Bharatiya Janata Party (BJP)
-
బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది: మమత
కోల్కతా: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పారీ్టకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. 13 సీట్లలో ఇండియా కూటమి 10 చోట్ల గెలవడంపై స్పందిస్తూ.. ఎన్డీయేకు 46 శాతం ఓట్లు రాగా. ఇండియా కూటమికి 51 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. బెంగాల్లో నాలుగింటికి నాలుగు స్థానాల్లో టీఎంసీని గెలిపించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్లో మినహా ఎక్కడా బీజేపీ మంచి ప్రదర్శన చేయలేకపోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగానే తీర్పు వచి్చందన్నారు. ఇప్పుడు బీజేపీ మళ్లీ ‘ఏజెన్సీ రాజ్ (సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పడం)’ను మొదలుపెట్టిందని ఆరోపించారు. కొత్త నేర చట్టాల్లో ఏముందో న్యాయవాదులు, పోలీసులకే స్పష్టమైన అవగాహన లేదన్నారు. ‘స్వేచ్ఛకు ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ, ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. బాధితులుగా మారొచ్చు’ అని మమత అన్నారు. మార్పునకు సంకేతం: కాంగ్రెస్ బీజేపీ సృష్టించిన భయాలు, భ్రమలు పటాపంచలయ్యాయని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైతులు, యువత, కారి్మకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల వారూ నియంతృత్వానికి పాతరేయాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, తమ జీవితాల బాగు కోసం ప్రజలు ఇండియా కూటమికే పూర్తిగా అండగా నిలుస్తున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఈ ఫలితాలు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, అమిత్ షాల విశ్వసనీయత పడిపోతుందనడానికి ఫలితాలు గట్టి నిదర్శనమన్నారు. -
నాడు కాంగ్రెస్ ఖాతాలో 414.. నేడు బీజేపీ అధిగమించేనా?
దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు సొంతంగా కనీస ఓట్లను కూడా పొందలేని స్థితికి చేరిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 1991 నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. 1991 తర్వాత 2009 లోక్సభ ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ 200 సీట్ల సంఖ్యను తాకగలిగింది. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 1951-52లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 364 సీట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీకి మొత్తం 44.99 శాతం ఓట్లు వచ్చాయి. 1962లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా తగ్గాయి. ఓట్లు 44.71 శాతం ఉండగా, సీట్లు 361కి తగ్గాయి. 1967లో పార్టీ ప్రజాదరణ మరింత క్షీణించింది. ఓట్లు 40.78 శాతానికి, సీట్లు 283కి తగ్గాయి. అయితే 1971లో పార్టీకి వైభవం తిరిగివచ్చింది. ఓట్లు 43.68 శాతానికి, సీట్లు 352కి పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని 28 సీట్లు, బీహార్లో 39 సీట్లు, మహారాష్ట్రలో 42 సీట్లు, ఉత్తరప్రదేశ్లోని 73 సీట్లు వచ్చాయి. 1977లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. లోక్సభ పదవీకాలం నవంబర్తో ముగియాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఆ ఏడాది ఎన్నికలు ప్రకటించారు. ఎమర్జెన్సీతో ఆగ్రహించిన ప్రజానీకం ఏకమై కాంగ్రెస్ను కేవలం 154 సీట్లకు పరిమిత చేశారు. ఓట్ల శాతం కూడా 34 శాతానికి తగ్గింది. మరోవైపు జనతా పార్టీ 295 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జనతా పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 42.69 శాతం ఓట్లతో 353 సీట్లు వచ్చాయి. 1984లో కూడా పార్టీ ఈ సంఖ్యను దాటేసింది. నాడు ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత సెక్యూరిటీ గార్డులే హత్య చేశారు. దీంతో దేశంలో కాంగ్రెస్పై సానుభూతి వెల్లువెత్తింది. 1984 నాటి రికార్డును పార్టీ ఇప్పటి వరకు దాటలేదు. నాడు సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ఓట్లు 48 శాతానికి పెరిగాయి. సీట్లు కూడా రికార్డు స్థాయిలో 414కు పెరిగాయి. గత పదేళ్లలో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్గానీ ఈ రికార్డును దాటలేదు. కాగా లోక్సభలో మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం. 1984 తర్వాత కాంగ్రెస్కు ఒక్కసారి కూడా ఒంటరిగా మెజారిటీ రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. 1989లో 39.53 శాతం ఓట్లు, 197 సీట్లు వచ్చాయి. 1991లో పార్టీ 36.40 శాతం ఓట్లు, 244 సీట్లు సాధించగలిగింది. ఆ సమయంలో బీజేపీకి తొలిసారిగా 120 సీట్లు రాగా, 20 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. 2004 ఎన్నికల వరకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. 1996లో కాంగ్రెస్కు 140 సీట్లు, బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. 1998లో ఆ పార్టీ 141 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 184 సీట్లు గెలుచుకుంది. 1999లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు కాంగ్రెస్కు 114 సీట్లు దక్కాయి. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
Karnataka election results 2023: వాడిపోయిన కమలం
సాక్షి, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఆనవాయితీ మారలేదు. అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను 2018లో 104 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేదు. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఏమాత్రం ఊహించలేకపోయారు. హేమాహేమీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గట్టెక్కించలేదు. రాష్ట్రంలో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపించడానికి బలమైన నాయకులు లేకుండాపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా.. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని గద్దెనెక్కించడం బీజేపీకి నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. బొమ్మై పరిపాలనపై రగిలిన అసంతృప్తి సెగలు బీజేపీ కొంపముంచాయి. ఇతర వర్గాలపై చిన్నచూపు రాష్ట్రంలో లింగాయత్, ఒక్కళిగ వంటి ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలను ఆకట్టుపోవడంలో విఫలమైంది. ఇంతచేసినా లింగాయత్లు, ఒక్కళిగలు బీజేపీని ఆదరించలేదు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు మాత్రమే కాకుండా లింగాయత్లు, ఒక్కళిగలు సైతం కాంగ్రెస్కే ఓటేశారు. పెచ్చరిల్లిన అవినీతి.. కమీషన్లు దందా ‘40 శాతం ప్రభుత్వం’అంటూ బీజేపీ సర్కారు కమీషన్ల దందాపై కాంగ్రెస్ చేసి ప్రచారం ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జనంలో విస్తృతంగా చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. అవినీతి బాగోతం, కమీషన్ల వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నానాటికీ పెరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు బీజేపీ ఇచ్చిన హమీలు అమలు కాకపోవడం జనాన్ని నిరాశపర్చింది. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ బీజేపీ పెద్దలు చేయలేదు. బీజేపీ ఇంకా అధికారంలో కొనసాగితే ఒరిగేదేమీ లేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే ఇంటికి సాగనంపారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జలవనరుల పథకాలు, రోడ్డు నిర్మాణాలు, ఎక్స్ప్రెస్ వే వంటివి చేపట్టినా ప్రజలు పట్టించుకోలేదు. పనిచేయని హిందూత్వ కార్డు హలాల్, హిజాబ్, అజాన్, జై భజరంగబలి, హనుమాన్ చాలీసా.. ఇవన్నీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న ఆయుధాలు. కర్ణాటకలో తలెత్తిన హలాల్, హిజాబ్, అజాన్ వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ మతాన్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, అవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. బీజేపీ హిందూత్వ కార్డు కర్ణాటకలో ఎంతమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఫలితాలపై స్పందన వచ్చే లోక్సభ ఎన్నికలతో మొదలయ్యే బీజేపీ అంతానికి ఆరంభం ఇది. దారుణ నిరంకుశ, ఆధిపత్య రాజకీయాలను జనం అంతంచేశారు. –తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై తమ పాచికలు పారవని బీజేపీ ఇకనైనా గుర్తించాలి. –ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మెరుగైన ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు –కర్ణాటక మాజీ సీఎం బొమ్మై ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కొత్త సానుకూల భారత్ దిశగా ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడింది. మోదీతో ఏదైనా సాధ్యమనే నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. – ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ కాంగ్రెస్కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో గెలవడమంటే కర్ణాటక రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న ఆలోచనకు జై కొట్టడమే. దేశాన్ని ఐక్యం చేసే రాజకీయ గెలుపు ఇది. పార్టీ కోసం చెమట చిందించి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలు చెల్లించిన మూల్యమిది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర వెంటే విజయం పాదం కదిపింది. – ప్రియాంక గాంధీ -
అలా కుట్ర పన్నినందుకే ఓటర్లు బీజేపీకి తగిన పాఠం చెప్పారు!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వేధించినందుకు ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..దాదాపు పదేళ్ల తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీని లోక్సభ సభ్యునిగా అనర్హత వేటు వేయాలని, ఆయనను నిరాశ్రయులను చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని నానో పటోలే అన్నారు. గత మార్చి నెలలో గుజరాత్ సూరత్ కోర్టు పరవు నష్టం కేసులో దోషిగా తేలుస్తూ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో అనర్హత వేటు, ఆ తర్వాత వెంటనే అధికార నివాసాన్ని ఖాళీ చేయించడం తదితర చర్యలతో రాహుల్ని అవమానపరిచారు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రజలే తమ ఓట్లతో భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పారన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పటానికి కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని నానా పటోలే అన్నారు. ఈ క్రమంలో శివసేనలో చీలికకు సంబంధించిన వివిధ అంశాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 16 మంది సేన ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న అనర్హత నోటీసులపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మాహా వికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో స్పీకర్గా పనిచేసిన పటోలే రాహుల్ నార్వేకర్ తాను నిర్వహిస్తున్న పదవిని కించపరిచేలా చేయకూడదని హితవు పలికారు. (చదవండి: ఆ నేత ఎంగేజ్మెంట్ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు) -
ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది!
కర్ణాటకలో ఒకే విడతలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంకా నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా దాదాపు తుది అంకానికి చేరుకోనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అతన్ని కుటుంబాన్ని హత్య చేయడానికి కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బెంగళూరు మీడియా సమావేశంలో ఓ ఆడియో క్లిప్ని ప్లే చేసింది. బెంగళూరులోని చిత్తాపూర్ని బీజేపి అభ్యర్థిగా మణికంఠ రాథోడ్ని బరిలోకి దింపింది. అతను ఎలాంటి వాడో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తెలుసని, అతని నేర చరిత్రకు సంబంధించిన ట్రాక్ రికార్డు గురించి వారికి బాగా తెలసునంటూ వ్యాఖ్యానించింది. ఐతే అదే ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారు. కావాలనే బీజేపీ ఇలా మణికంఠని మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడిపైకి పోటికి దింపిందని ఫైర్అయ్యింది. చిత్రాపూర్ నియోజకవర్గం ప్రజలను అవమానించేందుకే బీజేపి ఇలా ఒక రౌడీషీటర్ని దింపోతోందని విమర్శించింది. పైగా కాంగ్రెస్ విడుదల చేసిన ఆ ఆడియో క్లిప్లో బీజేపీ అభ్యర్థి అనుచిత పదజాలంతో మల్లిఖార్జున ఖర్గేని, అతని కుటుబాన్ని మట్టుబెడతానని చెబుతున్నట్లు వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ బీజేపీ కావాలనే ఇలా చేస్తుందని, ఒకవేళ ఏదైనా జరిగినా..మోదీతో సహా కర్ణాటక పోలీసులు, భారత ఎన్నికల సంఘం కూడా మౌనంగా ఉంటుందని మండిపడింది కాంగ్రెస్. ఐతే కర్ణాటక ప్రజలు దీన్ని చూసి మౌనంగా ఉండరని తగిన సమాధానం చెబుతారని నొక్కి చెప్పింది. కాగా, బీజేపీ అభ్యర్థి మణికంఠ 30కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద అభ్యర్థి. కలబురిగి నుంచి బహిష్కరించారు కూడా. గతంలో మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేని హత్య చేస్తానని బహిరంగంగా బెందిరించి అరెస్టు అయ్యాడు. ఆ తదుపడి బెయిల్పై విడుదలయ్యాడు. Meet Manikant Rathod, the BJP candidate from Chittapur constituency, who has over 40 criminal cases against him. He also happens to be the "blue-eyed boy" of PM Modi & CM Bommai. In this viral audio, the BJP leader can be heard saying- *"Will wipe off Kharge's family"* Here's… pic.twitter.com/NIcBMkgDhD — Congress (@INCIndia) May 6, 2023 (చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..) -
బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు మూడురోజుల శిక్షణ తరగతులకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్, జాతీయకార్యదర్శి అరవింద్ మీనన్, బీజేపీ ప్రశిక్షణ్ కమిటీ జాతీయ ఇన్చార్జి పి. మురళీధర్రావు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు దాదాపు 300 మంది నాయకులు తరగతులకు హాజరు కానున్నారు. మొత్తం 14 సెషన్స్.. పార్టీలో పలువురు కొత్త నాయకులు చేరిన నేపథ్యంలో వారితో పాటు రాష్ట్ర నాయకులకు పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే దిశగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్తో పార్టీ సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంతో దేశానికి కలిగిన ప్ర యోజనాలు తదితర అంశాలపై వివరించనున్నా రు. ప్రారంభం, ముగింపు కార్యక్రమాలతో కలిపి మొత్తం 14 సెషన్స్ ఉంటాయని పార్టీ ముఖ్యనేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మోదీ సర్కార్ సాధించిన విజయాలపై కిషన్రెడ్డి, విదేశాంగ విధానంపై విజయ్ చౌతేవాలా, సంస్థాగత అంశాలపై సునీల్ బన్సల్, పార్టీ చరిత్రపై మురళీధర్రావు, సాంస్కృతిక జాతీయ వాదం అంశాలపై ఆరెస్సెస్లో పనిచేస్తున్న ఇద్దరు తెలుగునేతలు ప్రసంగించనున్నారు. బీఎల్ సంతోష్ హాజరవుతారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈ నెల 21న తమ ఎదుట హాజరుకావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరవుతారా? లేదా? అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముందుగా సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం సంతోష్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, సంతోష్ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించడం బీజేపీకి ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు. ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ -
Pankaj Tripathi: వెండితెర వాజ్పేయి
భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్పేయి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్పేయీగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు. ‘‘అటల్ బిహారి వాజ్పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్ బిహారి వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ‘జ్ఞానగని అయిన మీ ప్రతిభాశక్తి మొదట్నుంచీ నన్ను అమితంగా ఆకర్షిస్తోంది. దశాబ్దాల మీ అపార అనుభవం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. చురకత్తుల్లాంటి మీ ఏకవాక్య పలుకులు నన్ను ఎన్నోసార్లు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. భావ వ్యక్తీకరణ అనేది మీలోని అత్యంత ప్రధానమైన అస్త్రం. నెల్లూరు నుంచి న్యూఢిల్లీదాకా సాగిన మీ అసాధారణ ప్రయాణ ఘట్టం అద్భుతం, సదా ఆదర్శనీయం వెంకయ్య గారూ’ అంటూ వెంకయ్యపై మోదీ పొగడ్తల వాన కురిపించారు. ‘సవాళ్లు ఎదురైన ప్రతీసారీ మరింత రెట్టించిన ధైర్యం, ఉత్సాహం, బాధ్యతలతో ముందుకు సాగారు. రాజ్యసభ చైర్మన్గా పార్లమెంటరీ క్రమశిక్షణ, సంప్రదాయాల పరిరక్షణలో అందరికీ చుక్కానిగా మారారు. రాజ్యసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించినపుడు పార్లమెంట్ గౌరవాన్ని తగ్గి్గస్తున్నారంటూ మీరు పడే బాధ ప్రతిసారీ మీ స్వరంలో ప్రతిధ్వనించింది’ అని అన్నారు. బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిప్రదాత ‘బీజేపీతో దశాబ్దాల మీ అనుబంధం చిరస్మరణీయం. వ్యవస్థీకృత అంశాల్లో మీ అంకితభావం ప్రతీ పార్టీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. తొలినాళ్లలో పార్టీ ఆంధ్రప్రదేశ్లో అంతగా విస్తరించని కాలంలోనే బీజేపీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. అకుంఠిత దీక్షతో పనిచేశారు. పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పార్టీని వ్యవస్థాగతంగా పటిష్టంచేశారు. ప్రస్తుతం అవి ప్రజాసేవా కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. పార్టీలో దశాబ్దాల అనుబంధంలో మీ నుంచి నేను నేరుగా ఎన్నో అంశాల్లో సలహాలు, సూచనలు పొంది లబ్ధిపొందాను. చిన్న మాటల్లోనే పెద్ద భావాలను పలికించగల భావ వ్యక్తీకరణ మీ సొత్తు. ఈ విషయంలో మీరు వినోబా భావేను స్మరణకు తెస్తారు’ అని మోదీ అన్నారు. -
జగ్గారెడ్డిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు
-
కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత
-
ఎస్ఐ కాలర్ పట్టుకున్నరేణుకా చౌదరి
-
పువ్వాడ అజయ్ పై రేణుక చౌదరి దారుణ వ్యాఖ్యలు
-
సగం సొంతం చేసుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాలపైనే ప్రధానంగా దృష్టిసారించింది. పార్టీ బలహీనంగా ఉన్న లోక్సభ స్థానాల్లో బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే కార్యాచరణను సిద్ధం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన 144 లోక్సభ స్థానాల్లో సగమైనా గెలుచుకునేలా జూన్ ఒకటి నుంచి రంగంలోకి దిగనుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల కిందటే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, ఆఫీస్ బేరర్లకు దిశానిర్దేశం చేశారు. రోడ్ మ్యాప్ సిద్ధం ముందుగా గుర్తించిన 144 లోక్సభ స్థానాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అంతర్గతంగా ఓ రోడ్మ్యాప్ను బీజేపీ సిద్ధం చేసింది. మొదటగా ఈ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ల వారీగా పార్టీ బలహీనతలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం ఆధారంగా మూడు స్థాయిల్లో నేతలు బరిలోకి దిగనున్నారు. మొదటి స్థాయిలో జాతీయ స్థాయి నేతల కమిటీ ఈ 144 లోక్సభ స్థానాల్లో కార్యాచరణ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తుంది. రెండో స్థాయిలో ఒక్కో కేంద్ర మంత్రికి రెండు లేక మూడు లోక్సభ స్థానాల బాధ్యతలు అప్పగిస్తారు. సోషల్ మీడియా గ్రూప్లు ప్రతి లోక్సభ పరిధిలో ఒక సోషల్ మీడియా గ్రూప్ను సైతం ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూప్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కులాలు, సమస్యలు, పార్టీల బలహీనతలు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. నియోజకవర్గంలో కులాల సమీకరణల ఆధారంగా పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేలా పార్టీకి సాయపడుతుంది. లోక్సభ సోషల్ మీడియా ఇన్చార్జి కనీసం 50వేల మందిని ఈ గ్రూపుల్లో చేర్చే బాధ్యత తీసుకోవాలి. డిసెంబర్ నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఏడాదిన్నరలో ఈ నియోజకవర్గాల పరిధిలోని 74వేల బూత్లను బలోపేతం చేసి సగానికి పైగా సీట్లను గెలుచుకునే వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసింది. -
బీజేపీలో చేరితే దావూద్కూ మంత్రి పదవి: ఠాక్రే
ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. -
కన్నడనాట కాంగ్రెస్కు భారీ షాక్?
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో రాజకీయ వేడి మొదలు కాబోతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు బీజేపీ గాలం వేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విధానసభ ఎన్నికల్లో తన వర్గానికి మొత్తం 20 అసెంబ్లీ సీట్లు కావాలని సిద్ధరామయ్య అడిగారట. దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే సిద్ధరామయ్య కమలం గూటికి చేరడం ఖాయమనిపిస్తోంది. మంత్రివర్గంలో సిద్ధూ అనుచరులు కర్ణాటక కేబినెట్లో ఇప్పటికే సుమారు 15 మంది మంత్రులు సిద్ధూ అనుచరులు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణంలో అమాత్యగిరి దక్కలేదని అసమ్మతి వ్యక్తం చేస్తూ బీజేపీలో చేరిన వారంతా సిద్ధూ అనుచరులుగానే చెబుతారు. వారందరిలో ఒకరిద్దరు మినహా అందరికీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు లభించాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలవేళకి సిద్ధరామయ్య కూడా కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 20 స్థానాలపై సిద్ధూ పట్టు బీజేపీ నేతల ఆహ్వానానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన వర్గానికి సుమారు 20 అసెంబ్లీ స్థానాల టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. వరుణ, చాముండేశ్వరి, హుణసూరు, హెబ్బాళ, చామరాజపేటె, కోలారు తదితర స్థానాలను సిద్ధూ ఆశించారు. మైసూరు జిల్లా హుణసూరు నుంచి సిద్ధూ పోటీ చేసినా తనకు ఇష్టమే అని మాజీ మంత్రి హెచ్.విశ్వనాథ్ అన్నారు. సిద్ధరామయ్య కోసం తన సీటును వదులుకుంటానని స్పష్టం చేశారు. పాత మైసూరుపై పట్టు కోసమే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతబలంతో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ప్రాబల్యం లేని పాత మైసూరు ప్రాంతంలో పట్టు సాధించేందుకు అక్కడి నేతలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 10 చోట్ల మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్కు సిద్ధూ గుడ్బై: మరి కొన్ని రోజుల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. బీజేపీలో చేరుతారని రాష్ట్ర మంత్రి ఆర్.మునిరత్న వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. గతంలో రామకృష్ణ హెగ్డేకు వచ్చిన పరిస్థితే.. ఇప్పుడు సిద్ధరామయ్యకు వస్తుందన్నారు. అదేవిధంగా మండ్య ఎంపీ సుమలతను బీజేపీలో చేర్చుకునే అంశంపై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు – 224+1 (నామినేటెడ్), బీజేపీ – 122 (స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరితో కలిపి) కాంగ్రెస్ – 69 జేడీఎస్ – 32 స్వతం్రత్రులు– 2 -
అసెంబ్లీ సాక్షిగా నెక్స్ట్ టార్గెట్ అసెంబ్లీనే: బండి సంజయ్
-
తృణమూల్లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
-
చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు
చండీగఢ్: ప్రతిష్టాత్మకమైన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా అవతరించింది. 35 స్థానాలకు గాను 14 చోట్ల నెగ్గింది. పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలితప్రాంతమైన చండీగఢ్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ బరిలోకి దిగిన మొదటిసారే తమ సత్తా చాటుకుంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 12 వార్డుల్లో గెలిచి రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు నెగ్గగా... శిరోమణి అకాలీదళ్ ఒకచోట గెలుపొందింది. చిత్రమేమింటే... 8 సీట్లు నెగ్గి మూడోస్థానంలో నిలిచిన కాంగ్రెస్కు అన్ని పార్టీలకంటే ఎక్కువగా 29.79 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో 26 వార్డులుండగా (బీజేపీ 20, కాంగ్రెస్ 4, శిరోమణి అకాలీదళ్ 1) ప్రస్తుతం వాటి సంఖ్య 35కు పెరిగింది. శుక్రవారం ఎన్నికలు జరగగా... సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుత చండీగఢ్ మేయర్ రవికాంత్ శర్మ 17వ వార్డులో ఆప్ అభ్యర్థి దమన్ప్రీత్ సింగ్ చేతిలో 828 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మేయర్ పదవిని చేపట్టాలంటే సాధారణ మెజారిటీ.. 18 స్థానాలు కావాలి. పంజాబ్లో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల కాంగ్రెస్, అకాలీదళ్లు ఆప్కు మద్దతు ఇచ్చే అవకాశాలు స్వల్పం. 12 స్థానాలు నెగ్గిన బీజేపీ ఓటమిని అంగీకరించి... మేయర్ పదవికి పోటీకి దూరంగా ఉంటుందా? లేక ఇతర పార్టీల కార్పొరేటర్లకు వలవేసి మళ్లీ అధికారపీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుందా? అనేది చూడాలి. పంజాబ్లో మార్పుకు సంకేతం: కేజ్రీవాల్ చండీగఢ్ కార్పొరేషన్ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్లో రాబోయే మార్పుకు సంకేతమని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చండీగఢ్ వాసులు నీతివంతమైన పాలనకు పట్టం కట్టారని, ప్రత్యర్థి పార్టీల అవినీతిమయమైన రాజకీయాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ఆప్ కార్యకర్తలకు, విజేతలకు అభినందనలు తెలిపారు. ఆప్ పంజాబ్ వ్యవహారాల ఉపబాధ్యుడు రాఘవ్ చద్దా (ఢిల్లీ ఎమ్మెల్యే) స్పందిస్తూ.. ‘పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’ అని వ్యాఖ్యానించారు. -
విశ్వసనీయ వారధిగా మారండి
న్యూఢిల్లీ: పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ఎండీసీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా, సంకల్పం, అంకితభావం అనే విలువలపై ఆధారపడి బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం చుట్టే తిరగడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్కు చురకలంటించారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, ఒక కుటుంబం పెత్తనం కింద కొనసాగడం లేదన్నారు. ప్రజా సంక్షేమం అనే సంస్కృతే బీజేపీకి ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజల బాగు కోసం పని చేస్తోంది కాబట్టే కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని వివరించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కార్యకర్తలు ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే బీజేపీకి పరమావధి అని స్పష్టం చేశారు. అభివృద్ధి ఎజెండాకు ప్రజామోదం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని మోదీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో బద్వేల్ ఉప ఎన్నికలోనూ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుందని వివరించారు. బద్వేల్ ఉప ఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి కేవలం 750 ఓట్లు వచ్చాయని, ఈసారి ఏకంగా 21,000కుపైగా ఓట్లు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి అజెండాకు ప్రజామోదం లభిస్తోందనడానికి ఇవే నిదర్శనాలని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకోవాలని, వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు. కార్యకర్తలకు నడ్డా దిశానిర్దేశం వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షులు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి 10.40 లక్షల పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటును పూర్తిచేస్తామన్నారు. రాజకీయ తీర్మానం ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను కొనియాడుతూ, ప్రతిపక్షాల అవకాశవాద వైఖరిని ఎండగడుతూ బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధించడం ఖాయమని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం పట్ల మోదీని అభినందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతిపక్షాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. -
నిశ్శబ్ద వ్యూహకర్త
న్యూఢిల్లీ: అధికార బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జగత్ ప్రకాష్ నడ్డా(59)కు మృదు స్వభావిగా పేరుంది. స్వభావరీత్యా ఒదిగి ఉండే నడ్డా కార్యాచరణలో మాత్రం దృఢ సంకల్పంతో వ్యవహరిస్తారు. ఆర్భాటాలపై ఆసక్తిలేని నడ్డా అనతికాలంలోనే ఎదిగి, అపరచాణుక్యుడిగా పేరొందిన అమిత్షా నిర్వర్తించిన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. నడ్డా నిశ్శబ్ద వ్యూహకర్త. ఆయన నిశ్శబ్దం వెనుక పట్టుదల, నిబద్ధత, సంస్థాగత నైపుణ్యం దాగి ఉన్నాయంటారు ఆయనను ఎరిగిన వారు. ఆరెస్సెస్కు నమ్మకస్తుడు ఆరెస్సెస్తో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తి నడ్డా. బీజేపీలో ప్రస్తుతం నడ్డా అత్యంత బలమైన మూడో వ్యక్తి. పార్టీ భవిష్యత్ వ్యూహంలో భాగంగానే గత ఏడాది నడ్డాని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి జేపీ నడ్డా 1960 డిసెంబర్ 2వ తేదీన బిహార్లోని పట్నాలో జన్మించారు. నడ్డా తండ్రి ఎన్.ఎల్. నడ్డా. ఈయన పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. విద్యార్థి దశనుంచే బీజేపీ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుకైన కార్యకర్తగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకి ఉంది. పాఠశాలలను అప్గ్రేడ్ చేయాలంటూ నిర్వహించిన ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు నడ్డాని 45 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. ‘ఛత్రా సంఘర్‡్ష సమితిలో చేరడానికి జేపీ ఉద్యమం నుంచి ప్రేరణ పొందాను’ అని నడ్డా ఒకచోట ప్రస్తావించారు. ఆ తరువాత ఏబీవీపీ, బీజేపీ యువజన సంఘం భారతీయ యువ మోర్చాతో కలిసి పనిచేశారు. రాజకీయ కుటుంబం కాదు నడ్డాది సామాన్య బ్రాహ్మణ కుటుంబం. కానీ, రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన యువతిని వివాహం చేసుకున్నారు. నడ్డా భార్య మల్లిక జబల్పూర్ ఎంపీ జయశ్రీ బెనర్జీ కుమార్తె. జేపీ నడ్డా రాజకీయాల్లో ఆసక్తి కనపరిస్తే, మల్లిక నడ్డా విద్యారంగం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. బిలాస్పూర్ నుంచి అసెంబ్లీలోకి డిగ్రీ వరకు బిహార్లో చదివిన నడ్డా.. ఎల్ఎల్బీని హిమాచల్ప్రదేశ్లో చదివారు. బిలాస్పూర్ నుంచి 1993లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలుమార్లు నడ్డా ఇదే స్థానం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో అటవీశాఖ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా నడ్డా పనిచేశారు. -
కమలనాథులకు కొత్త దళపతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా బీజేపీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ప్రకటించారు. నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. ఐదున్నర ఏళ్ల పాటు పార్టీని విజయవంతంగా నడిపి, పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నిలిపిన అమిత్ షా స్థానంలో నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన నడ్డాకు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే నేతగా పేరుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సైద్ధాంతిక దిక్సూచి ఆరెస్సెస్, ప్రధాని మోదీ, అమిత్ షా సమర్ధించారు. ఈ సంస్థాగత ఎన్నికలో నడ్డా తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే ముగిసింది. నడ్డా తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలువురు రాష్ట్ర శాఖల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించడం కొత్త అధ్యక్షుడిగా నడ్డా ముందున్న తక్షణ సవాలు. ఇప్పటివరకు విజయం సాధించని రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని సాధించిపెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని నడ్డా పేర్కొన్నారు. ఎన్నిక అనంతరం నడ్డా అభినందన కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి షా, పార్టీ అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. మోదీ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా చేరడంతో.. గత జూన్లోనే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికయ్యారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉండటం వల్ల.. ఒక వ్యక్తికి ఒకే పదవి అని బీజేపీలో ఉన్న సంప్రదాయం నేపథ్యంలో నడ్డా నాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికవడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి హయాంలో, మోదీ మార్గనిర్దేశంలో బీజేపీ కొత్త శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘నడ్డా నేతృత్వంలో పార్టీ మరింత వైభవాన్ని, మరిన్ని విజయాలను సాధించాలి’ అని రాజ్నాథ్ సింగ్ ఆకాంక్షించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి నడ్డా ఎదగడం బీజేపీ కార్యకర్తల పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేస్తోందని మరోమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ఇది బీజేపీలోనే సాధ్యం ఒక సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీనే. అయితే, మనం ఇక్కడే ఆగిపోం. కొన్ని రాష్ట్రాలు మిగిలాయి. మన దృష్టి ఇకపై వాటిపైననే. త్వరలో వాటినీ సాధిస్తాం’ అన్నారు. కలిసి స్కూటర్పై తిరిగాం నడ్డా అభినందన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. నడ్డా, తాను పాత స్నేహితులమని, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా తాము కలిసి స్కూటర్పై తిరిగేవారమని చెప్పారు. నడ్డా హయాంలో పార్టీకి కొత్త శక్తి, ఆశ, ఆకాంక్షలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడికి అందరం పూర్తి సహకారం అందించాలన్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్న అమిత్ షా నిరుపమాన కార్యకర్త అని ప్రశంసించారు. మరోవైపు, ఇదే వేదికపై నుంచి మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారు కొత్త ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు. అబద్ధాలను, గందరగోళాన్ని వ్యాప్తి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవాలని, అదే బీజేపీ బలమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
బీజేపీ చీఫ్గా నడ్డా!
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డాను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. జేపీ నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. పోటీ లేకుండానే సోమవారం నడ్డా ఎన్నిక జరిగే అవకాశముంది. నడ్డాకు మద్దతుగా నామినేషన్లను సమర్పించేందుకు కేంద్రమంత్రులు సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల ప్రతినిధులు సోమవారం ఢిల్లీ వస్తున్నారు. విద్యార్థి సంఘ కార్యకలాపాలు సహా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసిన అనుభవం, కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్తో అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా పరిణమించాయి. దాంతో, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లను జనవరి 20న దాఖలు చేస్తారని, అవసరమైతే, ఆ మర్నాడు ఎన్నిక నిర్వహిస్తామని బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ఆదివారం ప్రకటించారు. అమిత్ షా అడుగు జాడల్లో.. ఐదున్నర ఏళ్లకు పైగా బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. షా హయాంలో బీజేపీ అత్యున్నత దశను అనుభవించింది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్ షా హోంమంత్రిగా చేరడంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. నడ్డా ప్రస్తుతం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. గత మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్చార్జ్గా నడ్డా వ్యవహరించారు. -
బీజేపీ నేత ఇంటిని పేల్చివేసిన నక్సల్స్
పట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నికలను బహిష్కరించాలనే డిమాండ్తో ఓ బీజేపీ నేత ఇంటిని నక్సల్స్ పేల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్లోని దుమారియా గ్రామంలో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అనుజ్ కుమార్ సింగ్ నివాసంపై నక్సల్స్ దాడికి తెగబడ్డారు. డైనమైట్ సాయంతో ఇంటిని కూల్చివేశారు. ఈ దాడిలో అనుజ్ నివాసం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని సమాచారం. ఈ దాడి అనంతరం నక్సల్స్ ఆ ప్రాంతంలో కొన్ని పోస్టర్లను విడిచి వెళ్లారు. లోక్సభ ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా వారు అందులో పేర్కొనానరు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రం గయాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమారియా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారిని ఎదుర్కొవడం భద్రతా బలగాలకు సవాలుగా మరింది. ఎన్నికల సమయం కావడంతో ఈ ప్రాంతంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. -
‘‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకు టికెట్ ఇవ్వలేదు’
లక్నో : 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మైభీ చౌకీదార్’ ప్రచారాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ నాయకులంతా ట్విటర్ అకౌంట్లో తమ పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకుంటున్నారు. అయితే తాను పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకే పార్టీ తనకు టిక్కెట్ నిరాకరించిందని బీజేపీ ఎంపీ అన్షుల్ వర్మ ఆరోపించారు. బుదవారం బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలో చేరిన అన్షుల్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ట్విటర్లో నా పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోలేదు. అదికాక ఈ మధ్య పార్టీ చేస్తోన్న కొన్ని పనులను వ్యతిరేకించాను. ఆలయ ప్రాంగణంలో బీజేపీ నాయకులు మద్యం సరఫరా చేయడాన్ని తప్పు పట్టాను. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడాను. అందువల్లే నాకు టికెట్ ఇవ్వలేదు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. దీని గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్కు సైతం లేఖ రాశాను. కానీ ఆయన స్పందించలేద’ని అన్షుల్ వర్మ తెలిపారు. అంతేకాక బీజేపీలో నిరంకుశత్వం రాజ్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను ఎస్పీలోకి ఎలాంటి షరతులు లేకుండా చేరానని అన్షుల్ తెలిపారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి విజయం సాధిస్తుందని అన్షుల్ ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో అన్షుల్ వర్మ హర్దోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం బీజేపీ ఈ టికెట్ను జై ప్రకాశ్ రావత్కు కేటాయించింది. -
40 శాతం కమీషన్కు పాత నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: నోట్లరద్దు అనంతరం ఓ బీజేపీ నేత 40 శాతం కమీషన్ తీసుకుని పాత నోట్లు మార్చారని ఆరోపిస్తూ అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను పలు ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసింది. 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అహ్మదాబాద్లో చిత్రీకరించినదనీ, కొందరు జర్నలిస్టులు ఈ వీడియో తీశారని పేర్కొంది. టీడీపీ, ఎన్సీ, ఆర్జేడీ, లోక్తాంత్రిక్ జనతా దళ్ తదితర పార్టీల నేతలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఈ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో నిజమైనదే అనడానికి, అందులోని వ్యక్తి బీజేపీ మనిషేననడానికి కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలనూ చూపలేదు. మరోవైపు ఆ వీడియో నకిలీదనీ, పార్టీ పరిస్థితి దిగజారి నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఇలా రోజుకో నకిలీ సమాచారంతో ప్రజలను మోసగించాలని చూస్తోందని బీజేపీ ఎదురుదాడి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ నకిలీ పనులు మరీ విపరీతంగా నవ్వు తెప్పించేలా ఉంటున్నాయని అన్నారు. -
ఏపీ బీజేపీ మేనిఫెస్టో విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సాధికారత సాధించేందుకు కృషి చేస్తామని బీజేపీ హామీయిచ్చింది. తమకు అధికారం కట్టబెడితే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ వర్గీకరణ చేస్తామని.. అక్రమ కేసులను ఎత్తేస్తామని పేర్కొంది. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని, 16 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీయిచ్చింది. సన్నకారు, కౌలు రైతుల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది. జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని భరోసాయిచ్చింది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఉద్యోగులతో సమానంగా వేతనాలు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ల పంపిణీ డిగ్రీలో చేరిన విద్యార్థినులకు 90 శాతం సబ్సిడీపై స్కూటీలు చేనేత కార్మికులకు రుణాల మాఫీ సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం, ఆధునీకరణ అంచెలంచెలుగా మద్యపాన నిషేధం పారిశ్రామిక కేంద్రంగా రాయలసీమ అభివృద్ధికి చర్యలు విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి కృషి హిందూ మత పరిరక్షణ వ్యాప్తి కోసం చర్యలు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ. 3000 పెన్షన్ 1000 కోట్ల నిధిలో యువత సాధికార పథకం హోంగార్డులకు నెలకు రూ. 20 వేలు జీతం -
ఓమై గాడ్ నాకు ఎంపీ టికెటా..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక లోక్సభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీనియర్, బలమైన నేతలను కాదని బెంగళూరు దక్షిణ లోక్సభ టికెట్ను 28ఏళ్ల యువ న్యాయవాదికి కేటాయించి ఆశ్చర్యపరిచింది. ఈ స్థానం నుంచి బీజేపీ దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి అనంత కుమార్ సతీమణి తేజస్విణీని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఐతే ఆఖరి నిమిషంలో ఆమెను కాదని కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న తేజస్వీ సూర్యను తెరపైకి తీసుకువచ్చింది. సూర్యను బెంగళూరు దక్షిణ స్థానానికి తమ అభ్యర్థిగా బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక స్థానానికి తనను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తేజస్వీ షాక్కు గురయ్యారు. ‘‘ఓమై గాడ్ నాకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చిందన్న వార్తను ఇంకా నమ్మలేకపోతున్నా’’అని సూర్య ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్పై తేజస్వీ పోటీపడనున్నారు. యువ నేతలకు అవకాశాలు ఇవ్వాలని, వారికి పార్టీలో సముచితస్థానం కల్పించాలని అభ్యర్థుల ఎంపికలో నిర్ణయించినట్లు ఒక బీజేపీ వర్గాలు తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి అనంత్ కుమార్ వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నేత నందన్ నీలేకనిపై అనంత్ కుమార్ గెలుపొందిన విషయం తెలిసిందే. I am humbled. Grateful. Overwhelmed. I thank PM @narendramodi for giving me this opportunity. I can't thank you enough, Modi Ji. I promise you that I shall work ceaselessly for our motherland till my last breath. That is the only way I can repay this debt of gratitude. THANK YOU! — Chowkidar Tejasvi Surya (@Tejasvi_Surya) March 25, 2019 -
చౌకీదార్కు ఫైన్ మోత
సాక్షి, భోపాల్: వాహనం నంబర్ ప్లేట్పై చౌకీదార్ అని రాసి ఉన్నందుకు పోలీసులు ఎమ్మెల్యేకు చలాన్ విధించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మై భీ చౌకీదార్’ అనే నినాదాన్ని ఈ మధ్య బాగా పాపులర్ చేసింది. అయితే ఈ నినాదానికి తనపేరును కూడా జోడించి చౌకీదార్ పంధాన అని సొంత కార్ నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందాంగోర్. బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఖండ్వా ఎమ్మెల్యే నందకుమార్ సింగ్ను కలవడంతోపాటు పట్టణంలో రంగులపంచమికి హాజరవడానికి రాందాంగోర్ వచ్చారు. ఉత్సవ సమయం కావడంతో పోలీసులు కొన్నిచోట్ల చెక్పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే రాందాంగోర్ వాహనాన్ని రోడ్డుపై వెళ్తున్నప్పుడు నెంబర్ ప్లేట్ను చూసిన పోలీసులు.. వాహనాన్ని ఆపి నెంబర్ ప్లేట్ చట్టం ప్రకారం ఫైన్ విధించారు. చలాన్ వివరాలను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. తాను ఎటువంటి అతిక్రమణలకు పాల్పడలేదని, పోలీసుల ఫైన్ విధింపులో కాంగ్రెస్ కుట్ర దాగుందని ఎమ్మెల్యే రాందాంగోర్ ఆరోపించారు. -
బీజేపీ గెలుపు ఖాయం
సాక్షి, పాలమూరు : జిల్లాలో డీకే అరుణకు ఉన్న ప్రజాదరణను గుర్తించిన పార్టీ నాయకత్వం మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా ఆమెను బరిలో దించిందని, ఫలితంగా 20 ఏళ్ల తర్వాత పాలమూరులో మళ్లీ బీజేపీ గెలవబోతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. తెలంగాణలో బీజేపీని పటిష్టం చేయడంలో పార్లమెంట్ ఎన్నికలు మొదటి మెట్టుగా భావిస్తున్నామన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సీటును 20 ఏళ్ల తర్వాత సీటు గెలవాలని కార్యకర్తలు భావిస్తున్నారు. డీకే అరుణ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మోదీ మహబూబ్నగర్కు వస్తున్నారు.. దీన్ని బట్టి డీకే అరుణపై బీజేపీకి ఎంత నమ్మకం ఉందో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో కొన్ని ముఖ్య స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజాం నియంతృత్వ పాలనను ప్రజలు ఎండగడతారనే విశ్వాసం తమలో పెరుగుతుందన్నారు. రజాకార్ల పార్టీతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల కోసం అయోధ్య రామాలయం అంశాన్ని వాడుకునే అవసరం బీజేపీకి లేదని, ఆ అంశం జాతీయ అంశమని వ్యాఖ్యానించారు. రామ జన్మభూమి గురించి కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశ భద్రత కోసం.. దేశ భవిష్యత్తు కోసం నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా డీకే అరుణని గెలిపించాలని పిలుపునిచ్చారు. నిధులను దారి మళ్లించారు.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ కేంద్రం ఎన్నో నిధులు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇచ్చిన నిధులను టీఆర్ఎస్ పాలకులు దారి మళ్లించారని ఆరోపించారు. కేంద్రంలో చక్రం తిప్పి, ప్రధాని అవుతానని చెబుతున్న కేసీఆర్ కేవలం 16 సీట్లతో ఏవిధంగా ప్రధాని అవుతారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతను పోషించలేని దుస్థితికి చేరిన నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పారు. దేశ భద్రత, సంక్షేమం కోసం దేశ ప్రజలు మోదీ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న అరాచక పాలనను, నిజాం వారసత్వ రాజకీయాలను తరిమికొట్టాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా దేశ సమగ్రతను కాపాడుకోవచ్చన్నారు. -
సీనియర్లకు ‘నమో’ నమః
సాక్షి, సెంట్రల్డెస్క్ : లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 184 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గడ్కరీ వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, సీనియర్ నేతలయిన ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారికి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. మరి కొందరు సీనియర్ నాయకులు స్వచ్ఛందంగానే ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద చూస్తే పార్టీ నాయకత్వం సీనియర్ నేతలు పలువురిని పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారిని ఎన్నికల్లో నిలబెట్టి వారిని ఇబ్బంది పెట్టవద్దన్న ఆర్ఎస్ఎస్ సూచనను బీజేపీ నాయకత్వం పాటించినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బీజేపీకి పెద్దదిక్కుగా, ఆ పార్టీకి జాతీయ గుర్తింపు రావడానికి కారకుడిగా పేరొందిన ఆడ్వాణీని కూడా తప్పించడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు వరసగా గెలిచిన ఆడ్వాణీ స్థానంలో అమిత్ షాను బరిలో దింపింది. కావాలనే పక్కన పెడుతున్నారా? నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సీనియర్లను పథకం ప్రకారం పక్కన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. వాజ్పేయి హయాంలో అత్యంత గౌరవనీయ స్థానం పొందిన ఆడ్వాణీని మోదీ అసలు పట్టించుకోలేదు. ఎదుట పడినా పలకరించకుండా ముఖం చాటేసిన సందర్భాలున్నాయి. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్న జశ్వంత్సింగ్, యశ్వంత్సింగ్, మురళీ మనోహర్ జోషీ, ఆడ్వాణీ, శాంతకుమార్ వంటి సీనియర్లను మోదీ బోర్డు నుంచి తొలగించారు. వారిని మార్గదర్శక్ మండల్ పేరుతో ఏర్పాటు చేసిన కమిటీలో వేశారు. ఇన్నేళ్లలో ఈ కమిటీ ఒక్కసారీ సమావేశం కాలేదు. దీన్నిబట్టి మోదీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్లను పక్కన పెడుతున్నారన్న భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేతల్లో చాలామంది మోదీ పాలనను విమర్శించిన వారే కావడం గమనార్హం. ఇంకొందరు తప్పుకున్నారు.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ఆడ్వాణీయే చెప్పినట్టు బీజేపీ నాయకత్వం ప్రచారం చేస్తోంది. అయితే, నాయకత్వం ఆడ్వాణీని టికెట్ విషయంలో సంప్రదించనే లేదని ఆయన కార్యదర్శి చెబుతున్నారు. మరో సీనియర్ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేసిన మురళీ మనోహర్ జోషీ, బండారు దత్తాత్రేయకు కూడా ఈసారి టికెట్ లభించలేదు. అలాగే, సుమిత్ర మహాజన్, కరియ ముండా, శాంతకుమార్, బీజీ ఖండూరి వంటి అనుభవజ్ఞులనూ బీజేపీ ఈ ఎన్నికల్లో పక్కన పెట్టేసింది. కల్రాజ్ మిశ్రా, భగత్సింగ్ కోషియారి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించారు. -
బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉమా భారతి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ఉమా భారతి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమా భారతి.. వచ్చే మే నెల నుంచి ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నాననీ, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని పార్టీ నాయకత్వానికి సమాచారం అందించారు. దీంతో హిందుత్వవాదిగా పేరున్న ఉమా భారతికి పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. -
ఆరుగురితో బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఇటీవల 10 మందితో తొలి జాబితాను ప్రకటించగా.. రెండో జాబితాలో ఆరుగురికి స్థానం కల్పించింది. మెదక్ స్థానాన్ని పెండింగ్లో పెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావును ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిపింది. పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, బెల్లంపల్లి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కొయ్యల ఏమాజీ పేర్లను అధిష్టానానికి పార్టీ రాష్ట్ర కమిటీ పంపింది. అయితే, సింగరేణి కార్మికుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గోదావరి ఖనికి చెందిన ఎస్.కుమార్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని భావించిన అధిష్టానం ఆయనకే సీటు కేటాయించింది. జహీరాబాద్ సీటు కోసం బానాల లక్ష్మారెడ్డి, బిష్కిం ద పీఠాధిపతి సోమాయప్పల పేర్లును పరిశీలించిన అధిష్టానం ఈసారి బానాల లక్ష్మారెడ్డికే అవకాశం కల్పించింది. హైదరాబాద్ స్థానం నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బరిలో నిలపాలని భావించినా ఆయన విముఖత చూపారు. దీంతో భగవంతరావుకు సీటు కేటాయించింది. చేవెళ్ల నుంచి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్రెడ్డి, బెక్కరి జనార్దన్రెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన నందకుమార్ యాదవ్ల పేర్లను పరిశీలించి జనార్దన్రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పించింది. లోక్సభ అభ్యర్థులు.. అదిలాబాద్ (ఎస్టీ): సోయం బాబూరావు; పెద్దపల్లి (ఎస్సీ): ఎస్.కుమార్; జహీరాబాద్: బానాల లక్ష్మారెడ్డి; హైదరాబాద్: డా.భగవంతరావు; చేవెళ్ల: బెక్కరి జనార్దన్రెడ్డి; ఖమ్మం: వాసుదేవ్రావు -
‘అందుకే ఆయన పోటీ చేయడం లేదు’
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్లో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వాణీతో పాటు అస్సాం బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వా శర్మ పేరు కూడా లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్ షూటర్గా పేరు పొందిన హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హిమంతకు టికెట్ కేటాయించకపోవడం వెనక గల కారణాలను ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ఆయన ‘ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం హిమంత బిశ్వా శర్మ నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏసీ) కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రల్లో పార్టీని బలపర్చడం ముఖ్యం. ఈ బాధ్యతలను హిమంత బిశ్వా చక్కగా నిర్వర్తిస్తారని పార్టీ నమ్ముతుంది. అందుకే ఆయనకు టికెట్ కేటాయించలేదు. అస్సాం బీజేపీ శ్రేణులతో పాటు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల అస్సాంతో పాటూ ఈశాన్య భారతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానం’టూ అమిత్ షా ట్విట్ చేశారు. ప్రస్తుతం బిశ్వా అస్సాం ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఎంపీ నామినేషన్లకు రెండ్రోజులే చాన్స్!
నిర్మల్: ఎంపీ నామినేషన్ల దాఖలు గడువు ముంచుకొస్తోంది. కేవలం రెండే రెండు రోజుల సమయముంది. ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ 25న సాయంత్రం 3 గంటలకు ముగియనుంది. గురువారం హోలీ పండుగ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆ రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఇక నామినేషన్ల దాఖలుకు కేవలం 22, 25 తేదీలు మాత్రమే మిగిలాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి కేవలం ఒకేఒక్క నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మాత్రమే ఇక్కడ నామినేషన్ వేశారు. టీఆర్ఎస్, బీజేపీలతోపాటు స్వతంత్రులూ ఇప్పటి వరకూ స్పందించపోవడం గమనార్హం! పెద్దపల్లి లోక్సభ పరిధిలో కూడా కాంగ్రెస్ నుంచి ఏ.చంద్రశేఖర్ నామినేషన్ వేయగా, చిన్న పార్టీలతోపాటు పలువురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. రెండు చోట్లా.. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఆది లాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానానికి సంబంధించి పెద్దపల్లి కలెక్టర్లు దివ్యదేవరాజన్, శ్రీదేవసేన రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్లను ఆయా జిల్లా కేం ద్రాల్లోనే వేయాల్సి ఉంటుంది. నామినేషన్ల దాఖలు సోమవారం ప్రారంభమైనప్పటికీ పెద్దగా స్పందన లేదు. ఆది లాబాద్ స్థానం నుంచి పోటీలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మాత్రమే నామినేషన్ వేశారు. పార్టీ తన పేరును ప్రకటించిన తెల్లారే ఆయన ఆదిలాబాద్ వెళ్లి రిట ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో కాస్త పర్వాలేదనిపిం చారు. ఇక్కడ ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ నుంచి ఏ.చంద్రశేఖర్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు బుధవారం వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రజాబంధు పార్టీ అభ్యర్థి తాడెం రాజప్రకాశ్, పిరమిడ్ పార్టీ అభ్యర్థి ఇరుగురాల భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థులుగా కొయ్యడ స్వామి, దుర్గం రాజ్కుమార్,అంబాల మహేందర్ తదితరులు తమ నామినేషన్లను అందించారు. అభ్యర్థుల ప్రకటనే ఆలస్యం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీల కంటే ముందుగా కాంగ్రెస్ తమ ఎంపీ అభ్యర్థుల పేర్లు తెలిపింది. బరిలో నిలిచే వారి జాబితాను నోటిఫికేషన్ సమయానికి ప్రకటించేసింది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరనేది స్పష్టత ఉన్నా.. వారి పేర్లను ఆ పార్టీ అధికారంగా ప్రకటించలేదు. గురువారం హోళీ పండుగ రోజు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆదిలాబాద్ స్థానానికి టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్ బరిలో ఉండనున్నారు. ఇప్పటికే ఆయన ఉమ్మడి జిల్లాలోని తన లోక్సభ స్థానం పరిధిలో పర్యటిస్తూ.. ప్రచారాన్నీ చేపడుతున్నారు. పెద్దపల్లిలో దాదాపుగా మాజీ ఎంపీ వివేక్కే సీటు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలన్న తపనతో ఉన్న బీజేపీ కూడా ఇప్పటి వరకు ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ లేదు. బోథ్ నియోజవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్కు చెందిన సోయం బాపురావు ఇటీవల బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ లోక్సభ టికెట్ దాదాపుగా ఈయనకే ఇస్తారని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దపల్లిలో సీనియర్ నాయకుడు కాసిపేట లింగయ్య, ఎస్.కుమార్లతో పాటో బెల్లంపల్లికి చెందిన కొయ్యల ఏమాజీ పోటీ పడుతున్నారు. స్వతంత్రులు సైలెంట్.. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్ల దాఖలులో స్థబ్ధుగా ఉన్నారు.పెద్దపల్లి స్థానంలో కాస్త పర్వాలేదనిపించేలా పోటీ పడుతున్నా.. ఆదిలాబాద్లో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడం గమనార్హం. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్వతంత్రులుగా నేతావత్ రాందాస్, పవార్ కృష్ణ, బంక సహదేవ్, మొసలి చిన్నయ్య తదితరులు బరిలో నిలిచారు. ఈసారి ఇప్పటి వరకూ ఈ స్థానం నుంచి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ వేయకపోవడం గమనార్హం. పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి కె.జయరావు, జి.వినయ్కుమార్, జి. రమేశ్, జె.రమాదేవి, టి.శ్రీనివాస్, బి.నారాయణ, ఎం. రవీందర్లు స్వతంత్రులుగా పోటీ చేశారు. ఉన్నది రెండ్రోజులే.. కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్ల ప్రక్రియకు వారం రోజులు గడువిచ్చింది. ఈనెల 18 సోమవారం నుంచి 25 సోమవారం వరకు సమయమిచ్చింది. ఇందులో 21న హోళీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవు దినాలు వచ్చాయి. మొదటి మూడు రోజులు అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక గురు, శని, ఆదివారాలు సెలవులు కాగా.. మిగిలింది రెండురోజులే. కేవలం శుక్రవారం, చివరి రోజైన సోమవారం మాత్రమే నామినేషన్లు వేసేందుకు మిగిలాయి. ఈ రెండు పనిదినాల్లోనూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరించనున్నారు. పండితుల లెక్క ప్రకారం శుక్రవారం కంటే 25న సోమవారం మంచి ముహూర్తం ఉందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో మిగిలిన అభ్యర్థులు చివరిరోజునే దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 26న స్క్రుటిని, 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది. -
హోలీ వేడుకల్లో విషాదం : ఎమ్మెల్యేపై కాల్పులు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన హోలీ వేడుకల్లో లఖీంపూర్ ఖేరీ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై కాల్పులు కలకలం రేపాయి. వర్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి గట్టెక్కారని సమాచారం. లఖీంపూర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై హోలీ వేడుకల్లో దుండగుడు కాల్పులు జరిపాడని, కాల్పుల్లో ఆయన కాలికి బుల్లెట్ గాయాలయ్యాయని జిల్లా ఎస్పీ పూనం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వర్మ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్పీ పూనం వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో కొంతమందితో ఎమ్మెల్యే ముచ్చటిస్తున్న క్రమంలో వాగ్వాదం చేసుకోవడంతో ఆయనపై కాల్పులు జరిపారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని లఖీంపూర్ జిల్లా మేజిస్ర్టేట్ ఎస్ సింగ్ చెప్పారు. ఎమ్మెల్యేపై కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేస్తారని సింగ్ పేర్కొన్నారు. -
కమలంలో నైరాశ్యం
సాక్షి, వికారాబాద్: కేంద్రంలో అధికారంలోకి రావాలని, మోదీని మరోమారు ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తోంది. మెజార్టీ ఎంపీ సీట్లు సాధించేలా వ్యూహరచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయటంతో పాటు కేడర్లోనూ జోష్ నింపుతోంది. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ ఉత్సాహం కనిపించడం లేదు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కమలం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలపై పార్టీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం, అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తుండటం నాయకులు, కార్యకర్తలను అసంతృప్తికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ వ్యవహారశైలితో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టాలని చూస్తున్న నేతలు.. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే పార్టీకి లాభం చేకూరేదని జిల్లాకు చెందిన బీజేపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ద్వితీయ శ్రేణి నేతల అసహనం చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి బలమైన అభ్యర్థి ని బరిలో దింపాలని ఆపార్టీకి చెందిన జిల్లా నాయకులు భావిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో స్పష్టత ఇవ్వటంలేదు. అధిష్టానం వ్యవహార శైలివల్లే ఎన్నికల్లో పార్టీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ద్వితీయ శ్రేణి నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరును గుర్తు చేసుకుంటున్నారు. పరిగి అసెంబ్లీకి సంబంధించి ఆ పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు టికెట్ ఆశించారు. అయితే చివరి నిమిషం వరకు బీజేపీ అధిష్టానం ఆయన పేరును ప్రకటించలేదు. దీం తో మనస్తాపానికి గురైన ఆయన పార్టీ వీడతానని ప్రకటించటంతో ఎట్టకేలకు తనను అభ్యర్థిగా ప్రకటించింది. పరిగిలో పార్టీ బలంగానే ఉన్నా.. ఎన్నికల ప్రచారానికి అనుకున్నంత సమయం దక్కకపోవటంతో ప్రహ్లాదరావుకు ఓటమి తప్పలేదు. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నాయకుడు రమేశ్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతూ వచ్చారు.అసెంబ్లీ టికెట్ను సీ నియర్ నేత రమేశ్ కోరుతూ వచ్చారు.అయితే అ ధిష్టానం ఎన్ఆర్ఐ పటేల్ రవిశంకర్కు టికెట్ కట్టబెట్టింది. అధిష్టానం నిర్ణయం ఓవర్గం బీజేపీ నా యకులను అసంతృప్తికి గురిచేసింది. ఫలితంగా తాండూరులో యోగి అదిత్యనాథ్ ఇతర ము ఖ్యనేతలు ప్రచారం చేసినా బీజేపీ ఓటమిపాలైంది. కలిసిరాని ఫలితాలు.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఫలితాలు కలిసిరాలేదు. చేవెళ్ల పార్లమెంట్కు రెండుసార్లు ఉన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ నుంచి సీనియర్ నేత బద్దం బాల్రెడ్డి పోటీ చేశారు. ఈయన గెలుస్తారని భావించినా కేవలం 1,12,417 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో బీజేపీ, టీడీపీ పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా వీరేందర్గౌడ్ను బరిలో దించగా ఆయన ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో వీరేందర్గౌడ్కు 3, 53,203 ఓట్లు వచ్చాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఏమాత్రం కలిసిరాలేదు. వికారాబాద్, పరిగి, తాండూరులో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. పరిగి బీజేపీ పార్టీ తరఫున ప్రహ్లాదరావు పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. ఆయనకు 6,739 ఓట్లు వచ్చాయి. వికారాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సాయికృష్ణ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కేవలం 1,973 ఓట్లు వచ్చాయి. ఇక తాండూరు నియోజకవర్గం నుంచి పటేల్ రవిశంకర్ పోటీ చేయగా ఆయనకు 10,548 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏమేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. జనార్దన్రెడ్డికే అవకాశం..? ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనైనా పార్టీ అధిష్టానం జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలని జిల్లా నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. చేవెళ్ల టికెట్ కోసం జనార్దన్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు రాజాసింగ్ పోటీ చేస్తే బాగుంటుందని కొంతమంది కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా బీజేపీ అధిష్టానం మాత్రం జనార్దన్రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో జనార్దన్రెడ్డికి దాదాపు లైన్ క్లియర్ అయినట్లేనని సమాచారం. మంగళవారం లేదా బుధవారం బీజేపీ అధిష్టానం చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. -
పోటీకి దూరంగా లక్ష్మణ్?
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించే అవకాశముంది. శుక్రవారమే ఈ జాబితాను ప్రకటించాలని భావించినా జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ నెల 16కి వాయిదా పడటంతో అభ్యర్థుల ప్రకటన కూడా ఆలస్యమైంది. శనివారం జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి, శనివారం లేదా ఆదివారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, మురళీధర్రావు, మంత్రి శ్రీనివాస్, రాంచంద్రరావు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురి పేర్లతో జాబితాను రూపొందించి తమ వెంట తీసుకువెళ్తున్నారు. కొత్తవారికి చాన్స్.. ఈ సారి కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా వారి పేర్లను కూడా జాబితాలో చేర్చినట్లు తెలిసింది. ఆ జాబితాపై పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి లోక్సభ ఎన్నికల్లో పోటీలో నిలపాల్సిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. మొత్తంగా 17 స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన పార్టీ మొదట 10 స్థానాలకు, తర్వాత ఒకట్రెండు రోజులకు మిగతా స్థానా లకు పోటీలో నిలిపే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా, సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి కూడా ఆ స్థానానికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ తన పోటీ యోచనను విరమించుకున్నట్లు తెలిసింది. దానిపైనా శనివారం స్పష్టత రానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కనుక పోటీ చేయాలని ఆదేశిస్తే లక్ష్మణ్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీలో నిలిచే అవకాశముంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలు.. ►సికింద్రాబాద్: కిషన్రెడ్డి/బండారు దత్తాత్రేయ/లక్ష్మణ్ ►నాగర్కర్నూల్: బంగారు శ్రుతి ►మహబూబ్నగర్: శాంతకుమార్/కొత్తవారికి అవకాశం ►చేవెళ్ల: జనార్దన్రెడ్డి/యోగానంద్ ►జహీరాబాద్: సోమాయప్ప ►నిజామాబాద్: ధర్మపురి అరవింద్/సదానందరెడ్డి ►కరీంనగర్: దుగ్యాల ప్రదీప్రావు/బండి సంజయ్/రామకృష్ణారెడ్డి ►పెద్దపల్లి: కాసిపేట లింగయ్య/ఎస్.కుమార్ ►ఆదిలాబాద్: రేష్మారాథోడ్/కొత్తవారికి అవకాశం ►వరంగల్: చింతా సాంబమూర్తి /బాబుమోహన్ ►మహబూబాబాద్: హుస్సేన్ నాయక్/చందా లింగయ్య దొర ►భువనగిరి: డాక్టర్ అనిల్/శ్యాంసుందర్ ►నల్లగొండ: శ్రీధర్/గోలి మధుసూదన్రెడ్డి ►హైదరాబాద్: అమర్సింగ్ ►మల్కాజిగిరి: రాంచంద్రరావు/ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్/మల్లారెడ్డి ►మెదక్: రఘునందన్రావు/రాజేశ్వర్రావు దేశ్పాండే/కరుణాకర్రెడ్డి ►ఖమ్మం: వాసుదేవ్ -
రేపు బీజేపీ అభ్యర్థుల జాబితా
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు ఆశావహులతో బీజేపీ జాబితా సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం రాత్రి నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో ముఖ్య నేతలు అరవింద లింబావలి, మురళీధర్రావు, బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, కిషన్రెడ్డి పాల్గొన్నారు. ప్రతి లోక్సభ సెగ్మెంట్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒక్కో స్థానానికి మూడు పేర్ల చొప్పున జాబితా రూపొందించారు. ఈ జాబితాను రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి తీసుకెళ్లారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. -
దీదీపై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్పై ప్రత్యేకంగా దృష్టిసారించిన బీజేపీ అందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ర్యాలీలతో హోరెత్తించిన కమలనాధులు బెంగాల్లో కనీసం 22 లోక్సభ స్ధానాల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇక బుధవారం ఎన్నికల కమిషన్ను కలిసిన బీజేపీ నేతలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ బెంగాల్ను సమస్యాత్మక రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు. బెంగాల్లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని తాము ఈసీ దృష్టికి తీసుకువచ్చామని బీజేపీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. స్ధానిక సంస్థలు, గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, మృతుల వివరాలతో పాటు బీజేపీ నేతల హెలికాఫ్టర్ల ల్యాండింగ్కు అనుమతి నిరాకరణ వంటి అన్ని అంశాలను ఈసీకి నివేదించామన్నారు. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మోదీ ఓటమే లక్ష్యంగా అవసరమైతే తాను ప్రధాని నియోజకవర్గం వారణాసిలో ప్రచారం చేపడతానని దీదీ సంకేతాలిచ్చారు. -
‘కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలింగ్’
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని బీజేపీ నేతలు మంగళవారం ఈసీని కోరనున్నారు. తమకు బెంగాల్ పోలీసులపై విశ్వాసం లేనందున కేంద్ర బలగాలు జోక్యం చేసుకోవాలని వారు ఈసీకి విన్నవించనున్నారు. ఈసీ అధికారులతో బీజేపీ నేతలు సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారని బీజేపీ ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా తృణమూల్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర బలగాలు రెండు రోజులే ఉంటాయని, ఆ తర్వాత ప్రజలు రాష్ట్ర పోలీసులపైనే ఆధారపడాలని తృణమూల్ మంత్రి ఒకరు ఓటర్లను బెదిరించారని బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జై ప్రకాష్ మజుందార్ ఆరోపించారు. బెంగాల్లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11న ప్రారంభమై మే 19తో ఏడు దశల పోలింగ్తో ముగుస్తాయి. -
అన్నింటా పోటీ.. గెలిచేవి ఎన్నో?
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థుల ఖరారుపైనా పార్టీ దృష్టి సారించింది. అయితే ఎన్ని స్థానాలు గెలుస్తారన్నదే కమలం పార్టీ శ్రేణులకు ఆందో«ళన కలిగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసినా ఒక్కస్థానంలోనే గెలిచింది. వందకుపైగా స్థానాల్లో డిపాజిట్ సైతం కోల్పోయింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై బీజేపీ నేతలు, శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఒంటిరిగా పోటీ చేసి సత్తా చాటాలని బీజేపీ భావించింది. పార్టీ బలోపేతం కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సైతం పర్యటించారు. తీరా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం కాషాయ పార్టీకి చేదునే మిగిల్చాయి. 2004 ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ బలం ఒక్క స్థానానికి పరిమితమైంది. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ప్రతి లోక్సభ సెగ్మెంట్పైనా బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గెలుపు అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇచ్చేలా కసరత్తు చేసింది. ఆశావహులు అధికంగానే ఉన్నా.. పార్టీ నుంచి పోటీ చేసేందుకు అశావహులు అధికంగానే ఉన్నారు. అందులో పార్టీ సీనియర్లే ఎక్కువ మంది టికెట్లను ఆశిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలంతా పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వారిలో పార్టీ అధ్య క్షుడు లక్ష్మణ్ సహా ముఖ్య నేతలంతా ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్రెడ్డి పోటీ చేయా లని భావిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి షెహజాదీ ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మ పురి అర్వింద్, జహీరాబాద్ నుంచి బానాల లక్ష్మారెడ్డి ఉన్నారు. తనకు సికింద్రాబాద్లో టికెట్ ఇవ్వకపోతే చేవెళ్ల నుంచి ఇవ్వాలని కిషన్రెడ్డి కోరుతున్నట్లు తెలిసింది. భువనగిరి నుంచి పీవీ శ్యాం సుందర్, మహబూబ్నగర్ నుంచి శాంతికుమార్, నాగర్కర్నూల్ నుంచి బంగారు శృతి, రజినిరెడ్డి, మెదక్ నుంచి రఘునందన్రావు, రాజేశ్వర్రావు దేశ్పాండే, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, జైపాల్ యాదవ్; పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్, కాశిపేట లింగయ్య; నల్లగొండ నుంచి గోలి మధుసూదన్రెడ్డి, పాదూరి కరుణ ఆశిస్తుండగా మరో మూడు స్థానాలనుంచి అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 15న అభ్యర్థుల జాబితాతో రండి: అమిత్ షా సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలిచ్చారు. ఈ నెల 15లోపు రాష్ట్ర స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసి జాబితాతో రావాలని సూచించారు. లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి తదితరులు అమిత్ షాను సోమవారం ఢిల్లీలోని ఆయ న నివాసంలో కలిశారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేసి ఈ నెల 15న తిరిగి రావాలని అమిత్ షా సూచించినట్టు సమాచారం. పార్టీ అభ్యర్థులను ఈ నెల 15న బీజేపీ ఖరారు చేయనుంది. ఈ నెల 14వ తేదీనాడే పార్టీ కోర్ కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి, జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం కోసం పంపించ నుంది. 14న రాత్రికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ జాబితాను తీసుకెళ్లనున్నారు. 15న పార్లమెంట రీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి, ఢిల్లీలోనే ప్రకటించే అవకాశం ఉంది. -
అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ప్రారంభించింది. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ముఖ్య నేతల కోర్ కమిటీ సమావేశంలో దీనిపై ప్రాథమిక చర్చ జరిగింది. బీజేపీ నుంచి పోటీకి రిటైర్డ్ అధికారులతోపాటు కొందరు సీనియర్ ప్రభు త్వ అధికారులు కూడా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి టికెట్ ఆశించి భంగపడే నేతలెవరైనా వస్తే పార్టీ నుంచి పోటీకి దింపే అవకాశాలున్నాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక జాబితా సిద్ధం చేసేందుకు పార్లమెంట్ ఇన్చార్జులను నియమించారు. వారు సంబంధిత నియోజకవర్గంలో పోటీకి అర్హులైన ముగ్గురేసి సభ్యులతో జాబితాలు సిద్ధం చేస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ మాజీ నేత కిషన్రెడ్డి పోటీలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చేవెళ్ల నుంచి దత్తాత్రేయ సమీప బంధువు జనార్దనరెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు నుంచి కిషన్రెడ్డిని కూడా పార్టీ జాతీయ నాయకత్వం పోటీకి దింపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తోపాటు ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. మరో 3, 4 రోజుల్లో మళ్లీ భేటీ కావాలని కోర్ కమిటీ నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన కసరత్తులో భాగంగా సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో లక్ష్మణ్ సమావేశం కానున్నారు. కరీంనగర్ నియోజకవర్గంపై దృష్టి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుగుణాకరరావు గెలుపుకోసం కృషి చేయాల ని పార్టీ కోర్ కమిటీ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడి రెబెల్గా రంగంలోకి దిగిన ఏబీవీపీ మాజీ నేత రణజిత్ మోహన్ పార్టీ పేరుతోపాటు ప్రధాని మోదీ ఫొటోతో ప్రచా రం నిర్వహించడాన్ని కోర్ కమిటీ తీవ్రంగా పరిగణిం చినట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించా రు. ఈ భేటీలో లక్ష్మణ్, దత్తాత్రేయ, మురళీధర్రావు, రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్రావు, కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పోటీ రెండు చోట్ల నుంచా?
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ తదితరులు పాల్గొన్న ఈ కీలక భేటీలో తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసి నుంచే మోదీ పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఈ ఒక్క చోటు నుంచేనా లేక మరో నియోజకవర్గం నుంచి సైతం పోటీచేస్తారా అనేది నిర్ణయించలేదని సమాచారం. 2014 ఎన్నికల్లో మోదీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అభ్యర్థుల ఖరారులో గెలుపు అవకాశాలు, వయోపరిమితి వంటివి పరిగణనలోకి తీసుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ..జార్ఖండ్లోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్తో బీజేపీ పొత్తు పెట్టుకోనుందని వెల్లడించారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఈ పార్టీ కి రాష్ట్రంలోని ఒక సీటు ఇచ్చారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే గులాంగిరికి వేసినట్లే
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే గులాంగిరికి ఓటు వేసినట్లేనని బీజేపీ నేత కిషన్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కుటుంబానికి గులాంగురి చేసేందుకు ఉపయోగపడుతారు తప్ప రాష్ట్రానికి ఒరిగేదేముండదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్కు ఓటేస్తే నెహ్రూ కుటుంబానికి ఓటేసినట్లేనని, ఈ రెం డు పార్టీల నుంచి గెలిచే ఎంపీలు ఆ రెండు కుటుంబాలకే గులాంగిరీ చేస్తారన్నారు. బీజేపీకి ఓటేస్తే దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని, అది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటేసినట్లు అవుతుందని చెప్పారు. ఈ ఎన్నిక లు దేశభవిష్యత్కు సంబంధించినవని, ప్రజలు సమర్థమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. 16 సీట్లు గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో చెప్పే ధైర్యం కేటీఆర్కు ఉందా.. అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ప్రధాని గా మోదీ కావాలని కోరుకుంటున్నారని.. ఆ విశ్వాసాన్ని ప్రజల్లో మోదీ కల్పించారన్నారు. దేశసేవకులా.. కుటుంబాలకు బానిసలా పాకిస్తాన్కు పట్టిన దయ్యాన్ని వదిలించిన ఘనత మోదీదేనని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. దేశానికి సేవకులు కావాలా.. కుటుంబాలకు బానిసలు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. బుధవారం కేటీఆర్ సభ కోసం విద్యార్థులను ఎండలో రోడ్లపై నిలబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లేనని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని, ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు పేర్లతో జాబితా పంపమని కేంద్ర పార్టీ కోరిందన్నారు. పార్లమెంట్ క్లస్టర్ల సమావేశం తరువాత భేటీ అయి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్లతో జాబితా తయారు చేసి పంపిస్తామన్నారు. ఒకరు పాల్.. మరొకరు చంద్రబాబు ఆంధ్రాలో ఇద్దరు గొప్ప నాయకులు మాట్లాడుతున్నారని, అందులో ఒకరు కేఏ పాల్ అయితే మరొకరు ఏపీ సీఎం చంద్రబాబని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారన్నారు. రాఫెల్ విషయంలో విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇంత వరకు ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదన్నారు. ఓట్ల గల్లంతు రెండు రాష్ట్రాలకు సంబంధించిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. -
త్వరలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-
కలలు సాకారం చేస్తాం
సాక్షి, చెన్నై: బలమైన భారత్ లక్ష్యంగా ముందుకు సాగుదామని, మరో అవకాశం ఇస్తే కలలు సాకారం చేస్తానని తమిళ ఓటర్లను ప్రధాని మోదీ బుధవారం కోరారు. చెన్నై శివారు కిలాంబాక్కం వేదికగా అన్నాడీఎంకే మెగా కూటమి నేతృత్వంలో ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా దాడులు, ప్రతిదాడులు, వింగ్ కమాండర్ అభినందన్ మళ్లీ భారత్కు రావడాన్ని గుర్తు చేస్తూ, తీవ్రవాదంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. తమిళనాట అన్నాడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని మెగా కూటమి ఖరారు అయింది. పొత్తులో భాగంగా తమిళనాడులో బీజేపీకి–5, పీఎంకేకు–7, పుదియ తమిళగం–1, పుదియ నిధి కట్చి –1, ఎన్ఆర్ కాంగ్రెస్కు పుదుచ్చేరిలోని దక్కాయి. మరికొన్ని చిన్న పార్టీలు కూటమిలో ఉన్న సీట్ల కేటాయింపులు అధికారికంగా వెలువడాల్సి ఉంది. మిగిలిన సీట్లలో అన్నా డీఎంకే పోటీ చేయనుంది. ఈ బహిరంగ సభతో పాటు అధికారిక వేడుక నిమిత్తం బుధవారం మోదీ చెన్నైకు వచ్చారు. ముందుగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారతరత్న ఎంజీఆర్ పేరును చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్కు పెడుతున్నట్లు మోదీ ప్రకటించారు. కర్ణాటకలో రిమోట్ కంట్రోల్ సీఎం సాక్షి, బెంగళూరు: కర్ణాటక కలబురిగిలో బీజేపీ ఎన్నికల సభలోనూ మోదీ పాల్గొన్నారు. ‘ రాష్ట్ర సీఎం కుమారస్వామి ఒక రిమోట్ కంట్రోల్ సీఎం. రాష్ట్రంలో ఒక బలహీనమైన ప్రభుత్వం పాలన సాగిస్తోంది’ అని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలు, అవినీతిపరుల దుకాణం బంద్ చేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత దీన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అందులో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకటని ఆరోపించారు. ఎలాంటి అవినీతికీ తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తుండడంతో కమీషన్లకు అలవాటు పడిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. మోదీ విరాళం 21 లక్షలు ప్రధాని మోదీ తన దాతృత్వాన్ని మరోసారి చాటారు. కుంభమేళాలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తన సంపాదన నుంచి రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. -
ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ
లక్నో : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు...తాము ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో అనే ఇంగిత జ్ఞానం మర్చిపోయారు. శిలా ఫలకంపై పేరు లేదంటూ జరిగిన వాగ్వివాదం కాస్త.. బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పులతో పరస్పరం కొట్టుకునేంతవరకూ వెళ్లింది. ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.... బుధవారం సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ, ఎమ్మెల్యే రాకేష్ సింగ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా రోడ్డు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై తన పేరు ఎందుకు లేదంటూ ఎంపీ శరద్ త్రిపాఠీ స్థానిక ఎమ్మెల్యే అయిన రాకేష్ సింగ్ను ప్రశ్నించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రస్థాయికి చేరడంతో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఎంపీ శరద్ త్రిపాఠీ.. కాలికి ఉన్న షూ తీసి ఎమ్మెల్యేను చితక్కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా ఎంపీపై చేయి చేసుకున్నాడు. అయితే వారికి సర్ధిచెప్పేందుకు అక్కడున్న పార్టీ నేతలు, అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి, ఇద్దరు నేతలను శాంతింప చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ వ్యవహారం మొత్తం యూపీ మంత్రి అశుతోష్ టండన్ సమక్షంలోనే జరగడం గమనార్హం. మరోవైపు ఎంపీ శదర్ త్రిపాఠీపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై రాష్ట్ర బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. -
శిలా ఫలకంపై పేరు లేదని.. షూతో కొట్టుకున్నారు!
-
‘కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద స్కాం’
సాక్షి విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు రుణమాఫీ మాత్రం జరగలేదుగానీ ఓట్లమాఫీ మాత్రం జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీకి కేవలం ఐదులక్షల ఓట్లు మాత్రం తేడా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీగ్రిడ్స్ స్కాం కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద కుంభకోణమని విమర్శించారు. ఏమీ తప్పుచేయని చంద్రబాబు గుమ్మడికాయ దొంగాల భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఐటీగ్రిడ్స్ సీఈవోను తెలంగాణ పోలీసులకు అప్పగించాలని మాధవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు వివేకం కోల్పోయి.. దిగజారుడు తనానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని, ప్రజల వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని హితవుపలికారు. ఐటీగ్రిడ్స్ సంస్థ ప్రజల డేటాను ఎవరికిచ్చిందో విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. -
తమిళనాట డీఎంకే కూటమి ఖరారు
సాక్షి, చెన్నై: తమిళనాట లోక్సభ ఎన్నికలకు డీఎంకే మెగా కూటమి ఖరారైంది. మిత్రులకు 20 సీట్లను డీఎంకే కేటాయించింది. మరో 20 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అ«ధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. పుదుచ్చేరి, తమిళనాడులో 40 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నాడీఎంకే– బీజేపీ నేతృత్వంలో ఓ మెగా కూటమి ఏర్పాటు చివరి దశలో ఉండగా డీఎంకే–కాంగ్రెస్ నేతృత్వంలో మరో కూటమి మంగళవారం రారైంది. సీట్ల సర్దుబాటు వివరాలను స్టాలిన్ ప్రకటించారు. తమ కూటమిలోని కాంగ్రెస్కు పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలో 10 స్థానాలు కేటాయించామన్నారు. ఎండీఎంకేకు ఓ ఎంపీ సీటు, ఓ రాజ్యసభ సీటును ఖరారు చేసినట్టు వివరించారు. ఇక, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 2, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్) 1, కొంగునాడు దేశీయ మక్కల్ కట్చి(కేడీఎంకే)1, ఇండియ జననాయగ కట్చి(ఐజేకే)1లకు ఒకటి చొప్పున సీట్లు కేటాయించినట్టు ప్రకటించారు. మిత్రులకు 20 కేటాయించామని, తమ అభ్యర్థులు 20 స్థానాల్లో పోటీ చేస్తారని వివరించారు. డీఎంకే గుర్తుపై కేడీఎంకే, ఐజేకే అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ అభ్యర్థులు కూడా ఇదే గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయన్నారు. -
కాంగ్రెస్లో చేరిన బీజేపీ ఎంపీ
లక్నో: సార్వత్రిక ఎన్నికల ముందు కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సావిత్రి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆమెతో పాటు ఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ సచాన్ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందని, దాని పరిరక్షణ కోసం కాంగ్రెస్లో చేరుతున్నట్లు పూలే తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యూపీలో మరిన్ని సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే చేరికలపై దృష్టిసారించారు. సావిత్రిబాయి పూలే 2000 సంవత్సరంలో బీజేపీలో చేరి 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. బహ్రైచ్ నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి లోక్సభకు ఎంపికయ్యారు. -
‘అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా’
లక్నో : బీజేపీ నాయకత్వంతో విభేదిస్తున్న ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తాను తిరిగి పట్నా సాహిబ్ స్ధానం నుంచే రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం నిర్ణయంతో నిమిత్తం లేకుండా తాను నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని తెగేసిచెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తాను పోటీ చేసే నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదన్నారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పలు అంశాలపై సిన్హా పార్టీ అగ్రనాయకత్వంతో విభేదిస్తున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ సహా పలు నిర్ణయాలపై సిన్హా సొంత పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ ఏడాది జనవరిలో కోల్కతాలో జరిగిన బీజేపీ వ్యతిరేక ర్యాలీలో పాల్గొని స్టార్ స్పీకర్గా విపక్షాల ప్రశంసలు అందుకున్నారు.మరోవైపు తన భార్య పూనం సిన్హాను యూపీలోని లక్నో నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్పై పోటీకి నిలిపేందుకు శత్రుఘ్న సిన్హా యోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో ఇటీవల లక్నోలో సిన్హా భేటీని ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ధ్రువీకరించని సిన్హా దీన్ని తోసిపుచ్చలేనని కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. కాగా రానున్న లోక్సభ ఎన్నికల్లో సిన్హా ఎస్పీ టికెట్పై పోటీలో ఉంటారని భావిస్తున్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్కు దీటుగా బదులిచ్చాం : అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధిచెప్పిందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. భారత్తో సంబంధాలపై ఇప్పుడు పాకిస్తాన్ తేల్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2019లో శుక్రవారం అమిత్ షా మాట్లాడుతూ ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయన్నారు. పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు భారత్ వైమానిక దాడులు చేపట్టిందని, మన దేశంలోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధవిమానాలను భారత్ సమర్ధంగా తిప్పికొట్టిందని అమిత్ షా పేర్కొన్నారు. పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ భారత్కు తిరిగి రానున్నారని చెప్పారు. సీబీఐని మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరచలేదని అమిత్ షా చెప్పుకొచ్చారు. రాబర్ట్ వాద్రా, మాయావతిలపై కేసులు మోదీ ప్రభుత్వం హయాంలోనివి కాదని గుర్తుచేశారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడంపై వ్యాఖ్యానిస్తూ రాజకీయాల్లో ఆమె రాక నూతనంగా జరిగింది కాదని, ఆమె గత 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని అమిత్ షా అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి తమ సర్కార్ పనితీరును తప్పుపట్టే హక్కు లేదన్నారు. -
భారత సైన్యం మీద పూర్తి నమ్మకం ఉంది
-
భారత్ అన్నింటా ఒక్కటిగానే..
న్యూఢిల్లీ : భారత్ ఐకమత్యంతో స్థిరంగా ముందుకు సాగుతూ అభివృద్ధి సాధిస్తుందనీ, పోరాడి గెలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్లా కాదని నిరూపించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులతో మాట్లాడారు. ‘భారత్ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఒక్కటిగా నిలుస్తుంది. అభివృద్ధి చెందుతుంది. ఐకమత్యంతో పోరాడి విజయం సాధిస్తుంది’అని అన్నారు. పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడుల అనంతరం ప్రజల్లో భావోద్వేగాలు మరింతగా పెరిగాయని పేర్కొన్న ప్రధాని.. మన జవాన్లు సరిహద్దులతోపాటు వెలుపల కూడా అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారని, దేశం యావత్తూ వారి పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. సైనికుల త్యాగాలను బీజేపీ రాజకీయలబ్ధికి ఉపయోగించుకుంటోందంటూ ప్రతిపక్షాలు చేసి ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘మన సైనికుల సామర్థ్యంపై నమ్మకం ఉంది. వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు గానీ, శత్రువు మన వైపు వేలెత్తి చూపే అవకాశం గానీ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రదాడుల ద్వారా అభివృద్ధిని అడ్డుకుని, దేశాన్ని అస్థిరం పరచడం శత్రువుకున్న లక్ష్యాల్లో ఒకటి’అని ఆయన తెలిపారు. అది అవినీతిమయ కూటమి ప్రతిపక్షాలతో ఏర్పడిన మహాకూటమిని ప్రధాని మోదీ పూర్తిగా అవినీతిమయ (మహా మిలావత్)కూటమిగా అభివర్ణించారు. ‘దేశాన్ని ఈ కూటమి ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లోకి పంపుతుంది. మునిగిపోతున్న కాంగ్రెస్ను రక్షించేందుకే ఈ కూటమి ఏర్పడింది. బీజేపీ విరోధులతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందనేందుకు ఈ కూటమి ఒక ఉదాహరణ. ఇది నూనె, నీటి కలయిక వంటిది. దీనివల్ల వారికి ఎటువంటి ఉపయోగమూ లేదు. ఒకరినొకరు చూసుకునేందుకు ఇష్టపడని నేతల కలయికతో ఏర్పడిన కూటమి అది’అని ఆయన వాఖ్యానించారు. 2004లో మాదిరిగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైతే.. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందనీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో ఈజ్ ఆఫ్ కరెప్షన్(అవినీతి) వస్తుందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలు దేశ ప్రజల అవసరాలను తీర్చడం లక్ష్యం కాగా, ప్రజల ఆకాంక్షలే ఎజెండా 2019 సాధారణ ఎన్నికలు రానున్నాయని తెలిపారు. దక్షిణాదిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గణనీయ ఫలితాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ గిమ్మక్కు కాదు.. అది నా సంస్కారం అలహాబాద్ కుంభమేళాలో తను పారిశుధ్య కార్మికుల పాదాలను కడగడం రాజకీయ ప్రయోజనం కోసం కాదని, అది తనకున్న సంస్కారమని ప్రధాని చెప్పారు. పుణేకు చెందిన ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘యూపీలో జరుగుతున్న కుంభమేళాకు ఇటీవల వెళ్లాను. దాదాపు 22 కోట్ల మంది ప్రజలు సందర్శించుకున్న ప్రాంతమది. అయినప్పటికీ అక్కడ చాలా పరిశుభ్రంగా ఉంది. అక్కడ పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులదే ఈ గొప్ప తనమంతా. వాళ్లు నిజమైన కర్మయోగులు. అందుకే గౌరవభావంతో వారి కి కాళ్లు కడిగి కృతజ్ఞతలు తెలిపాను. ఇది తెలియని వారు రాజకీయ తమాషా అనుకున్నారు’అని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు అధికార నివాసంలోకి గృహ ప్రవేశం ఎలా చేస్తారని అధికారులు నన్ను అడిగారు. నాలుగో తరగతి ప్రభు త్వ ఉద్యోగి ఒకరిని పిలిపించండి అని వారికి చెప్పా. ఒక దళిత ఉద్యోగిని వారు తీసుకువచ్చారు. అతని కుమార్తె చేతుల్లో కలశం ఉంచి గృహ ప్రవేశం చేయించా’అంటూ అప్ప టి అనుభవాన్ని వివరించారు. అప్పుడు బ్యాట్మెన్.. ఇప్పుడు బాహుబలి దేశం అభివృద్ధి బాటన సాగుతున్న ఈ సమయంలో ఎవరికి వారు తాము మరింత చురుకుగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఇది వరకు భారత్ అంటే పేదరికం. కానీ, ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం. పూర్వం భారత్ అంటే పాములను ఆడించే వారి దేశం. నేడు శాస్త్ర– సాంకేతిక రంగాలకు, ఉపగ్రహాలు, శాటిలైట్లకు పేరుగాంచింది. ఇదివరకు దేశంలో విద్యుత్తు కొరతతో చీకటి తాండవించేది. కానీ, భారత్ అంటే ఇప్పుడు ఎల్ఈడీ విప్లవం. ఇప్పటిదాకా బ్యాట్మెన్ను ప్రపంచం హీరోగా భావించేది. ఇప్పుడు బాహుబలి అంటే ఎవరో ప్రపంచానికి తెలిసింది’అని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ రికార్డు రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం ప్రధా ని మోదీ ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’కార్యక్రమంలో భాగంగా ’దేశవ్యాప్తం గా 15వేల ప్రాంతాల్లోని కోటి మంది బీజేపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రముఖులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నమో యాప్ ద్వారా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రపంచంలోనే అతి పెద్దదని బీజేపీ మీడియా విభా గం అధిపతి అనిల్ బలూనీ ఒక ప్రకటనలో తెలి పారు. దాదాపు 85 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాక్ సైన్యానికి చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ గురించి మాత్రం ప్రధాని ఎక్కడా ప్రస్తావించకపోవ డం గమనార్హం. -
‘సీ టర్న్, జెడ్ టర్న్ కూడా తీసుకుంటాను’
ముంబై: ప్రతిపక్షాలను అధికారానికి దూరంగా ఉంచడం కోసమే తమ పార్టీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నట్టు ఇటీవల ఇరుపార్టీల నేతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా బీజేపీపై పలు ఆరోపణలు చేసిన శివసేన తిరిగి బీజేపీతో జత కట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం శివసేన అనుబంధ సంస్థ స్థానీయ లోకాధికార్ సమితి(ఎస్ఎల్ఎస్) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్దవ్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను యూ టర్న్ తీసుకున్నానని.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో శివసేన కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. పార్టీపై వస్తున్న ఆ విమర్శలను పట్టించుకోవద్దు. నేను పార్టీ సైనికులు సహకారంతో శివసేనను నడుపుతున్నాను. అవసరమైతే నేను సీ టర్న్, జెడ్ టర్న్ కూడా తీసుకుంటాను. ఒంటరిగా పోటీ చేస్తే మన పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవడానికి సిద్దంగా లేదు. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకవేళ మనం ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధించినప్పటికీ.. హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం బీజేపీతో 25 ఏళ్ల నుంచి కలిసి ప్రయాణిస్తున్నాం. గత ఐదేళ్ల నుంచి ఇరు పార్టీల మధ్య సమస్యలు తలెత్తాయి. అయితే దేశ ప్రజలు కాంగ్రెస్కు 50 ఏళ్లు అధికారం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీకి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే.. చాలా అంశాలతో పాటు హిందుత్వం కూడా వెనుకబడిపోతుంద’ని తెలిపారు. కాగా, గత నెలలో ఎస్ఎల్ఎస్ సమావేశంలో ప్రసగించిన ఉద్దవ్.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళవారం భారత వైమానిక దళం అధికారులు జరిపిన మెరుపు దాడులకు ఉద్ధవ్ సెల్యూట్ చేశారు. సైనికుల త్యాగాలను రాజకీయం చేయకూడదన్నారు. పాక్ చెరలో చిక్కుకున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
పోరాట యోధుడి ప్రతిఫలం
‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’.. రైళ్ల సమయపాలన విషయంలో ఎప్పటినుంచో ఉన్న నానుడి ఇది. యాధృచ్ఛికమే గానీ.. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో ఈ నానుడి నిజమైంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల కల ఈడేరింది. సుదీర్ఘ పోరాటాలు ఫలించాయి. ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు ఎట్టకేలకు సాకారమైంది. మొదట కోల్కతా కేంద్రంగా ఉన్న ఆగ్నేయ రైల్వేలోనూ.. అనంతరం భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా రైల్వే జోన్లోనూ వాల్తేర్ డివిజన్కు జరుగుతున్న అన్యాయాలతో విసిగివేసారిన ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలనాడే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ డిమాండ్తో గళమెత్తారు. కీలకమైన రైల్వే ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలకు తరలించుకుపోవడం.. రైలు సర్వీసులను పొడిగించుకొని వాల్తేర్ సీట్ల కోటాకు ఎసరుపెట్టడం.. కొత్త కోచ్లు, ఇంజిన్లు తమ ప్రాంతాల్లో అట్టిపెట్టుకొని, వాల్తేర్కు పాతవి అంటగట్టడం.. వంటి వివక్షపూరిత చర్యలు ప్రత్యేక జోన్ వాదనను పదునెక్కించాయి..ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు వెళ్లే ఆంధ్ర నిరుద్యోగులను అక్కడి కేంద్రాల్లో పరీక్షలు రాయకుండా అడ్డుకోవడం, కొట్టడం వంటి సంఘటనలు.. జోన్ ఉద్యమాన్ని ఉడుకెక్కించాయి. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగినా.. మన ప్రజాప్రతినిధుల మెతకదనం, అప్పటి ఆగ్నేయ, ప్రస్తుత తూర్పుకోస్తా రైల్వేలకు ఆదాయపరంగా బంగారు బాతులా ఉన్న వాల్తేర్ డివిజన్ను వదులుకోవడం ఇష్టంలేక ఆ రాష్ట్రాలు మోకాలడ్డటం.. వంటి చర్యలు రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియకు ఎప్పటికప్పుడు రెడ్ సిగ్నల్ వేశాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా రూపొందించిన విభజన చట్టంలో విశాఖ రైల్వేజోన్ ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా.. సాంకేతిక ఇతరత్రా సాకులతో ఎప్పటికప్పుడు దాటవేస్తుండటాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యమించారు.. ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకున్న ఆ పార్టీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్లు కూడా పాదయాత్రలు, నిరవధిక దీక్షలతో రైల్వేజోన్ డిమాండ్ను ఎలుగెత్తిచాటారు. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఆలస్యంగానైనా విశాఖ రైల్వేజోన్ పట్టాలెక్కింది. విశాఖసిటీ: నాటి స్వాతంత్య్రోద్యమం నుంచి.. మొన్నటి విశాఖ ఉక్కు సంకల్పం.. నిన్నటి జై ఆంధ్ర.. సమైక్యాంధ్ర పోరాటాలు.. వీటన్నింటికీ నాయకత్వం వహించిన వారు స్వాతంత్య్ర యోధులు, మేధావులు వంటి మహోన్నతులు. అదే స్ఫూర్తి.. అదే ఉక్కు సంకల్పం.. నేటి రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఉద్యమానికి దారి చూపిన జాజ్వల్యమైన దీప్తి..కానీ.. ఈ ఉద్యమాన్ని నడిపించింది.. నడిపిస్తున్నది మాత్రం ఒకే ఒక్కడు. మడమతిప్పని యోధుడు.రెండు ప్రధాన డిమాండ్లతో అతడే సైన్యమై జోన్ కోసం పోరాటం చేస్తూ.. రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ.. విజయం వైపు నడిపించిన ధీరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెంచుకున్న ఆశలు రెండింటిపైనే.. ఒకటి ప్రత్యేక హోదా.. రెండోది విశాఖ రైల్వేజోన్. విభజన హామీలు సాధించే విషయంలో అధికార పార్టీ గుంభనంగా వ్యవహరించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నెరవేర్చకుండా కాలయాపన చేసింది. ఏడాది గడిచినా రాష్ట్రానికి ఏమీ విదిల్చకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిచడంతో.. ఉద్యమ భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని మొదటి అడుగు వేశారు ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. హోదాతో పాటు రైల్వో జోన్ సాధించే పోరుకు శంఖారావం పూరించారు. ఆయన వేసిన అడుగు.. ప్రభంజనమైంది. సామాన్యులు, ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల్లో చైతన్యం నింపింది. జోన్ ఆవశ్యకత, హోదా వస్తే లాభాల గురించి ఏపీలోని ప్రతి పౌరుడూ తెలుసుకునే విధంగా చైతన్యవంతం చేసిన జగన్మోహన్రెడ్డి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. పార్లమెంట్ లోపలా, బయటా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ పోరాటాలు సాగించారు. ఆయన స్ఫూర్తితో వాడవాడలా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు, రాజకీయ, రాజకీయేతర నేతలు.. ఇలా అందరూ.. జగన్ పోరాటంతో స్ఫూర్తి పొందుతూ.. జోన్ కోసం అనేక ఉద్యమాలు చేశారు. అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జోన్ కోసం దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు.. ఇలా ప్రతి పోరాటం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చారు. జగన్ స్ఫూర్తితో సాగిన ఐదేళ్ల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్ర వాసులు ఎన్నాళ్ల నుంచో ఆశగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వేజోన్ కల సాకారమైంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్గోయల్ బుధవారం రాత్రి ప్రకటించారు. ఇది ప్రజా విజయం.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ.. రైల్వేజోన్ సాధనలో కీలక పాత్ర పోషించిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ విజయం. జోన్ కోసం ‘విజయ’ యాత్ర స్థానికంగా పేరుకుపోయిన సమస్యలు తీరడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరాశలో కుంగిపోయిన యువతకు ధైర్యం చెబుతూ.. జోన్ సాధనే లక్ష్యంగా పాదయాత్ర చేసిన వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోన్ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ.. ప్రతి ఒక్కరిలో జోన్ గురించి చైతన్యపరచడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. జోన్ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తూ.. చేపట్టిన రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో జోన్ ప్రస్తావనను పదే పదే తీసుకొస్తూ... కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాల్సిందేనంటూ పదే పదే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లేలా పార్లమెంట్లో ఉద్యమించిన విజయసాయిరెడ్డి.. జోన్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. జగనన్న బాటలో అమర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో ఆయన మార్గదర్శకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత అనకాపల్లి సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్.. రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. అలుపెరగని ధీరుడు సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. నెల రోజుల్లో జోన్ ప్రకటించకుంటే ఆమరణ దీక్ష చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో 2016 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఐదురోజుల పాటు దీక్ష సాగిన నేపథ్యంలో ఏప్రిల్ 18న వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు హాజరయ్యారు. జోన్పై పోరాటం ఉద్ధృతం చేసేందుకు అన్ని వర్గాలతో కలిసికట్టుగా పోరాటం చెయాల్సిన అవసరం ఉందంటూ జగన్మోహన్రెడ్డే స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అప్పటి నుంచి రైల్ రోకోలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధనాలు, ధర్నాలు, సమ్మెలు నిర్వహించిన అమర్నాథ్.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 2017 మార్చి 30 నుంచి ఏప్రిల్ 9 వరకూ 200 పై చిలుకు కిమీ పాదయాత్ర చేస్తూ.. రైల్వేజోన్ వస్తే.. ఎలాంటి ఉపయోగం ఉంటుంది, యువతకు ఎలా ఉపాధి అవకాశాలు వస్తాయి. విశాఖతో పాటు ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయనే అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి.. జోన్ సాధనలో కీలక పాత్ర పోషించారు. -
సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర చాలా కీలకమైందని, మహిళల హక్కులు, అత్యాచారాలు లాంటి పలు అంశాలపై ఎన్జీవోలు పోరాడుతున్నారని బీజేపీ మహిళా జాతీయ మోర్చా అధ్యక్షురాలు విజయ రహత్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘ఎన్జీవోస్ మీట్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగ్రమూకలకు మోదీ వాళ్ల భాషలోనే సరైన సమాధానం చెప్పారన్నారు. ఎన్జీవోలు ఇచ్చే సలహాలను మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మోదీ తప్ప దేశానికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. మహిళల అభివృ ద్ధి, సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలను చేపట్టి సమర్థంగా అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళా పక్షపాతి మోదీ జాతీయవాద ఆలోచనలున్న వారందరూ బీజేపీలోకి రావాలని, ఎన్జీవోస్ నిస్వార్థంగా సేవ చేస్తూనే రాజకీయంగా రాణించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. మోదీ మహిళా పక్షపాతి అని, రక్షణ శాఖ మంత్రి సహా పలు కీలక పదవులు మహిళలకు కేటాయించడమే ఇందుకు నిదర్శనమని కొనియాడారు. ఎన్జీవోలు చాలా మంచి పనులు చేస్తాయన్నారు. దేశం మొత్తం మీద కమలం వికసిస్తోందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. పాక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నా మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ లు, మెరుపు దాడులను చేస్తూ ఉగ్రవాదులను తుదముట్టించే విధంగా మోదీ ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. సమాజ మార్పునకు ఎన్జీవోలు ప్రభుత్వంతో పాటు ఎన్జీవోలు సమాజ మార్పునకు కృషి చేస్తున్నారని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. కమర్షియల్గా కాకుండా పనిచేసే ఎన్జీవోలకు మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అందరమూ కలసి మరోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఎమ్మెల్సీ రాంచందర్రావు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యకురాలు ఆకుల విజయ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలి: లక్ష్మణ్ భారత వైమానిక దళం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు. ఇది ఒక దేశంపైనో, ప్రాంతంపైనో దాడి కాదని, దీనిని ప్రతీకార చర్యగా కాకుండా ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యగానే చూడాలని తెలిపారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి భారత సేనలు జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని వెల్లడించారు. -
జగన్తో సినీ నటుల భేటీ దురదృష్టకరం
సాక్షి, అమరావతి: జగన్తో సినీనటులు సమావేశమవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి సమావేశాల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. సినీ ప్రముఖుడు నాగార్జున మంగళవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను కలిసిన నేపథ్యంలో చంద్రబాబు బుధవారం టీడీపీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి అందరూ అండగా ఉండాలన్నారు. హైదరాబాద్లో ఆస్తులను చూపించి బెదిరింపులు చేయడం వల్లే టీడీపీకి కొందరు దూరం అవుతున్నారని, ఆస్తులు కాపాడుకునేందుకే వైఎస్సార్సీపీలో చేరుతున్నారని విమర్శించారు. అభ్యర్థుల ఎంపికను ప్రజాభిప్రాయం ప్రకారం చేస్తామని తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కొందరికి అవకాశం రాదని, అలాంటి వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 10 వేలు పెంచామని, ప్రైవేటు పాఠశాలలకు పలు రాయితీలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ లబ్ధి పొందిన వారంతా టీడీపీ వెంటే ఉంటారని చెప్పారు. వైఎస్సార్సీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని, ఇతరులు సర్వే చేస్తే అడ్డుంకులు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం జరిగి సరిగ్గా ఐదేళ్లయిందని, నమ్మక ద్రోహానికి ఐదవ వార్షిక నిరసనలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హాదాతో సహా మిగిలిన ఐదు హామీలను గాలికి వదిలేశారని, పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదని చెప్పారు. మమత వ్యాఖ్యలతో చర్చ జరుగుతోంది... స్వార్థంతో దేశ భద్రతను ఫణంగా పెడితే సహించేది లేదని, రాజకీయ లాభాల కోసం సైన్యంతో ఆటలాడితే సహించమని చెప్పారు. పుల్వామా దాడిపై ప్రజల్లో అనుమానాలున్నాయని,పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో దేశంలో చర్చ జరుగుతోందని తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలపై అనేక అనుమానాలున్నాయని, పాలకుల అసమర్థతతో దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజల్లో బీజేపీ పూర్తిగా పలుచనైందని, అందుకే చిన్నాచితకా పార్టీలతో పొత్తుల కోసం ఆరాటపడుతోందని విమర్శించారు. అధికారం కోసం బీజేపీ దేనికైనా దిగజారుతుందన్నారు. -
ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం
తుమకూరు: రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులను చిక్కమగళూరు బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జిల్లాలోని కుణిగల్ సమీపంలోని ఉర్కేనహళ్లి గ్రామ శివార్లలోని జాతీయ రహదానిపై చోటు చేసుకుంది. కనకపురలోని సూరేన హళ్లి గ్రామానికి చెందిన శశికుమార్ (28), సునీల్గౌడ (27)లు స్నేహితులు మునిరాజు, జయచంద్ర, పునీత్, మంజునాథ్లతో కలసి కొల్లూరు, శృంగేరి, ధర్మస్థల పర్యటనకు వెళ్లి తిరిగి కార్లలో గ్రామానికి పయనమయ్యారు. మార్గంమధ్యలో ఉర్కేనహళ్లి శివార్లలోని జాతీయ రహదారిపై కాలకృత్యాల తీర్చుకోవడానికి వాహనాలు రోడ్డుపక్కన నిలిపారు. అదే సమయంలో చిక్కమళూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు వెనుకవైపు నుంచి రోడ్డుపక్కన నిలిపి ఉంచిన కార్లను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కార్లపక్కన ఉన్న వ్యక్తులపై దూసుకెళ్లింది. ఘటనలో శశికుమార్, సునీల్గౌడలు అక్కడిక్కడే మృతి చెందగా మునిరాజు, జయచంద్ర, పునీత్, మంజునాథ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో ఎమ్మెల్యే రవితో పాటు కారు డ్రైవర్ ఆకాశ్, గన్మెన్ రాజు నాయక్లు కూడా గాయపడ్డారు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న కుణిగల్ పోలీసులు శశికుమార్, సునీల్ల మృతదేహాలను కుణిగల్ ఆసుపత్రికి తరలించి గాయపడ్డ నలుగురు యువకులను బెంగళూరు ఆసుపత్రిలో చేర్పించారు. ఘటన జరిగిన అనంతరం ఎమ్మెల్యే ఏమైందని కూడా అడగకుండానే మరొక కారులో బెంగళూరుకు వెళ్లిపోయారంటూ గాయపడ్డ యువకులు ఆరోపించారు. విషయం తెలుసుకొని కుణిగల్ ఆసుపత్రికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రవి ఆసుపత్రికి రావాలంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్యే రవి ఇక్కడికి వచ్చే వరకు నిరసన విరమించమంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
జవాన్ అంతిమయాత్రలో ఎంపీ అభ్యంతరకర ప్రవర్తన
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ అజిత్ కుమార్ అంతిమ యాత్ర సందర్భంగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగిన అజిత్ కుమార్కు కడసారి నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నావ్కు తరలిరాగా జవాన్ భౌతికకాయం ఉంచిన వాహనంపై స్ధానిక ఎంపీ సాక్షి మహరాజ్ వారందరికీ నవ్వుతూ అభివాదం తెలపడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఎండగట్టారు. కాగా, జవాన్ అంతిమయాత్రలో సాక్షి మహరాజ్ అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియో, ఫోటోలను మరికొందరు పోస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. సాక్షి మహరాజ్ జవాన్ అంతిమ యాత్రను అభినందన యాత్రగా పీలవుతున్నారని ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్ర సంధించగా, బీజేపీ ఎంపీ చర్య సిగ్గుచేటని మరో యూజర్ మండిపడ్డారు. -
‘మోదీ వర్సెస్ రాహుల్’
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టడం, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ ఎన్నికలు పూర్తిగా ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ మధ్యే ఉంటాయన్న భావనను ప్రజల్లోకి బలం గా తీసుకెళ్లేవిధంగా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేసింది. పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్ లోక్సభ స్థానాలపై విడతలవారీగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో సమీక్షలు జరిపింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహం, నేతల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక పార్టీ మేనిఫెస్టో తదితరాలపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని, కాంగ్రెస్ను గెలిపించి రాహుల్గాంధీని ప్రధానిగా చేయడం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని నేతలు సూచించారు. ఎన్నికల హామీలను అమ లు చేయడంలో మోదీ విఫలమయ్యారని, మతపరమైన రాజకీయాలతో మైనార్టీలను భయపెడుతున్నారనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మైనార్టీలను అభద్రతాభావంలోకి నెట్టి వేస్తున్న తీరును, నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలపై పడిన, పడుతున్న భారాన్ని వివరించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ 2 లక్షలు కూడా కల్పించలేదని, దీనిపై యువత లో అవగాహన కల్పించాలన్నారు. రాహుల్ ప్రధాని అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ లు నెరవేర్చలేదనే విషయాలు ప్రచారం చేయా లన్నారు. డీసీసీలు, ముఖ్యనేతలు కలసి పార్లమెంట్ స్థానాలకు ముగ్గురేసి ఆశావహుల పేర్ల ను పంపాలని, అందులో ఒకరిని అభ్యర్థిగా హైకమాండ్ ప్రకటిస్తుందని కుంతియా తెలి పారు. ఈ నెల 25 లోపు అధిష్టానానికి అభ్యర్థుల జాబితా పంపిస్తామని, నెలాఖరుకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం కావాలి: ఉత్తమ్ బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన విభజన రాజకీయాలు చేస్తోందని ఉత్తమ్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని, దేశమంతా రాహుల్ను ప్రధానిని చేయాలని ఎదురుచూస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని, అయితే, పార్లమెంట్ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని తెలిపారు. రాహుల్, మోదీ మధ్యే పోరు ఉంటుందని, నేతలంతా రాహుల్ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. భారత సైనికులపై ఉగ్రమూకల దాడిని ఉత్తమ్ ఖండించారు. -
కలకలం; బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్!
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్ అవడం కలకలం రేపుతోంది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.... లబ్ధ్పూర్కు చెందిన సుప్రభాత్ బత్యబయాల్ గురువారం రాత్రి ఓ సమావేశం నిమిత్తం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కూతురితో పాటు సుప్రభాత్ సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చిన ఐదుగురు ఆగంతకులు సుప్రభాత్ కూతురిని కిడ్నాప్ చేశారు. ఈ విషయం గురించి సుప్రభాత్ సోదరుడు మాట్లాడుతూ... ‘ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మొదట మమ్మల్ని ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లో చొరబడి తుపాకీతో బెదిరించి నా సోదరుడి కూతురిని లాక్కెళ్లారు. కార్లో ఎక్కించుకుని పరారయ్యారు’ అని పేర్కొన్నారు. కాగా ఐదు నెలల క్రితమే సుప్రభాత్ అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు కిడ్నాప్ అవడంతో లబ్ధ్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన స్థానికులు పోలీసు స్టేషను ఎదుట నిరసనకు దిగారు. ఇక ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని భావిస్తున్నట్లు బీర్భూమ్ జిల్లా ఎస్పీ శ్యామ్ సింగ్ తెలిపారు. అలా అని ఈ విషయాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని పేర్కొన్నారు. త్వరలోనే బాధితురాలి ఆచూకీ కనుగొంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది. -
బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య
-
బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య
సాక్షి, ముంబై : బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ తోడ్సమ్కు చేదు అనుభవం ఎదురైంది. రెండో భార్యతో కలిసి ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రాజు నారాయణ మొదటి భార్యతో తల్లి కూడా రోడ్డుపైనే ఆయనను చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని ఆర్ని(ఎస్టీ)నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజు నారాయణ తన రెండో భార్య ప్రియాతో కలిసి మంగళవారం 42వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం ఓ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో నారాయణ తల్లి, ఆయన మొదటి భార్య అర్చన అక్కడికి చేరుకున్నారు. వారిని వాహనాన్ని అడ్డగించి ప్రియాను కిందకి లాగి ఆమెపై దాడి చేశారు. చెంప దెబ్బలు కొడుతూ, తన్నుతూ ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ప్రియాను కాపాడేందుకు వాళ్లకు అడ్డుపడిన రాజు నారాయణను కూడా చితకబాదారు. వీరికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. ప్రధానికి ఫిర్యాదు చేస్తాం ఈ ఘటనపై స్పందించిన రైతు నాయకుడు కిషోర్ తివారీ మాట్లాడుతూ.. ‘ ఓ ప్రజాప్రతినిధి ఇలా సిగ్గులేకుండా మరో మహిళతో ఉంటూ తన భార్యకు అన్యాయం చేస్తున్నారు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అర్చనకు, ఆమె ఇద్దరు పిల్లలకు 48 గంటల్లోగా న్యాయం చేయాలి. లేనిపక్షంలో శనివారం ఇక్కడి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. ఇక బీజేపీ ట్రైబల్ వింగ్ చీఫ్ అంకిత్ మాట్లాడుతూ రాజు నారాయణ తన మొదటి భార్యకు న్యాయం చేయకపోతే ప్రధాని మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో వేదిక పంచుకోనివ్వమని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా వ్యతిరేకత మూటగట్టుకుంటే రాజు నారాయణ వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా పొందలేరని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ విషయం గురించి పోలీసు అధికారి డీఎస్ తెంబరే మాట్లాడుతూ.. ఘటన జరిగిన తర్వాత ఇరువర్గాలు పోలీసు స్టేషనుకు వచ్చాయని, సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
బీజేపీదే విజయం
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి రామ్లాల్ ధీమా వ్యక్తం చేశారు. మేరా పరివార్ భాజపా పరివార్ (మా కుటుంబం – బీజేపీ కుటుంబం) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై బీజేపీ జెండాను రామ్లాల్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రాంతీయ ఎన్నికలు కావని, ప్రాంతీయ నాయకులు ప్రధానమంత్రి కాలేరని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రధాని ఎవరు అనే అంశంపైనే ఎన్నికలు జరుగబోతున్నాయన్నారు. అన్ని సర్వేలు కూడా మోదీనే ఘన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, చేతివృత్తుల వారి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దేశాన్ని ప్రపంచంలో అందరూ గర్వించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోదీదేనన్నారు. ఆ నాయకులకు భయం పట్టుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి పనులతో కొన్ని పార్టీలకు, కొంతమంది నాయకులకు భయం పట్టుకుందని, అందుకే ఆయనని, బీజేపీని దూషిస్తున్నారని రామ్లాల్ విమర్శించారు. దూషించేవారెవరూ ఎన్నికల్లో ఇంతకుముందు గెలవలేదని, ఇప్పుడూ వారికి ఓటమి తప్పదన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఐదేళ్ల బీజేపీ పాలన చూసిన వారికి తేడా అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తుందన్నారు. ఈనెల 28న నరేంద్ర మోదీ టెలీకాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడతారని తెలిపారు. మార్చి 2న దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖరరావు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, నేతలు కిషన్రెడ్డి, చింతా సాంబమూర్తి, ఆచారి, ప్రేమేందర్డ్డి, మనోహర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మోదీని మళ్లీ ప్రధాని చేయాలి: లక్ష్మణ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశాన్ని శక్తివంతమైన దేశంగా చేసేందుకు, నవ భారత్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. అధిష్టానం పిలుపు మేరకు మేరా పరివార్–బీజేపీ పరివార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మణ్ హైదరాబాద్లోని తన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఈనెల 15 వరకు, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈనెల 25 వరకు తమ నివాసాలపై పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. -
నల్ల జెండాలను చూస్తే వారికి భయం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ ముఖ్యమంత్రులకు ఇప్పుడు నల్ల జెండాల భయం పట్టుకున్నట్లుంది. ఎక్కడైన వారికి నల్ల జెండాల నిరసన ఎదురయితే భరించలేక పోతున్నారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన వారిని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పోలీసులు కూడా ఒకప్పుడు ఎర్ర జెండాలను చూస్తే రెచ్చిపోయినట్లుగా ఇప్పుడు నల్ల జెండాలను చూస్తే రెచ్చి పోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా గువాహటిలో శనివారం ఆయన కాన్వాయ్ ముందు నల్ల జెండాలను ప్రదర్శించినందుకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారంతా విద్యార్థులే. అస్సాం పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేశారు. వారు అంతకుముందు చొక్కాలు చింపుకొని అర్ధనగ్నంగా కూడా ప్రదర్శనలు జరిపారు. దాంతో స్థానిక పోలీసు అధికారులు ఓ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిరసన ప్రదర్శనల్లో విపరీత పోకడలు వద్దని, మౌనంగా నల్ల జెండాలతో ప్రదర్శన జరిపేందుకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకొని అనుమతిని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రాజస్థాన్లో, 2018, మార్చి నెలలో నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగానే ‘నేషనల్ రూరల్ హెల్త్ మిషన్’కు చెందిన కాంట్రాక్టు కార్మికులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయగా, వారిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి లక్నో యూనివర్శిటీ సందర్శన సందర్భంగా గత జూన్ నెలలో 23 ఏళ్ల పూజా శుక్లా, మరో పది మంది నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయగా, వారిని 26 రోజులపాటు జైల్లో పెట్టారు. ఆ మరుసటి నెల జూలైలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ ముందు నెహా యాదవ్, మరో ముగ్గురు నల్ల జెండాలను ప్రదర్శించగా వారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సమాజ్వాది పార్టీకి చెందిన శుక్లా, యాదవ్లను జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైల్లో చితకబాదారట. ఎన్కౌంటర్ చేసి చంపేస్తామని బెదిరించారట. ఇలా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన అందరిపైనా చట్ట విరుద్ధంగా సమావేశమయ్యారని, అల్లర్లకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డం పడ్డారని, ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారంటూ కేసులు దాఖలు చేయగా, రాజస్థాన్లోని ఆరోగ్య కార్యకర్తలపై ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చారని అభియోగాలు మోపారు. ఇలా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం యూరప్ దేశాల్లో అనార్కిస్టు పార్టీల నుంచి వచ్చింది. యూరప్ వీధుల్లో మొదటిసారి 1982లో నల్ల జెండాల ప్రదర్శన జరిగినట్లు చరిత్రలో నమోదయింది. అప్పట్లో అనార్కిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేయడానికి నల్ల జెండాలనే కాకుండా ఎర్ర జెండాలను కూడా ప్రదర్శించేవారు. సోవియట్ యూనియన్లో అక్టోబర్ రెవెల్యూషన్ తర్వాత ఎర్ర జెండా కమ్యూనిస్టుల అధికారిక జెండాగా మారడంతో అనార్కిస్టులు ఎర్రజెండాను వదిలేశారు. అలా మొదలైన నల్లజెండాల ప్రస్థానం ప్రజాస్వామిక దేశాల్లో ప్రజల నిరసనకు చిహ్నంగా మారింది. -
టీడీపీ స్పెషల్ ఫ్లైట్లో బీజేపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ-టీడీపీ రహస్య కాపురం గుట్టు రట్టైంది. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్గా కొనసాగిస్తున్న ప్రేమాయాణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా బయట పెట్టారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీరును ఎండగట్టారు. బాబు.. ప్రజలు గమనిస్తున్నారు ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు. మరో ట్వీట్లో లోకేష్ బాబుకి ఇండిపెండెన్స్ డేకు రిపబ్లిక్ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీత గీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో A గ్రేడ్ ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డాడు. -
ప్రియాంకపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వేషధారణపై బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ఢిల్లీలో జీన్స్, టాప్ ధరిస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో చీర ధరించి కట్టుబొట్టు పాటిస్తారని అన్నారు. యూపీలోని బస్తీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమలో హరీష్ ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ విఫలమైనందునే ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. రాహుల్ బాటలోనే ప్రియాంక సైతం విఫలమవుతారని జోస్యం చెప్పారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు ఇదే తొలిసారి కాదు. కాగా, ప్రియాంక అందంగా ఉంటారు కానీ ఆమెకు రాజకీయ అనుభవం,నైపుణ్యం లేవని గతంలో బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా ఆరోపించారు. మరోవైపు ప్రియాంక తరచూ భావోద్వేగాలకు లోనవుతరాని, ఆమెది బైపోలర్ మనస్తత్వమని బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. ప్రియాంక గాంధీని గత నెల 23న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నియమించిన సంగతి తెలిసిందే. -
ఆశలన్నీ మోదీపైనే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం లో మోదీ మంత్రం పనిచేస్తుందనే ఆశాభావంతో బీజేపీ నాయకులున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేం ద్ర బడ్జెట్లో రైతులు, ఇతర వర్గాల ప్రజలకు చేసిన కేటాయింపులు, గత ఐదేళ్లలో దేశపురోగమనానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడేందుకు ఉపకరిస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఐదు శాతం రిజర్వేషన్ల కల్పన అంశం తురుపుముక్కగా పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్ సభ ఎన్నికలు పూర్తిగా భిన్న అంశాలు, జాతీయస్థాయి ఎజెండాకు అనుగుణంగా జరగనున్నందున మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నా రు. ముఖ్యంగా కొన్ని సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని బీజేపీ రాష్ట్రపార్టీ అంచనా వేస్తోంది. మార్చి 2 వరకు వరుస కార్యక్రమాలు... ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఐటీ విభాగం సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొంటారు. పార్టీ సిద్ధాంతకర్త దీన్దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని పురస్కరించుకుని 11న సమర్పణ దివస్ నిర్వహణ, అదేరోజు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, చేవెళ్ల పార్లమెంట్ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతల సమావేశంలో మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటారు. ఈనెల 12 నుండి మార్చి 2 వరకు ‘నా కుటుంబం– బీజేపీ కుటుంబం’ కార్యక్రమం, 12న రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఇళ్లపై బీజేపీ జెండా ఎగురవేస్తారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకుల ఇళ్లపైనా, ప్రతి బూత్లో కనీసం 25 ఇళ్లపైనా బీజేపీ జెండా ఎగురవేయడం, స్టిక్కర్ అతికించడం. కమల్ జ్యోతి పేరుతో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లలో జ్యోతి వెలిగించే కార్యక్రమం. మార్చి 2న ప్రతి అసెంబ్లీలో విజయ్ సంకల్ప్ బైక్ ర్యాలీలకు బీజేపీ సిద్ధమవుతోంది. కేడర్లో జోష్ పెంచేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి పూర్వమే రాష్ట్రవ్యాప్తంగా కేడర్ చైతన్యవంతమయ్యేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టడం, జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం ద్వారా జోష్ను పెంచాలని భావిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగానే లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావ డం ద్వారా పైచేయి సాధించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా లబ్దిపొందిన కుటుంబాలను స్వయంగా కలుసుకునే ఏర్పాట్లు, వారి ఇళ్లలో దీపం వెలిగించే కార్యక్రమాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై పార్టీ జెండాలు ఎగురవేయడం తదితర కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. -
‘అక్రమ వలసదారులే వారి ఓట్ బ్యాంక్’
లక్నో : ఎస్పీ, బీస్పీలు అక్రమ వలసదారులను ఓటు బ్యాంక్లా పరిగణిస్తాయని, తమ పార్టీ చొరబాట్లను జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా చూస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. యూపీలోని మహరాజ్గంజ్లో శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎస్పీ-బీఎస్పీ కూటమిపై నిప్పులు చెరిగారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడిఉందన్నారు. విపక్షాలు రామమందిర అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు.రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీలో గతంలో సాధించిన స్ధానాలను నిలబెట్టుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కాగా తూర్పు యూపీలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలపడంతో యూపీ ఎన్నికల రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. -
బాబు, లోకేష్లపై పొగడ్తల కోసమా?
సాక్షి, అమరావతి: గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్సీలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను పొగుడుతూ ఉపన్యాసాలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ‘గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అంటే చంద్రబాబు, లోకేష్బాబుల పొగడ్తల కోసం పెట్టుకున్న చర్చా..’ అంటూ విమర్శించారు. చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను పొగుడుతూ.. మోదీ, అమిత్షాలతోపాటు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారంటూ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు.. లబ్ధిదారులకు పోస్టు డేటెడ్ చెక్కుల్ని పంపిణీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. దేశంలో మరే ప్రభుత్వం ఇలా చేయలేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశారని, ఇప్పుడు మహిళల బంగారం జప్తునకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 23 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7 వేల పోస్టుల భర్తీకే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తప్పుపట్టారు. కాగా, శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఓ ప్రశ్నకు మంత్రి దేవినేని ఉమా బదులిస్తూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ. 51 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ.. రాజధాని అమరావతి నిర్మాణం దగ్గర్నుంచి విజయవాడ, గుంటూరు నగరాలకు, నీటి ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులిస్తోందని, సభలో వాటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. -
నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి తన వ్యాఖ్యలతో సొంత పార్టీని అయోమయంలో పడేశారు. రాజు, ప్రభుత్వం, పరిపాలన సెక్యూలర్గా ఉండొచ్చు కానీ వ్యక్తి ఎప్పుడూ సెక్యులర్ కాలేడంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్లో మంగళవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వధర్మ, సమభావనతో పని చేస్తున్నామని చెప్పారు. ప్రాంత, భాష, జాతి, ధర్మం బేధంలేకుండా పరిపాలన సాగుతోందన్నారు. (గడ్కరీ మాటలకు అర్థాలే వేరులే!) 70 ఏళ్ళు అయిన సామాజిక అసమానతలు కొనసాగడానికి కారణం పాలకులేనని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఆర్థిక వివక్ష లేకుండా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి తమ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని చారిత్రక నిర్ణయంగా వర్ణించారు. తప్పుడు పనులు చేస్తేనే కాదు.. మంచి అభివృద్ధి పనులు చేసినా ఎక్కువ మంది శత్రువులు పెరుగుతారని అర్థమయిందన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసే రాజకీయాలు జరుగుతాయని, జాగ్రతగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదని హామీలు నిలబెట్టుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. -
కోల్కతా బీజేపీ కార్యాలయంపై దాడి
కోల్కతా : మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రమైంది. బీజేపీ, తృణమూల్ నేతలు పరస్పర ఆరోపణలతో తలపడుతుంటే సోమవారం కోల్కతాలో బీజేపీ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. పాలక తృణమూల్ కార్యకర్తలే తమ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం తమపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కోల్కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడులను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ ఢిల్లీలో దీక్షకు దిగడంతో పరిస్ధితి వేడెక్కింది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. సీబీఐ వివాదం నేపథ్యంలో విపక్షాలు మమతా బెనర్జీకి బాసటగా నిలవగా అవినీతిని ప్రతిపక్షాలు సమర్ధిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు అవినీతి ఆరోపణలున్న వారిని విచారించడం నేరమా అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. -
బెంగాల్ వర్సెస్ కేంద్రం : ఈసీని కలిసిన బీజేపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : కోల్కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడుల నేపథ్యంలో కేంద్రం, మమతా బెనర్జీల మధ్య వివాదం తీవ్రరూపుదాల్చింది. బెంగాల్లో శాంతి భద్రతల పరిస్ధితి గాడి తప్పుతోందని బీజేపీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు బెంగాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. ఈసీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, అహ్లూవాలియా పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ బెంగాల్ ఇన్ఛార్జ్ కైలాష్ విజయవర్గీయ తదితరులున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతల ర్యాలీలను మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులను తొలగించాలని తాము ఈసీని కోరామని భేటీ అనంతరం కేంద్ర మంత్రి నక్వీ తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు కేంద్ర బలగాలను నియోగించాలని కోరామన్నారు. పశ్చిమ బెంగాల్లో నెలకొన్న దారుణ పరిస్థితులను ఈసీకి వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ, అకారణంగా నిర్భందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతల ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
రిజర్వేషన్లపై కుట్ర: కృష్ణయ్య
హైదరాబాద్: రిజర్వేషన్ మూలసూత్రాలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సేన తెలంగాణ ఆధ్వర్యం లో మోదీ సర్కార్ అక్రమ రిజర్వేషన్ల కల్పనపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సామాజిక వెనుకబాటు, అంటరానితనం తదిత ర అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి కానీ, పేదరికం ఆధారంగా కాదని చెప్పారు. అగ్రకులాల్లో పేదలుంటే వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి తప్ప రిజర్వేషన్లు కల్పించడమేంటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల వారి కి రిజర్వేషన్ కల్పించారని బీసీ సంఘర్షణ సమి తి అధ్యక్షుడు వీజీఆర్ నారగోని ఎద్దేవా చేశారు. అణగారిన వర్గాలను తొక్కిపెట్టేందుకే రిజర్వేషన్ కల్పించారన్నారు. బహుజన సేన తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కదిరే కృష్ణ అధ్యక్షతన నిర్వ హించిన ఈ సభలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, సమాజ్వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి, టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సొగరా బేగం తదితరులు పాల్గొన్నార -
మత వ్యతిరేక సందేశం.. బీజేపీ నేత అరెస్ట్
తిరువొత్తియూరు: ఓ మతానికి సంబంధించి వ్యతిరేకంగా అభిప్రాయాలను ఫేస్బుక్లో వెల్లడించిన బీజేపీ ప్రముఖుని పోలీసులు చెన్నై ఎయిర్పోర్టులో శనివారం అరెస్టు చేశారు. చెన్నై నంగనల్లూరుకు చెందిన కల్యాణరామన్ బీజేపీ ప్రముఖుడు. ఈయన కాక్కచై సిద్ధర్ కళ్యాణ రామన్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఇందులో ఓ మతానికి వ్యతి రేకంగా సందేశాలు ఇచ్చినట్లు పలువురు కల్యాణరామన్పై చెన్నై పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఆయనపై చెన్నై సెంట్రల్ క్రైం పోలీసులు 153ఎ, 295, 505 విభాగంలో కేసు నమోదు చేశారు. శనివారం అహ్మదాబాద్ నుంచి విమానంలో చెన్నైకి వచ్చిన కల్యాణరామన్ను ఎయిర్పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లి అతని వద్ద విచారణ చేస్తున్నారు. -
మధ్యతరగతి ఆశలు ఛిద్రం
దుర్గాపూర్/ఠాకూర్నగర్: రాబోయే లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తల హత్యాకాండకు పాల్పడుతున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల ఆశల్ని చిదిమేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో సీఎం మమతా బెనర్జీకి గుబులు మొదలైందని అన్నారు. ఆమె పాదాల కింద నేల క్రమంగా కదిలిపోతోందని చురకలంటించారు. దుర్గాపూర్, ఠాకూర్పూర్లలో శనివారం జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో మమతా ప్రభుత్వంపై మోదీ నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ అంటే తృణమూల్ తోలాబ్జి టాక్స్(ట్రిపుల్ టీ)గా నిలిచి పోయిందని ఎద్దేవా చేశారు. బెంగాలీలో తోలాబ్జి అంటే వ్యవస్థీకృత బలవంతపు వసూళ్లు అని అర్థం. ఇతర దేశాల్లో మతపర వేధింపులు ఎదుర్కొని మన దేశంలో శరణు కోరేవారికి న్యాయం, గౌరవం కల్పించాలంటే పౌరసత్వ బిల్లుకు చట్టరూపం తేవాల్సిందేనని పునరుద్ఘాటించారు. కమ్యూనిస్టుల బాటలోనే మమత.. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు మమత గతంలో పాలించిన కమ్యూనిస్టుల బాటలోనే నడుస్తున్నారని దుర్గాపూర్లో జరిగిన ర్యాలీలో మోదీ విమర్శించారు. బెంగాల్లో రూ.90 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, వాటిని అమలుచేయాలనే ఆసక్తి తృణమూల్ సర్కార్కు కొరవడిందని, వారు ఆ పనుల్లో వాటా కోరుకుంటున్నారన్నారు. బెంగాల్కు వలసొచ్చిన మతువా అనే ఎస్సీ వర్గం ఠాకూర్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ..పౌరసత్వ బిల్లుకు చట్టరూపం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. తూర్పు పాకిస్తాన్కు చెందిన మతువాలు 1950లలో బెంగాల్కు వలసొచ్చారు. సుమారు 30 లక్షల జనాభా ఉండే ఈ వర్గం కనీసం ఐదు లోక్సభ స్థానాల్లో ప్రభావం చూపగలదు. అయితే, వారిలో ఇంకా చాలా మందికి భారత పౌరసత్వం దక్కలేదు. ఈ నేపథ్యంలో మతువాలను బీజేపీకి ఓటుబ్యాంకుగా మలిచేలా మోదీ పౌరసత్వ బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. ఠాకూర్నగర్ సభకు ప్రజలు పెద్దసంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగినంత పనైంది. ఈ ఘటనలో పలువురు మహిళలు, పిల్లలు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మద్దతుదారులు బారికేడ్లు బద్దలుకొట్టి మరింత లోనికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో కొంత గందరగోళం నెలకొంది. ఉన్న చోటే ఉండాలని, ముందుకు రావొద్దని మోదీ వారించినా కొందరు కార్యకర్తలు కుర్చీలు విసిరేస్తూ నానా హైరానా సృష్టించారు. బెంగాల్లో బల ప్రదర్శన! పోటాపోటీ ర్యాలీలకు తృణమూల్, బీజేపీ రెడీ మమతా బెనర్జీ గత నెలలో బీజేపీయేతర పార్టీలతో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా రాష్ట్ర వ్యాప్తంగా మోదీ, అమిత్షాలతో బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు తమ అగ్ర నాయకులతో ర్యాలీలు నిర్వహించాలని కమలనాథులు ప్రణాళికలు రచించారు. అయితే ఈ ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి తృణమూల్ తన వంతు ప్రయత్నాల్ని చేస్తోంది. ఒకవైపు మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను కూడగడుతున్న మమతా బెనర్జీ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. బీజేపీ ప్రతిపాదించిన ర్యాలీలు, సభలకు అనుమతులను నిరాకరిస్తున్నారు. బీజేపీ సభలకు తృణమూల్ అడ్డుపుల్లలు.. విపక్షాల మహాగట్బంధన్ ర్యాలీకి ఏమాత్రం తీసిపోకుండా బెంగాల్ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని 32 లోక్సభ నియోజకవర్గాల్లో 300 ర్యాలీలు చేపట్టాలని ప్రణాళికలు వేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి హేమాహేమీలు ఈ ర్యాలీల్లో పాల్గొంటారు. జనవరి 23న జర్గ్రామ్, సురి ర్యాలీల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనాల్సి ఉండగా, ఆమె హెలికాప్టర్ ప్రభుత్వ హెలిప్యాడ్లో దిగేందుకు అనుమతించడంలో జాప్యం జరిగింది. దీంతో స్మతి పర్యటన రద్దయింది. ఈస్ట్ మిడ్నపూర్లోని కాంతి దగ్గర బీజేపీ మద్దతుదారుడి పొలంలో అమిత్షా ర్యాలీకి ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం పక్కనున్న భూస్వాములతో ర్యాలీకి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయించింది. ‘బెంగాల్ నుంచి తృణమూల్ను తరిమికొట్టడానికి అనుక్షణం పోరాడతా. నా హెలికాప్టర్ దిగేందుకు ప్రభుత్వం అనుమతించకపోతే హెలికాప్టర్ నుంచే ప్రసంగిస్తా. మా రథయాత్రను అడ్డుకుంటే కాలినడకనే ఊరేగుతాం’అని అమిత్ అన్నారు. -
అసెంబ్లీ సాక్షిగా సహనం కోల్పోయిన చంద్రబాబు
-
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
పార్లమెంటులో కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ (54) మోదీ ప్రభుత్వం అమలు పరిచిన ఆర్థిక సంస్కరణలన్నింటికీ సూత్రధారి. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అనారోగ్య కారణంగా తాత్కాలిక ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన గోయల్ ఆ హోదాలోనే ‘మధ్యంతర’బడ్జెట్ ప్రవేశపెట్టారు. చార్టెర్డ్ అకౌంటెంట్గా, న్యాయ విద్యార్థిగా అత్యున్నత ప్రతిభా పాటవాలు చూపిన గోయల్ 2014 ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రచారం ద్వారా ఎన్డీఏ విజయానికి దారులు వేశారు. విపత్కర సమయాల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు పని చేస్తూ ‘పని రాక్షసుడి’గా పేరుపడ్డారు. రైల్వే మంత్రిగా బులెట్ రైళ్లు, స్పీడ్ రైళ్లతో భారతీయ రైల్వేను పరుగులు పెట్టిస్తున్నారు. రైల్వేల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన నిరంతర విద్యుత్, స్వచ్ఛ ఇంధనం, ఉదయ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన వంటి పథకాల రూపకర్త గోయలే. దేశంలోని 5,97,464 గ్రామాలను పూర్తిగా విద్యుదీకరించినందుకుగాను గోయల్కు రెండు రోజుల క్రితమే పెన్సిల్వేనియా వర్సిటీ కర్నాట్ బహుమతిని ప్రదానం చేసింది. అంచెలంచెలుగా.. స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో చేరిన గోయల్ తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుని అనతికాలంలోనే కేబినెట్ స్థాయికి ఎదిగారు. బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రిగా బొగ్గు గనుల వేలాన్ని పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించారు. ఉజ్వల పథకం కింద దేశంలో ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని పెంచి కరెంటు ఖర్చు తగ్గించారు. త్వరగా, వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న గోయల్కు జ్ఞాపకశక్తి అపారం. సీఏలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించారు. న్యాయవిద్యలో ముంబై యూనివర్సిటీలోనే సెకండ్ ర్యాంకు సంపాదించారు. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డైరెక్టర్ల బోర్డుల్లో పని చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో చేరే నాటికి గోయల్ బీజేపీ కోశాధికారిగా ఉన్నారు. ఆయన తర్వాత పార్టీ మరెవరినీ కోశాధికారిగా నియమించకపోవడం గమనార్హం. కార్పొరేట్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న పీయూష్ గోయల్ తన 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టారు. గోయల్ తండ్రి వేద్ ప్రకాశ్ గోయల్ బీజేపీ జాతీయ కోశాధికారిగా, కేంద్రంలో మంత్రిగా పని చేశారు. తల్లి చంద్రకాంత గోయల్ మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. నాలుగు నెలలకు రూ.34.17 లక్షల కోట్లు న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2019–20)లో మొదటి నాలుగు నెలల కాలానికి గాను (ఏప్రిల్ నుంచి జూలై వరకు) రూ.34.17 లక్షల కోట్ల వ్యయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ద్వారా పార్లమెంట్ అనుమతి కోరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల వ్యయాలు రూ.97.43 లక్షల కోట్లుగా మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అంచనాలను పేర్కొన్నారు. మొదటి నాలుగు నెలల కాలానికి అయ్యే వ్యయాలకు గాను పార్లమెంటు ఆమోదం కోరారు. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్–మే నెలల్లో పూర్తవుతాయి. తదుపరి ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను వచ్చే జూలైలో కొత్త ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించనుంది. -
రాజకీయ స్వార్థం కోసం బాబు మిత్రదోహం చేశారు
-
ఏపీలో 24/7 కరెంటు మిగులు ఉంది
-
‘రాజీనామా స్పీకర్కు పంపలేదు.. సీఎంకే పంపాను’
సాక్షి, అమరావతి : నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన దీక్ష కూడా చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్కు పంపలేదని స్పష్టం చేశారు. ‘రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వచ్చాను. నా దీక్ష నియోకవర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది’ అని చెప్పుకొచ్చారు. -
టీటీడీలో జరుగుతున్న అవినీతిపై గవర్నర్ను కలిసిన బీజేపీ నేతలు
-
అమిత్ షా ర్యాలీపై ఆగని రగడ
మాల్ధా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీపై నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. మాల్దా ఎయిర్పోర్ట్ హెలిప్యాడ్లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ తృణమూల్ సర్కార్పై విరుచుకుపడింది. షా విమానం ల్యాండయ్యేందుకు ఇక్కడి గోల్డెన్ పార్క్ హోటల్తో పాటు మాల్ధా జిల్లాలో బీఎస్ఎఫ్ ఉపయోగించే హెలిప్యాడ్లో అనుమతించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. హెలిప్యాడ్ సమస్య పరిష్కారం కావడంతో అధికారులు సైతం ఊపిరిపీల్చుకుంటే తాజాగా ర్యాలీ నేపథ్యంలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం కొత్త తలనొప్పిగా మారింది. తమ పార్టీ చీఫ్ రాకను పురస్కరించుకుని తాము ఏర్పాటు చేసిన కటౌట్లు, హోర్డింగ్లు, పోస్టర్లను పలు చోట్ల తృణమూల్ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారని బీజేపీ బెంగాల్ రాష్ట్ర శాఖ చీఫ్ దిలీప్ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీకి హాజరయ్యేందుకు వాహనాల్లో వస్తున్న పార్టీ కార్యకర్తలను తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేస్తున్నారని అన్నారు. తృణమూల్ ఆగడాలను ప్రతిఘటిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీకి హాజరవుతున్నారని ఘోష్ చెప్పారు. -
‘టీటీడీ అక్రమాలపై విచారణ జరిపించాలి’
సాక్షి, హైదరాబాద్ : పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర - తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీటీడీలో అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. వీటి వెనక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు. గత నెల టీటీడీలో టికెట్ల కుంభకోణం వెలుగు చూసినప్పటికి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ను ఆదేశించాల్సిందిగా గవర్నర్ను కోరామని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఈవోకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాల వల్ల భక్తులకు తిరుమల దేవస్థానం పట్ల నమ్మకం సన్నగిల్లుతుందనిదత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై తాను చర్యలు తీసుకున్నట్లు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెలుగు చూసిన టికెట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
నడిరోడ్డుపై మహిళల సిగపట్లు
భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య సోమవారం తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహికి దిగడం కెమెరాకు చిక్కింది. బీజేపీ మహిళా కార్యకర్త, మహిళా పోలీసు పరస్పరం తోసుకోవడం, ముష్టిఘాతాలతో విరుచుకుపడటం వీడియోలో రికార్డైంది. 2011-12 పిప్లీ గ్యాంగ్రేప్, హత్య కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పూరి జిల్లా పిప్లీ ప్రాంతంలో 2011, నవంబర్ 28న పంతొమ్మిదేళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, జూన్ 21న బాధితురాలు చనిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ ప్రధాన్తో పాటు అతడి తమ్ముడు సుశాంత్లను గతేడాది డిసెంబర్లో మొదటి అదనపు సెషన్స్ కోర్టు విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడం వల్లే నిందితులు బయటపడ్డారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్ మహారథి తన పదవికి 2012లో రాజీనామా చేశారు. మళ్లీ 2014లో ఆయన మంత్రి పదవిని దక్కించుకున్నారు. #WATCH: Scuffle breaks out between the police and BJP Women Wing workers in Bhubaneswar during a protest over Pipili gang rape-and-murder case. #Odisha pic.twitter.com/1uDq3PfhWH — ANI (@ANI) January 21, 2019 -
‘అధికార బలంతో అమిత్ షాను అడ్డుకుంటున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా అడుగుపెట్టకుండా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అధికార బలంతో అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మాల్ధా ఎయిర్పోర్ట్లో అమిత్ షా విమానం ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ వాడకానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అదే హెలిప్యాడ్లో కొద్ది రోజుల కిందట మమతా హెలికాఫ్టర్ ల్యాండ్ అయిందని, అక్కడికి మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారని ఆ ప్రదేశం శుభ్రంగా, సురక్షితంగా ఉండటం తాను చూశాననన్నారు. అక్కడ హెలికాఫ్టర్లు బాగానే ల్యాండవుతాయని చెప్పుకొచ్చారు. భద్రతా కారణాలు సాకు చూపి అక్రమ పద్ధతుల్లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించారని ఆయన ఆరోపించారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే అమిత్ షా విమానం దిగేందుకు మాల్దా ఎయిర్పోర్ట్ వర్గాలు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు మమతా సర్కార్పై భగ్గుమంటున్నారు. -
కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేంద్రంపై నిందలు మోపడం మాను కోవాలని హితవు పలికారు. శాసనసభలో సీఎం కేసీఆర్ తన మాటలతో శాసనసభను, ప్రజలను తప్పు దారి పట్టించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఖర్చుపెట్టలేని దీన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అందరి ఆరోగ్యం కోసం కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని తీసుకువస్తే రాష్ట్రం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం వల్లే భువనగిరిలో ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) ఏర్పాటయిందన్నారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కేంద్రంపై నిందలు మోపడం మానుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు, సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అనతికాలంలోనే ఇచ్చిన విష యం సీఎం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, సీఎంలకు అపాయింట్మెంట్లు ఇస్తుంటే...రాష్ట్ర సీఎం మంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు, ఇతర పార్టీ నాయకులకు ఎన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చారో చెప్పాలన్నారు. గత ఐదు సంవత్సరాల్లో మోడీ ఎన్ని నిధులు ఇచ్చారో చర్చకు రావాలని సవాల్ చేశారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు దాదాపు 16 వేల కోట్లు ఇస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష 15 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన చందంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వ్యవహారం ఉందని పేర్కొన్నారు. -
‘తెలంగాణ రాష్ట్రంలో తెలుగే మాట్లాడతా’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తాను తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు బాగా నేర్చుకోవాలని టీఆర్ఎస్ ఎమెల్యేలు ఆయనకు సూచించారు. గవర్నర్ ప్రసంగం బాగుందని, కొన్ని అంశాల్లో తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. సభలో గవర్నర్ ప్రసంగంలోని అంశాల గురించి మాట్లాడాలేకానీ కొందరు ఎమ్మెల్యేలు రాజకీయాల గురించి మాట్లాడారన్నారు. ఏ పార్టీ సీఎం ఉంటే ఆయన కాళ్లు పట్టుకునే ప్రజాప్రతినిధులు కొందరు ఉంటారని, చంద్రబాబు మొదలుకొని వైఎస్, కిరణ్కుమార్రెడ్డి, ఇప్పుడు కూడా అలా కాళ్లు పట్టుకొని తిరుగుతున్న నేతలు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, సీఎంలు జాగ్రత్తగా ఉండాలని, వాళ్లు కాళ్లు పట్టుకోవడమే కాకుండా కాళ్లు పట్టి గుంజే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. కేసీఆర్ కిట్ పథకం బాగుందని, అందులో రాష్ట్ర వాటా ఎంత? కేంద్ర వాటా ఎంత? అనే వివరాలు ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం కూలిపోయే పరిస్థితి నెలకొందని, హెరిటేజ్ అధికారులతో మాట్లాడి త్వరలో కొత్త భవనం కట్టించాలన్నారు. కంటివెలుగులో ఎంతమందికి ఆపరేషన్లు అవసరం అనేది చెప్పలేదని, అనేక మంది అద్దాల కోసం తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీలు, కేజీ టూ పీజీ, ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆసరా పెన్షన్లు కొంతమందికి రావడం లేదని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్లో పెళ్లయిన తరువాత ఒకటి రెండేళ్లకు చెక్లు వస్తున్నాయన్నారు. డ్రగ్స్ కేసులో ఎంతమంది సెలబ్రిటీలపై కేసులు పెట్టారు? ఎంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధూల్పేట్ వాసులకు పునరావాసం విషయంలో పక్కా చర్యలు లేకుండాపోయాయన్నారు. సీఎం కూడా వస్తానని రాలేదని, ఆ కుటుంబాలకు పిల్లల ఫీజుల చెల్లించే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. -
మాయావతి హిజ్రా కన్నా అధ్వానం
చందౌలి(యూపీ): బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ తెలిపారు. సోమవారం నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. 1995లో లక్నోలోని ఓ గెస్ట్హౌస్లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. -
మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి
-
వాకింగ్కు వెళ్లిన బీజేపీ నేత హత్య..!!
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్లోని బర్వానీ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత మనోజ్ థాకరే మృతి చెందారు. ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన మనోజ్ గ్రామంలోని రాధా స్వామి భవన్ సమీపంలో విగతజీవిగా కనిపించినట్టు బర్వానీ ఏఎస్పీ చెప్పారు. మృత దేహానికి కొద్ది దూరంలో రక్తపు మరకలతో కూడిన ఒక రాడ్ను కనుగొన్నట్టు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. మనోజ్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని వర్ల పోలీస్స్టేషన్ ఇన్స్చార్జి దినేష్ కుశ్వాహ అనుమానం వ్యక్తం చేశారు. కాగా, రాజకీయ నేతల వరుస హత్యలు మధ్యప్రదేశ్లో కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం మంద్సౌర్ మన్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ బంధ్వార్ను దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ప్రహ్లాద్ హత్య కేసుతో సంబంధాలున్నాయని రాజస్థాన్లోని ప్రతాపఘర్లో మనీస్ బైరాగి అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. -
రాహుల్పై బీజేపీ ఎంపీ ప్రశంసలు
డెహ్రాడూన్ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై బీజేపీ మహిళా ఎంపీ సరోజ్ పాండే ప్రశంసలు కురిపించారు. రాహుల్లో ఇటీవల కొంత పరిణితి కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.చత్తీస్గఢ్కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అయిన పాండే గతంలో రాహుల్కు మందబుద్ధి ఉందని పేర్కొనడం గమనార్హం. రాహుల్ ఇటీవలి రాజకీయ ఎత్తుగడలను ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు . కాగా గతంలో వ్యాపం స్కాంను రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ భుజాలకెత్తుకుందని, ఇది సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో విపక్షాలు రాఫేల్ స్కాంను తెరపైకి తెచ్చాయని సరోజ్ పాండే ఆరోపించారు. ఇక కోల్కతాలో విపక్షాల ఐక్యతా ర్యాలీపై ఆమె విమర్శలు గుప్పించారు. తన సొంత రాష్ట్రం బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని మమతా బెనర్జీ విపక్షాల ర్యాలీకి నేతృత్వం వహించడం విస్మయం కలిగిస్తోందన్నారు. బెంగాల్లో విపక్షాలను అణిచివేస్తున్న మమతా సమక్షంలో విపక్షాలన్నీ మోదీపై పోరాడతామని ప్రకటించడం అవివేకమని ఎద్దేవా చేశారు. బీజేపీ సత్తా ఏపాటిదో ఈ నేతలను చూస్తే అర్ధమవుతుందన్నారు. -
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : స్వైన్ఫ్లూతో బాధపడుతూ ఎయిమ్స్లో చికిత్స పొందిన బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా అమిత్ షా తన నివాసానికి చేరుకున్నారని బీజేపీ నేత అనిల్ బలూనీ వెల్లడించారు. స్వైన్ఫ్లూ సోకిన అమిత్ షాకు ఎయిమ్స్ డైరెర్టర్ డాక్టర్ రణ్దీప్ గులెరియా పర్యవేక్షణలో చికిత్స అందించారు. కాగా తాను స్వైన్ఫ్లూతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని, భగవంతుడి దయ, మీ అందరి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటానని అమిత్ షా ట్వీట్ చేశారు. -
‘ఆ ఎమ్మెల్యేకి మతిభ్రమించింది’
లక్నో : బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్కు మతిభ్రమించిందని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. మాయావతి నపుసంకురాలి కంటే హీనమని యూపీలోని మొఘల్సరాయ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధనా సింగ్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. లక్నో గెస్ట్ హౌస్లో మాయావతి సహా బీఎస్పీ కార్యకర్తలపై గతంలో ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని పరోక్షంగా ప్రస్తావించిన సాధనా సింగ్ ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీల కలయికను తప్పుపడుతూ మాయావతిపై ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారని మిశ్రా వ్యాఖ్యానించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో బీజేపీ నేతలు మానసిక స్థైర్యం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై బీజేపీ నేత సాధనా సింగ్ వాడిన భాషే బీజేపీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. -
మమతకు శత్రుఘ్నసిన్హా ఝలక్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి బీజేపీ అసంతృప్త నాయకుడు శత్రుఘ్నసిన్హా ఝలక్ ఇచ్చారు. ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన అంగీకరించలేదు. మమత ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో కలిసి కోల్కతాలో విపక్ష ర్యాలీకి ఆయన హాజరయ్యారు. (మమతా బెనర్జీ మెగా ర్యాలీ) ‘వాస్తవంగా చెప్పాల్సివస్తే మమతా బెనర్జీ జాతీయ నాయకురాలు. రాజకీయాల్లో తానేంటో నిరూపించుకున్నారు. అయితే ఆమె ఇచ్చిన వాగ్దానాలకు, అమలు చేయడానికి మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఇచ్చిన మాటపై నిలబడగలగాలి. తర్వాతి ప్రధానమంత్రి ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది నా పని కాద’ని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. సొంత పార్టీపై తరచుగా విమర్శలు చేస్తున్న సిన్హా.. తాను బీజేపీ ఎంపీగా ఇక్కడకు రాలేదని చెప్పారు. యశ్వంత్ సిన్హా నాయకత్వంలో ఏర్పాటైన రాష్ట్ర మంచ్ తరపున ర్యాలీకి హాజరైనట్టు వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం వివాదంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. -
అమిత్ షా ర్యాలీకి ఆటంకం
కోల్కతా : బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదివారం నిర్వహించే ర్యాలీకి హాజరయ్యేందుకు మాల్ధా ఎయిర్పోర్ట్లోని హెలిప్యాడ్ను వాడుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విమానాశ్రయంలో హెలిప్యాడ్ ఉపయోగంలో లేదని, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులతో తాత్కాలిక హెలిప్యాడ్ను ఉపయోగించడం సాధ్యం కాదని మాల్ధా జిల్లా యంత్రాగం స్పష్టం చేసింది. హెలిప్యాడ్ వాడుకొనేందుకు అనుమతి నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పార్టీ స్ధానిక విభాగానికి మాల్ధా అదనపు జిల్లా మేజిస్ర్టేట్ శుక్రవారం తెలియచేశారు. కాగా అమిత్ షా పర్యటన కోసం హెలిప్యాడ్కు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బీజేపీ రాష్ట్ర శాఖ మండిపడింది. బీజేపీ నేతలు రాష్ట్రంలో ర్యాలీలు చేపట్టకుండా నిరోధించేందుకు తృణమూల్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించింది. కాగా రథయాత్రల స్ధానంలో బెంగాల్ అంతటా ర్యాలీలు నిర్వహించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిన క్రమంలో బీజేపీ మాల్ధాలో ర్యాలీకి సన్నాహాలు చేసుకుంది. అమిత్ షా విమానం దిగేందుకు వీలుగా మరో ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. -
‘అమిత్ షాకు అందుకే స్వైన్ఫ్లూ సోకింది’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వైన్ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచినందుకే అమిత్ షాకు స్వైన్ఫ్లూ సోకిందని వ్యాఖ్యానించారు. సంకీర్ణ సర్కార్ను కూలదోసే చర్యలు విరమించకపోతే ఆయనకు జ్వరంలో పాటు డయేరియా ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసిన బీజేపీ నేతలు వారిని ముంబై తరలించారని, వారికి బీజుఏపీ, ఆరెస్సెస్ కార్యకర్తలను కాపలగా ఉంచారని హరిప్రసాద్ ఆరోపించారు. జేడీయూ-కాంగ్రెస్ సర్కార్ను కూలదోయాలని ప్రయత్నించడంతోనే అమిత్ షాకు ఈ వ్యాధి సోకిందని ధ్వజమెత్తారు. మరోవైపు స్వైన్ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా కోలుకున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఆయనను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి చేస్తారని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ చెప్పారు. -
‘దృశ్యం’తరహాలో యువతిని చంపి, కుక్కను పాతిపెట్టి..
