు సంబంధించి సంప్రదాయ ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. కార్పొరేట్ రంగంలో స్త్రీలు సృష్టించిన మార్పులను గుర్తించింది. నాయకత్వ స్థానాల్లో కొనసాగుతున్న పురుషాధిపత్యాన్ని స్త్రీలు తిప్పి కొట్టగలుగుతున్నారనే అభిప్రాయాన్ని 41 శాతం మందికి పైగా వ్యక్తం చేశారు. ఇక వృత్తుల ఎంపిక విషయంలో స్త్రీలు తమ పరిధిని విస్తరించుకుంటున్నారని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
ఇదేం ‘శిక్ష’ణ..?
భద్రాచలం : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు సవ్యంగా కొనసాగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్లను(వైటీసీ) ప్రైవేటు సంస్థలకు అప్పగించటంతో సరైన ఫలితాలు రావటం లేదు. శిక్షణ పేరుతో నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా యువతకు ఉపాధి లభించటం లేదు. ఈ కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో నామమాత్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వివిధ శిక్షణ కేంద్రాలను ‘సాక్షి’ పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గ్రామ్ తరంగ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కేంద్రంలో ఒక్క జేడీఏ(జనరల్ డ్యూటీ అసిస్టెంట్) కోర్సులో మాత్రమే విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఆదివారం ఈ కేంద్రాన్ని పరిశీలించగా 10 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 360 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం కో– ఆర్డినేటర్ రవితేజ తెలిపారు. కానీ ఇందులో సేంద్రియ వ్యవసాయ సాగు, కోళ్ల పెంపకం వంటి అంశాల్లోనే సుమారు 240 మందికి శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్(ఉద్యోగం) చూపించాలనే నిబంధన ఉండటంతో ఇటువంటి వాటికే ఎక్కువ శ్రద్ధ చూపుతన్నారనే విమర్శ ఉంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో కేంద్రం నడిచిన సమయంలో దీనికి ఫర్నిచర్, ఇతర సామగ్రి పెద్ద ఎత్తున సరఫరా చేయగా, అవన్నీ గదుల్లో వృథా గా కనిపిస్తున్నాయి. జిల్లాలో 50 వేల మందికిగా పైగా నిరుద్యోగ అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకున్నప్పటికీ, ఇక్కడికి మాత్రం అభ్యర్థులు రాకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే గతంలో వచ్చిన అభ్యర్థులే మళ్లీ మరో కోర్సుకు వస్తుండటం గమనార్హం. అంటే శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ సవ్యంగా జరగడం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం నిర్వహణపై కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు దృష్టి సారించాలని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం అస్తవ్యస్తం... మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్న సమయంలో మంజూరైన నిధులతో భద్రాచలం, కొత్తగూడెం, వాజేడులో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల్లో గల ఐటీఐ ప్రిన్సిపాల్స్కు అప్పగించారు. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షలు మంజూరు కాగా, ఇందులో రూ.35 లక్షలతో భవనాలు నిర్మించారు. మిగతా నిధులతో టైలరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ భవనాన్ని వృథాగానే వదిలేసి భద్రాచలం డిగ్రీ కాలేజీ సమీపంలోని గిరిజన బాలికల సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ ప్రాంగణంలో ఓ మూలకు ఉన్న రేకుల షెడ్లలో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిలోనూ ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబసభ్యులు, గృహిణులు, వివిధ కోర్సుల్లో ప్రస్తుతం చదువుతున్న వారే ఉన్నారు. కొత్తగూడేనికి భవిత సెల్... గిరిజన యువతకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ఐటీడీఏలో ‘భవిత సెల్’ ఏర్పాటు చేశా రు. నిరుద్యోగ గిరిజన యువత ఇక్కడ పేరు నమోదు చేసుకుంటే చాలు, వారి చెంతకే ఉపా ధి, ఉద్యోగ అవకాశాల సమాచారం చేరేలా ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఐటీడీఏ ప్రాంగణంలోనే ఉన్న యూత్ ట్రైనింగ్ సెంట ర్లో వివిధ పోటీ పరీక్షల కోసం గిరిజన అభ్యర్థులకు వరుసగా ఉచిత శిక్షణలు ఇప్పించారు. కానీ నేడు సీన్ మారిపోయింది. యూత్ ట్రైనింగ్ సెంటర్లు ప్రైవేటు సంస్థలకు అప్పగించటంతో ‘భవిత సెల్’ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జాబ్ రిసోర్స్ పర్సన్(జేఆర్పీ)లకు పనిలేకుండా పోయింది. దీంతో ఈ కేంద్రాన్ని నేడో, రేపో భద్రాచలం నుంచి కొత్తగూడెం తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీని బాధ్యతలను పర్యవేక్షించే ఏపీఎం స్థాయి అధికారి ఇప్పటికే కొత్తగూడెం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో దీనిని ఇక్కడి నుంచి మార్చేందుకు అంతా సిద్ధమైంది. ఇదే జరిగితే శిక్షణలపై ఇక పూర్తిగా ప్రైవేటు పెత్తనం సాగనుంది. గిరిజన నిరుద్యోగులు 50 వేలకు పైనే.. భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తాజా లెక్కల ప్రకారం 50 వేల మందికి పైగానే పేర్లు నమోదు చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులు తమ విద్యార్హతలను భద్రాచలంలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలోనే నమోదు చేసుకోవాలి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాలు ఏజెన్సీ పరిధిలోనే ఉండటంతో ఇక్కడ నమోదయ్యే గణాంకాలనే అధికారులు పరిగణలోకి తీసుకుని, నిరుద్యోగుల లెక్క చూపుతారు. ఇలా నమోదు చేసుకున్న వారిలో పదో తరగతి విద్యార్హతతో సుమారు 21 వేల మంది, ఇంటర్తో 13,500 మంది, డిగ్రీ పట్టభద్రులు 7,800 మంది ఉన్నారు. పదో తరగతి లోపు చదువుకున్న వారు 3 వేల మంది ఉండగా, వీరితో పాటు నర్సింగ్, వివిధ రకాల టెక్నికల్ కోర్సులు చేసిన వారు కూడా వేలల్లోనే ఉన్నారు. కానీ ఇక్కడ పేరు నమోదు చేసుకోవటమే తప్ప అర్హులైన వారికి, కనీసం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సమాచారం కూడా రావటం లేదు. ఉపాధి చూపని కోర్సులు... యువతకు సత్వర ఉపాధి దొరికేలా ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లోనే గతంలో శిక్షణ ఇచ్చేవారు. ప్లంబింగ్ అండ్ రాడ్ బైండింగ్, వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ అండ్ హౌస్వైరింగ్, బోర్ వెల్ రిపేర్, ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్, కంప్యూటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెబైల్ సర్వీసు, రిపేరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చే వారు. మూడు నెలల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలను కల్పించి, శిక్షణ ఇవ్వటంతో పాటు, కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత స్వయంగా ఉపాధి పొందేలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా కల్పించేవారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో కేంద్రం నుంచి ఏడాదికి 400 మందికి పైగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చే వారు. కానీ ప్రస్తుతం ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహిస్తున్న కేంద్రాల్లో నిర్వాహకులకు అనువుగా ఉన్న కోర్సుల్లోనే శిక్షణ ఇస్తున్నారు. ఈ కారణంగా నిరుద్యోగ యువత వీటిపై ఆసక్తి చూపటం లేదు. -
నిరుద్యోగ యువతకు శిక్షణ
తాండూరు రూరల్ : నిరుద్యోగ యువతకు విభిన్నరంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో రూర్బన్ నిధులు రూ.2 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలో యువతకు స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఈ సెంటర్ను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. పెళ్లికోసం అప్పు చేయొద్దు కూతురు పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయొద్దని మంత్రి మహేందర్రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన 79 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎంపీపీ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ రవిగౌడ్, తహసీల్దార్ రాములు, జినుగుర్తి సర్పంచ్ పాపమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బాలమణి, నాయకులు రాంలింగారెడ్డి, శ్యామప్ప, శ్రీనివాస్గౌడ్, అమృత్రెడ్డి ఉన్నారు. -
ముద్రా యోజనకు రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరాల జల్లు కురిపించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ముద్రా పథకం కింద రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. 2015 ఏప్రిల్లో ప్రారంభించిన ముద్రా యోజన పథకం ద్వారా రూ.4.6 లక్షల కోట్ల రుణాలను ఇచ్చారు. ఈ పథకం కింద 10.38 కోట్ల మంది లబ్ధిపొందారు. రుణ ఖాతాలు ఉన్న వారిలో 76 శాతం మంది మహిళలు ఉండగా, 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారని జైట్లీ తెలిపారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన(పీఎమ్ఎమ్వై)లో శిశు, కిషోర్, తరుణ్ అనే పథకాల కింద రుణాలను ఇస్తారు. -
నాటా ఆధ్వర్యంలో వరంగల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
హన్మకొండ చౌరస్తా: అద్భుత ఫలితాలు అందించే యువతరాన్ని సానపెట్టడమే తమ లక్ష్యమని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సామల ప్రదీప్ అన్నారు. వరంగల్ నగరానికి చెందిన సామల ప్రదీప్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికాల వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాటా సేవా డేస్ పేరుతో ప్రతీ రెండేళ్లకు ఓ సారి స్వంత ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో 2015లో సేవ్ చైల్డ్ గర్డ్ థీమ్తో పని చేశారు. ఈ సారి భావి భవిత యువత అనే కాన్సెప్టుతో డిసెంబరు 21న వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రదీప్ వెల్లడించారు. ... నెగిటివ్ తగ్గించాలి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరం. ఎడ్యుకేషన్ హబ్ దేశ భవిష్యత్తును నిర్ణయించే యువతరం ఇక్కడుంది. కానీ కాలేజ్ ఏజ్లో లక్ష్యానికి దూరంగా తీసుకెళ్లే ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటికి ఈ కోవలోకే వస్తాయి. వీటికి సమ యువత, సమాజం నుంచి క్రమక్రమంగా ఆమోదముద్ర లభించడం మంచి పరిణామంక కాదు. పాజిటివ్ పెంచాలి పరీక్షల్లో పాసవడమే లక్ష్యంగా చదువుల సాగించే విద్యార్థులు గ్లోబలేజేషన్ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, ఉపాధి పొందడం కష్టం. నేటి పరిస్థితులకు తగ్గట్లుగా విద్యార్థులు తమలో ఉన్న సహాజ ప్రతిభకు ఎలా మెరుగు పెట్టుకోవాలి, మన ప్రయత్నంలో ఎదురయ్యే అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి. మన సమస్యలకు పరిష్కార మార్గాలు వినూత్నంగా ఎలా ఎంచుకోవాలి అనే అంశంపై నిపుణులతో సమావేశాల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు జనాభాలో సగం ఉన్న మహిళల సాధికరత సాధించడం ఎంతో కీలకం. అందుకే మహిళా సాధికారతకు నాటా పెద్ద పీట వేస్తుంది. 21న కార్యక్రమాలు నైపుణ్యం కలిగిన యువత, మహిళా సాధికారత లక్ష్యంగా మారథాన్ వాక్, సెమినార్లు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. డిసెంబరు 21న ఉదయం 7:00 గంటలకు వేయిస్థంభాలగుడి నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు మారథాన్ వాక్ నిర్వహిస్తున్నాం. ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సభర్వాల్, సినీ నటులు అలి, పూనమ్కౌర్లు ఈ వాక్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:00– నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు డ్రగ్స్,డ్రైవ్ అంశంపై అకున్ సభర్వాల్, మిషన్ స్మార్ట్రైడ్ ఎన్జీవోకు చెందిన నందా భాఘీ, వోట్ 4 గర్ల్స్ సంస్థ నుంచి అనుషా భర ధ్వాజ్, హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. లీడ్ ఇండియా 20:20 సీఈవో హరి ఇప్పనపల్లిలు దేశాభివద్ధిలో యువత, స్త్రీల పాత్ర అనే అంశాలపై ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ జిల్లాలకు చెందిన 40 మంది విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు అందచేస్తారు. సాంస్కతిక కార్యక్రమాలు నాటా సేవా డేస్ ముగింపు సందర్భంగా డిసెంబరు 21 సాయంత్రం 7 గంటలకు పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో ఉన్న జానపద కళాకారులచే ప్రదర్శన,కళాకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు రఘుకుంచే,గాయకులు గీతామాధురి, శ్రీ కష్ణ తదితరులు పాల్గొంటారు. -
రాష్ట్రంలో ‘నైపుణ్యం’ పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైపుణ్య కొలువుల శాతం తగ్గిపోతోంది. ఐటీ, మేనేజ్మెంట్, బీపీవో, కేపీవో వంటి రంగాల్లో నైపుణ్యం గల ఉద్యోగాల సాధన కత్తిమీద సాములానే మారుతోంది. రాష్ట్రంలో ఈ తరహా ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ సర్వేలో తేలింది. నైపుణ్యం గల ఉద్యోగాల కల్పన, డిమాండ్లో తెలంగాణ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కళాశాలల్లో నాసిరకం బోధన, ఆంగ్ల భాషపై పట్టులేకపోవడం, నైపుణ్య అంశాల్లో తగిన శిక్షణ లభించకపోవడం వంటివి ఈ పరిస్థితికి కారణమని యాస్పైరింగ్ మైండ్స్ సర్వే నివేదికలో వెల్లడించింది. మహారాష్ట్ర టాప్: యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ నైపుణ్య ఉద్యోగాల అంశంపై ఇటీవల దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. తమ అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ‘స్కిల్ డెవలప్మెంట్–2017’పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో నైపుణ్య ఉద్యోగాల కల్పన విషయంలో (ఓపెన్ జాబ్ ఆపర్చునిటీస్) దేశంలో మహారాష్ట్ర అగ్రభాగాన నిలిచింది. ఆ రాష్ట్రంలో 19.72 శాతం నైపుణ్య కొలువుల అవకాశాలున్నట్లు నివేదికలో వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ తర్వాతి స్థానాల్లో నిలవగా.. తెలంగాణ కేవలం 3.47 శాతం నైపుణ్య కొలువులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ‘సాఫ్ట్వేర్’లో బోలెడు అవకాశాలు నైపుణ్య ఉద్యోగాల కల్పన విషయంలో ఆయా రంగాల వారీగా పరిశీలిస్తే.. నైపుణ్యం గల సాఫ్ట్వేర్ డెవలపర్స్ కొలువులకు పలు రాష్ట్రాల్లో భారీగా డిమాండ్ ఉన్నట్లు సర్వే తేల్చింది. తర్వాతి స్థానంలో అమ్మకాల పరిస్థితిని గమనించే (సేల్స్ సిచ్యువేషన్) రంగం నిలిచింది. కస్టమర్ సర్వీస (సేవా రంగం) మూడో స్థానంలో నిలవగా.. హార్డ్వేర్ రంగం నాలుగో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 24 రాష్ట్రాల్లో పరిస్థితిని పరిశీలిస్తే ఇదే విషయం సుస్పష్టమైందని పేర్కొంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పనలో టాప్ ఐదు రాష్ట్రాలు రాష్ట్రం ర్యాంకు సాఫ్ట్వేర్ కొలువుల శాతం కర్నాటక 1 17.47 మహారాష్ట్ర 2 17.23 తమిళనాడు 3 12.12 ఢిల్లీ 4 11.11 గుజరాత్ 5 8.08 (మొత్తం నైపుణ్య ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల శాతం) ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో అధిక జనాభాకు అనుగుణంగా నైపుణ్య ఉద్యోగాల కల్పన జరగడం లేదని సర్వే తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్లలో మాత్రం ప్రతి లక్ష మందికి ఉద్యోగాల కల్పన విషయంలో మెరుగైన స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులు మాత్రం అత్యధిక ఉద్యోగాల కల్పనతో అగ్రభాగాన నిలిచినట్లు తెలిపింది. రాష్ట్రంలో నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణాలివే.. – ఆంగ్లభాషపై పట్టు సాధించకపోవడం: ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, వివిధ రకాల డాక్యుమెంట్లు రాయడంలో అనుభవం లేకపోవడం – డిడక్టివ్ రీజనింగ్ లోపం: వివిధ రకాల డేటాను విశ్లేషించి సులభతరంగా మార్చే నైపుణ్యం కొరవడడం – ఇండక్టివ్ రీజనింగ్లో లోపం: వివిధ రకాల అప్లికేషన్స్ను విశదీకరించి క్రోడీకరించే సామర్థ్యం లేకపోవడం – ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ సింథసిస్ లోపం: సమాచార సేకరణ, దానిని విశ్లేషించే సామర్థ్య లోపం – క్వాంటిటేటివ్ ఏబిలిటీ: అర్థ గణాంకాల విశ్లేషణ, సమస్యా పరిష్కారం విషయంలో వెనుకబడడం – మౌఖిక పరీక్షలు, బృంద చర్చల్లో విఫలం కావడం – కళాశాలల్లో విద్యార్థులకు మల్టీ టాస్కింగ్, నైపుణ్య అంశాల్లో సరైన శిక్షణ లభించకపోవడం వంటివి రాష్ట్రంలో నిరుద్యోగులకు నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణమని యాస్పైరింగ్ మైండ్స్ నివేదికలో వెల్లడైంది. -
నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతకే భృతి
సీఎం చంద్రబాబు వెల్లడి సాక్షి, అమరావతి: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. అయితే అది నిరుద్యోగులందరికీ కాదని, కేవలం నైపుణ్య శిక్షణ పొందుతున్న వారికే అని ఆయన వివరించారు. ఏపీలో గ్రామీణ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టామన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో న్యూఢిల్లీకి చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం ఐదు కోట్లతో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించనున్నట్లు కార్పొరేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఏపీలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి చర్చించారు. గత ఏడాది రూ.178 కోట్లతో రాష్ట్రంలోని 8,300 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మించామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది తమ సంస్థ లక్ష్యమని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్సీ)తో కలిసి పనిచేయబోతున్నామని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి.రవి తెలిపారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. -
‘స్కిల్ ఇండియా’పై పర్యవేక్షణ అవసరం
⇒ కేంద్ర హోంశాఖమాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య ⇒ ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ స్కిల్ సమ్మిట్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల అమలు తీరుపై నిత్యపర్యవేక్షణ అత్యవసరమని, తద్వారా మాత్రమే ఆశించిన లక్ష్యాలను సాధించగలమని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య స్పష్టం చేశారు. స్కిల్ ఇండియా పేరుతో రెండేళ్ల క్రితం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు కొత్తేమీ కాదని.. వేర్వేరు రూపాల్లో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. ‘ద ఇండస్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైన ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అండ్ ఎక్స్పో – 2017’కు పద్మనాభయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రానున్న ఐదేళ్లలో 1.27 కోట్ల ఉద్యోగులకు డిమాండ్ ఉంటుందని.. అయితే ప్రస్తుతమున్న ఉద్యోగుల్లోనే తగిన శిక్షణ పొందిన వారు 4.7 శాతం మాత్రమే అన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఉద్యోగుల్లోని తగిన శిక్షణ లేని వారితోపాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి బయటకొస్తున్న పట్టభద్రులకూ భిన్న అంశాల్లో నైపుణ్యాలు అందించాల్సి ఉందని అన్నారు. 2022 నాటికి ఒక్క నిర్మాణ రంగంలోనే దాదాపు మూడు కోట్ల మంది నిపుణుల అవసరముంటుందని పద్మనాభయ్య వివరించారు. పాఠశాల స్థాయి నుంచే..: ఆంధ్రప్రదేశ్లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వేర్వేరు అంశాలపై నైపుణ్యాన్ని కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో కె.వి.సత్యనారాయణ తెలిపారు. 2022 నాటికల్లా కనీసం రెండు కోట్ల మందికి నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ‘ద ఇండస్ గ్లోబల్’అధ్యక్షుడు ఎస్.బి.అనుమోలు, చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి సి.డి.అర్హ, బియర్డ్సెల్ లిమిటెడ్ ఎండీ భరత్ అనుమోలు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో జరిపిన కృషికి గాను పలువురికి కె.పద్మనాభయ్య అవార్డులు అందజేశారు. -
వరంగల్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
♦ మంజూరు చేసిన కేంద్రం ♦ సుశిక్షితులైన డ్రైవర్లుగా తయారు చేయడమే లక్ష్యం ♦ యువత స్వయం ఉపాధికి అవకాశం హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మం జూరు చేసింది. యువత స్వయం ఉపాధి పొం దే అవకాశం కల్పిం చింది. ఈ సెంటర్ ద్వారా యువతకు మోటారు డ్రైవింగ్లో నైపుణ్యం కలిగిన శిక్షణ ఇస్తారు. దేశంలో డ్రైవింగ్ విభాగంలో 100 స్కిల్ డెవలప్మెంట్ సెంట ర్లు ఏర్పాటు చేస్తుండగా ఇందులో మూడు రాష్ట్రాని కి మంజూరయ్యాయి. వాటిలో ఒకటి వరం గల్కు కేటాయిం చింది. మిగతా రెండు హైదరాబాద్కు మంజూరయ్యాయి. తెలంగా ణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీటి నిర్వహణ బాధ్యత తీసుకుంది. రవాణా రంగంలో విశేష అనుభవం ఉన్న ఆర్టీసీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్లోని ఆర్టీసీ సిబ్బంది శిక్షణ కాలేజీ, ట్రైనింగ్ అకాడమీతోపాటు వరంగల్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మంజూరయ్యాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా సుశిక్షితులైన డ్రైవర్లను తయారు చేస్తారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, వీరికి ఈ దిశగా అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్తో పాటు డ్రైవింగ్ ట్రాక్, ఇతర సౌకర్యాలు, శిక్షణ పరికరాల సమకూర్చుకోవడానికి ఒక్కో సెంటర్కు కేంద్రం రూ.కోటి కేటాయించింది. ఇందులో రూ.50 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో డ్రైవింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి ఇతర సంస్థలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వచ్చే నెల 15న దేశ వ్యాప్తంగా ఒకే రోజు 100 స్కిల్ డెవలప్మెంట్ సెటర్లను ప్రారంభించనున్నారు. డ్రైవింగ్ శిక్షణకు సంబం ధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. -
స్కిల్ ఇండియాకు 1,600 కోట్లు
రుణానికి ప్రపంచ బ్యాంకు అంగీకారం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ ఇండియా పథకానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. దేశంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేందుకు అనువుగా శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి రూ.1,600 (250 మిలియన్ డాలర్లు) కోట్ల రుణం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత దేశ ఆర్థికాభివృద్ధికి, సుసంప న్నతకు యువత తోడ్పాటు అందించేందుకు ఈ సాయం దోహదపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. స్కిల్ ఇండియా మిషన్కు 250 మిలియన్ డాలర్లు అందించేందుకు ప్రపంచ బ్యాంకు బోర్డు ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారని, రాష్ట్ర స్థాయిలోనూ.. జాతీయ స్థాయిలోనూ స్వల్పకాలిక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్(3–12 నెలలు లేదా 600 గంటల వరకూ)కు ప్రోత్సాహం అందించేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. 2022 నాటికి దేశంలోని 24 కీలక రంగాల్లో 10.9 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుందని అధికార గణాంకాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ పథకం కింద 15–59 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు, తక్కువ ఉపాధి కలిగిన వారికి నైపుణ్య శిక్షణ అందిస్తారు. అలాగే ఏటా లేబర్ మార్కెట్లోకి వస్తున్న 1.2 కోట్ల మంది 15–29 ఏళ్ల వయసు కలిగిన యువతను కూడా ఇందులో చేరుస్తారు. ఆరేళ్ల కాల పరిమితి కలిగిన ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి 88 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకుని.. మెరుగైన అవకా శాలను.. మెరుగైన వేతనాన్ని పొందుతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా 15 వేల మంది ట్రైనర్లకు, 3 వేల మంది మదింపు అధికారులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది. -
రైతుకు మిగిలింది పుర్రెలు, ఎముకలే
- చంద్రబాబు సర్కారుపై రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆగ్రహం - కలెక్టరేట్ వద్ద పుర్రెలు, ఎముకలతో నిరసన ప్రదర్శన కల్లూరు (రూరల్) : సీఎం చంద్రబాబు వ్యవసాయాభివృద్ధిపై చేసిన నిర్లక్ష్యం కారణంగా రైతులకు పుర్రెలు, ఎముకలే మిగిలాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం అన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలు, ఎముకలతో మంగళవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు కనీస ఉపశమన చర్యలు కూడా చేపట్టకుండా రైతులను అప్పుల ఊబిలోకి తోసేశారన్నారు. అప్పుల బాధ భరించలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారి పుర్రెలు మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని కోరారు. ఉల్లి, టమాట, మిర్చి, కందులు, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కరువు ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరువు మండలాల్లో ప్రతి రైతుకూ ఐదెకరాలకు సరిపడా విత్తనాలను 90 శాతం సబ్సిడీ పంపిణీ చేయాలని, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ పంటలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించి పంట నష్టపరిహారం డబ్బులు వరుసగా రూ.73 కోట్లు, రూ.45 కోట్లు, రూ.325 కోట్లు మంజూరు చేసినా రైతు ఖాతాలకు జమ చేయలేదని, వెంటనే ఆ ప్రక్రియ పూర్త చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, వీహెచ్పీఎస్ కన్వీనర్ మహేష్, ఏఐవైఎఫ్ టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబయ్య, రైతులు రంగన్న, పుల్లన్న, పెద్దయ్య, రంగన్న, ఫాతిమా, అమీనమ్మ పాల్గొన్నారు. -
అమెరికా బాటలో న్యూజిలాండ్
వెల్లింగ్టన్ : తమ దేశంలోని ఉద్యోగాలను కాపాడుకోవడానికి వలస నిబంధనలు కఠినతరం చేసిన దేశాల జాబితాలో అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు తాజాగా న్యూజిలాండ్ చేరింది. నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు దేశంలోకి తీసుకురావడంపై నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం తెలిపింది. న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ మంత్రి మైఖేల్ వుడ్హౌస్ మీడియాతో మాట్లాడుతూ, న్యూజిలాండ్లోని చాలా కంపెనీలు విదేశీ ఉద్యోగులపై ఆధారపడ్డాయని తెలిపారు. విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకోవడం కంపెనీలకు తలకుమించిన భారంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం న్యూజిలాండ్ జాతీయుల అభివృద్ధి, సంక్షేమానికే కట్టుబడి ఉందని వుడ్హౌస్ స్పష్టం చేశారు. అధిక నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు వేతన పరిమితి పెంచడం వంటి చర్యలు నూతన విధానంలో భాగంగా తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఉపాధికి పాలి‘టెక్నిక్’
- ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం - ఈ నెల13 వరకు అవకాశం - జిల్లాలో 14 కాలేజీలు, 2800 సీట్లు కర్నూలు సిటీ: పాలిటెక్నిక్.. పదో తరగతి పాసైన తరువాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించేందుకు చక్కని మార్గం. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల13వ తేది వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఇంజినీరింగ్లో డిప్లమా సర్టిఫికెట్ పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అనువైనవి. మధ్య తరగతి, దిగువ మధ్య తరతగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ కోర్సులు ప్రవేశ పెట్టారు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియేట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా అంత స్థోమత లేని వాళ్లు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతల విద్యార్థులు పదో తరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లమా పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మూడేళ్ల కోర్సు పూర్తయిన వారు.. ఈ–సెట్ రాసి నేరుగా బీటెక్ సెకెండ్ ఇయర్లో ప్రవేశించవచ్చు. జిల్లాలో ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, రెండు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఆరు ఇంజినీరింగ్ కాలేజీలు తరగతులు అయిన తరువాత మధ్యాహ్నం నుంచి పాలిటెక్నిక్ కోర్సును బోధిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 2,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఇవీ.. ప్రభుత్వ ఉద్యోగిగా మారేందుకు పాలిటెక్నిక్ కోర్సు వనరుగా మారుతోంది. ఎలక్ట్రికల్ కోర్సులు పూర్తి చేస్తే ఒ.ఎన్.జి.సిలోను, రైల్వే, విద్యుత్ విభాగంలోను, విద్యుత్ ఉపకేంద్రాల్లోను, వివిధ పరిశ్రమల్లోను ఉద్యోగాలు సాధించవచ్చు. మెకానికల్ కోర్సులు పూర్తి చేస్తే రైల్వే, ఆర్టీసీ, ఉక్కు పరిశ్రమల్లోను, గడియారం పరిశ్రమల్లో ఉపాధి సులువుగానే లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు పూర్తి చేసిన వారికి.. రైల్వే, బి.ఎస్.ఎన్.ఎల్, ఇతర సెల్ఫోన్ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి. సివిల్ కోర్సు పూర్తి చేస్తే రోడ్డు, భవనాల శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఒ.ఎన్.జి.సిలో ఉద్యోగాలు లభిస్తాయి. కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఈ–సెట్ రాసి ఇంజినీరింగ్లో చేరితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించవచ్చు. బ్రిడ్జి కోర్సు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారు.. సాధారణ డిగ్రీలో రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుంది. ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేలా (బ్రిడ్జి కోర్సు) గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. ఇంటర్ పూర్తి అయితే బ్రిడ్జి కోర్సు ద్వారా ఒకేషనల్ కోర్సులో రెండో సంవత్సరంలో చేరవచ్చు. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సులో మొదటి రెండేళ్లు పూర్తయ్యాక.. గతంలో ఆరు నెలలు పరిశ్రమల్లో నైపుణ్యశిక్షణకు (అప్రెంటిస్) వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆరు నెలల పరిమితిని నెల రోజులకు కుదించారు. ధరఖాస్తు ఇలా చేసుకోవాలి.. ప్రవేశ పరీక్ష రాయలనుకునే విద్యార్థులు ఈ నెల13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా కేంద్రాల్లో రూ.350 చెల్లించి పదో తరగతి హాల్ టికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫొటో జత చేసి దరఖాస్తు చేయాలి. ఈ నెల 28వ లేదీన ప్రవేశ పరీక్ష జరుగనుంది. పరీక్షలో మొత్తం 120 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో గణితం నుంచి 60, భౌతిక శాస్త్రం నుంచి 30, రసాయన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయం నిర్ణయించారు. ఉద్యోగాలు సులువుగా వస్తాయి – విజయ భాస్కర్, పాలిటెక్నిక్ కాలేజీల కన్వీనర్ పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారికి టెక్నీషియన్ ఉద్యోగాలు సులువుగా వస్తాయి. ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నీషియన్లదే కీలక పాత్ర. ఒక్క ఇంజినీర్కి ఆరుగురు టెక్నీషియన్లు తోడుగా ఉంటారు. నేరుగా ఇంజినీరింగ్ చేసిన వారి కంటే పాలిటెక్నిక్ డిప్లమా ద్వారా వచ్చిన వారికి మంచి నైపుణ్యం ఉంటుంది. డిప్లమా చేసిన వారు.. వృత్తి నైపుణ్యంతో రాణించవచ్చు. -
నైపుణ్యాల లేమితో ఉపాధిలో వెనుకబాటు
భీమవరం : ఇంజినీరింగ్ విద్యార్థుల్లో భాషాపరమైన, భావ ప్రకటనకు సంబంధించిన నైపుణ్యాలు తక్కువగా ఉండటంతో ఉపాధి అవకాశాలు పొందడంలో వెనుకబడిపోతున్నారని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ అన్నారు. భీమవరం బీవీ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో శనివారం జరిగిన విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువ ఇంజినీర్లు ఆంగ్లంపై పట్టు సాధించాలని, ఇందుకు దిన, వార పత్రికలు చదవాలని సూచించారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తితో పాటు సమస్య విశ్లేషణ, పరి ష్కార మార్గాల రూపకల్పన, సంక్లిష్ట సమస్యను పూర్తిగా అర్థం చేసుకో వడం, అత్యాధునిక పరికరాల విని యోగం, భావప్రకటన నైపుణ్యం, నా యకత్వ లక్షణాలు వంటివి కలిగి ఉండాలన్నారు. వాస్తవిక సమస్యలను పరిష్కరిస్తూ మౌలికాంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని సూచిం చారు. చదువుతో పాటు ప్రాజెక్ట్ రూపకల్పనలో ఆసక్తి చూపినప్పుడే భవిష్య త్ బాగుంటుందన్నారు. విట్ కళాశాల ప్రిన్సిపాల్ దశిక సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలపైఅవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సి పాల్ జి.శ్రీనివాసరావు మాట్లాడారు. అనంతరం కళాశాల యాజమాన్యం లక్ష్మీనారాయణను సత్కరించింది. కళాశాల డైరెక్టర్ జె.ప్రసాదరాజు, వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరాజు తదితరు లు పాల్గొన్నారు. -
ఐటీఐల కోసం ప్రత్యేక బోర్డు!
న్యూఢిల్లీ: ఐటీఐల కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల సీబీ ఎస్ఈ వంటి బోర్డుల తరహాలోనే ఐటీఐ విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు, సర్టిఫికెట్లు అందజేసేందుకు వీలేర్పడుతుంది. ఈ బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లు సీబీఎస్ఈ వంటి రెగ్యులర్ బోర్డులు జారీ చేసే పది, పన్నెండు తరగతుల సర్టిఫికెట్లకు సమానంగా పరిగణించడం జరుగుతుంది. తాజా ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏటా 13 వేల ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్(ఐటీఐల)లలో విద్య నభ్యసిస్తున్న 20 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. అంతేగాక ఐటీఐ కోర్సుల విద్యార్థులు ఇతర స్కూళ్లు, కళాశాలల్లోని రెగ్యులర్ కోర్సులు చేసేందుకూ వీలేర్పడుతుంది. బుధవారం లోక్సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రతిపాదిత ఐటీఐ బోర్డు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో ఉంటుందని తెలిపారు. ఈ బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లు రెగ్యులర్ బోర్డులు జారీ చేసే పదోతరగతి, 12వ తరగతి సర్టిఫికెట్లకు సమానంగా పరిగణించడం జరుగుతుందన్నారు. -
పునఃశ్చరణతో నైపుణ్యాల మెరుగు
– ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: పునఃశ్చరణ తరగతులతో నైపుణ్యాన్ని మరింత పెంచుకోవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఏఆర్ సిబ్బందికి మొబలైజేషన్ తరగతులను బుధవారం.. జిల్లా పోలీసు కార్యాలయంలోని కవాతు మైదానంలో ఎస్పీ ప్రారంభించారు. ఈ తరగతులు 14 రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటిరోజు యోగాతో తరగతులను ప్రారంభించారు. యోగా మాస్టర్ సత్యనారాయణమూర్తి పోలీసు సిబ్బందితో యోగాసనాలు చేయించారు. కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరై సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. అన్ని విభాగాల్లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. బందోబస్తుల్లో ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామంతో పాటు యోగా చేయాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్ఐలు రంగముని, జార్జి, ఆర్ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మాణ కార్మికుల నమోదుకు ప్రత్యేక డ్రైవ్
రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపునిచ్చేందుకు వారి పేర్లు నమోదు చేస్తామని, ఇందుకు ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్చేపట్టనున్నామని హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. భవన నిర్మాణ కార్మికు ల సంక్షేమంపై ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 9.49 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా నమోదై ఉన్నారని చెప్పారు. ఇప్పటికే భవన నిర్మాణ సంక్షేమ మండలి ద్వారా 69 వేల మందికి పైగా కార్మికులకు రూ.82.55 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మరో 10 కోట్ల వ్యయంతో 35,375 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. -
నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగావకాశాలు
ఎస్వీఐటీ కళాశాల వైస్ చైర్మన్ సి.చక్రధర్రెడ్డి రాప్తాడు : నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయని ఎస్వీఐటీ కళాశాల చైర్మన్ సి.చక్రధర్రెడ్డి, ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్రెడ్డి అన్నారు. కళాశాలలో ఆదివారం ఆన్లైన్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. బీటెక్ ఫైనల్ విద్యార్థులు ఆన్లైన్ప పరీక్షలకు హాజరయ్యారు. సి.చక్రధర్రెడ్డి మాట్లాడుతూ సబ్జెక్టులో నాలెడ్జీ ఉన్నా ప్రాక్టికల్ నాలెడ్జి లేకపోవడంతో విద్యార్థులు వెనుకబడుతున్నారన్నారు. పోటీ పరీక్షల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానంతోపాటు, నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు సబ్జెక్టుతోపాటు వారితో నూ తన అంశాలపై పరిశోధనలు చేయించాలని సూచించారు. అనం తరం ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి, ఇంటర్వూ ్యలను ఎలా ఎదుర్కోవాలి, తదితర అంశాలపై అవగాహన కల్పిం చారు. ప్లేస్మేంట్ ఆఫీసర్ కిరణ్కుమార్, ఏవో మథు సూద¯ŒSరెడ్డి, పీడీ శ్రీనివాసుల నాయక్, సిబ్బంది, పాల్గొన్నారు. -
'లక్ష మంది ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ'
ఏలూరు: రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి, సంక్షేమం, ఐక్యత ప్రధాన అంశాలుగా వారి ఆర్థికాభివృద్ధికోసం భూమి కొనుగోలు పథకాన్ని మరింత మెరుగ్గా అమలుచేయాలని నిర్ణయించామని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. స్థానిక జెడ్పీ అతిథిగృహంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కోసం అమలుచేస్తున్న భూమి కొనుగోలు పథకాన్ని ఇచ్చే రుణాన్ని రూ.5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచామని, తొలి విడతగా 1200 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో లక్ష మంది ఎస్సీ అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కార్యక్రమాలు రూపొందించామన్నారు. -
వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్ పేట): ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) ప్రధమ్ సంస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువతీయువకులకు ఒకేషనల్ స్కిల్స్లో శిక్షణ ఇ్వనున్నారు. ప్రాథమిక పరీక్ష ఆధారంగా ఇంటర్వూ్య నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఆటోమోటివ్, కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, కన్స్ట్రక్షన్, హెల్త్కేర్, బ్యూటీషియన్, హోటల్మేనేజ్మెంట్ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి, యూనిఫాం, మెటీరియల్ అందిస్తామని కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9052380148, 9849066402లో సంప్రదించాలని కోరారు. -
విద్యార్థులకు పరిశోధనలే కీలకం
కానూరు (పెనమలూరు): విద్యార్థులు పరిశోధనల పై దృష్టి పెట్టాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఇస్రో ఆ«ధ్వర్యంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేడు పరిశోధనలకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం పురోగమించాలంటే విద్యార్థులకు అవగహన కలిగే విధంగా ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఇస్రో జనరల్ మేనేజర్ ఎంఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో అనేక ఉపగ్రహాలను ప్రయోగించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలకు రూపకల్పన చేసి దేశ ప్రజల అవసరాలకు ఉపయోగిస్తామని వివరించారు. కార్యక్రమ కోఆర్డినేటర్ జి.రమేష్బాబు, కాలేజీ కన్వీనర్ ఎం.రాజయ్య, ప్రిన్సిపాల్ ఎవి.రత్నప్రసాద్, ప్రొఫెసర్ పద్మజ పాల్గొన్నారు. -
8న మెగా జాబ్మేళా
మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గుడివాడలోని కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్లో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ సుంకరి రామకృష్ణారావు తెలిపారు. ఈ జాబ్మేళాలలో 20 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థుల అర్హతను బట్టి ఎంపిక జరుగుతుందన్నారు. విద్యార్థులు డిగ్రీ, డిప్లమో, ఇంటర్, బీ–ఫార్మసీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన వారు ఇంటర్వ్యూలు హాజరుకావచ్చునని సూచించారు. -
'త్వరలో రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై శిక్షణ'
ఒంగోలు : మరికొద్ది రోజుల్లోనే రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం చేపడతామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగమ్మ కాలేజీలో ప్రకాశం నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని (స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకి భరోసా కల్పించే కార్యక్రమంగా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే మూడేళ్లలో జిల్లాలోని నిరుద్యోగులందరికీ శిక్షణా, ఉద్యోగం కల్పించడమే లక్ష్యమని వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
నైపుణ్యం ఉంటే ఉపాధికి కొదవే లేదు
అంతర్జాతీయ బిగ్ డేటా విశ్లేషకులు సునీల్ ములగాడ వెలుగుబంద (రాజానగరం) : ఐటీ రంగంలో అపారమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడానికి నైపుణ్యం, ప్రతిభ మినహా దేశ, విదేశాలతో సంబంధం లేదని అంతర్జాతీయ బిగ్ డేటా విశ్లేషకులు సునీల్ ములగాడ తెలిపారు. తాను దశాబ్దకాలం పాటు అమెరికాలో పొందిన అనుభవాన్ని మన దేశానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తానన్నారు. స్థానిక గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో టెక్ ఏ క్ట్స్రీమ్ పేరిట బిగ్ డేటా, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్పై నిర్వహిస్తున్న వర్క్షాపును చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ఎన్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి త్వరితగతిన ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్పర్ గ్యాన్ దుద్దిపూడి మాట్లాడుతూ ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్లో కఠోర శ్రమ ద్వారానే కమర్షియల్ అప్లికేషన్స్ విరివిగా చేయగలుగుతున్నామని చెప్పారు. వీటిలో ఉన్న ప్రత్యేకతను విద్యార్థులకు నేర్పడాన్ని ఒక హాబీగా పెట్టుకున్నామన్నారు. తాను చదివిన కళాశాలలో నిర్వహించే సదస్సుకు ఈ విధంగా హాజరుకావడం ఎంతో గర్వంగా ఉందని పూర్వ విద్యార్థి, డ్రీమ్ స్టెప్ సాఫ్ట్వేర్ అధినేత అనిల్ ఆనందం వ్యక్తం చేశారు. సంక్లిష్ట విశ్లేషణపై సరైన తర్ఫీదు ఇవ్వాలనే ఉద్ధేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సూర్యనారాయణరాజు తెలిపారు. సదస్సుకు రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, టెక్నికల్ క్విజ్, స్టార్టప్ ఐడియాస్పై పోటీలు నిర్వహిస్తామన్నారు. సీఎస్ఈ విభాగం హెచ్ఓడీ డాక్టర్ వై.వెంకట్ కన్వీనర్గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళాలు
చింతలపూడి : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగుల కోసం మరిన్ని ఉద్యోగ మేళాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గోలి నితిన్రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను ఉదయలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లిష్ భాషలో పట్టు సాధించాలని, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న కళాశాలలను పటిష్ట పరిచి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు చెప్పారు. కళాశాల అభివద్ధికి సహకరిస్తున్న సీపీడీసీ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సత్యన్నారాయణ, వైస్ జిల్లా గవర్నర్ కేవీ కిషోర్కుమార్, డీసీ చిల్లపల్లి మోహన్రావు, చింతలపూడి లయన్స్క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ పాల్గొన్నారు. -
నైపుణ్య వృద్ధితోనే అవకాశాలు
మైలవరం: వృత్తి విద్యలో విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఇ.వి. ప్రసాద్ తెలిపారు. ఐటి, ఎమ్సిఏ తృతీయ సంవత్సరం విద్యార్థులకు మీన్ స్టాక్ టెక్నాలజీ అండ్ క్లౌడ్ అనే అంశంపై విశాఖపట్నంకు చెందిన మిరాకిల్ సాఫ్ట్ సంస్థ సాంకేతిక సహకారంతో మూడు రోజులు వర్క్షాప్ను మంగళవారం ప్రారంభించారు. ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యోగాలకు పోటీ పెరుగుతుందన్నారు. దానికి అనుగుణంగా విద్యార్థులు ఇప్పటి నుంచే వృత్తి విద్య నైపుణ్యాల్లో వెళకువలు ఎలా పెంపొందించాలో తెలుసుకుని సంసిద్ధం కావాలన్నారు. ఐఒటి, హడూప్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ల మీద విద్యార్ధులు పట్టు సంపాదించాలన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ ఆర్ చంద్రశేఖరం, సిఎస్ఇ విభాగాధిపతి డాక్టర్ యన్. రవిశంకర్, ఐటి విభాగాధిపతి డాక్టర్ డి.నాగరాజు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలి
కోదాడ: యువత మారుతున్న కాలానికి అనుగుణంగా తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని విశ్రాంత అధా«్యపకుడు డాక్టర్ అందె సత్యం కోరారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా కోదాడలోని ఈవీరెడ్డి డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఐదురోజుల సెమినార్లో రెండో రోజు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతూ ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని, ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనే నైపుణ్యం కలిగి ఉండాలని కోరారు. పారిశ్రామిక విష్లవం వల్ల చేతివృత్తులకు విఘాతం కలిగిందని, దానిని అదిగమించానికి యువత కొత్త నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కోరారు. పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు వలంటీర్లు కృషి చెయాలని, పర్యావరణం దెబ్బతింటే బతకు దుర్బరంగా మారుతుందన్నారు. మహిళ నాయకురాలు బంగారు నాగమణి మాట్లాడుతూ లింగ వివక్షతను రూపుమాపాలని, బాలికలు కూడ పురుషులతో పాటు అన్ని రంగాల్లో రాణించే నైపుణ్యాలను కలిగి ఉండాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ గింజల రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాయపూడి చిన్ని, జీఎల్ఎన్రెడ్డి, చిలకా రమేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
200 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు!
