‘అందుకే ఆయన పోటీ చేయడం లేదు’ | Amit Shah Explains Why Himanta Biswa Sarma Will Not Contest Lok Sabha Polls | Sakshi
Sakshi News home page

హిమంత బిశ్వాను పక్కన పెట్టిన బీజేపీ

Published Fri, Mar 22 2019 11:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

Amit Shah Explains Why Himanta Biswa Sarma Will Not Contest Lok Sabha Polls - Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీతో పాటు అస్సాం బీజేపీ సీనియర్‌ నాయకుడు హిమంత బిశ్వా శర్మ పేరు కూడా లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందిన హిమంత బిశ్వాకు టికెట్‌ కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హిమంతకు టికెట్‌ కేటాయించకపోవడం వెనక గల కారణాలను ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఈ విషయం గురించి ఆయన ‘ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం హిమంత బిశ్వా శర్మ నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్‌డీఏసీ) కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రల్లో పార్టీని బలపర్చడం ముఖ్యం. ఈ బాధ్యతలను హిమంత బిశ్వా చక్కగా నిర్వర్తిస్తారని పార్టీ నమ్ముతుంది. అందుకే ఆయనకు టికెట్‌ కేటాయించలేదు. అస్సాం బీజేపీ శ్రేణులతో పాటు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల అస్సాంతో పాటూ ఈశాన్య భారతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానం’టూ అమిత్‌ షా ట్విట్‌ చేశారు. ప్రస్తుతం బిశ్వా అస్సాం ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement