బెంగళూరులో హిందూపురం వ్యాపారి ఆత్మహత్య | businessman commits suicide | Sakshi
Sakshi News home page

బెంగళూరులో హిందూపురం వ్యాపారి ఆత్మహత్య

Published Tue, May 12 2015 3:09 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

businessman commits suicide

హిందూపురం (అనంతపురం) : అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి బెంగళూరు నగరంలోని ఒక లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. హిందూపురంకు చెందిన విశ్వనాథ్(60) అనే వ్యక్తి స్థానికంగా మొక్కజొన్నల వ్యాపారం చేస్తుంటారు. కాగా రెండు రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వద్ద రూ.10 లక్షల నగదు ఉందని సమాచారం. అయితే బెంగళూరు చిక్కపేటలోని సూర్య లాడ్జిలో బస చేసిన ఆయన మంగళవారం ఉదయం నుంచి బయటకు రాకపోయేసరికి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టారు. ఆయన మంచంపై విగతజీవిగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. విశ్వనాథ్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement