Businessman
-
రన్యారావుతో నాకే సంబంధం లేదు: పిడుగురాళ్ల వ్యాపారి
పల్నాడు, సాక్షి: పిడుగురాళ్లలో తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ ఓ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడన్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కన్నడ నటి, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు(Ranya Rao) పేరు తెర మీదకు రాగా.. పరారీలో ఉన్నాడని చెబుతున్న సదరు వ్యాపారి ఈ అంశంపై స్పందించాడు. ఏం జరిగిందంటే.. స్థానికంగా తాను మిర్చి ఎగుమతి, బంగారు దిగుమతి చేస్తున్నానని.. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ సదరు వ్యాపారి ప్రచారం చేశాడు. అయితే అతని ఆర్భాటాలు, అప్పటికే అతను చేసిన దానధర్మాలు చూసిన కొందరు అది నిజమేనని నమ్మారు. దాచేపల్లి, కారంపూడి, సత్తెనపల్లి, నరసరావుపేటకు చెందిన కొందరు సదరు వ్యాపారికి డబ్బు ముట్టజెప్పారు. మార్చి మొదటి వారం నుంచి ఆ వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామన్న ఆందోళనతో బాధితులు లబోదిబోమన్నారు. అయితే సదరు వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావిస్తుండగా.. అతని పేరిట ఓ వాట్సాప్ సందేశం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.తానేం దేశం విడిచి పారిపోలేదని.. ఇండియాలోనే ఉన్నానని.. తనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, రెండు నెలల టైం ఇస్తే అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఆ ఆడియో మెసేజ్లో చెప్పాడు. వందల కోట్లు ఎగ్గొట్టాడని వార్తల్లో వస్తున్న కథనాలను ఆ వ్యాపారి తోసిపుచ్చాడు. అలాగే.. నటి రన్యా రావుతో లింకులు ఉన్నాయంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించాడు. ఆమెతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని ఆ ఆడియో మెసేజ్తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. -
ఆక్సిజన్ ఛాంబరే అతని ఆఫీస్
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలుషిత గాలికి బదులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో లభ్యమయ్యే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆక్సిజన్ ఛాంబర్నే తన కార్యస్థలిగా మార్చుకున్నారు.ఆక్సిజన్ సరఫరా ట్యూబ్లు పెట్టుకుని డెస్క్ టాప్పై పనిచేస్తున్న వీడియోను తాజాగా ‘ఎక్స్’ఖాతాలో షేర్చేశారు. ‘‘హైపర్బారిక్ ఆక్సీజన్ ఛాంబర్లోకి ఆఫీస్కు తీసుకొచ్చా’’అని ఆయన రాసుకొచ్చారు. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ(హెచ్బీఓటీ) తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఊపిరితిత్తుల్లోకి తగు పీడనంతో ఆక్సిజన్ వెళితే అంతర్గత కణజాలం ఏదైనా అతిసూక్ష్మస్థాయి రిపేర్లు ఉంటే వేగంగా చేసుకుంటుంది. హెచ్బీఓటీ అనేది ప్రపంచంలోనే చర్మ సంబంధ అత్యంత అధునాతన థెరపీ. ఈ థెరపీతో చర్మంలోని కణజాలం సాంద్రత 12.8 శాతం పెరుగుతుంది. సాగి, మళ్లీ యథాస్థానానికి వచ్చే ఎలాస్టిక్ గుణం 144 శాతం మెరుగుపడుతుంది. చర్మంలో అతిసూక్ష్మ రక్తనాళాల సంఖ్య 40.9 శాతం పెరుగుతుంది. సీడీ31 అనే రక్తనాళం సామర్థ్యం 84.3 శాతం మెరుగవుతుంది. కణక్షీణత 21 శాతం తగ్గుతుంది’’అని బ్రియాన్ చెప్పుకొచ్చారు. సముద్రజలాల్లో 33 అడుగుల లోతులో ఉన్నప్పుడు ఎంత పీడనం అయితే ఉంటుందో అంతే పీడనంతో గాలిని ఈ ఛాంబర్లో పీల్చే వెసులుబాటు ఉంది. ఈ ఛాంబర్లో 95 నుంచి 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ను పీలుస్తా’’అని చెప్పారు. పీడనంతో అంతా సమతుల్యం ‘‘సరైన పీడనంతో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరితే అక్కడి నుంచి అన్ని శరీరభాగాలకు ఖచ్చితమైన సమయానికి ఆక్సీజన్ అందుతుంది. దీంతో అన్ని అవయవాల్లో ఆక్సిజన్ స్థాయిలు సవ్యంగా ఉంటాయి. కణజాలాల్లో ఆక్సీజన్ లభ్యత పెరిగి శరీరం ఏదైనా గాయాలు, రిపేర్లు ఉంటే ఆ పనిని త్వరగా పూర్తిచేస్తుంది. అతిసూక్ష్మ రక్తనాళాలు పాతబడిపోతే వాటి స్థానంలో కొత్త రక్తనాళాలు త్వరగా పుట్టుకొస్తాయి’’అని బ్రియాన్ చెప్పారు.వయసు తగ్గింపు చర్యలపై స్పందించిన నెటిజన్లు 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు బ్రియాన్ పడుతున్న తాపత్రయాన్ని చూసి మెచ్చుకునే వాళ్లతోపాటు విమర్శించే వాళ్లూ పెరిగారు. ‘‘వాహనాలు, ఇతర కాలుష్య ఉద్గారాలతో కలుషితమైన గాలితో పోలిస్తే ఇలాంటి ఆక్సిజన్ చాంబర్లో కూర్చుని కాస్తంత స్వచ్ఛమైన గాలి పీల్చడం బాగానే ఉందిగానీ ఇది ఏమంత సురక్షితం కాదు. ఆక్సిజన్ అగ్నిని మరింత రాజేస్తుంది. పూర్తిగా ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వైర్లమయమైన ఛాంబర్లో పొరపాటున ఒక్క నిప్పురవ్వ అంటుకున్నా మీకే ప్రమాదం. పైగా వేగంగా వేడెక్కే కంప్యూటర్ వాడుతున్నారు’’అని ఒక నెటిజన్ హెచ్చరించారు. హాలీవుడ్ సినిమా మ్యాడ్మ్యాక్స్లో మృత్యుంజయునిగా ఉండేందుకు తాపత్రయపడే ‘ఇమ్మోరా్టన్ జోయ్’పాత్రధారి వేషంలో బ్రియాన్ భలేగా ఉన్నాడని మరో నెటిజన్ వ్యంగ్య పోస్ట్చేశారు. దీనిని నటుడు కీస్ బైర్న్ ఫొటోను జతచేశారు. ‘‘చిన్నతనంలో కార్టూన్ సినిమాలో చూసిన క్యాప్సూల్ లాగా ఈయన గారి ఛాంబర్ ఉంది’’అని ఇంకొకరు వెటకారంగా పోస్ట్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలుగులో 'నాని'తో ఒకే ఒక సినిమా.. ప్రియుడితో మలయాళ బ్యూటీ పెళ్లి (ఫోటోలు)
-
రూ.వేల కోట్ల సంపన్నుడు.. లోకల్ ట్రైనే ఎక్కుతాడు..
దేశంలోని కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖలు తమ నిరాంబర శైలితో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో నిరంజన్ హీరానందని (Niranjan Hiranandani) ఒకరు. వేల కోట్ల సంపదకు అధిపతి అయినా లోకల్ ట్రైన్లోనే ప్రయాణిస్తూ పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో 'ఇండస్ట్రీ గురు'గా పేరొందిన ఆయన హీరానందని గ్రూప్ పేరుతో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కొత్త శిఖరాలకు నడిపించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి డేటా సెంటర్స్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ బిజినెస్ కొత్త యుగం వరకు విస్తరించిన హీరానందని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిరంజన్ హీరానందని నాయకత్వం వహిస్తున్నారు. తన పదునైన వ్యాపార చతురత, నైపుణ్యంతో హీరానందని గ్రూప్ను ప్రపంచ ఖ్యాతి పొందిన కంపెనీగా మార్చడంలో ప్రసిద్ది చెందారు. నిరంజన్ హిరానందని గురించి, ఆయన విజయవంతమైన ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..?నిరంజన్ హీరానందని నెట్వర్త్హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. భారతదేశంలోని 50 మంది ధనవంతులలో నిరంజన్ హీరానందనీ ఉన్నారు. నిరంజన్కు రూ. 12 వేల కోట్లకుపైగా విలువైన ఆస్తులు ఉన్నాయి . విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. అయితే నిరంజన్ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన ఇప్పటికీ ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు.లోకల్ ట్రైన్లో ప్రయాణం ఇందుకే..ముంబై మహా నగరంలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అంతటి ట్రాఫిక్లో ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో టైమ్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే నిరంజన్ హీరానందని ట్రాఫిక్లో సమయాన్ని వృథా చేయకుండా ముంబై లోకల్ రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఇలా రైలులో వెళ్తున్నప్పుడు సాధారణ వ్యక్తులతో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నది ఆయన భావన."ఆయన (నిరంజన్ హీరానందానీ) తెలివిగల పెట్టుబడి వ్యూహాలు, మార్గదర్శక పరిణామాలకు ప్రసిద్ధి చెందారు. అతని ఆర్థిక విజయం రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాల అంకితభావం కృషి ప్రత్యక్ష ఫలితం" అని నిరంజన్ హీరానందానీ అధికారిక వెబ్సైట్ తెలిపింది. "ఆయన ప్రయత్నాలు ముంబై స్కైలైన్ను మార్చడమే కాకుండా, పట్టణ జీవన ప్రమాణాలను కూడా మార్చేశాయి, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, స్థిరమైన జీవనం ,విలాసవంతమైన జీవనశైలి అనేకమందికి అందుబాటులోకి తీసుకువచ్చాయి" వెబ్సైట్ పేర్కొంది.స్వీయ నిర్మిత బిలియనీర్నిరంజన్ హీరానందని సెల్ఫ్ మేడ్ బిలియనీర్గా గుర్తింపు పొందారు. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న లక్ష్యంతో సీఏ చదువును అభ్యసించిన ఆయన తర్వాత అకౌంటింగ్ టీచర్గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వాణిజ్య రంగంలో కొన్ని సంవత్సరాల తరువాత, హీరానందని తన సోదరుడితో కలిసి హీరానందని గ్రూప్ను స్థాపించారు. తరువాత 1981లో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా, హీరానందని తన దృష్టిని రియల్ ఎస్టేట్ పరిశ్రమపైకి మళ్లించి చివరికి ఆ రంగంలో తనను తాను ప్రముఖ వ్యక్తిగా స్థాపించుకున్నారు. -
నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు..
ఓ టెక్కీ ఫ్యాషన్ రంగంలోకి అడుపెట్టి అద్భుతమైన డిజైన్లను క్రియేట్ చేసి ఫ్యాషన్కే సరికొత్త అర్థం ఇచ్చాడు. మహామహా ఫ్యాషన్ డిజైనర్లకు పోటీ ఇచ్చేలా లెహాంగాలు తీర్చిదిద్ది ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏడాదికి రూ 5 కోట్ల టర్నోవర్తో దూసుకుపోతూ స్టైలిష్ రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఎవరతను..? ఎలా ఈ రంగంలోకి వచ్చారు. మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, నాన్సి త్యాగి వంటి ప్రముఖ డిజైనర్లు భారతీయ ఫ్యాషన్ని తమదైన శైలిలో పునర్నిర్వచించారు. ఆ కోవలోకి సూరత్కి చెందిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మయూర్ భరత్భాయ్(Mayur Bharatbhai) కూడా చేరిపోయాడు. ఆయన మహిళల కోసం తయారు చేసే ప్రసిద్ధ పెళ్లి లెహంగాల(Lehenga Business) బీఎల్ ఫ్యాబ్రిక్ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ మూడు రకాల ఎంబ్రాయిడరీ లెహంగాలను తయారు చేస్తుంది. థ్రెడ్వర్క్, జరీ వర్క్, సీక్విన్ వర్క్లతో రూపొందిస్తుంది. ఈ కంపెనీకి చెందిన సెమీ-స్టిచ్డ్ లెహంగాలు చాలా సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయి. ఈస్టార్టప్ వెంచర్ తన ఉత్పత్తులను సాంప్రదాయ మార్కెట్ల కంటే దాదాపు 65% నుంచి 70% వరకు తక్కువ ధరకే విక్రయిస్తుంది. అంతేగాదు వినియోగదారులు తమకు నచ్చిన రీతిలో లెహంగాలను డిజైన్ చేయించుకునే వెసులబాటు కూడా అందిస్తోది. అందుకోసం ఈ కంపెనీలో దాదాపు 25 మంది అంతర్గత కళాకారుల బృందం ఉంటారు. ప్రస్తుతం ఈ ఎల్బీ ఫ్యాబ్రిక్ వద్ద దాదాపు 200 డిజైన్ల అద్భుతమైన కలెక్షన్లు ఉన్నాయి ప్రారంభమైంది..మయూర్ తన దుస్తుల వ్యాపారాన్ని 2021లోనే ప్రారంభించారు. అంతకుముందు తన సోదరుడి దుస్తుల వ్యాపారంలో కొన్నాళ్లు పనిచేశారు. ఆయన సృజనాత్మకతతో కూడిన పనికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ ఆసక్తే ఆయన్ను సాఫ్ట్వేర్ రంగం నుంచి ఫ్యాషన్వైపు అడుగులు వేసేలా చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికి బీఎల్ ఫ్యాబ్రిక్ 10 శాతం నికర లాభల మార్జిన్తో సుమారు రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే ఈ కంపెనీ 2025 నాటికి రూ. 18 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంతేగాదు సోనీ టెలివిజన్ సీరీస్ షార్క్ట్యాంక్ ఇండియా 4(Shark Tank India 4)సీజన్లో న్యాయూమర్తులుగా వ్యవహరించే కునాల్ బహల్, రితేష్ అగర్వాల్ నుంచి కూడా 5% ఈక్విటీకి ఒక కోటి రూపాయల ఉమ్మడి షరతులతో కూడిన ఆఫర్ని అందుకుని ఎంటర్ప్రెన్యూర్గా మారారు. అంతేగాదు ఈ షో కోసం తానే స్వయంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు మయూర్. కుర్తా డిజైన్ కోసం నల్లటి ఫాక్స్ జార్జెట్ ఫాబ్రిక్ను ఎంచుకున్నారు. నీలం, గులాబీ, ఆకుపచ్చ , తెలుపు రంగుల బహుళ వర్ణ షేడ్స్లో సంక్లిష్టమైన ప్రకృతి-ప్రేరేపిత అలంకరణతో పరిపూర్ణ వైవిధ్యాన్ని అందించారు. ఒక ఇంజనీర్ ఫ్యాషన్ పరిశ్రమలో తన క్రియేషన్స్తో అద్భుతాలు సృష్టించి, ఆధాయాలు ఆర్జించడం విశేషం. View this post on Instagram A post shared by 🅑🅛 🅕🅐🅑🅡🅘🅒 (@blfabric) (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
వ్యాపారి అదృశ్యం ఘటన విషాదాంతం, శవమై తేలిన విష్ణు రూపాని
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో వ్యాపారి కిడ్నాప్ కథ విషాదంగా మారింది. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని దారుణ హత్యకు గురయ్యారు. ఎస్ఆర్ నగర్కు చెందిన ఓ కాలనీ రూపాని డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు .. రెండ్రోజుల క్రితం వ్యాపారి విష్ణురూపాని అదృశ్యంపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో ఎస్ఆర్ నగర్లో అనుమానాస్పద రీతిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు అది విష్ణు రూపానిదేనని నిర్ధారించారు.పంజాగుట్ట వ్యాపారవేత్త విష్ణు రూపాని కారు ఫైనాన్స్ వ్యవహారమే కిడ్నాప్, హత్యకు దారి తీసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు. -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి ఫిక్స్ : భలే ఇంప్రెస్ చేశాడుగా! ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
హౌస్ఫుల్ 2-స్టార్, సింగర్ షాజాన్ పదమ్సీ గుడ్న్యూస్ చెప్పేసింది. తన చిరకాల ప్రియుడు,వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. అంతేకాదు అతనితో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న షాజాన్ దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కలకాలం నీతో జీవించేందుకు ఎదురు చూస్తున్నా అని పేర్కొంది. మూవీమాక్స్ సినిమాస్ సీఈఓ, కనకియా గ్రూప్ డైరెక్టర్ ఆశిష్ను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీని, ఆశిష్ ఆకట్టుకునే అద్భుతమైన సెట్టింగ్తో తనను ఇంప్రెస్ చేసిన తీరును వెల్లడించింది. తనను తాను ఓల్డ్-స్కూల్ రొమాంటిక్ అని చెప్పుకునే షాజాన్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజాన్.ఆశిష్ అందమైన పూలతో అలకరించిన వేదికపై ఆమెకు అందంగా ప్రతిపాదించాడు. గత రెండున్నరేళ్లలో వారి చిత్రాలు జ్ఞాపకాలన్నింటినీ కలిపి కస్టమైజ్ చేసిన ఫోటో వాల్తో నవంబర్ 13న షాజాన్కు ప్రపోజ్ చేశాడు. షాజాన్ తన చిన్ననాటి స్నేహితురాలు ద్వారా ఆశిష్ని కలిసినటటు తెలిపింది. అలా సాగిన పరిచయం, డేటింగ్, పెళ్లి దాకా వచ్చిందని గుర్తు చేసుకుంది. తాము విభిన్న నేపథ్యాలనుండి వచ్చినప్పటికీ, అభిరుచులూ, ప్రధాన విలువలు ఒకటేనని తెలిపింది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లడం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ఉత్సవాలకు వెళ్లడంపై ఆసక్తి ఇద్దరికీ ఉందని వెల్లడించింది. అంతేకాదు తన కాబోయే భర్త క్రమశిక్షణ, నీట్నెస్ ఫ్రీక్ అని,ఆశిష్కు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా మెండుగా ఉందంటూ మురిసిపోయింది. View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్కు గట్టి టేప్తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్తో ఫ్రేమ్కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. వ్యాపారవేత్త ఆత్మాహుతి
బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఓ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తాళలేక బతికుండగానే ఆత్మాహుతికి పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. ప్రదీప్ హోటల్ కన్సల్టెంట్ బిజినెస్ చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ప్రదీప్ బతికుండగానే ఆత్మాహుతి చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది.బెంగళూరు నగర శివారు ప్రాంతమైన ముద్దీన్పాళ్యకు ప్రదీప్ తన స్కోడా కారులో వచ్చాడు. అనంతరం కారు సీట్లో ఉన్న ప్రదీప్ కారుకు నిప్పంటించాడు. అయితే కారు నుంచి మంటలు రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ప్రదీప్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అంనతరం బాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. On Saturday afternoon,a 42 yr old businessman Mr Pradeep was charred to death inside his car at Muddinpalya in Bengaluru. Prima Facie suggests a case of death by suicide.Police have registered the case of Unnatural Death.. pic.twitter.com/JOCTeYLBif— Yasir Mushtaq (@path2shah) November 16, 2024 -
బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్కు కోటి రూపాయల వాచ్ గిఫ్ట్
పంజాబ్లో నివాస భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్కు కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్ను బహుమతిగా ఇచ్చాడో వ్యాపారవేత్త. నాణ్యతగా, వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతలో కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా చూపిన ఖచ్చితమైన శ్రద్ధను గుర్తిస్తూ ఆయనకు ఈ బహుమతి అందించినట్లు భవన యజమాని గుర్దీప్ దేవ్బత్ చెప్పారు.కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా అందుకున్న ఈ వాచ్ 18-క్యారెట్ల బంగారంతో రూపొందించిన రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ స్కై-డ్వెల్లర్. చూడగానే బంగారు కాంతులతో ధగాధగా మెరిసిపోతున్న ఈ వాచ్కి బలమైన బంగారు లింక్లతో తయారైన సిగ్నేచర్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఉంది. అలాగే ఇందులో షాంపైన్-రంగు డయల్ కూడా ఉంది.200 మందికిపైగా కార్మికులుపంజాబ్లోని జిరాక్పూర్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం విషయానికి వస్తే ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్లోని షాకోట్కు చెందిన రూప్రా అనే కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా కార్మికులతో నిరంతరం పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు.వాస్తుశిల్పి రంజోద్ సింగ్ భవనం డిజైన్ను రూపొందించారు. దృఢమైన సరిహద్దు గోడతో ఒక ప్రైవేట్ కోటలా దీన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన హాళ్లు, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాణపరంగా విశిష్టమైన ప్రత్యేకతలెన్నో ఈ భవనంలో ఉన్నాయి. -
IT Raid : దుల్హన్ హమ్ లేజాయేంగే..
ఐటీ టీమ్ల గ్రేట్ డ్రామాదుమ్మురేపిన బారాత్బడాబాబులు బేజారు రెండేళ్ల కిందట.. మహారాష్ట్ర, జాల్నా.. ప్రధాన రహదారంతా పెళ్లి బారాత్తో నిండిపోయింది. అవును మరి.. ఒకటా రెండా.. దాదాపు 120 కార్లలో బయలుదేరారు మగపెళ్లివారు. ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అనే స్టికర్స్ని విండ్ షీల్డ్స్ మీద అతికించుకుని! పాటలు పాడుతూ, మధ్యమధ్యలో ఆ కార్లను స్లో చేసుకుంటూ.. బ్యాండ్ మేళం వాయించే బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ.. పెళ్లి కొడుకు చేత డాన్స్ చేయిస్తూ.. లోకంలోని పెళ్లి కళ, సందడంతా వాళ్లతోనే అన్నట్లుంది ఆ సంబడం! ఆ దారి పొడవున ఉన్న జాల్నా వాసులంతా ఆశ్చర్యపోయారు ‘ఎవరింటికబ్బా.. ఇంత ఘనమైన బారాత్’ అనుకుంటూ! ఓ కూడలి దాకా వెళ్లగానే ఆ 120 కార్లు అయిదు టీమ్లుగా విడిపోయాయి. ఓ టీమ్ జాల్నాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీని, ఇంకో టీమ్ టెక్స్టైల్ మిల్ను, మరో టీమ్ ఆ రెండు ఫ్యాక్టరీలకు చెందిన యజమానుల ఇళ్లను, వేరే టీమ్ ఫామ్హౌసెస్ను, ఒక టీమేమో అక్కడి కో ఆపరేటివ్ బ్యాంక్కి.. వెళ్లాయి. ఆయా చోట్లకు చేరుకోగానే ఆ బృందాల్లోని సభ్యులంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ‘ఫ్రమ్ నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్’ అని ఐడీ చూపిస్తూ రెయిడ్స్కి దిగారు. సదరు యజమానులు హతాశులయ్యారు. బ్యాంక్ వాళ్లు .. ఐటీ ఉద్యోగులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సోదాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీల్లో, ఇళ్లల్లో ఏమీ దొరకలేదు. ఫామ్హౌసెస్ను అంగుళం అంగుళం గాలించారు. అక్కడ సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి. వాటిల్లోనే లెక్కతేలని డబ్బు కోట్లలో దొరికింది. డాక్యుమెంట్స్ కూడా కనిపించాయి. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల వివరాలు తెలిశాయి. వెంటనే వీళ్లు కో ఆపరేటివ్ బ్యాంక్లో తనిఖీలో ఉన్న ఐటీ టీమ్కి సమాచారమిచ్చారు. దాంతో బ్యాంక్లోని టీమ్ పని సులువైపోయింది. ఆ వివరాల ప్రకారం అకౌంట్స్ చెక్ చేశారు. లాకర్స్లో ఉన్న నగలను తీశారు. అదే సమయంలో యజమానులకు సంబంధించి ఔరంగాబాద్, నాసిక్, ముంబైల్లో ఉన్న ఇళ్లు, ఆఫీస్లలోనూ సోదా జరిగింది. రూ. 56 కోట్ల డబ్బు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాలను సీజ్ చేశారు. మొత్తం అన్ని చోట్లా దొరికిన ఆ ఆస్తుల విలువ రూ. 390 కోట్లు. లెక్కాపత్రాల్లేని ఆ డబ్బునంతా జాల్నా స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్కి తీసుకెళ్లి లెక్కించారట. దాన్ని లెక్కించడానికి ఐటీ టీమ్కి పదమూడు గంటల సమయం పట్టింది. స్టీల్, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పేరుమోసిన వ్యాపార సంస్థలు ఎస్సార్జే పీటీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలికా స్టీల్ మాన్యుఫాక్చర్స్కి సంబంధించిన యజమానులపై జరిగిన ఈ రెయిడ్ దాదాపు అయిదురోజుల పాటు సాగింది. ఇందులో నాసిక్, పుణే, ఠాణే, ముంబై ఐటీ డిపార్ట్మెంట్లోని సుమారు 260 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జాల్నాకు చెందిన ఓ సోర్స్ ద్వారా సమాచారం అందుకున్న నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్ ఈ రెయిడ్కి రూపకల్పన చేసింది. యజమానులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. డిపార్ట్మెంట్ వాహనాలు వాడితే యజమానులు అప్రమత్తమవుతారని భావించి 120 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. అలాగే ఫార్మల్గా వెళితే వాళ్లకు ఉప్పందే ప్రమాదం ఉంటుందని అలా పెళ్లి బృందంలా తయారయ్యారు. ఆ ఆపరేషన్కి ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అని పేరుపెట్టుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ రెయిడ్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. -
భార్య ముందే వేరే యువతులతో భర్త అశ్లీల పనులు..
రాయచూరు రూరల్: ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా చేసుకున్న వైవాహిక బంధం కొందరి వల్ల నవ్వుల పాలవుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు పర వ్యామోహానికి గురై కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఆపై చట్టానికి చిక్కి ఊచలు లెక్కించే ఘటనలు ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. బెళగావి నగరంలోనూ అదే జరిగింది.చంపి, కళ్లను దానం చేసివివరాలు.. ఈ నెల 9వ తేదీన బెళగావి మహంతేష్ నగరలో నివాసమున్న పారిశ్రామికవేత్త సంతోష్ పద్మణ్ణవర్ (47) గుండెపోటుతో చనిపోయాడని ఆయన భార్య ఉమ పద్మణ్ణవర్ అందరికీ చెప్పి అంత్యక్రియలు జరిపించింది. పైగా భర్త కళ్లను దానం చేసింది. బెంగళూరులో చదువుకుంటున్న వారి కుమార్తె సంజన ఇంటికి వచ్చాక ఏదో జరిగిందని గ్రహించి 3 రోజుల కిందట స్థానిక మాళమారుతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నివ్వెరపరిచే సంగతులు వెలుగు చూశాయి. సంతోష్ నిరంతరం యువతులను ఇంటికి తెచ్చుకుని వారితో గడిపేవాడు. ఇంట్లో భార్య ముందే వారితో నగ్నంగా సంచరించేవాడు. ఇంటి సీసీ కెమెరాల 13 హార్డ్ డిస్కులను, రికార్డర్లను తనిఖీ చేయగా అవే దృశ్యాలు కనిపించడంతో కంగుతిన్నారు.విరక్తి పుట్టి..భర్త వైఖరిని చూసి భార్య ఉమకు విరక్తి పుట్టింది. ఫేస్బుక్ స్నేహితులైన ఇద్దరు యువకులు శోభిత్ గౌడ (31), పవన్ (35)కు విషయం తెలిపింది. ప్లాన్ ప్రకారం సంతోష్కు నిద్రమాత్రలు మింగించారు. నిద్రలోకి జారుకోగానే దిండుతో ఊపిరాడకుండా హత్యచేశారు. పోలీసులు ఉమ ను విచారించగా భర్త ప్రవర్తనను ఏకరువు పెట్టింది. తమ పిల్లల ముందు కూడా నగ్నంగా తిరిగేవాడని, ఇది తట్టుకోలేక తాను ఫేస్బుక్ మిత్రులతో కలసి భర్తను హత్య చేశామని నేరం అంగీకరించింది. ఆ కుటుంబం కథ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె శోభిత్ గౌడతో సన్నిహితంగా ఉండేదని గుర్తించారు.హార్డ్ డిస్కుల నిండా అవేబనశంకరి: సంతోష్ ఇంటిలో సీజ్ చేసిన హార్డ్ డిస్కుల్లో హతుడు సంతోష్ యువతులు, మహిళలతో ఉన్న ప్రైవేటు వీడియోలు అనేకం ఉన్నాయి. మహిళలతో గడుపుతూ మొబైల్తో వీడియోలు తీసుకునేవాడు. తరువాత వాటిని కంప్యూటర్లో భద్రపరిచేవాడు. నిందితులను జైలుకు తరలించారు. -
రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. స్టార్ హీరోతో సినిమా
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ దిగ్గజం రతన్ నావల్ టాటా నింగికేగిశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. మనదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు కూడా నివాళులర్పిస్తున్నారు.అయితే రతన్ నావల్ టాటా కేవలం వ్యాపారవేత్త అని మనందరికీ తెలుసు. కానీ ఆయన కళాపోషణ కూడా ఉందన్నది చాలామందికి తెలియదు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటాకు సినిమాలంటే అమితమైన ఆసక్తి. గతంలో అంటే 2004లో ఒక బాలీవుడ్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు నటించిన ఏట్బార్ అనే మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. రతన్ టాటా ఈ చిత్రాన్ని జతిన్ కుమార్తో కలిసి టాటా బీఎస్ఎస్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ఈ సినిమాను రూ. 9.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా.. కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రతన్ టాటా నిర్మించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. -