ఇండోర్ : దృశ్యం సినిమా తరహాలో ఓ కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేసిన తండ్రీ కొడుకులు.. పోలీసుల కళ్లుకప్పి రెండేళ్లపాటు నిజాన్ని దాచగలిగారు. చివరకు పోలీసుల విచారణలో నిజం బయటపడి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇండోర్ కు చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీశ్ కరోటియా (65) అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మహిళా కార్యకర్త ట్వింకిల్ దాగ్రే (22) ల మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధం కరోటియా ముగ్గురు కుమారులు అజయ్(38), విజయ్(36), వినయ్(31)లకు తెలిసింది. దీంతో తండ్రితో గొడవకు దిగారు. ట్వింకిల్ తో గడిపితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కుమారుల ఒత్తిడితో ట్వింకిల్ ను హతమార్చేందుకు జగదీశ్ ప్లాన్ చేశారు. ఆపై 'దృశ్యం' సినిమా చూసిన వీరంతా, అలాగే ప్లాన్ చేశారు. తమ సన్నిహితుడు నిలేశ్(28)తో కలిసి ట్వింకిల్ ను హత్య చేశారు. హత్య అనంతరం ఆమెను తమ కారులో తీసుకెళ్లి కాల్చేశారు. ఈ హత్యపై కచ్చితంగా పోలీసులు తమనే అనుమానిస్తారని ఊహించిన నిందితులు.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఓ చోట చనిపోయిన కుక్క మృత దేహాన్ని పాతిపెట్టారు. కొంతకాలం తరువాత ఎవరినో హత్య చేసి, పూడ్చి పెట్టారన్న పుకారును లేవనెత్తారు. అప్పటికే ట్వింకిల్ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో రాగా, పూడ్చి పెట్టిన ప్రాంతంలో కుక్క కళేబరం మాత్రమే వారికి కనిపించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. పోలీసులకు జగదీశ్ తో ట్వింకిల్ కు ఉన్న వివాహేతర బంధం గురించి తెలిసి ఆ దిశగా విచారించగా, అసలైన నిందితులని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశామని, మరిన్ని వివరాల కోసం వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
హామీల అమలులో బీజేపీ విఫలం: నారాయణ
సాక్షి,హైదరాబాద్: బీజేపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు వివిధ అంశాలపై ఆత్మావలోకనం చేసుకోవడంలో ఆపార్టీ విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ప్రతీ కుటుంబానికి వారి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న హామీ ఏమైందని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నిం చారు. జీఎస్టీపై వ్యతిరేకత ఇటీవలి ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కన్పించడంతో బీజేపీకి జ్ఞానోదయమైందన్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం గోబెల్స్ గనుక వినుంటే ఆత్మహత్య చేసుకునేవాడని ఎద్దేవా చేశారు. రఫేల్ ఒప్పందంలో మోదీనే ఓ దళారిలా వ్యవహరించినప్పుడు ఇక మధ్యవర్తులతో ఎందుకని విమర్శించారు. శబరిమలలో మహిళలకు సమానహక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకించి బీజేపీ మహిళా వ్యతిరేకి అన్న ముద్ర వేసుకుందన్నారు. పౌరసత్వం గుర్తింపు అంశంలో ప్రభుత్వమే మత విభజనకు పూనుకుందన్నారు. న్యాయవ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే లోక్సభ ఎన్నికలకు ముందే అయోధ్యలో రామాలయం కట్టి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ప్రకటించడం న్యాయవ్యవస్థను బ్లాక్మెయి ల్ చేయడమే అవుతుందని నారాయణ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఈ నెలలోనే బాబ్రీమసీదు అంశం విచారణకు రానున్న నేపథ్యంలో ఈ విధంగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. -
బీజేపీ పంచాయతీ పోరు నామమాత్రమే!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీపై బీజేపీ నాయకులు, శ్రేణుల్లో కొంత నిరాసక్తత నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడం వల్ల కలిగిన నైరాశ్యం ఇంకా కార్యకర్తలను వీడలేదు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపుతున్న పరిస్థితుల్లేవు. జిల్లాల్లో పార్టీకి పట్టున్నస్థానాలు, మండల స్థాయి ముఖ్య నాయకులు పోటీ చేస్తున్న స్థానాలపైనే రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు ఎక్కువగా దృష్టి పెడుతున్న సందర్భాలున్నాయి. శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుచుకున్న నియోజకవర్గాల్లో ఆధిపత్య రాజకీయాల కారణంగా ఆయా గ్రామాల్లో పోటీకి కిందిస్థాయి నాయకులు జంకుతున్న సందర్భాలున్నాయని బీజేపీ నాయకులే అంగీకరిస్తున్నారు. వ్యయప్రయాసలకు ఓర్చి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకున్నా, వారు పార్టీలో కొనసాగే అవకాశాలు తక్కువేనని గత అనుభవాలతో స్పష్టమైందని ఒక నాయకుడు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటే గెలవడం అది కూడా హైదరాబాద్ నగర పరిధిలోనిది కావడం, గ్రామీణ నేపథ్యమున్న నియోజకవర్గాల్లో గెలవకపోయినా గౌరవప్రదమైన సీట్లు కూడా పార్టీ అభ్యర్థులకు రాకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా లెక్కకు మించిన జిల్లాల్లోనిç పలు పంచాయతీల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ గ్రూపుల మధ్యే పోటీ తీవ్రంగా ఉండడంతో అలాంటి చోట్ల పోటీ వల్ల ఏమాత్రం ప్రయోజనంలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాల కోసం పట్టు పెరగడం, పోటీ నుంచి వైదొలగాలంటూ ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీ పక్షాన మద్దతుదారులు నిలబడే పరిస్థితులు లేవంటున్నారు. నేతల తర్జనభర్జన... పంచాయతీ ఎన్నికలు పార్టీరహితం కావడంతో రాజకీయపార్టీలకు సంబంధంలేదనే అభిప్రాయంతో ఉన్నా కిందిస్థాయిలో కార్యకర్తలను నిలుపుకునేందుకు, ప్రజల మద్దతును కూడగట్టేందుకు వచ్చిన అవకాశాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఏవిధంగా ఉపయోగించుకోవాలనే మీమాంసలో బీజేపీ ముఖ్య నాయకులున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే పంచాయతీ ఎన్నికలు రావడంతో జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో నాయకులు డబ్బు, ఇతర వనరుల వినియోగానికి వెనకాడుతున్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు ముగిశాక కొంత వ్యవధిలోనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో పోటీకి పార్టీ మద్దతుదారులు వెనకడుగు వేస్తుండగా, ఈ ఎన్నికల వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం చేకూరదనే భావనతో కొందరు రాష్ట్ర, జిల్లా నాయకులున్నారు. -
ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: అధికార పార్టీలోని నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నందునే ఆంధ్రప్రదేశ్లోకి సీబీఐని రాకుండా అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీతో పాటు బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సీబీఐని నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో తాను గుజరాత్ సీఎంగా ఉన్నానని, ఆ సమయంలో కాంగ్రెస్ అధికారాన్ని దుర్వినియోగపరిచి తనపై సీబీఐ విచారణ చేపట్టారని మోదీ పేర్కొన్నారు. సీఎం పదవిలోఉన్న తాను ఏ తప్ప చేయనందుకే చట్టాన్ని గౌరవించి విచారణను ధ్యైరంగా ఎదుర్కొన్నట్లు ఆయన గుర్తుచేశారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ రెండోరోజు సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్పేయీ మరణాంతరం జరుపుకుంటున్న మొదటి కౌన్సిల్ సమావేశాలని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలన కారణంగా (2004-14) పదేళ్లు దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందనీ, విలువైన సమయాన్ని కాంగ్రెస్ పాలకులు వృథా చేశారని మండిపడ్డారు. ఆ పదేళ్లు దేశమంతా అవినీతి స్కాంలు, కుంభకోణాల్లో మినిగితేలిందని ఆరోపించారు. ఆగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంలో కాంగ్రెస్ నేతలు ఉన్నందునే విచారణను కప్పిపుచ్చారనీ, ప్రజల సొమ్ముకు తిన్న ఏఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టదని మోదీ హెచ్చరించారు. హిందూవుల డిమాండైన అయోధ్య రామ మందిరాన్ని కోర్టుల్లో కాంగ్రెస్కు చెందిన న్యాయవాదులు ఏవిధంగా అడ్డుకుంటున్నారో మనందరికీ తెలుసన్నారు. ఎన్నోఏళ్లు ప్రకటనలకే పరిమితమైన అగ్రవర్ణల రిజర్వేషన్లను తమ ప్రభుత్వం చేసి చూపిందని మోదీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వేలమంది కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయడానికి ఈ సమావేశం దోహదం చేస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు జాతీయ నాయకులు పాల్గొన్నారు. -
పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు బీజేపీ చీఫ్ అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు తలపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యువత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను దేశం నలుచెరుగులా తీసుకువెళ్లాలని పార్టీ యంత్రాంగానికి అమిత్ షా సూచించారు. అభివృద్ధి, సంక్షేమానికి పాలక బీజేపీ పాటుపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గతంలో బీజేపీ ఉనికి లేని రాష్ట్రాల్లోనూ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 లోక్సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న మహాకూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. గతంలో ఒకరినొకరు చూసుకునేందుకూ ఇష్టపడని పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచి పనులను సహించలేని పార్టీలు ఆయనను ఓడించేందుకే సిద్ధాంతాలు పక్కనపెట్టి ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. మోదీ ఓటమే వారి ఏకైక అజెండాగా మారిందని దుయ్యబట్టారు. -
‘ఆకలితో పిండాలను సైతం తిన్నవారున్నారు’
సాక్షి, హైదరాబాద్ : ఈబీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు కృషిచేసిన ప్రధాని నరేంద్రకి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి అభినందనలు తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో పోటీపడలేని అగ్రవర్ణ పేద కుటుంబాలు అంధకారంలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆదిలాబాద్లోని సోన్ గ్రామంలో బ్రాహ్మణులు పెట్టిన పిండాలను సైతం ఆహారంగా తిని బతికిన జీవితాలను నా స్టడీ లో చూసాను’ అని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం సమభావం, సమానత్వం మోదీ పాలనలో నిజమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. అనే నినాదం రుజువు చేసి చూపించారని కొనియాడారు. మోడీ పాలనలో ఎస్సీ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా, ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్ ఇలా.. అన్ని వర్గాల కోసం.. మోడీ పనిచేస్తున్నారని వెల్లడించారు. కులం, మతం అనే తేడా లేకుండా పేదలందరికీ న్యాయం చెయ్యాలనే డిమాండ్ మోదీ తీర్చాడని అన్నారు. -
లబ్ధి కోసమే ఓసీలకు రిజర్వేషన్లు
హైదరాబాద్: రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ బిల్లును తీసుకువచ్చిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యం లో ఓసీలకు కల్పించిన రిజర్వేషన్ బిల్లును వెం టనే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఓసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేయడం నిం డు దర్బార్లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరి గి నట్లు ఉందన్నారు. ఆనాడు కౌరవులు మహాసభలో కళ్లుమూసుకుని దీనికి మద్దతు పలికినట్లుగా ఈనాడు లోక్సభలో ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారన్నారు. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటే తప్ప బడుగులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఇలాంటి విధానాల వల్ల రిజర్వేషన్ల ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాలవారంతా ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేశ్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అన్వర్ఖాన్, టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి, సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, రవి చంద్ర, తెలంగాణ రైతాంగ సమితి నాయకుడు సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో చేరిన తృణమూల్ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ బీజేపీ శిబిరంలో జోష్ నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌమిత్ర ఖాన్ బుధవారం బీజేపీలో చేరారు. గతంలో బెంగాల్ ఎమ్మెల్యేగానూ వ్యవహరించిన ఖాన్ ప్రస్తుతం విష్ణుపూర్ నుంచీ లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఖాన్ బీజేపీలో అధికారికంగా చేరే కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బెంగాల్ బీజేపీ నేత ముకుల్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఖాన్ రాక బెంగాల్లో పార్టీ పటిష్టతకు ఉపకరిస్తుందని కమలనాధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
మాకు రక్షణ కల్పించండి: ఏపీ బీజేపీ నేతలు
సాక్షి, విజయవాడ: తమకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పోలీసు శాఖను ఆశ్రయించారు. మంగళవారం డీజీపీ కార్యాలయానికి వచ్చిన బీజేపీ నేతలు.. డీజీపీతో పాటు ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కాలంలో తమ పార్టీ నేతలపై దాడులు జరగడంతో బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మహిళపై బెదిరింపులకు పాల్పడటం దారుణమని అన్నారు. ఆయన వెంటనే బైండోవర్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. టీడీపీ రౌడీలు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
‘కోట్లాది మంది బిహారీలకు ఇది అవమానకరం’
సాక్షి, ముంబై : బిహార్ వలస కూలీల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సురేశ్ దాస్పై సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సురేశ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే బిహారీ సోదరులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సురేశ్ దాస్ మాట్లాడుతూ.. ‘ బిహార్ నుంచి ఎంతో మంది వ్యక్తులు మహారాష్ట్రకు వలస వచ్చి ఇక్కడ బతుకుతుంటారు. వారి భార్యలేమో బిహార్లో బిడ్డలకు జన్మనిస్తారు. అయితే ఇందుకు ప్రతిగా ఈ వలసవాదులు మహారాష్ట్రలో మిఠాయిలు పంచుకుంటుంటారు’ అని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని వర్గాల నుంచి ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షం, బిహార్ అధికార పార్టీ జేడీయూ(జనతాదళ్ యునైటెడ్) కూడా సురేశ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ మాట్లాడుతూ... ‘ ఆయన (సురేశ్ దాస్) వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఇది కోట్లాది మంది బిహారీలకు అవమానకరం. మా ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారు. ఆయన మెదడు సరిగ్గా పనిచేయడం లేదేమో’ అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ, దాని మిత్రపక్షం సిద్ధాంతాలకు ఇటువంటి నాయకుల నీచమైన వ్యాఖ్యలే నిదర్శనమంటూ ప్రతిపక్ష ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్)విరుచుకుపడింది. -
లంచ్ బాక్స్ తెరచి చూస్తే షాక్..!!
హర్దోయ్/ఉత్తరప్రదేశ్ : సామాజిక సమ్మేళనం పేరిట దేవాలయంలో మద్యం పంపిణీ జరిగింది. ఈ ఘటన హర్దోయ్లోని శ్రావణ దేవి ఆలయంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ‘పాసి సమ్మేళన్’ జరిగింది. మీటింగ్లో పాల్గొన్న వారికి లంచ్ బాక్సుల్లో పెట్టి మద్యం సీసాలను అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్న పిల్లలకు కూడా అవే బాక్సులు ఇచ్చారు. బాక్స్ తెరచి చూడగా అందులో ఆహారంతో పాటు మద్యం సీసా కూడా ఉండడంతో పిల్లలు షాక్ అయ్యారు. ఈ వార్త బయటకు తెలియడంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే చేశారు.. దేవాలయంలో మద్యం పంపిణీ ‘ఒక దురదృష్టకర సంఘటన’ అని హర్దోయ్ ఎంపీ అన్షుల్ వర్మ వ్యాఖ్యానించారు. విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇటీవలే సమాజ్వాది పార్టీ నుంచి బీజేపీలో చేరిన నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీపై దుష్ప్రచారంలో భాగంగానే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. మీటింగ్లో పాల్గొన్న చిన్న పిల్లలకు సైతం మద్యం బాటిళ్లు చేరడం దుశ్చర్య అని అన్నారు. ఇంత భారీ స్థాయిలో మద్యం పంపిణీ జరుగుతోంటే ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ని బీజేపీలో చేర్చుకోవడంపై పార్టీ నాయకత్వం మరోసారి ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. కాగా, కార్యక్రమానికి హాజరైన పలు గ్రామాల పెద్దలు లంచ్ బాక్స్లు తీసుకొని, ఆయా గ్రామాల్లోని తమ వర్గంవారికి తప్పక పంపిణీ చేయాలని ఎమ్మెల్యే నితిన్ చెప్పున్న వీడియో ఒకటి బయటపడింది. అయితే, నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్ని దోషిని చేయడం ద్వారా బీజేపీ ఈ వివాదం నుంచి బయటపడాలని చూస్తోందని విమర్శలు వస్తున్నాయి. నితిన్, నరేష్లు ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
ఏపీలో చంద్రబాబు రౌడీయిజాన్ని పెంచిపోషిస్తున్నారు
-
‘ఎన్నికల వేళ ఆ అంశాలను తెరపైకి తెచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ఏడాది రామ మందిర నిర్మాణం, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వంటి అంశాలు కీలకంగా ముందుకొచ్చాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ నరేంద్ర మోదీ సర్కార్పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పక్కదారిపట్టి ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోవడం, ప్రజలను వేధించడం ఆమోదయోగ్యం కాదని, దేశంలో ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో పలు విశ్వవిద్యాలయాలు వాటి స్వేచ్ఛను, స్వతంత్రతను కాపాడుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇతర సంస్థల పరిస్థితీ అలాగే ఉందని, చివరికి పాత్రికేయులు సైతం తమ స్వేచ్ఛను కోల్పోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీయేతర లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన గతంలో పిలుపుఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన క్రమంలో బీజేపీయేతర పార్టీల కూటమిలో చేరేందుకు వామపక్షాలు వెనుకాడరాదని సూచించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో 31 శాతం ఓట్లు పొందిన పార్టీ రాజకీయాల్లో పెడపోకడలను ప్రోత్సహిస్తోందని అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. -
అధికారానికి 15 స్థానాల దూరంలో బీజేపీ కూటమి!
న్యూఢిల్లీ: మరో నాలుగు నెలల్లో లోక్సభ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో తలమునకలవుతుంటే మరోవైపు ఢిల్లీ కోటలో పాగా వేసేదెవరనే అంశంపై చర్చోపచర్చలు, సర్వేలు, అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై ఇండియా టీవీ–సీఎన్ఎక్స్లు కలిసి గత నెల 15 నుంచి 25 వరకు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించాయి. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. దేశంలో మొత్తం 543 నియోజకవర్గాలుండగా, ప్రతీ నియోజకవర్గంలోనూ వంద మంది అభిప్రాయాలను తీసుకుని ఈ సర్వే చేశారు. ఉన్నపళంగా ఎన్నికలు వస్తే కేంద్రంలో ఏ కూటమికీ సాధారణ ఆధిక్యం రాదని సర్వేలో తేలింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సాధారణ ఆధిక్యం (272 సీట్లు) కన్నా 15 సీట్లు తక్కువగా వస్తాయనీ, ఇరు కూటముల్లోనూ లేని ‘ఇతర’ పార్టీల మద్దతే కేంద్రంలో సర్కారు ఏర్పాటుకు కీలకమని ఈ సర్వే చెబుతోంది. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు, నవంబర్లో కూడా ఈ సంస్థలు సర్వే నిర్వహించగా, ఎన్డీఏకు 281, యూపీఏకు 124, ఇతరులకు 138 సీట్లు వస్తాయని వెల్లడైంది. ఆ అంచనాతో పోలిస్తే తాజా సర్వేలో ఎన్డీఏ 24 సీట్లు కోల్పోగా, యూపీఏకు 22 సీట్లు ఎక్కువగా రావడం గమనార్హం. ఎన్డీయేకు 257 సీట్లు.. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే కనీసం 272 సీట్లు గెలవాలి. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 282 సీట్లు గెలిచింది. అయితే ఈసారి పరిస్థితి వేరుగా ఉండనుందనీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలన్నింటికీ కలిపి 257 సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే అంటోంది. అంటే సాధారణ ఆధిక్యానికి 15 సీట్ల దూరంలో ఎన్డీయే ఆగిపోనుంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు (ఎస్పీ, బీఎస్పీలను కలపకుండా) 146 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే పేర్కొంది. ‘ఇతరుల’ హవా.. ఇరు కూటముల్లో లేని పార్టీలు, స్వతంత్రులు కలిసి మొత్తంగా 140 సీట్లు గెలుస్తారనీ, ప్రభుత్వ ఏర్పాటుకు వీరే కీలకం కానున్నారని అంచనా వేసింది. ఈ ‘ఇతర’ పార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బిజు జనతాదళ్, వైఎస్సార్సీపీ, లెఫ్ట్ ఫ్రంట్, పీడీపీ, ఏఐయూడీఎఫ్, ఎంఐఎం, ఐఎన్ఎల్డీ, ఆప్, జేవీఎం, ఏఎంఎంకే తదితరాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోనున్నాయని సర్వే తేల్చింది. తెలంగాణలో టీఆర్ఎస్కు 16, ఏపీలో వైఎస్సా ర్సీపీకి 19 సీట్లు వస్తాయని అంచనావేసింది. పార్టీల వారీగా సీట్లు ఇవీ.. ఈ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమిలో బీజేపీకి మొత్తంగా 223 సీట్లు రానున్నాయి. మిత్రపక్షాలైన శివసేన 8 స్థానాల్లో, జేడీయూ 11, శిరోమణీ అకాళీదళ్ 5, ఎల్జేపీ 3 స్థానాలు గెలవనున్నాయి. ఎన్డీయేలో మిగిలిన పార్టీలకు తలో సీటు రావొచ్చని అంచనా వేసింది. యూపీఏ విషయానికి వస్తే కాంగ్రెస్ 85 స్థానాల్లో విజయం సాధించనుంది. 2014 ఎన్నికల కంటే ఇది రెట్టింపు. ఆ కూటమిలోని డీఎంకే 21, ఆర్జేడీ 10, ఎన్సీపీ 9, జేఎంఎ, జేడీఎస్లు చెరో 4 సీట్లు, టీడీపీ సహా కూటమిలోని మిగతా పార్టీలకు 13 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. యూపీలో బీజేపీకి 40 మాత్రమే ఢిల్లీ గద్దెకు దారిచూపే ఉత్తరప్రదేశ్ (యూపీ)లో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 71 నియోజకవర్గాల్లో గెలవగా, ఎన్డీయే భాగస్వామి అయిన అప్నాదళ్ రెండు చోట్ల గెలిచింది. మొత్తంగా 80లో 73 సీట్లు ఎన్డీయేకే వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీకి యూపీలో 40 సీట్లు మాత్రమే వస్తాయనీ, ఎస్పీకి 20, బీఎస్పీకి 15, కాంగ్రెస్కు 2 స్థానాల్లో విజయం దక్కుతుందని సర్వే అంటోంది. బిహార్లోని మొత్తం 40 సీట్లలో బీజేపీకి 13, మిత్రపక్షం జేడీయూకు 11, ఆర్జేడీకి 10, కాంగ్రెస్కు 2 సీట్లు వస్తాయంది. మహారాష్ట్రలో బీజేపీకి 22, శివసేనకు 8, కాంగ్రెస్కు 9, ఎన్సీపీకి 9 స్థానాలు దక్కుతాయనీ, ఇక దక్షిణ భారతంలో అత్యధిక ఎంపీ నియోజకవర్గాలు కలిగిన తమిళనాడులో డీఎంకేకు 21, అన్నాడీఎంకేకు 10, కాంగ్రెస్కు 3 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. -
నాతో పెట్టుకుంటే ఫినిషే... బాబు వార్నింగ్!
-
మర్యాదగా ఉండు..మహిళకు చంద్రబాబు వార్నింగ్
-
ఫినిష్ అయిపోతావ్; మహిళకు చంద్రబాబు వార్నింగ్
సాక్షి, కాకినాడ: ‘మాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగా మహిళను హెచ్చరించారు. కాకినాడలో తన కాన్వాయ్ను అడ్డుకున్న బీజేపీ నాయకులను చంద్రబాబు తీవ్రస్థాయిలో బెదిరించారు. మహిళ అని కూడా చూడకుండా బీజేపీ నాయకురాలికి పబ్లిగ్గా వార్నింగ్ ఇచ్చారు. జన్మభూమి కార్యాక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం ఇక్కడకు వచ్చిన చంద్రబాబును బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మోదీ జిందాబాద్, చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు ముఖ్యమంత్రినన్న సంగతి మరిచిపోయి బెదిరింపులకు దిగారు. ‘లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని పబ్లిక్ వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి నీకు. వెళ్లమ్మా వెళ్లు’ అంటూ బీజేపీ మహిళా నేతను హెచ్చరించారు. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలిలో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆయన గురించి తెలిసిన వారు మాత్రం చంద్రబాబు మారలేదని సరిపెట్టుకున్నారు. గతంలో ‘నాయీబ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తా’ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీఎం వ్యవహారశైలిని బీజేపీ నాయకులు తప్పుబట్టారు. మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా బెదిరించడం సరికాదన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు. -
శబరిమలపై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలను అనుమతించడం మంచి నిర్ణయమని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ సమర్ధించారు. లింగ సమానత్వం సాధించే దిశగా ఇది ముందడుగు వంటిదని అన్నారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిసంఘ్ చైర్మన్గా తాను వ్యక్తిగత హోదాలో అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. పురుషుడి పుట్టుకకు మూలమైన స్ర్తీ అపవిత్రురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. భగవంతుడు సర్వాంతర్యామి అంటే ఆలయం వెలుపలా దేవుడు ఉంటాడని, రాజ్యాంగం దృష్టిలో మహిళలు, పురుషులూ సమానమేనని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. సంప్రదాయాలు కాలానుగుణంగా మారుతాయని, గతంలో బాల్య వివాహాలు, సతీసహగమనం సైతం దేశంలో సంప్రదాయాలుగా ఉండేవని తదనంతరం మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. కాగా, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్యకు ఉదిత్ రాజ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. -
బాబు ప్రభుత్వాన్ని నిలదీయండి: ప్రధాని మోదీ
-
వేల కోట్ల అవినీతికి శ్వేతపత్రాలేవి?
విజయనగరం అర్బన్: రోజూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న వేల కోట్ల అవినీతిపై ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు ప్రశ్నించారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణానికి వచ్చిన ఆయన స్థానిక ప్రైవేటు హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోని అవినీతి పనులను ఎండగట్టారు. కేంద్రం ఇస్తున్న వేల కోట్ల నిధులను తండ్రీ కొడుకులు కలిసి దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రం ఇంతవరకు రూ.16 వేల కోట్లను రాష్ట్రానికి విడుదల చేస్తే యంత్రాలతో మట్టిని తీసి నిధులను దోచుకున్నారని విమర్శించారు. నిజంగా ఆ నిధులు సద్వినియోగం చేస్తే వర్షపు నీళ్లతో చెరువులు కళకళలాడేవని.. కరువు జాడలు కనిపించేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి ఏటా రూ.30 వేల కోట్ల వంతున నాలుగేళ్లలో రూ.120 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే మధ్యాహ్న భోజనానికి కనీసం గుడ్డు పెట్టే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, ఆ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. పాఠశాల విద్యార్ధులకు ఇచ్చే యూనిఫాం నిధుల్లోనూ రాష్ట్రస్థాయి కాంట్రాక్ట్ ద్వారా దోచుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, ఎమ్మెల్సీ మాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బవిరెడ్డి శివప్రసాద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, జిల్లా ఇన్చార్జి రామకృష్ణారెడ్డి, పూడి వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తి అచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
రాజ్యసభకు ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఉన్నదున్నట్టుగా ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెబుతోంది. అధికార బీజేపీ మాత్రం ఓటింగ్ సమయంలో రాజ్యసభలో సభ్యులందరూ అందుబాటులో ఉండాలని విప్ జారీ చేసింది. గురువారం లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మిత్రుల సంఖ్యతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ శనివారం మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇతర పక్షాలతో కలిసి తప్పకుండా బిల్లును అడ్డుకుంటుందని చెప్పారు. 2018లో దాదాపు పది పార్టీలు ఈ బిల్లును నేరుగానే వ్యతిరేకించాయని చెప్పారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి మద్దతునిచ్చిన పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిల్లుపై ప్రభుత్వం తొందరపడుతోందని, మరింత మెరుగైన అధ్యయనంకోసం బిల్లును పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్కి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ముస్లిం మహిళల సమానత్వం, గౌరవం కోసం ఉద్దేశించినదని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ముస్లిం కుటుంబాలలో ఆందోళన కలిగిస్తున్నదని ఆలిండియా ముస్లిం విమెన్ పర్సనల్ లాబోర్డు అంటోంది. బిల్లుపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించడం వల్ల సమాజంలో అలజడులు చెలరేగే అవకాశముందని విమెన్ పర్సనల్ లాబోర్డు అధ్యక్షురాలు శైస్త్రా అంబర్ చెప్పారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ చేస్తే విడాకులు ఇచ్చిన భర్తకు మూడేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. -
త్వరలోనే కూటమి సాకారం
లక్నో: సమాజ్వాదీ పార్టీ– బహుజన్ సమాజ్ పార్టీల మధ్య పొత్తుపై వస్తున్న వార్తలపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు. పొత్తుపై చర్చలు ప్రారంభమవుతాయని త్వరలోనే కూటమి ప్రజల ముందు ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ –బీఎస్పీలు కలసి పనిచేయడంతో బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈ రెండు పార్టీలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేయాలని భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి త్వరలోనే చర్చలుంటాయని అఖిలేశ్ తెలిపారు. ఈ కూటమిలో కాంగ్రెస్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అఖిలేశ్ మెచ్చుకున్నారు. అందుకే ఎన్కౌంటర్ ఎత్తుగడలు ఉత్తరప్రదేశ్లో పోలీసులు బదిలీలు తప్పించుకునేందుకే ఎన్కౌంటర్ ఎత్తుగడలను అనుసరిస్తున్నారని అఖిలేశ్ అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులు రెట్టింపయ్యారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా లేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రోత్సాహంతోనే పోలీసు ఉన్నతాధికారులు బదిలీల అంశంలో లబ్ది పొందుతున్నారన్నారు. వచ్చే ఏడాది దేశం మరో కొత్త ప్రధానిని చూస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీకాదని, ఆరెస్సెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అఖిలేశ్ విమర్శించారు. -
‘పీఎంఏవై కింద రాముడికి ఇల్లు ఇవ్వండి’
లక్నో : ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శ్రీరాముడికి ఇల్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్భర్ అయోధ్య జిల్లా మేజస్ట్రేట్కు లేఖ రాశారు. రాముడు ప్రస్తుతం టెంట్లో ఉంటున్నారని యూపీ ఎంపీ ఈ లేఖలో పేర్కొన్నారు.కాగా అయోధ్యలో రామమందిరం ఎప్పుడు నిర్మించినా అది తమ హయాంలోనే జరుగుతుందని, మరొకరితో సాధ్యం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందూ సంస్కృతే భారత సంస్కృతని అన్నారు. మరోవైపు అయోధ్యలో మందిర నిర్మాణానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. మందిర్ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాదని పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ రైతులకు తాయిలాలు
న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రైతులను మచ్చిక చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వ్యవసాయ రంగం సంక్షోభంపై ప్రతిపక్షాలతోపాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీంతోపాటు రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ బీజేపీ నేతలు, ఎంపీలు, వివిధ వర్గాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రైతులకు భారీ ఆర్థిక ప్యాకేజీపాటు పలు ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ ప్రధాని మోదీకి ఇప్పటికే వివరించింది. ఇందులో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను చూపింది. ఏడు రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు, ఒడిశాలో ఇన్పుట్ సబ్సిడీ, తెలంగాణలో రైతు బంధు పథకం సహా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వంటివి ఇందులో ఉన్నాయి. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎన్నికల లోపే ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. -
‘24 గంటల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలుస్తాం’
సాక్షి, బెంగళూరు : మరో ఇరవై నాలుగు గంటల్లో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమేశ్ కట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆధ్వర్యంలో బుధవారం జరిగే పార్టీ సమావేశానికి హాజరయ్యే ముందు ఉమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు మాతో(బీజేపీకి) టచ్లో ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం నుంచి బయటకు వస్తారు. కాబట్టి మరో ఇరవై నాలుగు గంటల్లో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. అలాగే వారం రోజుల్లోగా బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... యడ్యూరప్ప మాత్రం ప్రభుత్వ ఏర్పాటు గురించి భిన్నంగా స్పందించారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం. ఇకపై కూడా అలాగే కొనసాగుతాము’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమాస్వామి ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఆయన అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మాజీ హోం మంత్రి రామలింగా రెడ్డి వంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాజ్భవన్ ముందు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఉమేశ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ... దమ్ముంటే ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఉమేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘బుల్లెట్ రైలు తర్వాత.. ముందు వీటిని పట్టించుకోండి’
న్యూఢిల్లీ : బెల్లెట్ ట్రైన్ సంగతి వదిలేసి.. ముందు ఉన్న వాటి మీద దృష్టి పెడితే మంచిదంటూ ఎద్దేవా చేశారు బీజేపీ మహిళా నాయకురాలు లక్ష్మీ కాంత్ చావ్లా. రైల్వే పనితీరు ఎలా ఉందో వివరిస్తూ సోషల్ మీడియాఓ ఓ వీడియోను రిలీజ్ చేశారు. పంజాబ్ మాజి మంత్రి చావ్లా ఈ నెల 22న శౌర్య - యమున రైలు ఎక్కారు. అమృత్సర్ నుంచి అయోధ్య వెళ్లిన ఆ రైలు దాదాపు 10 గంటలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంది. అన్ని గంటలు రైల్లో ఉండాల్సి రావడంతో తీవ్ర అసహనానికి గురైన చావ్లా.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మొబైల్లో వీడియో తీశారు. ఈ వీడియోలో చావ్లా మాట్లాడుతూ.. ‘మేం ప్రయాణం చేసిన రైలు చాలా సార్లు నిలిచిపోయింది. గడిచిన 24 గంటల్లో మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మేం ప్రయాణించిన రైలు వేరే మార్గంలోకి వెళ్లిపోయింది. దాంతో దాదాపు 10 గంటలు ఆలస్యంగా నడిచింది. కానీ దీని గురించి ఒక్కరు కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. కనీసం ప్రయాణికులకు ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయలేదం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గంటకు 120, 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైల్ల సంగతి పక్కన పెట్టండి. ముందు ఉన్న వాటిలో సరైన సౌకర్యాలు కల్పించండి. చాలా చోట్ల వెయిటింగ్ రూమ్స్ లేవు. ఇంత దారుణమైన చలిలో జనాలు ఫుట్పాత్ మీదే నిద్ర పోతున్నారు. పియూష్ జీ, మోదీ జీ వీరి పట్ల దయ చూపండి’ అన్నారు. ఇదేకాక రైల్వే అధికారులు ఏ విధంగా లంచం డిమాండ్ చేస్తున్నారో వివరించారు. ‘శతాబ్ది, రాజధాని లాంటి రైళ్లు కేవలం సంపన్నుల కోసమే. పేద ప్రజలు, కూలీలు, సైనికులు ఉపయోగించే రైళ్ల పరిస్థితి ఏంట’ని చావ్లా ప్రశ్నించారు. అంతేకాక రైల్వే మంత్రి ఈ రైళ్లలో ప్రయాణిస్తే అప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ‘మోదీ జీ జనాలు నిరాశలో ఉన్నారు. మీరు చెప్పిన అచ్చే దిన్ ఎవరి కోసమే నాకు తెలియదు కానీ కచ్చితంగా సామాన్యుల కోసం మాత్రం కాద’ని ఆరోపించారు. రైలు ఆలస్యంపై ఫిర్యాదు చేసేందుకు తాను రైల్వే వెబ్సైట్లో ఉన్న అన్ని ప్రకటనలకు ఫోన్ చేశానని, చివరకు ఓ మంత్రికి మెయిల్ కూడా చేశానని చావ్లా తెలిపారు. అయినా ఏ ఒక్కరి నుంచీ సమాధానం రాలేదని ఆరోపించారు. -
తలాక్ చట్టం తెచ్చి తీరుతాం
గాంధీనగర్: సంప్రదాయవాదులు, ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తమ ప్రభుత్వం తెచ్చి తీరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉద్ఘాటించారు. దేశంలో గత ప్రభుత్వాలు స్త్రీల సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోలేదనీ, తమ ప్రభుత్వం వచ్చాకనే మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరిగిన బీజేపీ మహిళా విభాగం ఐదవ జాతీయ సదస్సులో మోదీ ప్రసంగించారు. ట్రిపుల్ తలాక్ను నిషేధించే బిల్లును గతంలోనే లోక్సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ మోకాలడ్డడంతో కేంద్ర బిల్లుకు పలు సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లుపై లోక్సభలో ఈ నెల 27న చర్చ జరిగే అవకాశం ఉంది. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులిచ్చే భర్తలు బెయిలు పొందే అవకాశం కూడా తాజాగా ప్రభుత్వం కల్పించింది. అలాగే స్త్రీలు హజ్ యాత్రకు వెళ్లాలంటే పురుషులు తోడు ఉండాల్సిందేనన్న నిబంధనను కూడా తమ ప్రభుత్వం తొలగించిందని మోదీ చెప్పారు. 60–70 ఏళ్లుగా గత ప్రభుత్వాల చేతుల్లో మోసపోయిన మహిళలు ఇప్పుడు బీజేపీపై నమ్మకం పెట్టుకున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల (గ్యాస్ సిలిండర్ల పంపిణీ), ‘బాలికలను రక్షించండి, చదివించండి’ తదితర పథకాలను మోదీ ప్రస్తావించారు. వైమానిక, నౌకా దళాల్లోకి కూడా తమ ప్రభుత్వం మహిళలను అనుమతించిందన్నారు. విభజన శక్తులతో జాగ్రత్త సమాజంలో విభజన శక్తులు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కులం పేరిట దోపిడీలకు దిగుతున్నాయనీ, వారితో జాగ్రత్తగా ఉండాలని మోదీ పోలీసులకు సూచించారు. గుజరాత్లోని కేవడియాలో జరిగిన డీజీపీ, ఐజీపీల వార్షిక సమావేశంలో మోదీ ప్రసంగించారు. కులం పేరిట జనాలను విడగొట్టే విభజన శక్తులను క్షేత్రస్థాయిలో ఏకాకులను చేయాలని ఆయన పోలీసులను కోరారు. దేశ సమగ్రత, ఐక్యతల కోసం పోలీసులు పనిచేయడాన్ని కొనసాగించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నందుకు పోలీసులను మోదీ ప్రశంసించారు. ప్రత్యేకించి ఈ విషయంలో జమ్మూ కశ్మీర్ పోలీసులను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారన్నారు. కింది స్థాయిలో ప్రజల కోసం కష్టించే పోలీసులకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకోవచ్చని సలహా ఇచ్చారు. పలువురు నిఘా విభాగం (ఐబీ) అధికారులకు రాష్ట్రపతి పతకాలను మోదీ బహూకరించారు. జాతీయ పోలీస్ స్మారకంతో కూడిన పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. సైబర్ సమన్వయ కేంద్రాన్ని ప్రారంభించారు. -
కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీనే..
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ధీమా వ్యక్తం చేశారు. హిందుత్వ, సోషల్ ఎజెండాతో బీజేపీ ముందుకెళ్తేనే అది సాధ్యమని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో శనివారం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ‘ఏ నేషన్ జర్నీ త్రూ టు ది నెక్ట్స్ ఎరా ఆఫ్ గవర్నెన్స్’అనే అం«శంపై సీఎన్ఎన్ ఐబీఎన్ ఎడిటర్ భూపేంద్ర చౌబేతో ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే అధిక సీట్లు వస్తాయని, వ్యతిరేక పవనాలు వీయడంలేదని, 3 రాష్ట్రాల్లో ఓటమి ఆ రాష్ట్రాలకే పరిమితమన్నారు. కేంద్రం లోని ఒక్క మంత్రిపైనా ఈ నాలుగేళ్లలో ఒక్క కేసు, చార్జీషీటు నమోదు కాలేదన్నారు. ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన జైట్లీ... దేశంలో ప్రధాని, విదేశీ వ్యవహారాల మంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి బాగా పనిచేసే వాళ్లు ఉంటే అది మంచి ప్రభుత్వం అన్నారు. మన దేశంలో ముగ్గురు బాగానే పనిచేస్తున్నా ఆర్థిక మంత్రి జైట్లీ అన్నింటా విఫలమయ్యారన్నారు. జైట్లీ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాడని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు మంచి నిర్ణయమే అయినా ఆర్థిక మంత్రిత్వశాఖ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం విడ్డూరమన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ రాజీనామా చేయాల్సింది కాదని, అతని స్థానంలో శక్తికాంత్దాస్ను నియమించడం దారుణమన్నారు. దాస్ అవినీతిపరుడని, ఆర్థిక శాఖలో పనిచేసే సమయంలో తాను చేసిన ఆరోపణలతోనే అతన్ని పదవి నుంచి తొలగించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుకు ఆ శాఖను తనకు అప్పగిస్తే స్వీకరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ« చక్కగా నడుస్తోందని, ఇటీవలి కాలంలో కొన్ని సమçస్యలు వచ్చినా అన్నీ ప్రస్తుతం సర్దుకున్నాయన్నారు. కౌలు రైతులకు మేలు జరగడం లేదు... రుణమాఫీ, రైతు పెట్టుబడి వంటి పథకాలతో అసలైన రైతులకు మేలు చేకూరడం లేదని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 47 శాతం కౌలు రైతులున్నారని, వారే వ్యవసాయం చేస్తున్నారని, వీరికి పైసా అందడం లేదన్నారు. రైతులుగా ఉన్న భూస్వాములు, నగరాల్లో నివాసముంటూ గ్రామాల్లో భూములున్న వారికే లబ్ధిచేకూరుతోందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాక్తిస్తాన్ దేశం ఏర్పాటు ఒక విఫల ప్రయోగమని, అది 4 దేశాలుగా విడిపోతేనే అక్కడి వారికి, మనకు మేలు జరుగుతుందన్నారు. ‘రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు’ రాహుల్ ఎప్పుటికీ ప్రధాని కాలేడని, ఆయన బ్రిటన్ పౌరుడని చెప్పుకున్నాడని, దాన్ని కోర్టులో కేసు వేశానని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. సోనియా, రాహుల్, వాద్రా, చిదంబరం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మహాకూటమి విఫలకూటమి అని, ప్రధాని ఎవరో చెప్పలేని స్థితిలో వారున్నారన్నారు. అయోధ్యలో ఆలయం నిర్మించాల్సిందేనన్నారు. మన దేశంలోని ముస్లింలు, క్రైస్తవుల పూర్వీకులు హిందువులేనని, దీన్ని కొందరు ఒప్పుకున్నా, ఇంకొందరు ఒప్పుకోకపోవడంతోనే సమస్యగా మారిందన్నారు. మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొనడం తప్పన్నారు. తమిళనాడులో 69 శాతం ఉన్నాయని పేర్కొంటున్నారని, అక్కడ మత ఆధారిత రిజర్వేషన్లు కావని గుర్తించుకోవాలన్నారు. -
‘21 గోవులు మరణించాయి.. అది కనిపంచడం లేదా’
లక్నో : మీకు ఇద్దరు మనుషులు చనిపోవడం మాత్రమే కనిపిస్తోంది.. కానీ అక్కడ మరో 21 ఆవులు కూడా చనిపోయాయి.. అది మీకు కనిపించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ శర్మ. కొన్ని రోజుల క్రితం బులందషహర్ ప్రాంతంలో జరిగిన మూక దాడిలో ఇద్దరూ పోలీసు అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి వెనక వేరే ఉద్దేశాలున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సంఘటనల గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్ మౌనంగా ఉన్నారు. దాంతో ఆగ్రహించిన మాజీ సివిల్ సర్వీస్ అధికారులు కొందరు ఈ విషయం గురించి పూర్తిగా విచారణ చెపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ శర్మ ‘కేవలం ఇద్దరు మనుషులు చనిపోయారని ఇంత రాద్ధంతం చేస్తున్నారు. కానీ అక్కడ 21 గోవులు కూడా చనిపోయాయి. ఆవులను చంపేవారే నిజమైన నేరస్తులు. గోమాతను చంపుతున్నారనే ఆగ్రహంతోనే ఈ మూక దాడి చర్యలు పుట్టుకొచ్చాయం’టూ సంజయ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూక దాడిలో ఇద్దరూ పోలీస్ అధికారులు మరణించినప్పటికి ఆదిత్యనాథ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ‘ఆదిత్యనాథ్కు మనుషుల ప్రాణాలకంటే గోవుల గురించి చింతే ఎక్కువైంది. గో రక్షణ పేరిట మనుషుల ప్రాణాలు తీస్తున్న చలించడం లేద’ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి మరిన్ని విమర్శలకు అవకాశం కల్పించారు. -
‘ప్రధాని రేసులో లేను’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ స్ధానంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా తాను ముందుకు రాబోనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తానున్న స్ధానం తనకు సంతృప్తికరంగా ఉందని..ఇక ప్రధాని రేసులో ఉండాల్సిన పనిలేదని పేర్కొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని మహారాష్ట్రకు చెందిన రైతు నేత, వసంత్రావు నాయక్ సేఠి స్వావలంబన్ మిషన్ చైర్మన్ కిషోర్ తివారీ ఆరెస్సెస్ చీఫ్కు లేఖ రాయడాన్ని ప్రస్తావించగా నితిన్ గడ్కరీ ఈ మేరకు స్పందించారు. తాను తొలుత గంగా నదీ ప్రక్షాళన పనులు పూర్తిచేయాలని, రహదారి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని, ఈ పనులను పూర్తిచేసేందుకు సమయం వెచ్చించాల్సి ఉందని గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రధాని అభ్యర్థిత్వంపై తనకు ఆసక్తి లేదని పేర్కొన్నారు. -
హనుమాన్ మా ముస్లిం: బీజేపీ ఎమ్మెల్సీ
లక్నో: హనుమంతుడు దళితుడంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారకమునుపే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆంజనేయుడు దళితుడు కాదు, ముస్లిం.. అంటూ బీజేపీకే చెందిన ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ముస్లిం పేర్లు రహ్మాన్, ఫర్హాన్ లాగా ఆయన పేరు కూడా హనుమాన్ అని ఉండటమే అందుకు రుజువు అని ఆయన వాదిస్తున్నారు. ‘అందరికీ ప్రీతిపాత్రుడైన దైవస్వరూపుడు హనుమంతుడు. మతం, కులం, వర్గం అనే బేధం లేకుండా ఆయన అందరి పూజలు అందుకుంటున్నారు. మా మతంలోని వారికి ఉండే పేర్లు సల్మాన్, రెహ్మాన్, రంజాన్, జిషాన్, కుర్బాన్.. మాదిరిగానే హనుమాన్ పేరు కూడా ఉంది. అందుకే, నాకు తెలిసినంతవరకూ ఆయన మహమ్మదీయుడు’ అని బుక్కల్ నవాబ్ తన వాదనను సమర్థించుకున్నారు. -
దళితుడు.. గిరిజనుడు... కాదు కాదు ముస్లిం!
లక్నో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం పొందేందుకో లేదా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకో రాజకీయ నాయకులు చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు దళితుడు అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంపై స్పందించిన ఓ జైన మతప్రబోధకుడు హనుమంతుడు జైన మతానికి చెందిన వాడని వ్యాఖ్యానించగా... ఇక ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ యాదవ్ ఓ అడుగు ముందుకు వేసి హనుమంతుడి కులాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికేట్ జారీచేయాలని వారణాసి జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తు చేశారు. మరోవైపు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ నందకుమార్.. హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడని ప్రకటించి వివాదాన్ని మరో మలుపు తిప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ హనుమంతుడి మతాన్నే మార్చివేసి మరో కొత్త వివాదానికి తెరతీశారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్...‘ హనుమంతుడు ముస్లిం అని నమ్ముతున్నా. అందుకే ముస్లింలు ఆయన పేరు మీదుగానే రెహమాన్, ఫర్మాన్, జీషన్, కుర్బాన్ వంటి పేర్లు పెట్టుకుంటారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా నోరు ఉండి ప్రశ్నించగల ‘ఓటరు దేవుళ్లే’ ఎన్నికల వాగ్దానాలు తప్పిన ప్రజాప్రతినిధులను ఏమీ చేయలేక మౌనం వహిస్తుంటే.. పాపం అందరి తప్పులను మన్నించే గుణం ఉన్న ఆ దేవుడు స్వార్థ రాజకీయాల కోసం తనకు ఎన్ని కులాలు, మతాలు అంటగడితే మాత్రం ఏం చేస్తాడులెండి! #WATCH: BJP MLC Bukkal Nawab says "Hamara man'na hai Hanuman ji Muslaman theyy, isliye Musalmanon ke andar jo naam rakha jata hai Rehman, Ramzan, Farman, Zishan, Qurban jitne bhi naam rakhe jaate hain wo karib karib unhi par rakhe jaate hain." pic.twitter.com/1CoBIl4fPv — ANI (@ANI) 20 December 2018 -
హర్యానా కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ముందంజ
చండీగఢ్ : హర్యానాలో అయిదు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. మూడు కార్పొరేషన్లలో బీజేపీ మేయర్ అభ్యర్ధులు సమీప ప్రత్యర్ధులపై భారీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా, మరో రెండు చోట్లు స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిసార్లో బీజేపీ మేయర్ అభ్యర్థి గౌతమ్ సర్ధానా ఆధిక్యంలో ఉండగా..కర్నాల్, పానిపట్, రోహ్తక్, యమునానగర్లలోనూ బీజేపీ మేయర్ అభ్యర్ధులు వరుసగా రేణు బాల, అవనీత్, మన్మోహన్, మదన్సింగ్లు విపక్ష మేయర్ అభ్యర్ధుల కంటే ముందంజలో ఉన్నారు. పలు రౌండ్ల లెక్కింపు మిగిలిఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ ఎన్నికలను పాలక బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకపోయినా కొందరు ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తోంది. విపక్ష ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమి కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచింది. -
మహిళా అధికారికి బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు
ఆగ్రా : యూపీలో పాలక బీజేపీ ఎమ్మెల్యే ఉదయభన్ చౌదరి.. కేరావలి సబ్ డివిజనల్ మేజిస్ర్టేట్ (ఎస్డీఎం) గరీమ సింగ్ను బెదిరిస్తూ వీడియోలో పట్టుబడ్డారు. రాజకీయ నేతగా తన సత్తా ఏంటో చూపిస్తానని అంటూ తాను ఎమ్మెల్యేనని తెలియదా అని ఆమెను గద్దించారు. నా అధికారం ఏంటో నీకు తెలియదని కేకలు వేస్తున్న దృశ్యం ఆ వీడియోలో రికార్డయింది. గరీమను ఆయన సర్వెంట్గా సంబోధిస్తూ దబాయించారు. నీవు ఎస్డీఎంననే దర్పం నా వద్ద ప్రదర్శించాలని అనుకుంటున్నావా అంటూ నీవు ఎస్డీఎం కాదని, ఓ నౌకరువు మాత్రమేనని అనడం వీడియోలో వినిపించింది. రైతు సమస్యల గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఎస్డీఎంను కలిశారు. ఎస్డీఎంపై ఆయన కేకలు వేస్తున్న క్రమంలో అక్కడున్నవారిలో కొందరు ఎస్డీఎం జిందాబాద్ అనడం వీడియోలో రికార్డయింది. మహిళా అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే చిందులు వేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
‘ఆయన కారణంగా చంద్రబాబు గెలిచారు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధియోధర్ విమర్శలు గుప్పించారు. 2014 లో మోదీ మానియాతోనే టీడీపీ గెలిచిందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగు చెందారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరభావం తప్పదని హెచ్చరించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఆంద్రుల ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపిస్తే.. చంద్రబాబు దానిని కాంగ్రెస్కు తాకట్టు పెట్టారు. 2014 ఎన్నికల సందర్భంగా రాహుల్ సోనియాలు ఆంద్ర ద్రోహులుగా అభివర్ణించిన బాబు ..నేడు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను మోదీపై వేస్తున్నారు. ఆంద్రుల అసలైన ద్రోహి మోదీ కాదు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తున్నాం’ అని ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6న ఏపీలో పర్యటించనున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను చూస్తుంటే చంద్రబాబుకు నిద్రపట్టడంలేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని వెల్లడించారు. దొంగల ముఠాలు.. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో దొంగల ముఠాలను ఏర్పాటు చేశారని సునీల్ ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ర్టాన్ని నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా మంచి నిటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందిచండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు దండుకోవడానికి బోగాపురం ఎయిర్పోర్టు పనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. -
‘కేసీఆర్ను ఏ పార్టీలు విశ్వసించవు’
సాక్షి, హైదరాబాద్ : ‘కేసీఆర్కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం.. టీఆర్ఎస్కు ఇదే చివరి ప్రభుత్వం’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావ్ విమర్శలు గుప్పించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యలు, నిర్వాకం చూస్తే ఆయ ఏ మాత్రం మారలేదనే విషయం అర్థమవుతోందన్నారు. తాడు, బొంగరం లేని కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏం చేయగలరని ప్రశ్నించారు. కేసీఆర్ని ఏ పార్టీలు విశ్వసించవన్నారు. మజ్లీస్ను పట్టుకుని ఊరుగేదామని కేసీఆర్ కలలు కంటున్నారని ఆరోపించారు. మజ్లీస్ని జాతీయ పార్టీగా మారుస్తానని కేసీఆర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయని కేసీఆర్ నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడం విడ్డూరమని విమర్శించారు. దేశానికి ఒక సుప్రీం కోర్టు కాకపోతే.. రాష్ట్రానికి ఒకటి ఉంటుందా అని ప్రశ్నించారు. 2019లో రెండు జాతీయ కూటముల మధ్యే యుద్ధం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు 2019కి ఎలాంటి గీటురాయి కావని వివరించారు. -
బీజేపీ ఓటమి వెనక..
15 ఏళ్లుగా అధికారంలో కొనసాగడంతో ప్రభుత్వ వ్యతిరేకత తలెత్తడం సహజమే. కానీ ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓటమికి గ్రామీణ జీవన సంక్షోభం, రైతు సమస్యలు, నక్సల్స్ సమస్య సహా పలు అంశాలు కారణమయ్యాయి. 2013లో కేవలం లక్ష ఓట్ల తేడాతో (0.7శాతం) మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి భారీగా నష్టపోయింది. ► వ్యవసాయ సంక్షోభంపై దృష్టిసారించకపోవడం రమణ్సింగ్ సర్కారుపై వ్యతిరేకత పెంచింది. 2013లో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ.. 2017లో సీఎం నియోజకవర్గమైన రాజ్నంద్గావ్లో 50,000 మంది రైతులు ప్రదర్శన జరిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు (సెప్టెంబరులో) క్వింటాల్ వరికి రూ. 300 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతులకు సర్కారుపై నమ్మకం కలగలేదు. మరోవైపు, తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాగ్దానం చేయడం, మద్దతు ధరలకు హామీ ఇవ్వడం వంటికి రైతాంగాన్ని ప్రభావితం చేశాయి. ► రూ.36000 కోట్ల పౌర సరఫరాల కుంభకోణంలో రమణ్సింగ్, ఆయన భార్యకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, 60 మంది మరణానికి కారణమైన రూ.5000 కోట్ల చిట్ఫండ్ కుంభకోణ నిందితులపై ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం (310 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి), పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరు ఉండటం, సహజ వనరుల్ని ధనికులకు కట్టబెట్టడం వంటి అంశాలు పాలక పార్టీని అపఖ్యాతి పాల్జేశాయి. కాంగ్రెస్కు ఇవే పెద్ద ప్రచారాస్త్రాలు అయ్యాయి. ► 2006లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిన వాగ్దానం పని చేసింది. ఈ చట్టాన్ని బీజేపీ నీరుగారుస్తుందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ హయాంలో అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధర తగ్గిపోవడాన్ని కూడా కాంగ్రెస్ ప్రముఖంగా ప్రచారం చేసింది. ► రమణ్సింగ్ సర్కారులోని అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని అధిగమించేందుకు కొత్త ముఖాలను బరిలోకి దింపాలన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. టికెట్ల కేటాయింపులో అధిష్టానం మాటే చెల్లుబాటయ్యింది. ► నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరగడం (రాష్ట్రంలో ఇంచుమించు 40 లక్షల మంది నిరుద్యోగులున్నది ఒక అంచనా), ఆదివాసుల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం, సాగునీటి వనరుల గురించి బీజేపీ సర్కారు పట్టించుకోకపోవడం వంటి అంశాలు కూడా కొంతమేరకు ప్రభావితం చూపాయి. నోట్ల రద్దు పర్యవసానాలు, జీఎస్టీ అమలు కూడా పాలక పార్టీపై కొంత వ్యతిరేకతకు కారణమైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు. -
ప్రజా విశ్వాసం పొందని ‘రాణి’
రాజస్తాన్లో వసుంధరా రాజే స్వయం కృతాపరాధమే పార్టీ ఓటమికి దారి తీసింది. బీజేపీపై వ్యతిరేకత కంటే కూడా వసుంధరాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పరిస్థితికి దారి తీసింది. వసుంధరా రాజే ఈ ఎన్నికలను తన చుట్టూనే తిప్పుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా తాను ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా వంటి పథకాలే పార్టీని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆ అతి విశ్వాసంతోనే అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి ప్రచారం వరకూ అంతా తానై వ్యవహరించారు. చివరి నిమిషంలో కుల సమీకరణలపై రాజే ఆశలు పెట్టుకున్నప్పటికీ రాజ్పుట్లు, జాట్లు కలిసిరాలేదు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న అధిష్టానం 100 మంది సిట్టింగ్లకు టిక్కెట్లు నిరాకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వసుంధర రాజే మెజారిటీ సైతం బాగా తగ్గిపోయింది. యూనస్ ఖాన్, రాజ్పాల్ సింగ్ షెకావత్, అరుణ్ చతుర్వేది, శ్రీచంద్ క్రిప్లానీ వంటి మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ నేతలే కలిసిరాలేదు.. అన్నదాతల ఆక్రోశాన్ని వసుంధరా రాజే సర్కార్ ఎన్నడూ పట్టించుకోలేదు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. కుల సమీకరణలు అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రాజ్పుత్రులు వెర్సస్ రాజేగా మారిపోయాయి. రాజ్పుత్కు చెందిన గ్యాంగ్స్టర్ ఆనందపాల్ సింగ్ ఎన్కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్పుత్ నాయకుడికి అవకాశం దక్కకుండా రాజే అడ్డుకోవడం వంటివి వసుంధరపై ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. రహదారుల వెడల్పు, సుందరీకరణ అంటూ రోడ్డు పక్కనున్న చిన్న గుడుల్ని తొలగించడం, గోరక్షకుల పేరుతో జరిగిన మూకదాడులు కూడా బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. రాజే నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ఆరెస్సెస్ కూడా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేదు. ఆరెస్సెస్ యంత్రాంగం రాజే సర్కార్ను గెలిపించడానికి పెద్దగా కృషి చేయలేదు. ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా బీజేపీని ముంచినా, తేల్చినా అందుకు రాజేదే బాధ్యత అన్నట్టుగా వదిలేశారు. మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగలేదు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలను రాజే ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. పైలెట్+ గెహ్లాట్= కాంగ్రెస్ గెలుపు బీజేపీ సర్కారుపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా..అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇచ్చిన హామీ బాగా పనిచేసింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్లు సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అయింది. సీనియర్ నేత గెహ్లాట్కు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మంచి అనుబంధం ఉంది. వారిలో ఉత్సాహం నింపి కష్టించి పనిచేసేలా చేయడం లో గెహ్లాట్ సక్సెస్ అయ్యారు. ఇక సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర్రవ్యాప్తంగా బలపం కట్టుకొని తిరిగారు. ఉద్యోగాలు రాక అసహనంతో ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేలా సచిన్ వ్యూహరచన చేశారు. వారి సమష్టి కృషి కాంగ్రెస్ విజయానికి కారణమైంది. కాంగ్రెస్కు సవాలే రాజస్తాన్లో కష్టపడి సాధించుకున్న ఈ విజయం కాంగ్రెస్కు ఏమంత ఆశాజనకంగా లేదు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించు కోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేది అనుమానంగానే మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాష్ట్రీయ లోక్తంత్ర పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ వంటివి గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం కాంగ్రెస్కు ఇబ్బందికరమే. టిక్కెట్ల పంపిణీ సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్గా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడైనా సీఎంగా సరైన నేతను ఎంపిక చేయకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం వినవస్తోంది. -
ఎడారి రాష్ట్రం ‘హస్త’ గతం
జైపూర్: ఊహించినట్లే రాజస్తాన్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ప్రభావం చూపాయి. వసుంధరా రాజే నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రేసులో ఉన్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సైతం తమతమ స్థానాల్లో గెలుపొందారు. ఇక సీఎం ఎవరో తేల్చాల్సిన బాధ్యత అధిష్టానంపై పడింది. ఫలితాలు స్పష్టం కావడంతో నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జైపూర్లో సమావేశమై తమ నేతను ఎన్నుకోనున్నారు. నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అల్వార్ జిల్లాలోని రామ్గఢ్ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్ధి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిలిపివేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 100 కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 100, బీజేపీ 70 వరకు సీట్లు గెలుచుకున్నాయి. దీంతోపాటు బీఎస్పీ మూడు చోట్ల గెలిచి, మరో మూడు చోట్ల ముందంజలో ఉంది. భారతీయ ట్రైబల్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ మూడు చోట్ల మెజారిటీ దిశగా ఉంది. సీపీఎం ఒక స్థానం గెలుచుకుని, మరో చోట ముందంజలో ఉంది. దాదాపు 12 చోట్ల స్వతంత్రులు గెలిచే అవకాశా లున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ మంగళవారం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ మధ్య సయోధ్య ఉందని చూపుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సచిన్ పైలెట్ మాట్లాడుతూ..స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి రెబెల్స్గా బరిలోకి దిగి గెలుపొందిన చాలామంది మా పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. నేడు జైపూర్లో జరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీకి పరిశీలకునిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు’ అని తెలిపారు. ఈ సమావేశం అనంతరం పార్టీ పరిశీలకులు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న పైలెట్, అశోక్ గెహ్లాట్లతోపాటు ఎమ్మెల్యేలందరితో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన నివేదికను అందజేస్తారు. బుధవారం సాయంత్రం జైపూర్లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఎన్నికతోపాటు పలు విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అవినాష్ పాండే మీడియాకు తెలిపారు. గెహ్లాట్, పైలెట్ కాకుండా మరెవరైనా సీఎం రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా ఆ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఎమ్యెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుని ఆ నివేదికను హైకమాండ్కు అందజేస్తాను. అంతిమ నిర్ణయం హైకమాండ్ చేతుల్లోనే ఉంది’ అని కేసీ వేణుగోపాల్ వివరించారు. దేశమంతటా ఇదే ట్రెండ్: సచిన్ పైలెట్ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దేశమంతటా సాధిస్తుందని సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రాష్ట్రంలో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇది చరిత్రాత్మక దినం’ అని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్ధులు సహా భావసారూప్యం కలిగిన అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ముఖ్యమంత్రి ఎవరో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారు’ అని ఆయన తెలిపారు. ‘ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇతర పార్టీలు, బీజేపీని వదిలి వచ్చే అభ్యర్ధులను కూడా కలుపుకుని పోతాం. మా పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని గెహ్లాట్ తెలిపారు. -
బీజేపీ ఓట్ల శాతం తగ్గింది!
