సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రకటన వెలువడిన నేపథ్యంలో బీజేపీ పలు సదస్సులు నిర్వహించాలని తలపెట్టింది. తొలి సభను బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో నిర్వహిస్తోంది. తెలంగాణ కోసం తమ పార్టీ చేసిన కృషిని ఈ సదస్సులో వివరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో తమను ఆదరించాలని కోరనుంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సదస్సుకు పార్టీ నేతలు కిషన్రెడ్డి, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి తదితరులు హాజరవుతున్నారు.