ఘంటా సుబ్బారావు వెల్లడి మచిలీపట్నం టౌన్ : విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించేందుకు కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ ఘంటా సుబ్బారావు అన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సిరి కళ్యాణ మండపంలో జిల్లాలోని డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్స్కు అవగాహనా సదస్సును నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ 200 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ యేడాది 2.5 లక్షల మందికి నైపుణ్య వృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. కృష్ణా యూనివర్శిటీ వైస్ఛాన్స్లర్ సుంకరి రామకృష్ణారావు మాట్లాడుతూ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ కంపెనీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చన్నారు. రిజిష్ట్రార్ డి సూర్యచంద్రరావు పాల్గొన్నారు. -
నైపుణ్యం పెంచుకోవాలి
వైద్య శాఖ సిబ్బందికి ఏడీఎంహెచ్ఓ సూచన ఎంజీఎం : సీహెచ్సీ, పీ హెచ్సీల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆర్గనైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు వృత్తిలో నైపుణ్యం మెరుగుపరచుకోవాలని అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం సూచించారు. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వై ద్యారోగ్య శాఖలోని పలు పథకాల నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాం మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మాతా శిశు మరణాలు నమోౖ§ð నప్పుడు వైద్యాధికారి, ఇతర అధికారులు వాటి కారణాలను పూర్తిగా విశ్లిషించాలని సూచించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కాయకల్ప్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ, సీహెచ్సీల్లో మౌలిక వసతుల ఏర్పాటు, సుందరీకరణ, మెరుగైన వైద్యసేవల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 2న అవార్డులు ఇస్తామని ప్రకటించారు. దీనిపై శనివారం ఐఎంఏ హాల్లో వైద్యాధికారులకు వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి కాంతారావు, డిప్యూటీ డెమోలు నాగరాజు, స్వరూపరాణి పాల్గొన్నారు. -
పరభాషా సాహిత్యం అనువాదంపై విచక్షణ అవసరం
విశాఖ–కల్చరల్ తెలుగు సాహిత్య ఆరంభాలే అనువాదంపై ఆధారపడ్డ బలమైన నిర్మాణాలని పలువురు సాహితీవేత్తలు సూచించారు. విభిన్న మానవ సమాజంల్లోని ప్రజలు ఒక సమాజంలో ఏం జరుగతున్నదీ తెలుసుకోవాలంటే...ఆ భాషలో రాసింది ఇంకోక భాషలోకి వెళ్లడం చాలా అవసరమని పేర్కొన్నారు. అనువాద రంగంలో తొలిసారిగా సాహిత్య అకాడమి ‘అనువాద ధోరణలు–నైపుణ్యాలు’అనే అంశంపై ప్రముఖ అనువాద సాహితీవేత్తలు అనువాద అనుభవాలను క్రోడికరించి ఒక రోజు సదస్సు నిర్వహించారు. విశాఖ పౌరగ్రంథాలయంలో సాహిత్య అకాడమి, మొజాయిక్ సాహిత్య సంస్థ సంయుక్తంగా ఆదివారం ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా çహాజరైన ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పరిభాష సాహిత్య అనువాద ప్రాముఖ్యతను వివరించారు. సంస్కత రచనలు ఎలా తొలినాళ్ల కవులను ప్రభావితం చేసాయో అలానే ఆధునికసాహిత్య ఆరంభాలు కూడా మన పూర్వమహాకవులు మూలాలు ఆధారంగానే తొలి సామాజిక రచనలు, నవలలు, వచనలు పూర్వభూమికలు అయ్యాయన్నారు. ప్రబంధ కవుల కాలం నుంచి సొంత కల్పన,కొంత పౌరాణిక ఇతివత్తాలతో మేళవించి రాయడం మొదలై, తెలుగు కవులు రచనలు స్వతంత్ర ప్రతిపత్తితో వెలుగొందాయని గుర్తి చేశారు. సాహిత్య అకాడమి దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి ఎస్. పి.మహాలింగేశ్వర్ మాట్లాడుతూ అనువాదరంగంలో నగరానికి చెందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎల్.ఆర్.స్వామి, డాక్టర్ ఎ. శేషారత్నం, డాక్టర్ చాగంటి తులసి, వంటి లబ్ది ప్రతిష్టులూ, పురస్కార గ్రహీతలతోపాటుగా, మరికొందరు మహానుభావులు భాషాపటిమతో కషి చేయడం ప్రశంనీయమన్నారు. అనువాద సాహితీవేత్త డాక్టర్ ఎన్. గోపి మాట్లాడుతూ అనువాద లక్షణాలపై వివరించారు. పరభాష సాహిత్యాన్ని అనువదించడంలో అనువధికునికి రెండు భాషలపై పట్టు, నిబద్ధత, నైపుణ్యత అవసరమన్నారు. ముఖ్యంగా విచక్షణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. బహుముఖ భాషాప్రజ్ఞశాలి ఎల్.ఆర్.స్వామి కీలక ప్రసంగం చేశారు. ఆసక్తిగా పత్రాలు సమర్పణ అనంతరం ఏడు భాషల నుంచి పత్ర సమర్పణ కార్యక్రమం ఆసక్తిగా రేపింది. పత్ర సమర్చకులుగా హిందీ, ఇంగ్లీష్, ఒడియా, బెంగాళీ, కన్నడ, మళయాళీ, ఉర్దూభాల నుంచి తెలుగులోకి అనువాదాలపై రెండు భాగాలుగా సదస్సు జరిగింది. మొదటి సభను డాక్టర్ ఎ. శేషారత్నం(హిందీ) అధ్యక్షతన మహీధర రామశాస్త్రి(ఒడియా), రెండోది అబ్దుల్ వాహేద్(ఉర్ధూ) అనువాదాలపైన నిర్వహించారు. కవయిత్రి జగద్దాత్రి(తెలుగు నుంచి ఇంగ్లీష్) అధ్యక్షతన, రామతీర్ధ(బెంగాళీ), శాఖమూరు రాంగోపాల్(కన్నడ), మాటూరి శ్రీనివాస్(ఇంగ్లీష నుంచి తెలుగు)అనువాదాలపైన పత్రసమర్ఫణ చేశారు. పత్రసమర్ఫణ అనంతరం డాక్టర్ చాగంటి తులసి సమాపన ప్రసంగం చేశారు. ఆకట్టుకున్న కథసంధి సాయంత్రం జరిగిన సదస్సులో సీనియర్ పాత్రికేయుడు చింతకింది శ్రీనివాసరావు నిర్వహించిన కథా సంధి ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. తను రచించిన క£ý పఠనం, చర్చాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి,సాహిత్య విమర్శకుడు, అనువాదికుడు రామతీర్ధ మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో విశేష ప్రాధాన్యత గల అనువాద కషులకు అభినందనలు తెలిపారు.సదస్సులో ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు ఆచార్య చందు సుబ్బారావు, ద్విభాష్యం రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
ఎస్ఆర్కేఆర్’లో సాఫ్ట్స్కిల్స్పై శిక్షణ
భీమవరం : నేటి తరం విద్యార్థులు సాఫ్ట్స్కిల్స్లో శిక్షణ పొందితే భావవ్యక్తీకరణ, భాషపై పట్టుసాధించి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదుగుతారని ప్రముఖ సాఫ్ట్స్కిల్స్ సంస్థ సింకరోసర్వ్కు చెందిన లీడ్ట్రైనర్ కేఎల్ శంకర్ చెప్పారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్వవిద్యార్థుల సంఘం వారం రోజుల పాటు నిర్వహించే సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో సాఫ్ట్స్కిల్స్ కేవలం ఉద్యోగావకాశాల కోసమేనని, భావన కంటే తమను తాము తీర్చిదిద్దుకోవాలనే పట్టుదల ఉండాలన్నారు. పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జేవీ నర్సింహరాజు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు విద్యనాటికే ఉద్యోగవకాశాన్ని చేపట్టాలనే పట్టుదలతో నిరంతరం కృషి చేయాలన్నారు. పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు జంపన నర్సింహరాజు, డాక్టర్ ఎం.గజపతిరాజు పాల్గొన్నారు. -
టీఎన్ఐటీ జీఓ ప్రతులు దహనం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ సామర్థ్యాల మదింపు పేరుతో ట్రై నింగ్ నీడ్ ఐడెంటిఫికేషన్ టెస్టు(టీఎన్ఐటీ) నిర్వహించడం ఉపాధ్యాయులను అవమానపరచడమేనని ఎస్ఎల్టీఏ, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి అన్నారు. బోధనానుభవం కలిగిన వారికి సామర్థ్య పరీక్షల పేరుతో టెస్టు నిర్వహించడం సరికాదన్నారు. ఇది ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని శకించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఆదివారం కలెక్టరేట్ ఎదుట జీఓ ప్రతులను దహనం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యమాలు తప్పవన్నారు. సామర్థ్యాల మదింపు కోసం విడుదల చేసిన జీఓ 88ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎల్టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్, గౌరవాధ్యక్షుడు బాలన్న, జిల్లా అధ్యక్షుడు యోగీశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, హెచ్ఎంల సంఘం నాయకుడు శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొంతా సుబ్బారాయుడు పాల్గొన్నారు. -
భావ వ్యక్తీకరణ నైపుణ్యాలతో అవకాశాలు
జేఎన్టీయూ: భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్స్ స్కిల్స్) పెంపొందించుకుంటేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్. వేణుగోపాల్రెడ్డి అన్నారు. శనివారం అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్డే నిర్వహించారు. ఆచార్య వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లిష్తో పాటు జపనీస్, చైనీస్, స్పానిష్ భాషలను విద్యార్థులు నేర్చుకోవాలన్నారు. అనేక విదేశీ కంపెనీలు ఏపీకి రానుండడంతో విదేశీ భాషలు నేర్చుకున్న వారికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ.. కళాశాలలో ఉన్న వసతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజాన్ని ప్రేమించాలని.. అది మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుందన్నారు. -
ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
రాప్తాడు: ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు పరిశోధనలు చేయడం ద్వారా ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని, తద్వారా మేధాశక్తిని సంపాదించవచ్చని మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ)లో కళాశాల డైరెక్టర్ చక్రధర్రెడ్డి అధ్యక్షతన ఫైనల్ ఇయర్ ఈసీఈ, ఈఈఈ చదువుతున్న విద్యార్థులకు రెండు రోజుల పాటు మ్యాట్ ల్యాబ్పై వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ హజరై మ్యాట్ ల్యాబ్లోని పరికరాలు ఎలా పనిచేస్తాయి.. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటి ద్వారా ఎలా టెక్నాలజీని అభివృద్ధి చే యాలనే అంశాలపై విద్యార్థులకు ప్ర యోగాల ద్వారా అవగాహన కల్పిం చారు. అలాగే మ్యాట్ ల్యాబ్పై విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు నూతన ప్రయోగాలు చేస్తూ సరికొత్త ఒరవడికి నాందీ పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సి.చక్రధర్రెడి, కళాశాల ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్రెడ్డి, ఏఓ మధుసూదన్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, హెచ్ఓడీ ఎస్ఎల్వీ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
ఏయూక్యాంపస్: విద్యార్థులు తమ నైపుణ్యాలను అందిపుచ్చుకునే దిశగా కషిచేయాలని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ మందిరంలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విభాగంలో కల్పిస్తున్న వసతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రసాయన శాస్త్రంలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయన్నారు. విద్యార్థులు తమ ఆలోచన శక్తిని విస్తతం చేసుకోవాలన్నారు. విద్యార్థులు పూర్తి సమయాన్ని తరగతి గదిలో, ప్రయోగశాలలో వెచ్చించాలన్నారు. విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ పూర్తిగా నిశిద్ధమని, ర్యాగింగ్కు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ మాట్లాడుతూ సత్ ప్రవర్తన కలిగి ఉండటం ఎంతో ప్రధానమన్నారు. వర్సిటీ విద్యార్థులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుందన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. స్కూల్ఆఫ్ కెమిస్ట్రీ సంచాలకులు ఆచార్య ఆర్.మురళీకష్ణ రావు విద్యలో అంతరార్ధాన్ని తెలుసుకుని మసలు కోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ.ఉమా బాబ, వి.వెంకటేశ్వరరావు, పి.శ్యామల,టి.శివరావు, సిద్దయ్య, శైలజ, బసవయ్య పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నైపుణ్య సాధనతోనే సుందరభవిత
ఏటా కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు తడబడుతున్న విద్యార్థులు పలు అంశాల్లో రాణించని వైనం చదువుతుండగానే ఉద్యోగం సాధించడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ప్రతి కాలేజీలోనూ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అయితే ముంగిటకు వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. నైపుణ్యం లేకపోవడం, ఆంగ్లభాషపై, సబ్జెక్టుపై పట్టు లేకపోవడం ప్రధానంగా వారిని వేధిస్తున్నాయి. బాలాజీచెరువు (కాకినాడ): జిల్లాలో 32 ఇంజనీరింగ్, ఐదు ఫార్మశీ, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు 90 వరకూ ఉన్నాయి. వీటి నుంచి ప్రతి ఏటా ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పూర్తిచేసిన సుమారు పది వేలమంది పట్టభద్రులై వస్తున్నారు. ప్రముఖ కంపెనీల క్యాంపస్ డ్రైవ్లు జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ప్రభుత్వ.ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు టీపీఎస్, టెక్మహీంద్ర, టాటా, ఎల్అండ్టీ, హెచ్పీ,హెటిరోడ్రగ్స్, ఫార్మశీ సంస్థలు ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నాయి. వీటికి వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నప్పటికీ కేవలం 40శాతం మంది మాత్రమే అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతున్నారు. మిగిలిన వారు చిన్నపాటి ఉద్యోగాలకే పరిమితం కావలసి వస్తోంది.∙ ప్రణాళికతో విజయం ప్రతి విద్యార్థి మొదటి సంవత్సరం నుంచి తప్పని సరిగా ప్రణాళికలు రూపొందించు కొని ఆమేరకు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. చాలా మంది చివరి సంవత్సరంలో ప్రిపేరవుతుంటారు. అప్పటికే సమయం మించిపోవడంతో అర్హత సాధించలేకపోతున్నారు. పుస్తక ,ప్రపం^è పరిజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు ఆంగ్లంపై పూర్తి స్ధాయిలో పట్టు సాధించాలి. అందరితో కలుపుగోలుతనంగా ఉండటంతో పాటు చర్చావేదికల్లో పాల్గొనాలి. అప్పుడే తమలో ఉన్న భయం, బిడియాన్ని తొలగించుకోగలుగుతారు. చాలా మంది అలా చేయకపోవడం వల్లే ఉద్యోగాన్ని సాధించడంలో విఫలమవుతున్నారు. కళాశాలల్లో ప్రత్యేక శిక్షకులు విద్యార్థుల్లో లోపాలను గుర్తించి ప్రాంగణ ఎంపికలకు అవసర మైన శిక్షణను కళాశాలల్లో ఇస్తున్నారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ ముఖాముఖితో విజయం సాధించేందుకు నిపుణుల సదస్సులు ఏర్పాటు చే స్తున్నారు. జేఎన్టీయూకే, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు ప్రైవేట్ కళాశాలల్లో సీఆర్టీæ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. అన్నింశాలపై దృష్టి సారించాలి ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించాలంటే అన్ని అంశాలపై దృష్టి సారించాలి. ఆంగ్లభాషపై పట్టులేకపోవడం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేకపోవడంతో చాలామంది వెనుకబడిపోతున్నారు. ప్రతి సబ్జెక్టుపై ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు పుస్తక పఠనానికి ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మందికి పుస్తక పరిజ్ఞానం తప్ప ఇతర అంశాలపై పట్టు ఉండటం లేదు. ఎం.వీరభద్రయ్య, ఆచార్యులు, ఎంఎస్ఐటీకోర్సు, జేఎన్టీయూకే జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైనవారు సంవత్సరం ఎంపికైనవారు 2013–14 750 2014–15 650 2015–16 480 -
నైపుణ్య సాధనతోను సుందర భవిత
ఏటా కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు తడబడుతున్న విద్యార్థులు పలు అంశాల్లో రాణించని వైనం చదువుతుండగానే ఉద్యోగం సాధించడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ప్రతి కాలేజీలోనూ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అయితే ముంగిటకు వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. నైపుణ్యం లేకపోవడం, ఆంగ్లభాషపై, సబ్జెక్టుపై పట్టు లేకపోవడం ప్రధానంగా వారిని వేధిస్తున్నాయి. బాలాజీచెరువు (కాకినాడ): జిల్లాలో 32 ఇంజనీరింగ్, ఐదు ఫార్మశీ, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు 90 వరకూ ఉన్నాయి. వీటి నుంచి ప్రతి ఏటా ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పూర్తిచేసిన సుమారు పది వేలమంది పట్టభద్రులై వస్తున్నారు. ప్రముఖ కంపెనీల క్యాంపస్ డ్రైవ్లు జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ప్రభుత్వ.ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు టీపీఎస్, టెక్మహీంద్ర, టాటా, ఎల్అండ్టీ, హెచ్పీ,హెటిరోడ్రగ్స్, ఫార్మశీ సంస్థలు ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నాయి. వీటికి వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నప్పటికీ కేవలం 40శాతం మంది మాత్రమే అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతున్నారు. మిగిలిన వారు చిన్నపాటి ఉద్యోగాలకే పరిమితం కావలసి వస్తోంది.∙ ప్రణాళికతో విజయం ప్రతి విద్యార్థి మొదటి సంవత్సరం నుంచి తప్పని సరిగా ప్రణాళికలు రూపొందించు కొని ఆమేరకు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. చాలా మంది చివరి సంవత్సరంలో ప్రిపేరవుతుంటారు. అప్పటికే సమయం మించిపోవడంతో అర్హత సాధించలేకపోతున్నారు. పుస్తక ,ప్రపం^è పరిజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు ఆంగ్లంపై పూర్తి స్ధాయిలో పట్టు సాధించాలి. అందరితో కలుపుగోలుతనంగా ఉండటంతో పాటు చర్చావేదికల్లో పాల్గొనాలి. అప్పుడే తమలో ఉన్న భయం, బిడియాన్ని తొలగించుకోగలుగుతారు. చాలా మంది అలా చేయకపోవడం వల్లే ఉద్యోగాన్ని సాధించడంలో విఫలమవుతున్నారు. కళాశాలల్లో ప్రత్యేక శిక్షకులు విద్యార్థుల్లో లోపాలను గుర్తించి ప్రాంగణ ఎంపికలకు అవసర మైన శిక్షణను కళాశాలల్లో ఇస్తున్నారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ ముఖాముఖితో విజయం సాధించేందుకు నిపుణుల సదస్సులు ఏర్పాటు చే స్తున్నారు. జేఎన్టీయూకే, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు ప్రైవేట్ కళాశాలల్లో సీఆర్టీæ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. అన్నింశాలపై దృష్టి సారించాలి ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించాలంటే అన్ని అంశాలపై దృష్టి సారించాలి. ఆంగ్లభాషపై పట్టులేకపోవడం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేకపోవడంతో చాలామంది వెనుకబడిపోతున్నారు. ప్రతి సబ్జెక్టుపై ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు పుస్తక పఠనానికి ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మందికి పుస్తక పరిజ్ఞానం తప్ప ఇతర అంశాలపై పట్టు ఉండటం లేదు. ఎం.వీరభద్రయ్య, ఆచార్యులు, ఎంఎస్ఐటీకోర్సు, జేఎన్టీయూకే జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైనవారు సంవత్సరం ఎంపికైనవారు 2013–14 750 2014–15 650 2015–16 480 -
76 ఏళ్ల వయసులోనూ...
ఆమె ప్రదర్శించే విన్యాసాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కర్ర తిప్పే తీరు గమనిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. వయసుతో సంబంధం లేకుండా కర్రసాము కత్తి ఫైట్లతో ఇప్పుడా వృద్ధ మహిళ ఇంటర్నెట్ యూజర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రాచీన యుద్ధ కళా విన్యాసాల్లో తనదైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఫేస్ బుక్ యూజర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఫేస్ బుక్ లో ఆమె పోస్టు చేసిన వీడియో... లక్షలకొద్దీ వీక్షణలతో సంచలనం సృష్టిస్తోంది. కేరళ వటకారా లో నివసిస్తున్న మీనాక్షియమ్మ వయసు 76 సంవత్సరాలు. ఆమె పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పురాతన భారతీయ యుద్ధ కళారూపం కలరిపయట్టు (కర్రసాము) లో నేటికీ అనేక మంది విద్యార్థులకు శిక్షణనిస్తూ అద్భుత నైపుణ్యాన్ని కనబరుస్తోంది. కర్రలు, కత్తులు, బాకులు ఉపయోగించి చేసే కర్రసాములో ఆమె చూపించిన విన్యాసాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా వ్యాపించాయి. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన, పురాతన కాలంనాటి కళగా గుర్తింపుపొందిన కర్రసాము బోధకురాలుగా మీనాక్షిమమ్మ ఎంతో గుర్తింపు పొందింది. ఏడు పదుల వయసు దాటినా ఆమె నేటికీ తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మీనాక్షియమ్మ వీడియో... ఫేస్ బుక్ లో ఇండియా అరైజింగ్ పేరున జూన్ 16న పోస్ట్ చేశారు. ఆ అద్భుత విన్యాసాల వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షియమ్మ వీడియోను కేవలం నాలుగు రోజుల్లోపే సుమారు 9 లక్షలమంది పైగా వీక్షించారు. వయోవృద్ధురాలైన ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ముగ్ధులైపోతున్నారు. కర్రను చేతపట్టి, చీరకొంగు నడుముకు చుట్టి ఓ వ్యక్తితో ఆమె తలపడిన తీరును చూస్తే నిజంగా అద్భుతం కళ్ళకు కడుతుంది. చూపరులు ఊపిరి బిగపట్టేలా చేస్తుంది. తనకన్నా వయసులో అతి చిన్నవాడు, ఆమె వద్దే శిక్షణ పొందిన వ్యక్తితో ఆమె యుద్ధకళను ప్రదర్శించిన తీరు ఫేస్ బుక్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కేరళ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కలరిపయట్టు, పురాతన కాలానికి చెందిన ఓ ప్రత్యేక యుద్ధకళగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ కళ అత్యంత క్లిష్టమైన విద్యగా కూడ పేరొందింది. -
ఎస్టీ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి
యూఎస్ ఎయిడ్, మెకెన్సీ కంపెనీల సహకారంతో ప్రారంభం సాక్షి, హైదరాబాద్: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంథాను అనుసరిస్తోంది. అంతర్జాతీయ సంస్థల సహకారంతో శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలకు అవకాశం కల్పించి, ఉపాధి పొంది సొంతంగా నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా యునెటైడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ (యూఎస్ ఎయిడ్), మెకెన్సీ అండ్ కంపెనీల సహకారంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వైద్య సేవారంగంలో ఎస్టీ యువతకు శిక్షణ, యునెటైడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) సహకారంతో గిరిజన ప్రాంతాల్లో ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటునకు చర్యలు చేపట్టింది. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తీసుకున్న చొరవతో ప్రతిష్టాత్మకమైన సంస్థల సహకారంతో ఆయా రంగాల్లో శిక్షణను అందించనున్నారు. వైద్య సేవారంగంలో... మెకెన్సీ అండ్ కంపెనీ, యూఎస్ ఎయిడ్ సహకారంతో వైద్య రంగంలో పేషెంట్ కేర్ అసిస్టెంట్ (పీసీఏ), జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (జీడీఏ)లుగా ఎస్టీ యువతకు వృత్తిపరమైన శిక్షణనివ్వనున్నారు. అనంతరం హైదరాబాద్లోని మాక్స్క్యూర్, కిమ్స్, ఎన్టీఆర్ కేన్సర్ ఆసుపత్రి, స్టార్ ఆసుపత్రి తదితరాల్లో నెలకు రూ.7,300-రూ.9,300 జీతం లభించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ.. శిక్షణ పొందేవారిని ఎంపికచేసి, వారికి అవసరమైన మెటీరియల్, శిక్షణ తరగతుల నిర్వహణ, పర్యవేక్షణ తదితరాలను చేపట్టనుంది. ఎస్టీ సంక్షేమ శాఖ శిక్షణ తరగతుల నిర్వహణకు సహకారం అందించనుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ యూఎన్డీపీతో రాష్ట్రప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ అందించనుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ముందుగా భ ద్రాచలం (ఖమ్మం జిల్లా), ఏటూరునాగారం (వరంగల్ జిల్లా), ఉట్నూరు (ఆదిలాబాద్ జిల్లా), హైదరాబాద్లలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్స్(ఈడీసీ)లను ఏర్పాటుచేసి, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను వివరించి, శిక్షణ ఇవ్వనున్నారు. 2016-17లో కనీసం వెయ్యిమందికి శిక్షణనిచ్చి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎస్టీ శాఖ ప్రణాళికలు రూపొందించింది. -
10 వేల మంది నిరుద్యోగులకు శిక్షణ
ఈ ఏడాది ఎస్సీ శాఖ లక్ష్యం: డాక్టర్ ఎం.వి.రెడ్డి సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనపై ఎస్సీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. 10 వేల మంది నిరుద్యోగ ఎస్సీ యువతకు ఈ ఏడాది నైపుణ్యాల శిక్షణను అందిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జీ వీసీ, ఎండీ డా.ఎం.వి.రెడ్డి‘ సాక్షి’ కి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పదో తరగతి పాసైనవారు, ఫెయిలైనవారు ఖాళీగా ఉండకుండా ఆయా రంగాల్లో శిక్షణను అందిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో తరచుగా గృహోపకరణాలు, ఇతర అంశాల్లో రిపేర్లు, ఇతరత్రాఅవసరాలకు అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు టీవీ, ఫ్రిజ్, ఎలక్ట్రీషియన్ వంటి గృహోపకరణాలు, ఇతరత్రా అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్లో నెల రోజులపాటు శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు. గత ఏడాది 5 వేల మందికి స్కిల్డెవలప్మెంట్ శిక్షణను ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఈ ఏడాది దానిని పదివేలకు పెంచినట్లు తెలియజేశారు. లబ్ధిదారుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎం.వి.రెడ్డి తెలిపారు. రుణానికి తగ్గట్టు పనులు చేయనివారిని, దుర్వినియోగం చేసినవారిని, డిఫాల్టర్లుగా ఉన్నవారిని బ్లాక్లిస్ట్లో పెట్టేలా చర్య లు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లబ్ధిదారులు చేపట్టిన పనులను వీడియో రికార్డు, ఫొటోల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఎంవీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన డేటాబేస్ను తయారు చేసి దశలవారీగా తనిఖీ చేస్తామన్నారు. -
గురుకులాల్లో నైపుణ్య శిక్షణ!
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు - ఇంగ్లిష్, కెరీర్ కౌన్సెలింగ్ తదితర అంశాలపై అవగాహన సాక్షి, హైదరాబాద్: జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లో కొత్త అధ్యాయాలు ఆవిష్కృతమవుతున్నాయి. వేసవి సెలవుల్లో రాష్ట్ర బీసీ గురుకులాల పరిధిలోని పాఠశాలలు, జూని యర్ కాలేజీలు, మహిళల డిగ్రీ కాలేజీ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు నాలుగైదు బ్యాచ్లుగా 2 వేల మందికి పైగా విద్యార్థులకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నారు. కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలు మర్చిపోకుండా వారికి గుర్తుండిపోయేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దీంతో పాటు ఆటలు, పాటల్లో ఆసక్తి, నైపుణ్యం ఉండి ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రత్యేమైన శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడలపై ఆసక్తి లేని వారు వివిధ చదువుకు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం సాధించేలా చొరవ తీసుకుంటారు. వివిధ అంశాలపై పట్టు సాధించేలా.. రాష్ర్టంలోనే తొలిసారిగా బీసీ గురుకులాల ప రిధిలో మహిళల కోసం గతేడాది రెసిడెన్షియ ల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసిన విషయం తె లిసిందే. డిగ్రీ విద్యార్థినిలు, జూనియర్ కా లేజీ అమ్మాయిలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సంస్థ పరిధిలోని రెండు బాలుర జూనియర్ కాలేజీల్లోని 300 మందికి పైగా విద్యార్థులకు సి విల్ సర్వీస్ పరీక్షలపై అవగాహన కల్పిస్తారు. ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అయిన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీలకు ప్రిపేర్ అయ్యే తీరు, ఆయా సబ్జెక్టులపై ఎలా పట్టు సాధించాలి వంటి అంశాలపై వివరిస్తారు. తొమ్మిది, పది తరగతులకు వెళ్లనున్న 1,500 మందికి 45 రోజుల పాటు ఇంగ్లిష్పై శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 300పైగా 7, 8, 9 తరగతుల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, కెరీర్ కౌన్సెలింగ్ అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భవిష్యత్కు బాటలు వేసేలా.. వేసవి సెలవుల్లో విద్యార్థులు కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలు మర్చిపోతారు. అందుకే వారికి వేసవిలో కూడా చదువు కొనసాగించడంతో పాటు భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలకు బాటలు వేసేలా ఆయా కార్యక్రమాలు రూపొందించాం. ఇంగ్లిష్పై పట్టు సాధించడంతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం పొందేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయి. నిపుణులైన అధ్యాపకులతో రెసిడెన్షియల్ తరహాలో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తాం. -మల్లయ్యభట్టు, బీసీ గురుకులాల కార్యదర్శి -
అలాంటి పిల్లలకు టాలెంట్ ఎక్కువట!
లండన్: వీడియోగేమ్స్.. పిల్లల వీపు విమానం మోత మోగించేందుకు తల్లిదండ్రులకు ఒక కారణం. అది ఒకప్పుడు. మరి ఇప్పుడు.. 'మొన్నే లేటెస్ట్ మొబైల్ కొన్నా.. మా బుడ్డోడు దాన్ని ఒదిలిపెడితే ఒట్టు. ఎట్లా నేర్చుకున్నాడో గానీ భలే ఆడతాడండీ గేమ్స్..' అని గొప్పలు చెప్పుకోని పేరేంట్స్ లేరంటే అతిశయం కాదు. ఇంతకీ పిల్లలు వీడియోగేమ్స్ ఆడటం మంచిదా? కాదా? అంటే.. నూటికి నూరుపాళ్లు మంచిదేనంటున్నారు పరిశోధకులు. కొలంబియా యూనివర్సిటీలోని మాలిమన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన పరిశోధకులు భారీ అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని రుజువు చేశారు. వివిధ దేశాల్లోని 6 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారుల మెంటల్ హెల్త్ కండీషన్ ను అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చినట్టు పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలు తీసుకోవడంతో పాటు తాము అడిగిన ప్రశ్నలకు పిల్లలు చెప్పిన సమాధానాల ఆధారంగా ఓ డేటా రూపొందించి..దానిపై సమగ్రంగా విశ్లేషించినట్టు పరిశోధకులు తెలిపారు. సాధారణ పిల్లలతో పోలిస్తే వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో మేధో శక్తి 1.75 రెట్లు అధికంగా ఉందని నిర్ధారించారు. వీడియో గేమ్స్ ఆడే పిల్లలు చదువుల్లోనూ 1.88 రెట్లు ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్నారని, తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, హెల్దీ రిలేషన్స్ డెవలప్ అవుతాయని అధ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్ కేథరీన్ ఎం కీయెస్ పేర్కొన్నారు. అయితే వీడియో గేమ్స్ అధికంగా ఆడటం వల్ల చిన్నారుల్లోని నైపుణ్యంపై ప్రభావం పడుతుందనే ఆందోళనతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమ అధ్యయనంలో ఇందుకు విరుద్దుమైన ఫలితాలు వచ్చాయంటున్నారు కేథరీన్. అంతేకాకుండా అందరూ అనుకున్నట్లు వీడియోగేమ్స్ ఆడటానికి, చిన్నారుల మానసిక రుగ్మతలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని, అయితే అదే పనిగా వీడియోగేమ్స్ స్క్రీన్లకు అతుక్కుని పోకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ అధ్యయన ఫలితాలు ఉంటాయని కీయోస్ సలహా ఇస్తున్నారు. -
4 జిల్లాల్లో ‘నై’పుణ్య శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల పరిధుల్లోని శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లోని నిరుద్యోగులతోపాటు ఆయా రంగాల్లో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ(కార్పొరేషన్) నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల తీరు అధ్వానంగా ఉంది. మరో 25 రోజుల్లో ప్రస్తుత ఆర్థికసంవత్సరం ముగియనుండగా, స్కిల్డెవలప్మెంట్ కింద రాష్ట్ర రాజధానిలో కనీసం ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వకపోవడం గమనార్హం. హైదరాబాద్తోపాటు మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కరికి కూడా నైపుణ్యాల మెరుగుదల కింద శిక్షణ ఇవ్వలేదు. ఈ ఏడాది హైదరాబాద్లో 505, మిగతా 9 జిల్లాల్లో 500 చొప్పున అంటే 5,005 మందికి శిక్షణను అందించాలని ఎస్సీ కార్పొరేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు రూ.10 కోట్లను కేటాయించారు. ఫిబ్రవరి ఆఖరుకల్లా మొత్తం 1,072 మందికి రూ.2.10 కోట్లే ఖర్చు చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 500 మందికిగాను 380 మందికి, కరీంనగర్లో 224, నిజామాబాద్లో 220, నల్లగొండలో 102, మహబూబ్నగర్లో 86, ఖమ్మంలో 60 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఎస్టీలకూ అంతంతే: షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక కార్పొరేషన్(ట్రైకార్) ద్వారా భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు (ఆదిలాబాద్) ఐటీడీఏల పరిధిలో 7 వేల మందికి శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో వారిని నియమించేలా నిర్ణయించారు. అయితే 997 మందికి శిక్షణనిచ్చి, వారిలో 700 మందికి ప్లేస్మెంట్ ఇచ్చారు. నేరుగా ప్లేస్మెంట్ ద్వారా 1,194 మందికి అవకాశం కల్పించినట్లు ఎస్టీ కార్పొరేషన్ గ ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వయం ఉపాధి కింద మూడు ఐటీడీఏలను కలుపుకుని 4,483 మందికి శిక్షణను ఇవ్వగా, ఇంకా 169 మంది శిక్షణను కొనసాగిస్తున్నారు. ఈ 3 ఐటీడీఏల్లోని యూత్ ట్రైనింగ్ సెంటర్ల(వైటీసీ) ద్వారా స్వయం ఉపాధి, శిక్షణ ఇస్తున్నారు. వైటీసీల ద్వారా భద్రాచలంలో మొత్తం 2,967 మందికి, ఏటూరునాగారంలో 2135 మందికి, ఉట్నూరులో అత్యధికంగా 6,672 మందికి ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. -
ప్రకటనలకే శిక్షణ..!