న్యూఢిల్లీ: బీజేపీ జోరుకు బ్రేకులు పడుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గతంకన్నా భారీగా ఓట్ల శాతం కోల్పోయింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో 2013 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఒక్కసారిగా తగ్గింది. అయితే ఆ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపే మళ్లలేదు. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ ఓట్లను పంచుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లశాతంతో మొత్తం 65 స్థానాలకుగాను 62 స్థానాల్లో విజయం సాధించినా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. మరోవైపు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం ఢంకా మోగించాయి. 2014 తర్వాత చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపేతర పార్టీలకు ఆదరణ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే 2019 సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పోషిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా బీజేపేతర పార్టీలు కూటమి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో దిగజారిన బీజేపీ.. ఛత్తీస్గఢ్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, 2014లో అది 49 శాతానికి పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అది 32.2 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్కు 2013లో 40.3శాతం రాగా, 2014లో 38.37 శాతానికి తగ్గింది. ఈ ఎన్నికల్లో 43.2 శాతానికి పెరిగింది. 2013లో బీఎస్పీకి 4.3 శాతం ఓట్లు రాగా.. ఈ సారి ఆ పార్టీ మాజీ సీఎం అజిత్ జోగి పార్టీతో కూటమిగా ఏర్పడి 10.7 శాతం ఓట్లు దక్కించుకుంది. మరోవైపు స్వతంత్రులు 2013లో 5.3 శాతం కొల్లగొట్టగా తాజాగా 6.3 శాతానికి మెరుగయ్యారు. రాజస్తాన్లోనూ అదే పరిస్థితి.. రాజస్తాన్లోనూ బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 45.2 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఇప్పుడది 38.8కి పడిపోయింది. 2014లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ రికార్డ్ స్థాయిలో 55శాతం ఓట్లను కొల్లగొట్టి మొత్తం 25 స్థానాలూ గెలిచింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైంది. 2013లో 33.1 శాతం వస్తే, ఇప్పుడది 39.2కు చేరింది. 2014లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుని అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఇక ఇక్కడ స్వంతత్రుల ఓటు షేర్ 8.2 శాతం నుంచి 9.5కి పెరిగింది. మిజోలో కాంగ్రెస్ చతికిల.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన 5 రాష్ట్రాల్లో కేవలం మిజోరాంలోనే బీజేపీకి ఓట్ల శాతం పెరగడం, కాంగ్రెస్ తగ్గడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ను ఓడించిన ప్రాంతీయ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)దే అత్యధిక ఓట్లు సాధించింది. 2013లో ఇక్కడ కాంగ్రెస్కు 45 శాతం ఓట్లు రాగా, తాజాగా అది 30 శాతానికి పడిపోయింది. ఇక బీజేపీ 0.4 నుంచి 8 శాతానికి పెంచుకోగలిగింది. ఇక ఎంఎన్ఎఫ్ ఓట్ల శాతం 28.8 శాతం నుంచి ఈసారి 37.6 పెరిగింది. హోరాహోరీగా మధ్యప్రదేశ్.. కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ హోరా హోరాగా ఉండటంతో మధ్యప్రదేశ్లో బీజేపీ ఓట్ల శాతం ఆసక్తిగా మారింది. 2013తో పోలిస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్కు 36.4 శాతం ఓట్ల నుంచి 41.4కి పెరిగింది. ఇక బీజేపీ 44.9శాతం నుంచి 41.3కు పడిపోగా, బీఎస్పీ 4.6 శాతానికి పడిపోయింది. ఇక స్వతంత్రులు అదే 5 శాతం వద్ద ఆగిపోగా..చిన్న పార్టీలు తమ ఓటు షేర్ పెంచుకున్నాయి. కాగా, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండూ పతనమయ్యాయి. -
2019 ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం అవ్వాలి: కన్నా
-
‘అందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నారు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పటానికి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు అన్నారు. సోమవారం బాబు ఏది జాబు అంటూ భారతీయ జనతా యువ మోర్చా నేతలు, కార్యకర్తలు విజయవాడలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రంగంలోని ఖాళీలను భర్తీ చేయాలంటూ, నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలకు పెంచాలంటూ ఏపీపీఎస్ ఛైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ధర్నాచౌక్నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యువ మోర్చా నేతలకు మధ్య వాగ్వివాదం.. తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఏలూరు రోడ్డులో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుంది అంటూ నిరుద్యోగ యువతని చంద్రబాబు మోసం చేశారని, ఆయన వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కొడుకుకు తప్పితే రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. -
ముఠా రాజకీయాలు గతం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ముఠా రాజకీయాలు గతమని, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అందరూ కలసి పనిచేశారని సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం తిరుగుబాటు చేస్తున్నారని, 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ప్రముఖ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడం, సీఎం పదవికి పోటీ, రాబోయే లోక్సభ ఎన్నికలు తదితరాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో ముందు వరుసలో ఉంటారా? అని ప్రశ్నించగా ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేనని దాటేశారు. రాష్ట్రంలో బీజేపీని గద్దె దించడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని, ఆ తరువాతే పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని తెలిపారు. సింధియాతో పాటు మరో సీనియర్ నేత కమల్నాథ్ సీఎం రేసులో ఉన్నట్లు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఐకమత్యమే మా బలం.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన తరువాత సీనియర్ నాయకులు తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలున్నాయా? అని అడగ్గా..అలాంటిదేం ఉండదని అన్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకున్నామని, అప్పుడు అంతర్గత కుమ్ములాటలతో నష్టపోయామని గుర్తుచేశారు. తాజా ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేశారని తెలిపారు. ఐకమత్యమే ఈసారి పార్టీ బలమని, అది అలాగే కొనసాగాలని అన్నారు. మీడియా తరచూ లేవనెత్తుతున్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్కు ఇప్పుడు సమస్యే కావని నొక్కి చెప్పారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వలేకపోవడానికి కారణం ఐకమత్యం లేకపోవడమే నన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్ర యూనిట్ పని సంస్కృతిలోనూ మార్పు వచ్చిందని పేర్కొన్నారు. -
రీలాక్స్ అవుతున్న పార్టీల అభ్యర్ధులు
జోగిపేట(అందోల్): అందోల్ నుంచి పోటీలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం కార్యకర్థలు, ముఖ్యనేతలతోనే గడిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ శనివారం తన స్వగ్రామమైన వట్పల్లి మండలం పోతిరెడ్డిపల్లిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో గడిపారు. పోలింగ్ సరళిపై, శాతం, మెజారిటీ తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన వివరాలపై సంతృప్తి వ్యక్తం చేసారు. తప్పకుండా గెలుపొందుతామన్న ధీమాను వ్యక్తం చేసారు. దామోదర సైతం.. సంగారెడ్డిలోని తన ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర రాజనర్సింహా కార్యకర్తలతో చర్చిస్తూ గడిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు సంగారెడ్డికి తరలివెళ్లారు. మండలాల వారిగా పార్టీకి ఎంతెంత పోలయ్యిందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. మనమే గెలుపొందుతామని కార్యకర్తలకు ఆయన చెప్పినట్లు సమాచారం. మనుమరాళ్లతో బాబూమోహన్ జోగిపేట(అందోల్): పోలింగ్ ముగియడంతో అందోల్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి పీ. బాబూమోహన్ తన మనుమరాళ్లు ఆన్యా, శనాయాతో సరదాగా గడిపి రిలాక్స్ అయ్యారు. 20 రోజులుగా ప్రచార నిమిత్తం నియోజకవర్గంలోనే ఉండిపోవడంతో ఆయన ఇంటివైపు వెళ్లలేదు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో శనివారం అంతా ఆనందంగా గడిపారు. సరదాగా గడిపిన సతీశ్బాబు హుస్నాబాద్: దాదాపు 45 రోజులుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్కుమార్ శనివారమంతా కుటుంబ సభ్యులతో గడిపారు. వరంగల్లోని తన ఇంజనీరింగ్ కళాశాలలో కుమారుడు ఇంద్రనీల్తో కలిసి సరదాగా మార్నింగ్ వాక్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. జహీరాబాద్ అభ్యర్థుల విశ్లేషణలు ముఖ్య నేతలతో సమావేశమైన గీతారెడ్డి జహీరాబాద్: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జె.గీతారెడ్డి శనివారం సైతం బిజీ బిజీగా గడిపారు. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఆమె తీరిక లేకుండా గడిపారు. శుక్రవారం జరిగిన ఎన్నికల సందర్భంగా గీతారెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గం అంతా పర్యటించి అలసిపోయారు. అయినా శనివారం సైతం పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహించారు. ఎన్నికల సరళి గురించి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు గీతారెడ్డి ఇంటి వద్దకు వచ్చి ఆమెకు వివరాలు అందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏ మేరకు ఓట్లు పోలయ్యాయనే విషయమై ఆరా తీశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్కు అనుకూలంగా పోలింగ్ జరిగిందని పార్టీ నేతలు వివరించారు. భారీ మెజార్టీతో గెలుపొందుతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు గీతారెడ్డికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం ఆమె హైదరాబాద్కు పయనమయ్యారు. మాణిక్ రావు సైతం.. నెల రోజులుగా టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్రావు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు. శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నంత సేపు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. శనివారం సైతం కార్యకర్తలు, నేతలతో గడిపారు. భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం మాణిక్రావు పార్టీ ముఖ్య నేతలను కలిసేందుకు హైదరాబాద్ తరలి వెళ్లారు. తన విజయం కోసం శ్రమించినందుకు ఎమ్మెల్సీ ఎం.డి.ఫరీదుద్దీన్ను మాణిక్రావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రేణుల సమక్షంలో సంబరం కార్యకర్తల సమక్షంలో పెళ్లి రోజు జరుపుకొన్న ఆకుల రాజయ్య, గజమాలతో సన్మానించిన అభిమానులు మెదక్ అర్బన్: మెదక్ బీజేపీ అభ్యర్థిగా అనూహ్యంగా తెరమీదకు వచ్చి.. వినూత్నంగా ప్రచారం నిర్వహించి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు ఆకుల రాజయ్య. గత పదిరోజులుగా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాజయ్య శనివారం మెదక్లో కార్యకర్తల నడుమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు. రాజయ్య, స్వరూపరాణి దంపతులను గజమాలతో సన్మానించారు. సేద తీరిన సోలిపేట దుబ్బాకటౌన్: గత రెండు నెలలుగా ప్రచారంలో తీరికలేకుండా గడిపిన దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట జ్వరం రావడంతో శనివారం అంతా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నారు. తన వద్దకు వచ్చిన కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు. 50 వేల పై చిలుకు భారీ మోజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చాలా రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ విరామం లేకుండా ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి మాదవనేని రఘునందన్రావు ఎన్నికలు ముగియడంతో తన కూతురు వివాహ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 12న ఆయన కూతురు సింధు వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా సాక్షితో రఘునందన్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆశిస్సులతో తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటిపట్టునే ఖేడ్ అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే విజయపాల్రెడ్డి, ఇతర నేతలతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్ నారాయణఖేడ్: దాదాపు పక్షం రోజులుగా ఎన్నికల ప్రచారంలో గడిపిన ఖేడ్ ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం ఇళ్లలోనే ఉండి సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఇంటికి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు. ఫలితాలు ఎలా ఉంటాయోన్న ఆందోళన ఎవ్వరిలో కనిపించక పోవడం విశేషం. సరదాగా గడిపిన సతీశ్బాబు హుస్నాబాద్: దాదాపు 45 రోజులుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్కుమార్ శనివారమంతా కుటుంబ సభ్యులతో గడిపారు. వరంగల్లోని తన ఇంజనీరింగ్ కళాశాలలో కుమారుడు ఇంద్రనీల్తో కలిసి సరదాగా మార్నింగ్ వాక్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. స్నోబాల్ ఆడుతూ మన పార్టీ అభ్యర్థి.. నారాయణఖేడ్: ఖేడ్ నుంచి మన పార్టీ తరఫున పోటీ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళీగోవింద్ శనివారం స్నోబాల్ ఆడి రిలాక్స్ అయ్యారు. దాదాపు 20 రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన శనివారం హైదరాబాద్ వెళ్లారు. మెదక్జోన్: మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి శనివారం పాపన్నపేట మండలం యూసుఫ్పేటలోని తన ఇంటిలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. గత 20 రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఆయన తీరిక లేకుండా గడిపారు. కుటుంబ సభ్యులతో ఉపేందర్రెడ్డి -
వంశీచంద్రెడ్డిపై దాడి
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి పోలింగ్బూత్ వద్ద శుక్రవారం ఉదయం కల్వకుర్తి నియోజకవర్గ కాం గ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనలో ఆయన గాయపడ్డారు. దీంతో ఆయనకు ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి అనంతరం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. జంగారెడ్డిపల్లిలోని పోలింగ్బూత్ వద్దకు వంశీచంద్రెడ్డి చేరుకుని క్యూలో ఉన్న ఓటర్లకు అభివాదం చేస్తూ బూత్ లోపలికి వెళ్లారు. దీనికి బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. క్యూలో ఉన్న వారికి కాంగ్రెస్కు ఓటేయమని వంశీచంద్రెడ్డి ప్రచారం చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. తాను అభ్యర్థినని పోలింగ్బూత్లోకి వెళ్లడానికి అనుమతి ఉందని చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పోలింగ్ బూత్లోకి దూసుకువచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వంశీ చంద్ను బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అక్కడే ఉన్న వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారిపై రాస్తారోకో బీజేపీ కార్యకర్తల దాడిలో వంశీచంద్రెడ్డి గాయపడ్డారని తెలియడంతో కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆయనను నిమ్స్కు తరలించిన అనంతరం జాతీయ రహదారిపైకి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించా రు. సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ మల్లీశ్వర్లు, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని కాం గ్రెస్, టీడీపీనేతలను సముదాయించారు. నిమ్స్లో నేతల పరామర్శ నిమ్స్లో చేరిన వంశ్చంద్ను కాంగ్రెస్ నేతలు జైపాల్రెడ్డి, వీహెచ్, కేవీపీ, కోదండరెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి పరామర్శించారు. చికిత్స అనంతరం వంశీచంద్రెడ్డి ప్రైవేట్ అంబులెన్స్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్లారు. చికిత్స తీసుకుంటున్న వంశీచంద్రెడ్డి -
అన్నం పెట్టిన చేతిని నరకడం బాబు నైజం : కన్నా
సాక్షి, కాకినాడ : పిల్ల కాంగ్రెస్కు ఓటేస్తే తల్లి కాంగ్రెస్కు ఓటేసినట్లు అన్న చంద్రబాబు.. ఇప్పుడు తల్లి కాంగ్రెస్ చంకెక్కారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబు సహజ గుణమంటూ విమర్శించారు. బీజేపీ నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొచ్చే చర్యలు తీసుకోబట్టే దొంగలంతా ఒకటవుతున్నారని తెలిపారు. అందుకే సూట్కేస్ కంపెనీలు కూడా మూతపడుతున్నాయన్నారు. కేసుల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం దొంగ చంద్రబాబు ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడో అందరికి తెలుసన్నారు. మాతో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు కూడా బాబు దొంగగానే కనిపించాడంటూ కన్నా ఆరోపించారు. 2014లో చంద్రబాబు నేను మారాను నమ్మండంటూ వస్తే మాతో పాటు మోదీ కూడా నమ్మారని తెలిపారు. ఎస్పీవీ ఏర్పాటు చేయకుండా కేంద్రం నుంచి రూ. 16, 500 కోట్లు చంద్రబాబు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారంటూ ఆరోపించారు. పిల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. అందులో కొందరికి మంత్రి పదవులను కట్టబెట్టి బాబు తన ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారంటూ కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమిత్ షా రధయాత్రకు హైకోర్టు నో
సాక్షి, కోల్కతా : బీజేపీ చీఫ్ అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహర్లో శుక్రవారం పాల్గొనాల్సిన రధయాత్రకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతి నిరాకరించింది. బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో సాగే ఈ మెగా ర్యాలీనీ అమిత్ షా లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో బీజేపీ బెంగాల్ శాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 9న తదుపరి విచారణ చేపడతామని అప్పటివరకూ రధయాత్రను వాయిదా వేయాలని హైకోర్టు కోరింది. కాగా రధయాత్రకు అనుమతి నిరాకరించిన కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తామని బీజేపీ బెంగాల్ ఇన్చార్జ్ విజయ్వర్గీయ వెల్లడించారు.కాగా, కూచ్బెహర్ సమస్యాత్మక ప్రాంతమని, అక్కడ ఇలాంటి ర్యాలీకి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. డిసెంబర్ ఏడు నుంచి రాష్ట్రంలో మూడు ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి కోసం తాము దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వ అధికారులు, పోలీసుల నుంచి స్పందన లేదని పేర్కొంటూ బీజేపీ బుధవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. -
మోదీ, బాబులను ఇంటికి సాగనంపండి
విజయనగరం పూల్బాగ్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలను కూల్చివేయాలని, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ అఖి ల భారత అధ్యక్షుడు డాక్టర్ హేమలత పిలుపునిచ్చారు. విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి గురజాడ కళాభారతి వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఆల్ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆది, సోమవారాల్లో విజయనగరంలో నిర్వహించే సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. మన దేశంలో పేదల కడుపుకొట్టి ధనవంతులకు దోచిపెడుతున్నారన్నారు. బీజేపీ కులంపేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోందని తెలిపారు. నరేంద్రమోదీ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో దేశ సమైక్యతను దెబ్బతీసేలా మాట్లాడటం అంటే కార్మిక, ఉద్యోగ, ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్ కార్మికులు, ఉద్యోగులు, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ నర్సింగరావు, ఎంఎ గపూర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి జపంతో ప్రజల ఆస్తులను పెట్టుబడుదారులకు అప్పనంగా ఇస్తున్నారన్నారు. కనీసవేతనం అమలు చేయలేని మోదీ, చంద్రబాబులకు పాలించే హక్కులేదని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జగ్గునాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బరావమ్మ, బేబిరాణి తదతరులు పాల్గొని ప్రసంగించారు. -
రూ.10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకెళ్లిన ఉద్యమకారులకు నెలకు రూ. 5 వేల పెన్షన్ సహా రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు సబ్సిడీలు ఇచ్చేలా బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల వంటి 26 రంగాల వారికి తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే హామీలతో మేనిఫెస్టోను ఖరారు చేసింది. గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కన్వీనర్ మల్లారెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు... వ్యవసాయం:రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ. ప్రతి రైతుకు ఉచిత బోరు లేదా బావి, ఉచిత పంపుసెట్టు. ఉచితంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లింపు. మద్దతు ధరకు అదనంగా బోనస్, పంట సేకరణ సమయంలో రైతు ఖాతాలో జమ. అందుకోసం రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు. ట్రాక్టర్లు, పంట కోత మిషన్, నాట్లు వేసే యంత్రాలకు 50 శాతం సబ్సిడీ. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్. నీటిపారుదల: పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పూర్తి. గోదావరి జలాల ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన నీటిని సద్వినియోగం చేసేలా 13 చోట్ల తక్కువ ముంపుతో రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్మాణం. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ద్వారా 100 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉపయోగించడం. గోదావరి, ఉపనదుల్లో జల రవాణా సౌకర్యం. విద్య: డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా లాప్టాప్లు. ప్రతిభావంతులైన 25 వేల మంది పేద విద్యార్థులకు జేఈఈ, బిట్శాట్, నీట్ పరీక్షలకు ఉచిత శిక్షణ. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికలకు ఉచిత సైకిళ్లు. డిగ్రీ, ఆపైస్థాయి విద్యార్థినులకు 50 శాతం సబ్సిడీతో స్కూటీలు. ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ. వైద్యం: రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ . 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు. ప్రతి మండల కేంద్రంలో అందుబాటులో అంబులెన్సులు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా రూ. 2 లక్షల బీమా, ఆ ప్రీమియం ప్రభుత్వమే చెల్లింపు. ఉద్యోగులు : నూతన సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగింపు. ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంపు. కాంట్రాక్టు, పార్ట్టైం, ఔట్సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగుల సర్వీçసునుబట్టి క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు. యువత, ఉపాధి : 2 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీకి 3 నెలల్లో నోటిఫికేషన్. అ«ధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటన. నిరుద్యోగులకు నెలకు రూ. 3,116 నిరుద్యోగ భృతి. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత. 5 లక్షల మంది నిరుద్యోగులకు హామీ అవసరంలేని రుణాలు. సాంఘిక సంక్షేమం : 2022 నాటికి అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణం, ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు నెలకు రూ. 5 వేల అద్దె చెల్లింపు. పేద కుటుంబాల్లో 55 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 2 వేల పెన్షన్. వితంతువులకు రూ. 3 వేల పెన్షన్. రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి ఏటా రూ. 1000 కోట్లు కేటాయింపు. బీసీ కులాల ఫెడరేషన్ల ఏర్పాటు. చేతివృత్తుల వారికి ఉచితంగా విద్యుత్ సరఫరా, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు. అమరుల కుటుంబాల సంక్షేమం:అమరుల అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం. జైలుకు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులకు నెలకు రూ. 5 వేల పెన్షన్. రజకులను ఎస్సీల్లో, వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎస్టీల్లో చేర్చేందుకు చర్యలు. నేత, గీత, రజక, క్షౌ ర, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు తదితర కులవృత్తుల వారు 55 ఏళ్లు దాటితే నెలకు రూ. 3 వేల పెన్షన్. తాటి చెట్టు ఎక్కే ప్రతి గీత కార్మికునికి 50 ఏళ్లు దాటితే రూ. 3 వేల పెన్షన్. వెనుకబడిన కులాలు: ఎస్సీ వర్గీకరణ. ఆ అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు చర్యలు. డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారికి ప్రతి నెలా రూ . 3 వేల పెన్షన్. పేద, గిరిజన కుటుంబాలకు 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్. జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్ల పెంపు. మైనారిటీలకు కేంద్ర పథకాలైన సీకో ఔర్ కమావో, నయా మంజిల్, పడో పరదేశ్, నయా రోష్నీ వర్తింపు. వక్ఫ్ భూముల పరిరక్షణ, మదర్సాలలో కంప్యూటర్, నైపుణ్య శిక్షణ. మహిళా సంక్షేమం:సౌభాగ్యలక్ష్మి పథకం పేరుతో వివాహ సమయంలో పేద మహిళలకు రూ. లక్ష నగదుతోపాటు ఒక తులం బంగారం. బాల్యవివాహాలు, డ్రాపవుట్ల నిరో«ధానికి గ్రామీణ పేద బాలికలకు 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు నెలకు రూ. 1,000 స్కాలర్షిప్. డ్వాక్రా గ్రూపులకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణం, రూ. లక్ష గ్రాంటు, స్మార్ట్ఫోన్లు. సింగరేణి కార్మికులకోసం: సింగరేణిలో 20 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు. 100 కారుణ్య నియామకాల అమలు. సిబ్బందికి రూ. 15 లక్షల వరకు గృహ నిర్మాణ అడ్వాన్సు సింగరేణి నుంచే చెల్లించేలా చర్యలు. తక్కువ వడ్డీతో వాయిదాల్లో రికవరీ. పారిశ్రామిక రంగానికి: ఖాయిలా పడిన సంస్థల పునరుద్ధరణకు రూ. 2 వేల కోట్లతో నిధి. పారిశ్రామిక రంగాలకు రూ. 2 వేల కోట్లు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలపై 4 శాతం వరకు వడ్డీ తగ్గింపు. ఉచిత విద్యుత్ సదుపాయం. స్థానిక సంస్థల బడ్జెట్ రెట్టింపు, గ్రామీణ రోడ్ల అభివృద్థి. జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఏటా రూ. 100 కోట్లు. జిల్లా, మండల కేంద్రాల్లో ఇంటి స్థలాలు. అర్హులందరికీ అక్రెడిటేషన్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహణ. వృద్ధ కళాకారులకు రూ. 3 వేల పెన్షన్. మానస సరోవరయాత్ర, కాశీ, పూరీ, చార్ధామ్లను సందర్శించే సీనియర్ సిటిజన్లకు సబ్సిడీ. ఉత్సవాలు, పండుగల సమయంలో ఏటా లక్ష గోవుల వితరణ. అన్ని నగరాలు, పట్టణాల్లో నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ. ‘‘పాత ఆటో ఇవ్వండి, కొత్త ఆటో పొందండి’నినాదంతో పర్యావరణహిత స్వచ్ఛ వాహనాలకు ప్రొత్సాహం. హైదరాబాద్ నుంచి తాండూరు, కామారెడ్డి, జనగామ, నల్లగొండ, జడ్చర్ల వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు. మెట్రో రైలును పటాన్చెరు, సూరారం, కొంపల్లి, అల్వాల్, ఈసీఐఎల్, బీఎన్రెడ్డి నగర్, తుక్కుగూడ, రాజేంద్రనగర్కు విస్తరణ. ప్రతిభావంతులైన కానిస్టేబుళ్లకు ఎస్సైలుగా పదోన్నతి. డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్, ఓటర్ ఐడీ, జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఎలక్ట్రానిక్ రూపంలో వినియోగం. 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి చర్యలు. ఉత్తర, దక్షిణ పవర్గ్రిడ్ల అనుసంధానం ద్వారా నిరంతర విద్యుత్. రూ. 2 కోట్లతో తెలంగాణ క్రీడా నిధి ఏర్పాటు. 1,000 మంది క్రీడాకారులకు ఏటా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు స్కాలర్షిప్. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు భృతి. కోచ్లకు పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తింపు, వేతనాలు పెంపు. హోంగార్డుల సర్వీసు క్రమబద్ధీకరణ, కానిస్టేబుళ్లతో సమానంగా ప్రభుత్వ సౌకర్యాలు, హోంగార్డు లందరికీ ఇళ్లు. -
‘నేను సేవకున్ని.. కానీ ఆయన పైలెట్’
జైపూర్ : నేను పైలెట్ను కాను.. సేవకున్ని అంటూ కాంగ్రెస్ పార్టీపై పరోక్ష విమర్శలు చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి యునస్ ఖాన్. టోంక్ నియోజకవర్గం నుంచి.. కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలెట్కు వ్యతిరేకంగా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు యునస్ ఖాన్. రాష్ట్రంలో బీజేపీ తరపున ఉన్న ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి యునస్ ఖాన్. టోంక్ ప్రాంతంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న యునస్ ‘ఈ ఎన్నికలను హిందూ - ముస్లింల ఫైట్గా భావించకండి. ఇది కులానికి, మతానికి సంబంధించిన యుద్ధం కాదు. ఇది ప్రజాస్వామ్య యుద్ధం అని తెలిపారు. బీజేపీ తరపున ఒకే ఒక మైనారిటీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ప్రశ్నించగా ‘ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ రాజస్తాన్లో దివంగత రంజాన్ ఖాన్, నేను 1980 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నామం’టూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలెట్ గురించి మాట్లాడుతూ.. ‘సచిన్జీకి ఇది కొత్త ప్లేస్.. కొత్త మనుషులు. వీటన్నింటిని పక్కన పెడితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి.. ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. ఇది తప్ప ఆయనకు మరో కల లేదు. కానీ నేను ప్రజల మనిషిని. పోయిన సారి నేను దీద్వానాలో పని చేశాను.. ఈ సారి టోంక్లో. ప్రజలు ఆశీర్వదీస్తే ఇక్కడ కూడా సేవకునిలా పనిచేస్తాను’ అన్నారు. అంతేకాక ‘నేను సేవకున్ని.. ఎమ్మెల్యే మాత్రమే కాగాలను.. కానీ ఆయన చాలా పెద్ద మనిషి.. పైలెట్ కదా’ అంటూ సచిన్పై పరోక్ష విమర్శలు చేశారు. టోంక్ ప్రజలకు కావాల్సింది పైలెట్ కాదు.. సేవకుడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో దీద్వానా నుంచి గెలుపొందిన యునస్ ఖాన్, వసుంధరా రాజే ప్రభుత్వంలో రవాణా మరియు పబ్లిక్ వర్క్స్ మంత్రిగా పని చేశారు. ముస్లింలు ఎక్కువగా ఉండే టోంక్ నియోజకవర్గంలో బీజేపీ తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ సింగ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలెట్ను తన అభ్యర్థిగా ప్రకటించడంతో.. బీజేపీ అజిత్ సింగ్ స్థానంలో యునస్ ఖాన్ని నిలబెట్టింది.