వ్యాపారి అదృశ్యం కలకలం.. బిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన కారు
బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.ముంతాజ్ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
మిడిల్ క్లాస్ అబ్బాయి.. నేడు బిలియనీర్ కుర్రాడు
అత్యంత పోటీ ఉండే వ్యాపార రంగంలో కొంతమంది సంచలనంగా దూసుకొస్తారు. అలాంటివారిలో ఒకరే పెరల్ కపూర్. ఎన్నో ఏళ్లు వ్యాపారంలో తలలు పండితేగానీ రాని గుర్తింపు, ఘనతలు ఈయన చిన్న వయసులోనే సొంతం చేసుకున్నారు. 27 ఏళ్ల వయసుకే బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. పెరల్ కపూర్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్గా నిలిచారు.ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన బిజినెస్మెన్లలో ఒకరైన పెరల్ కపూర్కు అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అలాగే బ్లాక్చెయిన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో అగ్రగామి సంస్థ అయిన జైబర్ 365 గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్గా ఉన్నారు. మరిన్ని వ్యాపారాలు స్థాపించే యోచనలో ఉన్న పెరల్ కపూర్ ప్రస్తుత నెట్వర్త్ 1.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 9,243 కోట్లు.మధ్యతరగతి కుటుంబం నుంచి..పెరల్ కపూర్ ప్రయాణం అంత సునాయాసంగా సాగలేదు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కపూర్ ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే కసితో ఉండేవాడు. కంప్యూటర్ సైన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో రాణించిన పెరల్కు చిన్ననాటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఉండేది. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత కపూర్ ప్రతిష్టాత్మకమైన క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్లో సీటు సాధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఎంఎస్ఈ చేశారు. లండన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా తన వృత్తిని ప్రారంభించి బ్లాక్చెయిన్ ఎడ్యుకేషన్, సైబర్సెక్యూరిటీలో సంచలనాత్మక వెంచర్ను స్థాపించారు.ఇంటర్న్షిప్లతో ప్రారంభంపెరల్ కపూర్ కెరియర్ దేశ, విదేశాలలోని ప్రముఖ టెక్ సంస్థలలో ఇంటర్న్షిప్లతో చాలా సాంప్రదాయ మార్గంలో ప్రారంభమైంది. లండన్లోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలోనూ ఆయన ఇంటర్న్షిప్లు చేశారు. అయినప్పటికీ ఆయనలో ఉన్న వ్యవస్థాపక స్ఫూర్తి అనతికాలంలోనే బయటపడింది. 2019లో లండన్లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 2023 మేలో జైబర్ (Zyber) 365 గ్రూప్ని స్థాపించి సాహసోపేతమైన అడుగు వేశారు.జైబర్ 365 గ్రూప్ వెంచర్ క్యాపిటల్ ప్రపంచం దృష్టిని తక్కువ రోజుల్లోనే ఆకర్షించింది. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకువచ్చారు. ప్రీ రెవెన్యూ నిధుల సేకరణలో జైబర్ 365 గ్రూప్ విశేషమైన ప్రయాణం టెక్ పరిశ్రమలో ఒక కొత్త ఉదాహరణను నెలకొల్పింది. కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతున్న ట్రెండ్ను ప్రతిబింబిస్తుంది. ఉత్పత్తులు ఇంకా మార్కెట్కు సిద్ధంగా లేకపోయినా వినూత్న ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు.నిరాడంబర జీవనశైలి పెరల్ కపూర్ ప్రస్తుతం మొనాకోలో నివసిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే పెరల్ విలాసవంతమైన జీవితానికి కాస్త దూరంగానే ఉంటారు. అంత సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. కొత్త వ్యాపార వెంచర్లతో కొత్త ఆలోచనలను తీసుకురావడానికి తన టీమ్తో కలిసి పని చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతారు. చదవడం, ప్రయాణించడంతోపాటు కొత్త సాంకేతిక పోకడలను అన్వేషించడాన్ని ఆనందిస్తారు. బుగట్టి సెంటోడీసి, కోయినిగ్సెగ్ వంటి సూపర్ కార్లంటే ఆయనకు ఇష్టం. సంగీతం వినడం, క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడటాన్ని కూడా ఇష్టపడతారు. -
పాపం ఏ కష్టమొచ్చిందో.. వ్యాపారి కుటుంబమంతా ఒకేసారి!