నిరుద్యోగులందరికీ వివిధ వృత్తి విద్య, కంపెనీ పుణ్యాల్లో శిక్షణ ఇస్తాం... ఉద్యోత సాధనలో తోడ్పాటునందిస్తాం... అందరికీ ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దుతామంటూ గత బడ్జెట్లో ప్రకటించారు. అరచేతిలో స్వర్గం చూపారు. మళ్లీ బడ్జెట్ సమయం ఆసన్నమైనా శిక్షణ ఆరంభం కాలేదు. ఉపాధి చూపలేదు. ఫలితం.. నిరుద్యోగ అభ్యర్థుల్లో నైరాశ్యం నెలకొంది. టీడీపీ సర్కారు మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి రుజువైందని విమర్శిస్తున్నారు. ఎచ్చెర్ల: రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరే షన్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు మంజూరు చేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు రూ.25 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఎచ్చెర్ల సమీపంలోని 21 వ శతాబ్ధి గురుకులంలో శిక్షణ తరగతులు ఆరంభిస్తామని వెల్లడించింది. ఇది జరిగి ఏడాది పూర్తయినా శిక్షణలు మాత్రం ప్రారంభించ లేదు. ఒక్క నిరుద్యోగికీ ఉపాధి కల్పించలేదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో సైతం నైపుణ్య కేంద్రాలు ప్రారంభిస్తామంటూ అట్టహాసం చేసిన టీడీపీ సర్కారు ఆచరణలో విఫలమైందని, నిరుద్యోగ అభ్యర్థులకు మొండిచేయి చూపిందని వాపోతున్నారు. గతంలో రాజీవ్ యువకిరణాలు, రీమ్యాప్ ఆధ్వర్యంలో 21 వ తశాబ్ధి గురుకులంలో నైపుణ్య కేంద్రం నిర్వహించారు. 2014 ఏప్రిల్ నుంచి శిక్షణలు నిలిపి వేశారు. దీంతో గురుకులం భవనాలు సైతం నిరుపయోగంగా మారాయి. ఇదీ పరిస్థితి.. శిక్షణలు ఇచ్చేందుకు ప్రారంభంలో విదేశీ కంపెనీ అయిన సీమ్యాన్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ శిక్షణ ప్రారంభించ కుండానే తప్పుకుంది. ప్రస్తుతం మరో కంపెనీ టాటా ప్రాజెక్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కూడా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి. శిక్షణ అనంతరం కనీసం 80 శాతం మందికి ప్లేస్ మెంట్ కల్పించక పోతే ఆశయం దెబ్బతింటుంది. కొన్ని సంస్థలు శిక్షణలు ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చినా, ప్లేస్మెంట్కు మాత్రం ముందుకు రాలేక పోతున్నాయి. గతంలో సైతం ఇక్కడ శిక్షణలు ఇచ్చిన సత్యం కంప్యూటర్స్ ఎడ్యుకేషన్, సాహితీ సిస్టమ్స్, సింక్రోసర్వ్ గ్లోబస్ సొల్యూషన్స్, టీంలీజ్ సర్వీ సెస్, నేషనల్ అకాడమీ కనస్ట్రక్షన్స్ సంస్థలు శిక్షణలు ఇచ్చినా ఉపాధి చూపడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వ సాయం లేకపోతే ఇలాంటివి నిర్వహించలేమని కంపెనీ ప్రతినిధులే పేర్కొంటున్నారు. ఎదురుచూపే మిగులుతోంది... పుణ్య శిక్షణలు కోసం యువత ఎదురు చూస్తున్నారు. మరో పక్క మార్చి వచ్చేస్తుంది. మరో బడ్జెట్ అమలు కానుంది. మొదటి బడ్జెట్లో నిధులు కేటాయించినా ఇంత వరకు శిక్షణలు ప్రారంభించ లేదు. ఇక్కడ రాజధాని నిర్వాసిత యువతకు కొన్నాళ్లు పాటు నైపుణ్య శిక్షణలు ఇచ్చారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వీరు అర్థాంతరంగా శిక్షణ కేంద్రం విడిచి పెట్టి వెళ్లిపోయారు. జిల్లా అభ్యర్థులకు ఆ పాటి శిక్షణ కూడా కరువైంది. శిక్షణల కోసం రిలీవ్ అయిన ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు ఎదురుచూస్తున్నా నిరాశే ఎదురవుతోంది. -
టామ్కామ్తో వెయ్యి మందికి ఉపాధి
దుబాయ్లో ముగిసిన ‘నాయిని’ పర్యటన మూడు కంపెనీలతో ఒప్పందాలు రాయికల్: నకిలీ గల్ఫ్ ఏజెంట్ల వ్యవస్థను అరికట్టేందుకు...గల్ఫ్ దేశాల్లో తెలంగాణ యువత ఉపాధి కోసం తెలంగాణ మానవ వనరుల సంస్థ(టామ్కామ్) వేసిన తొలి అడుగు విజయవంతమైంది. అందులో భాగంగా రాష్ట్ర కార్మిక హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ కవితలు 3రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా వారు పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్న చర్యలు, విధివిధానాలపై రోడ్షో నిర్వహించారు. మంత్రి నాయిని ఈ నెల 19న దుబాయ్ వెళ్లారు. అదే రోజు ఆయన సోలాపూర్ లేబర్ క్యాంపును సందర్శించారు. 20వ తేదీన దుబాయ్లో నిర్వహించిన స్కిల్ మేనేజ్మెంట్ రోడ్షోలో ఎంపీ కవితతో పాటు పాల్గొని.. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. ఈనెల 21న జెజీరా ఎమిరేట్స్ పవర్ 250, మాడన్ ఎగ్జిక్యూటివ్ సిస్టం కన్స్ట్రక్షన్ కంపెనీ 500, క్యూబిజీ కంపెనీతో 300 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు నాయిని, ఆయా కంపెనీలో మేనేజింగ్ డెరైక్టర్లతో ఒప్పంద పత్రాలను చేసుకున్నారు. కాగా, మంత్రి... ఎంపీల వెంట దుబాయ్లో తెలంగాణ ప్రభుత్వ టామ్కామ్ ప్రతినిధి శ్రీనివాసశర్మ ఉన్నారు. కార్మికుల సమస్యలపై సర్వే.. మంత్రి నాయిని, ఎంపీ కవితలతో పాటు వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ఆయా ప్రాంతాల్లోని తెలంగాణ కార్మికుల స్థితి గతులపై సర్వే చేపట్టారు. తెలంగాణ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి హర్పిత్సింగ్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్కామ్ డెరైక్టర్ భవానీరావులు 3 బృందాలుగా విడిపోయి మంగళవారం కార్మికులు ఉంటున్న క్యాంపులను సందర్శిస్తూ వివరాలు సేకరించి టామ్కామ్ ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై సర్వే చేస్తున్నట్లు సమాచారం. -
ప్రపంచం మన వైపు చూస్తోంది
ఇతర దేశాల్లో మన వాళ్ల పనితీరు అద్భుతంగా ఉంటోంది. మన దేశంలో ఆ స్థాయిలో ఉండడంలేదు. విజ్ఞానం లక్ష్యంగా చదువులు ఉండాలి. అప్పుడు ఉద్యోగం చిన్న అంశమే అవుతుంది. చదువుతోపాటు ఆ స్థాయిలో స్కిల్స్ పెంపొందించుకోవాలి. గూగుల్, వాట్సాప్... ఇవన్నీ యువకులే రూపొందించారు. ఇలాంటి వాటికి ఇప్పుడు ఇంకా ఎంతో స్కోప్ ఉంది. ఎనగందుల వరదారెడ్డి... చదువనేది ఉద్యోగమే లక్ష్యంగా ఉండకూడదని, విజ్ఞానం సంపాదించడానికే అని నమ్మారు. జీవితంలో ఆచరించారు. హాయిగా సాగేపోయే ప్రభుత్వ ఉద్యోగాలను వదలివేశారు. సాధించాలనే తపనతో అడుగు వేశారు. అలుపెరుగని బోధనతో ముందుకు కదిలారు. 40 ఏళ్ల క్రితం ఎస్ఆర్ ట్యుటోరియల్స్ స్థాపించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగంలో ఓ బ్రాండ్గా నిలిచారు. 6 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వరదారెడ్డి జీవిత విశేషాలు ఆయన మాటల్లోనే... ఒక్క నాగలి వ్యవసాయం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట మా ఊరు. ఆర్థికంగా పేద కుటుంబం. ఒక్క నాగలి వ్యవసాయమే. 1947 మార్చి 12 నా పుట్టిన రోజు. అమ్మ కాంతమ్మ, నాన్న నర్సింహారెడ్డి, నాన్నకు చదువు రాదు. సంతకం మాత్రం చేసేవారు. నేను బాగా చదువుతాననే నమ్మకం నాన్నకు మొదటి నుంచి ఉండేది. అందుకే ఎప్పడూ నా చదువుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఉద్యోగం వదిలి చదవుకోవాలనుకున్నప్పుడు బంధువులు, దగ్గరి వారు వ్యతిరేకంగా చెప్పారు. నాన్న మాత్రం నా అభిప్రాయం ప్రకారం చదువుకోవాలనే చెప్పాడు. నాలుగో తరగతి వరకు మా ఊరిలోనే చదువుకున్నా. తర్వాత ఎనిమిదో తరగతి వరకు వర్ధన్నపేటకు వెళ్లా. వర్ధన్నపేటలో అన్ని తరగతులకు మాదే ఫస్ట్ బ్యాచ్ ఉండేది. తొమ్మిదో తరగతి ప్రారంభమం కావడం ఆలస్యమైంది. దీంతో జఫర్గఢ్కు వెళ్లా. 11వ తరగతి వరకు అక్కడే. ఆ తర్వాత హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పీయూసీ, డిగ్రీ, ఎమ్మెస్సీ(ఫిజిక్స్) పూర్తి చేశా. అప్పుడు ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. ఆవును అమ్మి ఫీజు చదువుపై చాలా ఇష్టం ఉండేది. అప్పుడున్న పరిస్థితుల్లో ఫీజుల కట్టేందుకు డబ్బులు ఉండేవి కావు. హెచ్ఎస్సీలో ఉన్నప్పుడు పరీక్ష ఫీజుకు (రూ.12) డబ్బులు లేవు. దీంతో బడికి పోవడం మానేశా. మూడు రోజులు వెళ్లలేదు. అప్పుడు మా సార్లు ఇంటికి వచ్చి మా నాన్నకు నచ్చజెప్పారు. డబ్బులు లేని విషయం చెప్పాం. అప్పుడు 10 మంది సార్లు చెరో రూపాయి, హెడ్ మాస్టర్ రెండు రూపాయలు ఇచ్చారు. అక్కడ చదువు జీవితం మలుపు తిరిగింది. తర్వాత పీయూసీలో చేరేటప్పుడు ఇదే పరిస్థితి. కాట్రపల్లి లక్ష్మీనర్సింహారెడ్డి(కేఎల్ఎన్రెడ్డి) పీయూసీ అడ్మిషన్ ఫీజు రూ.125 చెల్లించారు. ‘నువ్వు మంచి ప్రతిభావంతుడిలా ఉన్నావు. బాగా చదువుకోవాలి రా. ఏ అసవరం ఉన్నా నా దగ్గరకి రా’ అని చెప్పారు. ఆ తర్వాత పీయూసీ పరీక్ష ఫీజు రూ.18కి ఇబ్బందులు. ఇంటికి వెళ్లి నాన్నకు విషయం చెప్పా. ఆవును అమ్ముదామని నాన్న అన్నాడు. పాలేరుకు కూడా తెలియకూడదని కాట్రపల్లి అంగడికి ఆవును తీసుకెళ్లాం. రూ.20 రూపాయలు కచ్చితంగా వస్తాయని నాన్న అన్నాడు. మూడు గంటలు వేచి చూసినా ఆవు దగ్గరికి ఎవరూ రాలేదు. అప్పుడు నాన్న, నేను దిగాలు పడ్డాము. చివరికి రూ.28కి ఆవు అమ్ముడుపోయింది. నాన్న ఎంతో సంతోషంతో... ‘దీనికి ఇంత వస్తాయని అనుకోలేదురా. మొత్తం రూ.28 నువ్వే తీసుకో. బాగా చదవుకోవాలి’ అన్నారు. అప్పుడు హన్మకొండ నుంచి దమ్మన్నపేటకు వెళ్లాంటే 90 పైసలు బస్సు కిరాయి. నేను అడ్దదారుల్లో నడిచే ఇంటికి వెళ్లే వాడిని. ఊరి మొదట్లో దళితవాడ ఉండేది. నడిచి వస్తున్న నన్ను చూసి వారు ప్రేమతో... అయ్యో పాపం అనేవారు. గురువులే మార్గదర్శకులు మా చిన్నతనంలో గురువులు గొప్ప మార్గదర్శకులుగా ఉండేవారు. అప్పటి విద్యా విధానం ప్రకారం ఎనిమిదో తరగతిలో ఆప్షనల్ తీసుకోవాల్సి ఉండేది. సైన్స్, ఆర్ట్స్లో ఏది ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకోవాలి. విద్యార్థులకు ఆ స్థాయిలో అంతగా అవగాహన ఉండదు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులే ఆప్షనల్ నమోదు చేసేవారు. అప్పుడు ఎక్కువగా ఆర్ట్స్ సబ్జెక్టునే ఎంపిక చేసుకునేవారు. మొదట నేను ఆర్ట్స్ అని చెప్పాను. నువ్వు లెక్కలు బాగా చేస్తావు అని మా సార్ తర్వాత నా ఆప్షనల్ మార్చారు. అది నా జీవితంలో మంచి మలుపు. నాకు మొదటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం. దాంట్లోనే నైపుణ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఉద్యోగాలు వదిలాను అప్పుడు పరీక్షలు అయిపోతుండగానే ఉద్యోగాలు వచ్చేవి. అలా పీయూసీ పూర్తికాగానే 1964లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వే సూపర్వైజర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పుడే గవర్నమెంట్ రక్షిత కౌలుదారు చట్టం తెచ్చింది. భూస్వాముల భూములను దున్నుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని ఆ చట్టం ఉద్దేశం. ప్రభుత్వం మంచి ఆలోచనతో చేసిన ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత మాది. అప్పుడు నాకు 18 ఏళ్లు. చిన్నతనంలోనే మంచి ఉద్యోగం. మరిపెడ మండలం గిరిపురంలో నాకు డ్యూటీ. అక్కడ భూస్వామి భూములను సర్వే చేసి ఆ ఊరి వారికి పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయమే అయినా అక్కడి వారు ఆ భూస్వామి ఏదో దానం చేస్తున్నట్లుగా భావించి మసలుకునేవారు. ఒక రోజు ఓ గిరిజనుడు వచ్చి చిన్న పిల్లాడిని భూస్వామి కాళ్లపైన పెట్టి తనకు భూమి ఇవ్వాలని కోరాడు. ఆ భూస్వామి చిన్న పిల్లాడిని తన్నినంత పని చేశాడు. అది నన్ను కలిచి వేసింది. ప్రభుత్వం చేసిన చట్టం గొప్పది. అమలు విషయంలో క్షేత్ర స్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. భూస్వామి చెప్పినట్లుగా కాకుండా నేను నిబంధనల ప్రకారం చేశాను. అయినా చట్టం స్ఫూర్తి నెరవేరే పరిస్థితి వంద శాతం కనిపించలేదు. ఆ వ్యవస్థలో ఇమడలేకపోయాను. ‘అందరూ నౌకరి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే నువ్వెందుకు రాజీనామా చేసున్నావు, ఆలోచించుకో’ అని అందరు చెప్పారు. అవినీతిలో భాగస్వామిని కాలేక రెండేళ్లకే రాజీనామా చేశాను. కష్టపడి పనిచేయాలని భావించాను. అందుకు చదువు ఒక్కటే మార్గమని డిగ్రీ, పీజీ పూర్తి చేశా. మహబూబియా పంజతన్(ఎయిడెడ్) జూనియర్ కాలేజిలో ఫిజిక్స్ లెక్షరర్గా 1974లో ఉద్యోగం వచ్చింది. మూడున్నర ఏళ్లు పని చేసి వాలంటరీ రిటైర్మ్ంట్ తీసుకున్నా. ఈ నిర్ణయంపై అప్పుడు మా ప్రొఫెసర్స్ సహా అందరు నన్ను కోప్పడ్డారు. నేను మాత్రం ధైర్యంగా అడుగు వేశా. కోచింగ్ నుంచి మొదలై.. నాకు తెలిసింది ఒక్కటే.. బోధన. ఆ రంగంలోనే నా సామర్థ్యం కొద్ద్దీ పని చేసుకుంటూ వెళ్లా. ఎమ్మెస్సీ పూర్తయ్యాక 1976లో ఎస్ఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభించా. ఉదయం, సాయంత్రం ట్యుటోరియల్... మధ్యాహ్నం కాలేజీ ఇలా ప్రతి రోజు 18 క్లాసుల వరకు చెప్పే వాడిని. ఎస్సెస్సీ, ఇంటర్, పాలిటెక్నిక్... ఇలా అన్ని తరగతులకు కోచింగ్ ఇచ్చేవాడిని. 1978లో హన్మకొండలో ఎస్ఆర్ జూనియర్ కాలేజీని స్థాపించాను. 1980లో ఎస్ఆర్ హైస్కూల్, 1994లో ప్రభుత్వ ఆమోదిత జూనియర్ కాలేజిని, 2002లో ఇంజనీరింగ్ కాలేజీలు, 2003లో డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు నెలకొల్పాను. తెలంగాణలో మహబూబ్నగర్ తప్ప అన్ని జిల్లాలో మా ఎస్ఆర్ విద్యాసంస్థలు ఉన్నాయి. విశాఖపట్టణంలో నెలకొల్పిన విద్యాసంస్థలు అక్కడి ప్రజల సహకారంతో సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అక్కడ ప్రజలకు ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్ లేదు. ఎవరైనా ఒక్కటే అనుకుంటారు. అది నా అనుభవపూర్వకంగా రుజువైంది. అందరి సహకారంతో అక్కడా బాగా చదువు చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు మొత్తం 93 విద్యా సంస్థలు ఉన్నాయి. 6170 మంది ఉపాధి పొందుతున్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అఫిలియేటెడ్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్థాపించాం. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించా. తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్(టీపీజేఎంఏ) అధ్యక్షుడిగా ఉన్నా. శ్రీమతి సహకారం ట్యుటోరియల్, కాలేజీలతో ఇలా దశాబ్దాలపాటు నిత్యం బిజీ. పిల్లల చదువులు, ఇంటి విషయాలు అన్ని నా భార్య సుమతీదేవి చూసుకునేవారు. మా కాలేజీలో హాస్టల్స్ నిర్వహణ ఆమే చూసుకునేది. నేను ప్రభుత్యోద్యోగం చేయాలని ఆమె మొదట కోరుకునేది. ప్రభుత్వోద్యోగం చేస్తే ఇప్పుడు ఇలా వేల మందికి ఉపాధి కల్పించేవాడిని కాదు కదా. అందుకే ఇప్పుడామె సంతోషంగా ఉంది. సుమతి వాళ్లది పెద్ద కుటుంబం. కరీంనగర్ జిల్లా మంథని. వీళ్ల అన్నయ్య చందుపట్ల రాంరెడ్డి మాజీ ఎమ్మెల్యే. గవర్నమెంట్ ఉద్యోగాలు వదులుకున్న సమయంలో నాపై ఒత్తిడి వచ్చింది. చదువుకునే రోజుల్లోనే అందరికి విద్య అందుబాటులో ఉండేలా ఏదన్నా స్కూల్ పెట్టాలని అనుకునేవాడిని. అందరూ దాన్ని అర్థం చేసుకోలేదు. తలా ఓ మాట అంటుంటే నాకు బాధనిపించేది. ఇదివరకే రెవెన్యూ ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఇప్పడు లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేశాను. నేనేమైనా తప్పు చేశానా? అని మథనపడ్డాను. తర్వాత ఏదైతే అదైందని ధైర్యం చేశాను. నాకు ఇద్దరు పిల్లలు. మధుసూదన్రెడ్డి, సంతోష్రెడ్డి. చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్దామనుకున్నారు. నేనే వద్దని చెప్పా. 1998 నుంచి విద్యా సంస్థల పర్యవేక్షణ భాగస్వాములయ్యారు. 2008 నుంచి వాళ్లే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. విద్యా వ్యవస్థ ఏ దేశమైనా విద్యతోనే ప్రగతి సాధిస్తుంది. మెరుగైన బోధన మంచి సమాజాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు విద్యార్థులు ఉద్యోగం లక్ష్యంగా చదువులు సాగిస్తున్నారు. తల్లిదండ్రుల ఆలోచన తీరు ఇలాగే ఉంటోంది. ఇది మారాలి. అమెరికాలో కూడా ఎస్ఆర్ అసోసియేషన్ ఉంది. నా పూర్వ విద్యార్థులు ఎంతోమంది విదేశాల్లో స్థిరపడిపోయారు. వారి ఆహ్వానం మేరకు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటా. ఎక్కువ యువత ఉన్న దేశం మనదే కావడంతో మిగిలిన దేశాలు మనవైపు చూస్తున్నాయి. గూగుల్, వాట్సాప్... ఇవన్నీ యువకులే రూపొందించారు. ఇలాంటి వాటికి ఇప్పుడు ఇంకా ఎంతో స్కోప్ ఉంది. మనకు ఉద్యోగం అని కాకుండా మనం కొందరికి ఉద్యోగం కల్పిస్తామనే ఉద్దేశంతో చదువు సాగాలి. ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్కి కష్టంలోనే సుఖముంటుంది. పేరు, ప్రతిష్ట అన్నీ వస్తాయి. - పిన్నింటి గోపాల్, (సాక్షి ప్రతినిధి, వరంగల్) ఫొటోలు : సంపెట వెంకటేశ్వర్లు ‘శ్రీమంతుడే..!’ నా సొంతూరు దమ్మన్నపేట అంటే ఎంతో ఇష్టం. నేను పుట్టిన ఊరు, ఈ పేరు రావడానికి కారణమైన ఊరు. ఆ ఊరితో నా బంధం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికీ అక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మా పొలంలో పని చేసే వారికి ఏ పని చేయాలనేది ఎప్పుడూ చెప్పను. మీరు ఏ పని చేస్తారో చేయండి. ముందుగా మీరు తీసుకుని నాకు ఇవ్వండి అని చెప్పాను. వాళ్లు తృప్తిగా పని చేస్తున్నారు. రెండు రోజులకోసారి 15 క్వింటాళ్ల కూరగాయలు వస్తున్నాయి. మా ఊళ్లో బడిని పునర్నిర్మించే పని చేపట్టాను. రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మా ఊరి వాళ్లు ఎవరైనా పని మీద వరంగల్ నగరానికి వస్తే భోజనం చేసి వెళ్లమని చెబుతుంటాం. మా విద్యా సంస్థల్లో మా ఊరి వాళ్లకు సగమే ఫీజు ఉంటుంది. ఇవన్నీ నాకు తృప్తి నిస్తున్నాయి. నా ఇనిస్టిట్యూషన్స్లో చదివే ఎంతోమంది పేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ ఇస్తున్నాను. ఇంకా చాలామందికి ఉచితంగా విద్యాదానం చేస్తున్నాను. జీవితం ఇప్పుడు హాయిగా సాగుతోంది. ఖాళీగా ఉంటే మనసుకు ఏది తోచదు. కేసీఆర్ అభినందన తెలంగాణ ఉద్యమం జరగడానికి దారి తీసిన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమం జరుగుతున్న తరుణంలోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలంగాణలో వందల కాలేజీలను ప్రారంభించారు. వాళ్లు ఇక్కడ కాలేజీలు పెట్టినప్పుడు మనం అక్కడ కాలేజీ పెట్టవచ్చు కదా అనే ఆలోచనతో నేను విశాఖపట్నంలో కాలేజీ ప్రారంభించా. ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నన్ను అభినందించారు. ‘మన వాళ్లు బయటికి వెళ్లరనే అభిప్రాయం ఉంది. వరదారెడ్డి అక్కడ స్కూళ్లు పెట్టి, ఆ అభిప్రాయం మార్చిండు. ఇలా ఎక్కువ మంది ఆలోచించాలి’ అని మీటింగ్లోనే అన్నారు. -
రూ. 100 కోట్లతో హెచ్ఎస్బీసీ స్కిల్ డెవలప్మెంట్
భారత్లో 75 వేల మందికి శిక్షణ లండన్: బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ భారత్ కోసం ‘హెచ్ఎస్బీసీ స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించింది. దీని కోసం హెచ్ఎస్బీసీ రూ.100 కోట్లు వెచ్చించనుంది. వచ్చే ఐదేళ్లలో 75,000కు పైగా యువతీ యువకులను, మహిళలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య లక్ష్యం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సంయుక్తంగా గురువారం సాయంత్రం ‘హెచ్ఎస్బీసీ స్కిల్స్ ఫర్ లైఫ్’ ప్రోగ్రామ్ను ఆవిష్కరించారు. 29 ఏళ్ల సగటు వయసుతో భారత్ 2020 నాటికి ప్రపంచంలోనే యుక్త వయసు జనాభా అధికంగా గల దేశంగా అవతరించనుందని హెచ్ఎస్బీసీ పేర్కొంది. ఒక దేశం స్థిర వృద్ధిని సాధించడంలో స్కిల్ డెవలప్మెంట్ కీలక పాత్ర పోషిస్తుందని, పేదరిక నిర్మూలనకు ఆయుధంగా పనిచేస్తుందని, సమాజంలో అసమానతలను తొలగిం చడంలో ప్రధాన భూమిక పోషిస్తుందని వివరించింది. వెనకబడిన యువతీ యువకుల్లో,మహిళ్లలో నైపుణ్యాలను పెంపొందించి, వారిని ఆర్థిక వృద్ధిలో భాగస్వాములను చేయడంలో ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని హెచ్ఎస్బీసీ ఇండియా గ్రూప్ జనరల్ మేనేజర్, సీఈవో స్టువర్ట్ పి మిల్నే విశ్వసించారు. -
జాబ్మేళాకు విశేష స్పందన
తుళ్ళూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్ స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరులో బుధవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటైన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో పలు నియామకాలకు నిర్వహించిన జాబ్మేళాకు 238 మంది యువతీయువకులు హాజరయ్యారు. వీరిలో146 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓడీపీఎస్ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్లో 26 మంది, నవత ట్రాన్స్పోర్టులో 21మంది, ఏజీస్ గ్లోబల్ సర్వీసెస్లో 45 మంది, ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్ఆఫీసర్లుగా 46 మంది ఎంపిక య్యారు. ఇతర విభాగాలలో శిక్షణ నిమిత్తం మరో 92 మందిని ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ జాబ్స్ సిటీ మేనేజర్ షేక్మీరావలి చెప్పారు. కార్యక్రమంలో సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రహంతుల్లా, సోషల్ డెవలప్మెంట్ డెరైక్టర్ జయదీప్, క్యాంపస్ అడ్మిన్ అధికారి అజయ్చౌదరి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఓ పుస్తకాన్ని పూర్తిగా చదవడం ఎలా?
సాధారణంగా విద్యార్థులకు పుస్తకాలు చదవడం ఒక సవాల్గా అనిపిస్తుంటుంది. బోర్ గా ఫీలవుతుంటారు. ఇప్పుడు ఈ పుస్తకం చదవాలా అని అనుకుంటారు. ఒక వేళ చదివినా మొక్కుబడిగా పరీక్షల కోసమే అసంపూర్ణంగా చదివి పక్కకు పడేస్తారు. ఇది కేవలం విద్యార్థులకే కాకుండా పెద్దవారికి కూడా వర్తిస్తుంది. ఎంతోమంది విలువైన పుస్తకాలు కొనుగోలు చేస్తారు కానీ వాటిని పూర్తిస్థాయిలో శ్రద్ధతో అస్సలు చదవరు. అయితే ఆ సమస్యకు ఓ పరిష్కారం కూడా ఉంది. అసలు పుస్తకాన్ని ఎలా చదవాలో, అందులో విషయపరిజ్ఞానం ఎలా నేర్చుకోవాలో పరిశీలించి కొందరు అధ్యయనకారులు ఏడు రకాల చిట్కాలు చెప్పారు. అవేంటంటే.. 1.రోజు ఎన్ని పేజీలు చదువుతామో ముగించే సమయానికి ఉన్న పేజిలో తప్పకుండా ఒక గుర్తు పుస్తకం వెలుపలికి కనిపించేలా పెట్టుకోవాలి. 2.ఒక సారి ఒక అంశం చదివినప్పుడు అది అర్థం కానట్లయితే.. అర్ధం అయ్యేవరకు మరోసారి చదవాలి. అది మంచి అలవాటు కూడా.. దీనిని జ్ఞాపక లేమి సమస్యగా అస్సలు భావించవద్దు. 3. ముఖ్యమైన సమాచారం రాత్రి వేళలో ఎట్టి పరిస్థితుల్లో చదువరాదు. సాయంత్రగానీ, రాత్రి వేళగానీ తేలికైన సాధారణ అంశాలు పఠించడం చాలా మంచిది. వేకువ జాముల్లో సాంకేతిక పరమైన అంశాలను, క్లిష్టమైన అంశాలను చదవాలి. 4.చదువుకునేందుకు కూర్చునే ప్రదేశం కూడా చాలా అనుకూలంగా ఉంటే ఇంకా మంచిది. లేదంటే ఏకాగ్రత లోపిస్తుంది. 5.ఒకసారి చదివిన అంశాన్ని గుర్తుంచుకోలేకపోతున్నట్లయితే అందులోని కీ పాయింట్స్ను ఒక్కొక్కటిగా తప్పకుండా ఓ క్రమ పద్ధతిలో నోట్స్ రాసుకోవాలి. 6.పుస్తకంలో ఏ అంశాన్ని చదువుతున్నారో అందులో పూర్తిగా లీనమవ్వాలి. అంశంలో నువ్వు భాగస్వామ్యం అయినట్లుగా నువ్వే అందులో తిరుగుతున్నట్లుగా ప్రదేశాలను సందర్శిస్తున్నట్లుగా భావించి పుస్తకంలో మునిగిపోవాలి. 7.ఒకసారి ఓ పుస్తకాన్ని చదవాలని నిర్ణయించుకొని కొంతమేర చదివి తిరిగి బోర్ గా అనిపించి పక్కకు పడేసినప్పుడు.. చదవలేకపోయానే అని బాధపడకుండా మనస్పూర్తిగా ఆ పుస్తకానికి క్షమాపణ చెప్పగలిగి ఎంత ఆలస్యం అయినా ఆ పుస్తకాన్ని చదవాలని భీష్మించుకోవాలి. ఇలా చేయడం ద్వారా పుస్తక పఠనం తేలికవడమే కాకుండా.. అందులోని సారాంశం కూడా మనసుకుపట్టేసి పుస్తక పఠనం లేకుంటేనే ఏదో వెలితిగా అనిపించే స్థితికి వస్తారు. ఆ స్థితి ఎప్పుడు మీలో ఉంటే.. అప్పుడు జ్ఞాన సముపార్జనకు మీరు సంసిద్ధులైనట్లు. -
పరిశ్రమలకు ‘పని’కొచ్చే చదువు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో పరిశ్రమల అనుసంధాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడమే ధ్యేయంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దేశీయ ఉత్పత్తి రంగాల్లో నైపుణ్యాలు కలిగిన యువత అవసరం ఎక్కువగా ఉన్నందున, దానికి అనుగుణంగా విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల సిలబస్ను మార్చాలని నిర్ణయించింది. నైపుణ్యాలు కలిగిన మానవ నవరులను అందించాలంటే యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అనుసంధానం అవసరమని గుర్తించింది. ఇందుకోసం విశ్వ విద్యాలయాల్లో యూనివర్సిటీ-పరిశ్రమల అంతర్గత అనుసంధాన కేంద్రాలను(యూనివర్సిటీ-ఇండస్ట్రీ ఇంటర్-లింకేజీ సెంటర్స్) ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు జూలై 27న జరిగిన కమిషన్ సమావేశంలో మార్గదర్శకాలను ఆమోదించింది. మార్గదర్శకాల్లోని వివిధ అంశాలు, విశ్వవిద్యాలయాల్లో యూఐఎల్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై మరిన్ని సలహాలు, సూచన లను స్వీకరిస్తోంది. త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఈ పథకాన్ని అమలు చేసే యూనివర్సిటీలకు యూజీసీ నిధులను ఇవ్వనుంది. రెండేళ్లపాటు(12వ పంచవర్ష ప్రణాళిక ముగిసే వరకు) యూజీసీ సహకారం అందిస్తామని పేర్కొంది. ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే యూనివర్సిటీలు యూజీసీకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను యూజీసీ నిపుణుల కమిటీ పరిశీలించి యూఐఎల్ కేంద్రాలను మంజూరు చేస్తుంది. పరిశ్రమలు ఏం చేస్తాయంటే.. పరిశ్రమలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి. నైపుణ్యాల పెంపునకు సహకరించాలి. పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వాలి. ప్రత్యేక విభాగాలు, నిర్వహణలో సహకారం అందించాలి. పరిశోధనల్లో భాగస్వామ్యం కల్పించాలి. స్కాలర్షిప్లు అందజేయాలి. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహకారం అందించాలి. యూఐఎల్ కేంద్రాలు ఏం చేయాలంటే... విద్యార్థుల్లో విజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధికి పక్కా చర్యలు చేపట్టేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అకడమిక్ కార్యక్రమాలను నిర్ణయించాలి. అత్యున్నత విద్యార్హత లు కలిగిన ఫ్యాకల్టీని నియమించాలి. నాణ్యమైన పరిశోధనలకు పెద్దపీట వేయాలి. నైపుణ్యాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమలతో సంప్రదించి ఒప్పందాలు చేసుకోవాలి. పరిశ్రమల అవసరాల మేరకు సిలబస్, బోధనలో మార్పులు చేయాలి. ఉపాధి అవకాశాలు లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. పరిశ్రమల సందర్శన, శిక్షణలు, స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్ నిర్వహించాలి. సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించే చర్యలు చేపట్టాలి. -
50 కిలోమీటర్లకో చెక్పోస్టు
జాతీయ రహదారులపై ప్రతి 50 కిలో మీటర్లకూ టాస్క్ఫోర్స్ పోలీసులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. జాతీయ రహదారులకు దగ్గరగా ఉన్న గ్రామాల వద్ద రోడ్డు దాటుతూ ఎక్కువ మంది ప్రమాదాల బారిన పడుతున్నారని.. ప్రజలు ఇష్టానుసారంగా రోడ్డు దాటకుండా ఇరువైపులా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, రద్దీ ఎక్కువగా ఉన్నచోట అండర్ టన్నెల్స్ నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికులను రవాణా చేసే వాణిజ్య వాహనాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, అలాంటి డ్రైవర్ల లెసైన్సులు రద్దు చేస్తామని చెప్పారు. ఏకాభ్రిపాయంతోనే విద్యపై నిర్ణయం.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలుచేస్తున్న నాన్ డిటెన్షన్ విధానాన్ని డిటెన్షన్ విధానంగా మార్చాలా వద్దా అన్నదానిపై ఏకాభ్రిపాయంతోనే నిర్ణయం తీసుకుంటామని రాజప్ప చెప్పారు. దీనిపై జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించే సమావేశాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను బట్టి ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. సిలబస్ను కూడా మార్చే విషయమై మంత్రి వర్గం చర్చించనుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
నిపుణుల రాజధానిగా భారత్
పేదల నుంచి నిపుణుల సైన్యాన్ని తయారు చేస్తాం * ప్రతి పేదవాడూ నా సైనికుడు * పేదరికంపై పోరాటంలో విజయం సాధించాలి * 2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ * ప్రధాన్మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన మోదీ న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచ మానవ వనరుల రాజధానిగా ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. విశ్వ ఉత్పత్తి కర్మాగారంగా చైనా అవతరించినట్లే నైపుణ్య భారత్గా మన దేశం ఆవిర్భవించాలని ఆయన అన్నారు. ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతిష్టా త్మకమైన ‘‘ప్రధాన్మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై)’’ కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం మోదీ ప్రారంభించారు. దీంతో పాటు నైపుణ్యాభివృద్ధి-పారిశ్రామిక జాతీయ విధానం-2015, నైపుణ్య రుణాల పథకాలను ప్రారంభించారు. కొంతమంది ఎంపిక చేసిన ట్రైనీలకు ఆయన చేతుల మీదుగా రుణాలు అందించారు. ‘‘స్కిల్ ఇండియా’’ లోగోను కూడా ప్రధాని ఆవిష్కరించారు. యువతలో ఆత్మాభిమానాన్ని పెంపొందించి.. వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకురావలసిన అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం నైపుణ్య భారత్ మిషన్ను ప్రారంభించిందని మోదీ అన్నారు. ‘‘మనం చేస్తున్నది పేదరికంపై పోరాటం.. పేదల నుంచి మనం పటిష్టమైన సైన్యాన్ని తయారు చేయాలి. ప్రతి పేదవాడు నా సైనికుడే.. వారి లోపల దాగున్న ప్రతిభను వెలికి తీయడం ద్వారా పేదరికంపై యుద్ధంలో విజయం సాధిస్తాం’’ అని మోదీ అన్నారు. పోటీలో వెనుకబడిన పేదలను ముందుకు తీసుకురావాలనే ఈ పథకాన్ని ప్రారంభించామని. రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో కేంద్రం కలసి పనిచేస్తామని మోదీ అన్నారు. దేశంలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వయసున్న వారే ఉన్నారని వాళ్లు ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించకపోతే దేశానికి వారే పెద్ద సవాలుగా మారతారని మోదీ అన్నారు. ‘‘ప్రపంచం... పరిజ్ఞానం చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంది. రానున్న పదేళ్లలో పారిశ్రామిక వేత్తలు.. టెక్నాలజీ నిపుణుల పరస్పర సమన్వయంతో యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచాల్సి ఉంది.’’ అని ఆయన అన్నారు. చైనా ప్రపంచ ఉత్పాదక కర్మాగారంగా అగ్రస్థానంలో ఉన్నట్లే మన దేశం కూడా మానవ వనరుల రాజధానిని చేయటం కోసం అంతా దృఢచిత్తంతో పని చేయాలని మోదీ తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో సంపద పోగై ఉన్నప్పటికీ.. వాటి దగ్గర మానవ వనరుల కొరత విపరీతంగా ఉందని మోదీ అన్నారు. మన దగ్గర సరైన నిపుణులను తయారు చేసుకోగలిగితే.. ప్రపంచానికి మన అవసరం తప్పనిసరిగా ఏర్పడుతుందన్నారు. దేశ వ్యాప్తంగా శిక్షణ సంస్థలు క్రియాశీలకంగా వ్యవహరించాలని.. ఐఐటీ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఎలాగైతే పేరు తెచ్చుకున్నాయో.. ఐటీఐలు కూడా ప్రపంచదేశాల్లో తమదైన ముద్ర కనిపించేలా తయారు కావాలని మోదీ అన్నారు. తమ ప్రభుత్వ అతి ముఖ్యమైన ప్రాధాన్య అంశం యువతకు ఉపాధి కల్పించడమేనన్నారు. 2022 నాటికి 40.02 కోట్ల మందికి శిక్షణ ఇస్తామని ప్రధాని వివరించారు. మోదీ ప్రసంగంలోని మరి కొన్ని అంశాలు.. * మన యువత ఎవరి దయాదాక్షిణ్యాలపైనో బతకాలనుకోవటం లేదు. వారి ప్రతిభతోనే తలెత్తుకుని బతకాలనుకుంటున్నారు. * ప్రభుత్వ ముఖ్యమైన ప్రాధాన్యాంశం విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించటం * యువత తమంతట తాము ఉపాధిని సాధించేందుకు అనువైన నిర్మాణాత్మకమైన వ్యవస్థలను మనం సృష్టించాలి. * ఈ పథకం మీ జేబులను నింపటం కోసమే కాదు.. మీలో ఆత్మస్థైర్యం నింపటం.. జీవితంలో నూతన శక్తిని కలిగిస్తాం * లక్షలాది యువత వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించాలి.. ఆధునిక భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి. * వచ్చే దశాబ్ద కాలంలో నాలుగు నుంచి 5 కోట్ల వరకు మానవ వనరుల మిగులు మన దేశంలో ఏర్పడుతుంది. ప్రపంచ సవాళ్లను దీటుగా ఎదుర్కొనే విధంగా ఈ మానవ వనరులను మనం తీర్చి దిద్దాలి. * దేశంలో మొదటి సారి యువకుల నైపుణ్యానికి ప్రభుత్వ ధృవీకరణ లభిస్తోంది. నైపుణ్యాభివృద్ధికి ప్రతి రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయం యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్రూఢీ తెలిపారు.దేశంలో మిగులు మానవ వనరులను నైపుణ్య వనరుగా మారుస్తామని ఆర్థిక మంత్రి జైట్లీఅన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మంచి స్థానంలో నిలుస్తుందని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన్మంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే.. దేశంలో 35 ఏళ్ల లోపు యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఇది. వచ్చే ఏడాది చివరికల్లా 24 లక్షల మందికి సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి విద్యల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2022 నాటికి 40 కోట్ల మందిని గుణాత్మక నిపుణులుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. స్కిల్ లోన్స్: నైపుణ్య శిక్షణ పొందిన యువతకు స్కిల్ లోన్ పేరుతో రూ. 5 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. రానున్న అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో శిక్షణ పొందిన యువకుల్లో 34 లక్షల మందికి రుణ సదుపాయం కల్పించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. పరశురాంకు ప్రశంస నైపుణ్య భారత కార్యక్రమంలో తెలంగాణ యువకుడు పరశురాం నాయక్కు మోదీ ప్రశంసాపత్రాన్ని అందచేశారు. న్యూజిలాండ్లో ఏప్రిల్లో జరిగిన ప్రపంచ స్కిల్ ఒసెనియా-2015 పోటీ ల్లో ‘ఇటుకలు పేర్చడం’లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన పరుశురాంకాంస్య పతకం సాధించడాన్ని మోదీ అభినందించారు. -
తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ
కేంద్రమంత్రి రూడీ వెల్లడి * జాబితాలో ఏపీ, బిహార్ కూడా * విద్యార్థుల్లో నైపుణ్యాలుపెంచడమే లక్ష్యం * ఒకే గొడుగు కిందకు ఐటీఐ, ఏటీఐలు * వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెడతామని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) యూనివర్సిటీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో కలసి నగరంలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఏటీఐ)ను రూఢీ సందర్శించారు. దేశంలోని 12 వేల ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు, 7 ఏటీఐలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఉత్పత్తి రంగంలో నిపుణుల కొరతను తీర్చడంతో పాటు నిరుద్యోగాన్ని దూరం చేసేందుకు ఈ వర్సిటీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొదటివిడతలోనే తెలంగాణ, ఏపీ, బిహార్లో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ‘నేషనల్ స్కిల్ మిషన్’ను జూలై 15న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐల్లోని విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ వర్సిటీలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా విద్యావిధానంలో మార్పులు తెస్తున్నామని, ఇంజనీరింగ్ సహా ప్రాథమిక స్థాయి విద్యలో నైపుణ్యాలు పెంపొందేలా సిలబస్ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో నల్లధనమే ఉండదు విదేశాల్లో ఉన్న నల్లదనం విషయంలో కేంద్రం ఓ విధానానికి వచ్చిందని, భవిష్యత్తులో నల్లధనమే ఉండదని రూడీ పేర్కొన్నారు. అవినీతిని నిరోధించేందుకే బొగ్గు, సహజవనరుల్లో రాష్ట్రాలకే అధికారాలు అప్పగించినట్టుగా వివరించారు. ప్రైవేటు సంస్థల కోసం ప్రభుత్వం భూసేకరణ చేయబోదని, ప్రభుత్వ అవసరాలకే భూసేకరణ ఉంటుందని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం భారీగా పెంచినట్టుగా చెప్పారు. ఎంతమంది కలిసినా బిహార్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తొలివిడతలోనే తెలంగాణకు స్కిల్ డెవలప్మెంటు యూనివర్సిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
'అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన టీఎస్ ఐపాస్ విధానం అమలులోనూ అంతే వేగంతో ముందుకు వెళుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రెండు వారాల్లోపే 17 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పెద్దపెద్ద కంపెనీలన్నీ ఆసక్తి చూపుతున్నాయన్నారు. తన అమెరికా పర్యటనలోనూ పలు కంపెనీలు తెలంగాణ వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. పరిశ్రమల్లో ఉపాధి పొందగోరే యువకుల కోసం పది జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఓటుకు కోట్లు కేసుపై స్పందిస్తూ దొరికిన దొంగ తప్పించుకునే ప్రయత్నాలు.. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధిని ఏ విధంగానూ ప్రభావం చూపవన్నారు. -
జేఎన్టీయూహెచ్తో నాస్కామ్ ఎంవోయూ
- ప్రభుత్వపక్షాన సమన్వయకర్త ‘టాస్క్’ - నైపుణ్యాల పెంపే ధ్యేయం - పైలట్ ప్రాజెక్టుగా 50 కళాశాలల్లో శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం సమాయత్తమైంది. పరిశ్రమలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల రూపకల్పనతోపాటు కోర్సు పూర్తి అయిన విద్యార్థులను ఉద్యోగార్హత కలిగినవారిగా తయారు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా సచివాలయంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో నాస్కామ్, జేఎన్టీయూహెచ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సంస్థలు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదీ ప్రయోజనం: రాబోయే ఐదు, పదేళ్లలో ఉద్యోగావకాశాలు అధికంగా లభించే కోర్సులపట్ల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. బీటెక్ మూడు, చివరి సంవత్సరం విద్యార్థులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం ద్వారా కళాశాల నుంచే నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగాలకు వెళ్లేందుకు ఆయా కోర్సుల దోహదపడేలా కోర్సులను రూపొందిం చారు. వివిధ రంగాల్లో రాబోయే ఆపార అవకాశాలను ముందుగానే పసిగట్టి కోర్సులను డిజైన్ చేస్తారు. ఐటీ రంగంతో మొదలు: ప్రస్తుతానికి ఐటీ రంగంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనాలసిస్, డిజైన్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా వచ్చే అవకాశమున్నందున, వచ్చే రెండేళ్లలో సుమారు 15 వేల మంది ఐటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి 50 కళాశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. కోర్సుల డిజైనింగ్, అధ్యాపకుల శిక్షణ బాధ్యత నాస్కామ్, కాలేజీల్లో కోర్సుల పరిచయం బాధ్యతను జేఎన్టీయూహెచ్ చేప ట్టనుంది. జేఎన్టీయూహెచ్, నాస్కామ్ల మధ్య సమన్వయకర్తగా ప్రభుత్వం తరఫున టాస్క్ పనిచేయనుంది. నైపుణ్యాల పెంపునకే ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు నిలిపేశామని కేటీఆర్ తెలిపారు. -
రోశయ్యకు నాయిని క్షమాపణ
తప్పుడు సమాచారం వల్లే మల్లేపల్లి భూమిపై ప్రకటన చేసినట్లు వివరణ సాక్షి, హైదరాబాద్: అధికారులు ఇచ్చిన సమాచార లోపంతో తమిళనాడు గవర్నర్ రోశయ్య అల్లుడికి కేటాయించిన భూమి విషయంలో తప్పుడు ప్రకటన చేశానంటూ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో రోశయ్యకు క్షమాపణ చెప్పారు. మల్లేపల్లి ఐటీఐకి చెందిన భూమిలో ఒక ఎకరాన్ని తక్కువ ధరకే రోశయ్య అల్లుడికి కేటాయించారని తాను చేసిన ప్రకటన తప్పు అని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లేపల్లి ఐటీఐ స్థలాన్ని నైస్ ఆసుపత్రికి కేటాయించడంపై విచారణ జరిపి పూర్తి వివరాలు తెలుసుకుంటామని, ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రివర్గంలో చర్చిస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో మల్లేపల్లి ఐటీఐని ఆధునీకరిస్తామని, రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలనూ అభివృద్ధిపరుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రంలో ‘స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని’ మంజూరు చేయిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారని, స్థలం కేటాయింపునకు సీఎం కె.చంద్రశేఖర్రావు కూడా హామీ ఇచ్చారని నాయిని చెప్పారు. నాయిని సమక్షంలో చేరికలు వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం నాయిని సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గ పరిధిలోని గణపురం మండలానికి చెందిన సింగిల్విండో వైస్ చైర్మన్, డెరైక్టర్లు, టీడీపీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి నాయిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి గమ్యానికి నైపుణ్యాల నావ!
నడుస్తున్న కాలంలో సింహభాగం ‘నైపుణ్యం’పైనే చర్చ జరుగుతోంది. చేతిలో డిగ్రీ, పీజీ పట్టాలు ఎన్నున్నా.. ‘నైపుణ్యాలు’ గుండుసున్నా కావడంతో అధిక శాతం యువతకు అవకాశాలు ఎండమావిగా మిగులుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యాభివృద్ధిపైనే దేశ సత్వర అభివృద్ధి, పోటీతత్వం, సామాజిక స్థిరత్వం ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పోటీని తట్టుకుని నిలవాలంటే.. కంపెనీలు/సంస్థలు ప్రమాణాలకు అనుగుణంగా వస్తు, సేవలను అందించాల్సి ఉంది. ఈ తరుణంలో సుశిక్షితులైన, నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడింది. అందుకే విద్యావంతులైన యువతలో మార్కెట్కు సరిపడా స్కిల్స్ పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘ఎంటర్ప్రెన్యూర్షిప్, స్కిల్ డెవలప్మెంట్’కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, నైపుణ్యాల అభివృద్ధి సంస్థల ఏర్పాటు, కేటాయింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో వివిధ అంశాల్లో నైపుణ్యాలను అందించే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. వివరాలు.. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్: జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ)ను ఏర్పాటు చేశారు. ఇది ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్ఎస్డీసీ సహకారంతో హైదరాబాద్లో నడుస్తున్న కేంద్రాల్లో 21 అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. 30 రోజుల నుంచి 75 రోజుల వరకు శిక్షణ ఇస్తారు. కోర్సును బట్టి ఫీజు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటుంది. రిజర్వేషన్లను బట్టి ఫీజు రాయితీ లభిస్తుంది. కోర్సులు: ఆటోమొబైల్/ఆటో కాంపొనెంట్; ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్; టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్; లెదర్, లెదర్ గూడ్స్; కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్; జెమ్ అండ్ జ్యువెలరీ; బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్; ఫుడ్ ప్రాసెసింగ్; హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్; బిల్డింగ్ హార్డ్వేర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: www.nsdcindia.org ఎంఎస్ఎంఈ: కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) ఆధ్వర్యంలోని అభివృద్ధి సంస్థ హైదరాబాద్లో పారిశ్రామిక ప్రాంతమైన బాలానగర్లో ఉంది. ఇది పారిశ్రామిక ప్రేరణ ప్రచార కార్యక్రమాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్- స్కిల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎంఎస్ఎంఈ యువతకు ఉపాధి కల్పించే వివిధ కోర్సులు అందిస్తోంది. కోర్సులు: కంప్యూటర్ హార్డ్వేర్, మెయింటెనెన్స్-నెట్వర్కింగ్; గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్; హౌస్ వైరింగ్; ఎలక్ట్రిక్ గాడ్జెట్ రిపైరింగ్; ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాల్లో శిక్షణ అందిస్తోంది. వీటికి సంబంధించి సంస్థ ఎప్పటికప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుంది. వెబ్సైట్: http://msmehyd.ap.nic.in/ ఎన్ఐఓఎస్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్- ఎన్ఐఓఎస్(గతంలో నేషనల్ ఓపెన్ స్కూల్గా పిలిచేవారు).. 1989లో ఏర్పడిన స్వయంప్రతిపత్తిగల సంస్థ. ఇది సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిలో జనరల్, అకడమిక్ కోర్సులతో పాటు వివిధ వృత్తివిద్యా కోర్సులు అందిస్తోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ రీజియన్ కేంద్రం దిల్సుఖ్నగర్లో ఉంది. కోర్సులు: హౌస్ వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయిన్స్ రిపైరింగ్; కేటరింగ్ మేనేజ్మెంట్; ఎయిర్ కండీషనింగ్; బ్యూటీ కల్చర్; ఫుడ్ ప్రాసెసింగ్; ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వంటి అంశాల్లో శిక్షణ కోర్సులున్నాయి. వెబ్సైట్: www.nios.ac.in అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్: నగరంలోని విద్యానగర్లో ఉన్న అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఐ).. నైపుణ్యాలున్న మానవ వనరులను అందించేందుకు వివిధ దీర్ఘకాలిక, స్వల్పకాలిక కోర్సులను అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో నిపుణుడైన ఇన్స్ట్రక్టర్గా చేరేందుకు ఏడాది కాల వ్యవధిగల క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ (సీఐటీఎస్) కోర్సు అందుబాటులో ఉంది. ఇందులోని విభాగాలు: ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెషినిస్టు, మెకానిక్ మోటార్ వెహికల్, వెల్డర్. వీటితో పాటు అడ్వాన్స్డ్ వొకేషనల్ ట్రైనింగ్ స్కీమ్, వొకేషనల్ ట్రైనింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు, టెక్నికల్ అసిస్టెంట్ స్కీమ్, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ స్కీమ్ల కింద స్వల్పకాలిక కోర్సులున్నాయి. వెబ్సైట్: http://atihyderabad.ap.nic.in/ ఎన్ఐ-ఎంఎస్ఎంఈ: యూసఫ్గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎన్ ఐ-ఎంఎస్ఎంఈ) ప్రధానంగా రెండు రకాల కోర్సులను అందిస్తోంది. అవి.. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు. ఉదా.. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్ అండ్ ప్రొమోషన్ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్; ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ త్రూ మైక్రో ఫైనాన్స్. ఇవి సాధారణంగా 8-12 వారాల వ్యవధిగల కోర్సులు. రెండోది ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు. వెబ్సైట్: www.nimsme.org విద్యార్హతల కంటే నైపుణ్యాలే కీలకం తరగతి గదిలో నేర్చుకునేది విజ్ఞానం. ప్రాక్టికల్గా నేర్చుకునేది నైపుణ్యం. డిగ్రీలు విద్యార్హతలకు మాత్రమే ఉపయోగపడతాయి. కెరీర్లో రాణించాలంటే సంబంధిత అంశానికి అవసరమైన నైపుణ్యాలను సముపార్జించుకోవాలి. ఇంజనీరింగ్ విషయానికొస్తే విద్యార్థులు మొదటి సెమిస్టర్ నుంచే ప్రాజెక్టు వర్క్ మొదలుపెడితే నైపుణ్యాల సాధన దిశగా అడుగుపడినట్లే! ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరి జ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐటీ, కమ్యూనికేషన్ విభాగాల్లో వేలాదిగా మంచి అవకాశాలున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో నెలకొన్న పోటీని ఎదుర్కొనేందుకు విద్యార్థులు నైపుణ్యాలకు పదునుపెట్టుకోవడమనేది దైనందిన చర్యగా మారాలి. కమ్యూనికేషన్, లీడర్షిప్ స్కిల్స్ వంటి వాటిని క్యాంపస్ నుంచి బయటకు రాకముందే పుణికిపుచ్చుకోవాలి. ఒకవేళ స్కిల్స్ లేకుండా బయటికొస్తే అందుబాటులో ఉన్న శిక్షణ సంస్థల్లో చేరి, శ్రద్ధతో నైపుణ్యాలను ఒంటబట్టించుకోవాలి. - డాక్టర్ యు.చంద్రశేఖర్, డెరైక్టర్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా -
నైపుణ్యాల వృద్ధికి.. ఉపకరించే సాధనాలు
స్కిల్ గ్యాప్.. అంటే పరిశ్రమలు అభ్యర్థుల్లో కోరుకుంటున్న నైపుణ్యాలకు.. విద్యార్థుల్లో ఉంటున్న సాధారణ నైపుణ్యాలకు మధ్య అంతరం. నేడు ఏ కోర్సులు చదివిన విద్యార్థులకైనా జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అభ్యర్థులు నైపుణ్యాల లేమితో ఉద్యోగాలను దక్కించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆశిస్తున్న స్కిల్స్.. టెక్నికల్, మేనేజీరియల్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. వీటన్నింటినీ సొంతం చేసుకుంటేనే ఆకర్షణీయమైన కెరీర్ సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధనలో అందరికంటే ముందు నిలవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై విశ్లేషణ.. ఇంటర్న్షిప్స్ అకడమిక్స్ స్థాయిలోనే పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను ప్రత్యక్షంగా పొందగలిగే మార్గం ఇంటర్న్షిప్స్. అంటే.. ఒక విద్యార్థి తాను చదువుతున్న కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో కొద్ది నెలలపాటు పని చేయడం ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవడం. దీంతో పాటు వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఇంటర్న్షిప్స్ అనే ప్రక్రియ కరిక్యులంలో భాగంగా లేనప్పటికీ.. కొన్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలు సొంతంగా ఇంటర్న్షిప్ను అమలు చేస్తున్నాయి. బీటెక్లో మూడో ఏడాది ముగిసిన తర్వాత సెలవుల సమయంలో, ఎంబీఏలో మొదటి సంవత్సరం తర్వాత సెలవుల్లో ఈ ఇంటర్న్షిప్ ప్రక్రియ ఉంటోంది. వీటినే సమ్మర్ ఇంటర్న్గా పేర్కొంటున్నారు. ఈ సమయంలో విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం ఉన్న పరిశ్రమల్లో రెండు లేదా మూడు నెలల నిర్దేశిత వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే వీలుంటుంది. స్కిల్ గ్యాప్ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్న పరిశ్రమ వర్గాలు, సంబంధిత సంస్థలు కూడా ఇంటర్న్షిప్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంటర్న్షిప్స్ను ఆఫర్ చేసే సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఉత్పత్తి రంగంలో ఈ ధోరణి కొంత తక్కువైనప్పటికీ.. ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు ఇంటర్న్షిప్ ట్రైనీ అవకాశాలు బాగా కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సాఫ్ట్వేర్ సంస్థలు ఇంటర్న్ ట్రైనీలను నియమించుకోవడంలో ముందుంటున్నాయి. వీటిల్లో శిక్షణ పొందడంతోపాటు ఆయా సంస్థల విధానాల ప్రకారం ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందుకోవచ్చు. ఇంటర్న్షిప్ సమయంలో చొరవ, తమకు కేటాయించిన విభాగంలో ప్రతిభ ద్వారా ఆయా సంస్థల గుర్తింపు పొందితే.. ఇంటర్నషిప్ పూర్తయ్యాక ఉద్యోగాన్ని కూడా దక్కించుకోవచ్చు. ప్రాజెక్ట్ వర్క్స్ విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో మరో ముఖ్య సాధనం ప్రాజెక్ట్ వర్క్స్. ప్రస్తుత కరిక్యులం ప్రకారం ప్రతి ప్రొఫెషనల్ కోర్సులోనూ ఇది తప్పనిసరి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్లో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఫలితంగా విద్యార్థులకు సదరు సంస్థ, విభాగాలపై నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రాజెక్ట్ వర్క్లో విద్యార్థులు తాము ఎంచుకున్న అంశానికి సంబంధించి.. ఏదైనా ఒక సంస్థలో ఆరు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో తాము ఎంచుకున్న అంశంలో సమస్య ఎదురైతే.. దాని పరిష్కార మార్గాలు తెలుసుకుని పరిష్కరించాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్ విధానం కూడా విద్యార్థులకు భవిష్యత్తు ఉద్యోగాలను ఖాయం చేసే మార్గంగా పేర్కొనొచ్చు. ప్రాజెక్ట్ వర్క్ వ్యవధిలో సదరు సంస్థలో చక్కటి పనితీరు కనబరిచి ఉన్నతాధికారుల గుర్తింపు పొందితే అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలెన్నో. ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించి మరో ప్రత్యామ్నాయం ఇండివిడ్యువల్/గ్రూప్ ప్రాజెక్ట్స్. సంస్థల్లో ప్రాజెక్ట్ వర్క్ అవకాశం పొందని విద్యార్థులు సొంతంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా ప్రాజెక్ట్ చేయడం. ఈ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ ద్వారా సమస్య-పరిష్కారాలను సంస్థల దృష్టికి తీసుకెళ్లొచ్చు. మీరు చెప్పిన పరిష్కార మార్గాలు నచ్చితే మీకు ఉద్యోగం దక్కినట్లే. ఇలా తమ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ను సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయా రంగాలకు సంబంధించి నిర్వహించే సెమినార్లు, కాలేజ్ సావనీర్లు, క్యాంపస్ రిక్రూట్మెంట్ సెషన్స్ను వేదికలుగా ఉపయోగించుకోవాలి. కానీ.. ఇటీవల చాలా మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మార్కుల సాధన, సర్టిఫికెట్లో పర్సంటేజీ సంఖ్య పెంపుదల సాధనంగానే భావిస్తున్నారు. ఇది సరికాదు. ప్రాజెక్ట్ వర్క్ అంటే తాము అప్పటి వరకు పొందిన థియరీ నాలెడ్జ్ను క్షేత్ర స్థాయిలో అన్వయించడంతోపాటు.. వాస్తవ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పొందేందుకు చక్కటి సాధనంగా వినియోగించుకోవాలి అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి. ఉమామహేశ్వరరావు. అప్రెంటీస్షిప్స్ అప్రెంటీస్షిప్ ట్రైనింగ్.. విద్యార్థులు తాము ఉత్తీర్ణత సాధించిన కోర్సుకు సంబంధించిన సంస్థలో నిర్దిష్ట కాలంలో పూర్తి స్థాయిలో పని చేయడం. ముఖ్యంగా వృత్తి విద్య కోర్సుల్లో అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ ఎంతో కీలకమైన అంశం. అంతేకాకుండా స్కిల్ గ్యాప్నకు చక్కటి పరిష్కార మార్గం కూడా. నిర్ణీత వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్షిప్లో పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించడం ద్వారా క్షేత్ర స్థాయి అవసరాలపై అవగాహన పొందొచ్చు. అప్రెంటీస్షిప్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లోనే అప్రెంటీస్ యాక్ట్ పేరిట చట్టాన్ని కూడా రూపొందించింది. దీని ప్రకారం సంస్థలు మొత్తం శ్రామిక శక్తిలో పది శాతం మేర అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవాలి. అంతేకాకుండా శిక్షణలో స్టైఫండ్ చెల్లించాలని కూడా నిర్దేశించింది. ఇప్పటికే బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, బీఈఎల్, గెయిల్ వంటి మహారత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలు; ప్రైవేటు రంగంలో వేల సంఖ్యలో.. ట్రేడ్ అప్రెంటీసెస్; గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీసెస్; టెక్నీషియన్ అప్రెంటీసెస్ వంటి హోదాల్లో ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాల వరకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. నిర్ణీత వ్యవధి పూర్తయ్యాక నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, సెంట్రల్ అప్రెంటీస్ కౌన్సిల్లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ట్రేడ్ సర్టిఫికెట్లు పొందొచ్చు. కానీ.. ఇప్పటికీ అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ అంటే విద్యార్థుల్లో అంతగా అవగాహన ఉండట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అప్రెంటీస్షిప్ సదుపాయం సంఖ్య 4.8 లక్షలు ఉంటే కేవలం 2.8 లక్షల మంది మాత్రమే దీన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అప్రెంటీస్ చట్టానికి మార్పులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో స్టైఫండ్ శాతాన్ని కూడా 40 శాతం మేర పెంచింది. టెక్నికల్ కోర్సులకే పరిమితమైన ట్రైనింగ్ను బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఆన్ జాబ్ ట్రైనింగ్ స్కిల్ గ్యాప్నకు సంబంధించి ఇటు విద్యార్థులు, అటు పరిశ్రమ వర్గాలకు చక్కటి వారధిగా నిలుస్తున్న అంశం ఆన్ జాబ్ ట్రైనింగ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ద్వారా తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్న సంస్థలు.. వారికి తమ అవసరాలకు అనుగుణంగా సంబంధిత అంశాల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించేందుకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమమే ఆన్ జాబ్ ట్రైనింగ్. ముఖ్యంగా బీటెక్లో బ్రాంచ్తో సంబంధం లేకుండా అన్ని బ్రాంచ్ల విద్యార్థులను నియమిస్తున్న ఐటీ సంస్థలు ఆన్ జాబ్ ట్రైనింగ్కు ప్రాధాన్యమిస్తున్నాయి. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల పాటు ఉండే ఆన్ జాబ్ ట్రైనింగ్లో అభ్యర్థులకు.. వారు నియమితులైన విభాగాలకు సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతోపాటు సంస్థలో ఇతర విభాగాలు, వాటి విధి విధానాలు, పనితీరు వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. ఈ సదుపాయం కేవలం ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే కాకుండా.. సంస్థలో అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలోనూ అమలు చేస్తున్నాయి. మిడ్ లెవల్ కెరీర్ ప్రొఫెషనల్స్కు సంబంధించి.. ఆయా ఉద్యోగులు పని చేస్తున్న విభాగాలు, రంగాల్లోని తాజా పరిణామాలు, అప్డేటెడ్ నైపుణ్యాలు అందించే విధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి. ఫలితంగా ఉత్పాదకత పెరగడంతోపాటు, పోటీదారులకంటే ఒకడుగు ముందుండొచ్చనేది సంస్థల అభిప్రాయం. అభ్యర్థులు కూడా ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాల ద్వారా మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. సర్టిఫికేషన్లు ఎన్నెన్నో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఇప్పుడు ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నికల్ కోర్సుల్లో సెంట్రల్ ఒకేషనల్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో.. విద్యార్థుల డొమైన్ అర్హతలకు ఆధారంగా పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆయా రంగాలకు సంబంధించి- పరిశ్రమ వర్గాలతో ఒప్పందం ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాటిని పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తోంది. వీటితోపాటు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఆయా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ వివరాలు.. ఇన్ఫోసిస్: ఈ సంస్థ ఐటీ స్కిల్ డెవలప్మెంట్ కోసం సొంతంగా గ్లోబల్ ట్రైనింగ్ సెంటర్ను నిర్వహిస్తోంది. ఐటీసీ: రిటైల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీసీ సంస్థ- ఎన్ఐఎస్-స్పార్తా సంయుక్తంగా రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఐసీఐసీఐ బ్యాంకు, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరికొన్ని బ్యాంకులు పలు ఇన్స్టిట్యూట్లతో కలిసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లు స్టాక్ మార్కెట్ నిర్వహణ సంబంధిత పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. డొమైన్తోపాటు మరెన్నో స్కిల్స్ ఇటీవల కాలంలో సంస్థలు అభ్యర్థుల్లోని డొమైన్ నాలెడ్జ్కే పరిమితం కాకుండా ఇతర అంశాలు వాటిలోని నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. దృక్పథం, నైతికత వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవల తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయా సంస్థలు కోరుకుంటున్న స్కిల్స్ శాతాల గణాంకాలు.. ఇంటెగ్రిటీ అండ్ వ్యాల్యూస్: 30 శాతం రిజల్ట్ ఓరియెంటేషన్:21 శాతం బెటర్ ఆప్టిట్యూడ్: 12 శాతం కోర్ డొమైన్: 14 శాతం పీపుల్ స్కిల్స్ (కల్చరల్ డైవర్సిటీ, టీమ్ వర్క్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్): 23 శాతం ఇంటర్న్షిప్స్.. వే టు ఎంప్లాయ్మెంట్ కోర్సు వ్యవధిలో విద్యార్థులు చేసే ఇంటర్న్షిప్స్ వారి భవిష్యత్తు ఉపాధికి మార్గం నిలుస్తాయి. కానీ ఇప్పటికీ ఈ విషయంలో విద్యార్థుల్లో ఆశించిన అవగాహన ఉండట్లేదు. ఇన్స్టిట్యూట్ల స్థాయిలోనే వీటి ప్రాముఖ్యాన్ని తెలియజేసి ప్లేస్మెంట్ సెల్స్, ఇతర మాధ్యమాల ద్వారా అధ్యాపకులు, మేనేజ్మెంట్ వర్గాలు తమ విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసే అవకాశాలను అందించాలి. ఇక విద్యార్థులు కూడా తమకున్న పరిచయాల ద్వారా ఇంటర్న్షిప్స్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. కరిక్యులంలో భాగంగా లేని ఇంటర్న్షిప్ అనే పదం విద్యార్థుల రెజ్యుమేలో కనిపిస్తే కచ్చితంగా ఎంప్లాయర్స్ను ఆకర్షిస్తుంది. సదరు విద్యార్థికి ఇతరులకంటే ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది. - బి. అశోక్ రెడ్డి, ప్రెసిడెంట్- కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సయంట్ అప్రెంటీస్షిప్తో ప్రయోజనాలెన్నో టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తిస్థాయి ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ సమయంలో సదరు విభాగాలపై పూర్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి అప్రెంటీస్షిప్ ట్రైనింగ్, అది పూర్తయ్యాక నిర్వహించే ట్రేడ్ టెస్ట్ ప్రాధాన్యంపై అవగాహన ఉండట్లేదు. దీంతో మంచి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, ఎన్ఎస్డీసీ, ఏటీఐ వెబ్సైట్లను వీక్షిస్తే అందుబాటులో ఉన్న అప్రెంటీస్షిప్ సదుపాయాలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానాల వివరాలు తెలుస్తాయి. - కె.ఎస్.ఆర్. ప్రదీప్, డిప్యూటీ డెరైక్టర్, ఆర్డీఏటీ, హైదరాబాద్. స్కిల్స్తోపాటు పెరిగే అవకాశాలు విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తే.. అంతే స్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ప్రాక్టికల్స్, ప్రాక్టికాలిటీ అనే పదాలు కేవలం ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులకే పరిమితం కాదు. అన్ని కోర్సులు, రంగాల్లోనూ ఇప్పుడు ఎన్నో స్కిల్స్ అవసరమవుతున్నాయి. వీటిని గుర్తించి అకడమిక్ స్థాయి నుంచే సొంతం చేసుకునేలా వ్యవహరించాలి. మేనేజ్మెంట్కు సంబంధించి పీపుల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. - వి. పాండురంగారావు, డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ -హైదరాబాద్ ఎడ్యు న్యూస్ ఇన్స్పైర్ స్కాలర్షిప్ - 2014 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండి నేచురల్/బేసిక్ సెన్సైస్లో మూడేళ్ల బీఎస్సీ, బీఎస్సీ (హానర్స్), నాలుగేళ్ల బీఎస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందించే ‘స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్హెచ్ఈ)’కు ప్రకటన వెలువడింది. వీటిని కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) అందిస్తోంది. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్స్పైర్)’ పేరుతో ఈ స్కాలర్షిప్స్ను ఇస్తారు. మొత్తం స్కాలర్షిప్స్: 10,000 స్కాలర్షిప్: ఏడాదికి రూ.60,000తోపాటు సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం రూ.20,000 అందిస్తారు. ఇలా ఐదేళ్లపాటు స్కాలర్షిప్ ఇస్తారు. అర్హత: వివిధ రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డ్ 2014లో నిర్వహించిన ఇంటర్మీడియెట్/10+2 పరీక్షల్లో ఆయా రాష్ట్రాల్లో టాప్ వన్ పర్సంట్ జాబితాలో నిలవాలి. లేదా జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్/ఏఐపీఎంటీలో టాప్ 10,000 ర్యాంకుల్లో చోటు దక్కించుకుని ఉండాలి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఫెలోషిప్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ స్కాలర్షిప్, జగదీశ్ చంద్ర బోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ విజేతలు, ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో పతకాలు గెలుచుకున్నవారు కూడా స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో విజయం సాధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ - సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్లో విద్యనభ్యసిస్తున్నవారు కూడా అర్హులే. ప్రస్తుతం గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల/ఇన్స్టిట్యూట్లో నేచురల్/బేసిక్ సెన్సైస్లో బీఎస్సీ/ బీఎస్సీ (హానర్స్)/నాలుగేళ్ల బీఎస్/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్/ఎంఎస్సీ కోర్సులు చదువుతుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014 వెబ్సైట్:www.inspire-dst.gov.in/ ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్ జర్మనీలో నిర్దేశిత యూనివర్సిటీల్లో ఎల్ఎల్ఎం (యూరోపియన్ లా) చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ - ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్కు ప్రకటన వెలువడింది. స్కాలర్షిప్తో లభించేవి: సుమారు ఏడాది వ్యవధి ఉండే కోర్సులో భాగంగా నెలకు 750 యూరోల స్టైఫండ్, రానుపోను విమాన ఖర్చులకు ట్రావెల్ అలవెన్స్, స్టడీ అండ్ రీసెర్చ్ సబ్సిడీ కింద 460 యూరోలు, ఆరోగ్య, ప్రమాద బీమా. వీటితోపాటు రెండు నెలల జర్మన్ లాంగ్వేజ్ కోర్సులో భాగంగా ఉచిత నివాసం, ఫీజు మినహాయింపు, అలవెన్స్లు లభిస్తాయి. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: జనవరి/ఫిబ్రవరి-2015లో న్యూఢిల్లీలో నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2014 వెబ్సైట్: www.daaddelhi.org/en/ మైకాలో పీజీడీఎం - కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్లోని ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (మైకా).. పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ (పీజీడీఎం-సి) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 10+2+3 విధానంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: క్యాట్-2014/ఎక్స్ఏటీ-2014, 2015/మ్యాట్-2014 /సీమ్యాట్- 2014/ఏటీఎంఏ-2014 వంటి పరీక్షల స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులకు గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.. దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2015 వెబ్సైట్: www.mica.ac.in -
ఐసీటీ బోధన పద్ధతులు అమలు చేయాలి
విజి మురళి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మయం. ఐటీ అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఐటీ ప్రమేయం లేని విభాగాన్ని ఊహించడం కష్టమే. అందుకే ప్రస్తుతం విద్యార్థి లోకంలో అత్యంత క్రేజీగా మారింది.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ కోర్సులు చదివినంతనే అద్భుతాలు సాధ్యం కావని.. కెరీర్లో రాణించాలంటే నేటి యువత మరెన్నో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్.. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విజి మురళి. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు చదివిన మురళి.. కెరీర్లో అనూహ్యమైన మలుపుతో ఐటీ రంగంలో ప్రవేశించారు. ఇదే విభాగంలో ఉన్నతంగా ఎదుగుతూ ఐటీ వెటరన్గా పేరు సంపాదించుకున్న మురళి.. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్కు సీఐఓగా నియమితులైన నేపథ్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ.. పనితీరుకు గుర్తింపు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన యూసీ-డేవిస్కు సీఐఓగా ఎంపిక కావడం నా పనితీరుకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో ఐటీ విభాగంలో విధులు నిర్వర్తించాను. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో సీఐఓగా చేస్తున్న సమయంలోనే తాజా నియామకం ఖరారైంది. ఈ స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది. కెమిస్ట్రీ నుంచి కంప్యూటర్ సైన్స్ వైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, ఆ తర్వాత అదే విభాగంలో 1981లో పీహెచ్డీ పూర్తి చేశాను. అదే సమయంలో వివాహం కావడంతో అమెరికా వచ్చాను. అప్పుడు.. కెమిస్ట్రీలో కొనసాగాలా? ఇతర రంగాలు ఎంచుకోవాలా? అని ఆలోచిస్తుండగా.. నాన్న ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’లో కాలు పెట్టావు. రానున్న రోజుల్లో కంప్యూటర్, ఐటీ రంగాలకు భవిష్యత్తు ఖాయం’ అని చెప్పి కంప్యూటర్ సైన్స్వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి త్రీ-డీ మూలకాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత, పజిల్స్ రూపకల్పన వెనుక దాగున్న అంశాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. వీటన్నిటికీ కంప్యూటర్ సైన్స్, ఐటీ నైపుణ్యం ద్వారా అవకాశం లభిస్తుందని భావించాను. దాంతో లోవా స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో ఎంఎస్ పూర్తి చేశాను. అదే యూనివర్సిటీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా కెరీర్ ప్రారంభించాను. టెక్నాలజీ-విద్యార్థి దృక్పథం టెక్నాలజీ.. అకడమిక్ అధ్యయనాలకు వేగవంతమైన చోదకంగా ఉంటుంది. అదే సమయంలో.. హార్డ్ వర్క్, ఆసక్తి కూడా చాలా అవసరం. ఏ డొమైన్ అయినా ఈ రెండూ ఉంటేనే సదరు సబ్జెక్ట్పై పట్టు లభిస్తుంది. ఆసక్తి ఉంటేనే కొత్త విషయాలు, అంశాలు తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఫలితంగా విద్యార్థులకు అకడమిక్ అధ్యయనం ఎంతో సులభంగా మారింది. మేం చదువుకునే రోజుల్లో లాగరిథమ్ టేబుల్స్, స్లైడ్ రూలర్స్ వంటివి పెన్, పేపర్ లేనిదే సాధ్యమయ్యేవి కావు. కానీ ఇప్పుడు క్షణాల్లో వాటిని రూపొందించొచ్చు. టెక్నాలజీని వినియోగించుకునే దృక్పథంపైనే విద్యార్థి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. టెక్నాలజీ సహాయంతో క్షణాలు లేదా నిమిషాల్లో ఒక సమస్యను పూర్తి చేసేయొచ్చు. మిగతా సమయాన్ని కొత్త అంశాల అధ్యయనానికి కేటాయించుకోవచ్చు. ఇలా బ్రెయిన్ పవర్ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో అర్థవంతమైన ఫలితాలు, అద్భుతాలు సాధించొచ్చు. ఐటీతోపాటు మరెన్నో స్కిల్స్ కెరీర్లో విజయం సాధించాలంటే .. కేవలం ఐటీ డొమైన్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. దీనికి అదనంగా ఎన్నో స్కిల్స్ అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్, టెక్నాలజీ అప్డేషన్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు జత కలిస్తేనే ఐటీ కెరీర్లో ఉన్నతంగా రాణించగలరు. ఐసీటీ బోధనతో మన దేశంలో ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్యావకాశాలు అందించడం. దీనికి ఐటీతో పరిష్కారం కనుగొనొచ్చు. వైర్లెస్ కమ్యూనికేషన్ పద్ధతుల్లో గ్రామీణ ప్రాంత పాఠశాలలకు బోధన సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. చదువుకు దూరమవుతున్న విద్యార్థినులను దృష్టిలో పెట్టుకుంటే.. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) బోధన పద్ధతులు తప్పనిసరిగా అమలు చేయాలి. మరిన్ని ఆవిష్కరణలు ఒక్కసారి ‘వెబ్’ అనే యుగానికి ముందు.. ఇప్పుడు.. మన వ్యక్తిగత, సామాజిక జీవనశైలులను గమనించండి. ఎంతో తేడా కనిపిస్తోంది. ఔషధ ఉత్పత్తి, సైన్స్ ఆవిష్కరణలు, సామాజిక శాస్త్ర పరిశోధనల్లో సైతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, బయలాజికల్ ఆర్గాన్స్; ప్రోస్థెటిక్స్ వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరైన దిశలో.. సమర్థంగా వినియోగిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేయొచ్చు. అమ్మాయిలు రాణించగలరు ముందుగా.. మహిళలు, పురుషులు అనే బేధభావాన్ని వీడాలి. పురుషులతో దీటుగా రాణించగలమనే ఆత్మవిశ్వాసంతో అమ్మాయిలు అడుగు ముందుకు వేయాలి. ఉన్నత స్థానాలకు చేరుకుని కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక.. విద్యార్థులందరికీ నా సలహా.. అకడమిక్స్ ఎంపిక నుంచే జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రేజ్ లేదా కెరీర్ ష్యూర్ అనే ఆలోచనలకంటే ఆసక్తికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగిన కోర్సుల్లో చేరాలి. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్కు ప్రాధాన్యమిస్తూ అధ్యయనం సాగించాలి. అప్పుడే.. ప్రతి ఒక్కరి లక్ష్యమైన జాబ్.. దానికి అవసరమైన స్కిల్స్ లభిస్తాయి!!