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై పాడుబడిన కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని స్థానిక వ్యాపారవేత్త కుటుంబంగా పోలీసులు గుర్తించారు.నామనసముద్రం గ్రామ సమీపంలో పార్క్ చేసిన వాహనం మంగళవారం సాయంత్రం నుంచి అదే స్థలంలో ఉండడం స్థానికుల పోలీసులకు సమాచారం వచ్చారు. దీంతోప రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అయితే బాధితులు విషం సేవించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.మృతులను మణికందన్ (50) కుటుంబ సభ్యులగా గుర్తించారు. చనిపోయిన వారిలో అతని భార్య నిత్య, తల్లి సరోజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నివాసముండే సేలానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో వీరి మృతదేహాలు కనిపించాయి. మెటల్ వ్యాపారంలో నష్టాలు రావడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. కారులోంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లే ఈ నిర్ణయానికి దారితీసాయా అనే కోణంలో చర్యకు నెట్టివేసి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట!
గుజరాత్కు చెందిన వ్యాపారవేత్త ఫిట్నెస్ జర్నీ ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలుస్తోంది. జిమ్కి వెళ్లకుండా, ఫ్యాన్సీ డైట్ని అనుసరించకుండానే 10 నెలల్లో 23 కిలోల బరువు తగ్గించు కున్నాడు. దీంతో అంతకుముందు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు కాస్త, నాజూగ్గా మారిపోయాడు.వ్యాపారవేత్త నీరజ్ బరువు తగ్గేందుకు ఎలా నియమాలు పాటించింది వరుస పోస్ట్ల ద్వారా ఫిట్నెస్ కన్సల్టెంట్, సతేజ్ గోహెల్ వివరించారు. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు. గోహెల్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తింటూ, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ నీరజ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకో గలిగాడు.వృత్తి రీత్యా బిజీగా ఉండే నీరజ్ మొదట తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. తరువాత కూడా అనుభవం లేక జిమ్కి వెళ్లడానికి సంకోచించేవాడు. దీంతో అతని కోసం ఇంట్లో వినియోగించుకునేలా డంబెల్స్ తయారు చేసి ఇచ్చాడు గోహెల్. అలాగే ఇంటి ఫుడ్ సాధారణ నడక అలవాటు చేశాడు. మొదట్లో నీరజ్ 10 వేల అడుగులు వేయడానికి చాలా కష్టపడే వాడు. కానీ ఆ తరువాతికాలంలో నడక అలవాటుగా మారిపోయింది.ఫలితంగా 10 నెలల్లో నీరజ్ 23 కేజీల బరువు తగ్గాడు. 91.9 కేజీల నుంచి 68.7 కేజీలకు ఆయన బరువు దిగివచ్చింది. ఆహారంలో పనీర్, సోయా చంక్స్, పప్పు, ఇతర శాఖాహార ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాడట. దీంతోపాటు చక్కెర పదార్థాలను బాగా తగ్గిం చేశాడు. ఇది పూర్తిగా టీం వర్క్, వారం వారం అతనితో టచ్లో ఉంటూ, అతనికిష్టమైన ఆహారాన్ని అందిస్తూనే, వర్కౌట్లు ప్లాన్ చేసినట్టు గోహెల్ తన పోస్ట్లో వెల్లడించాడు. అయితే దీనిపై నెటిజన్టు భిన్నంగా స్పందించారు. నీరజ్ సంకల్పాన్ని కొందరు ప్రశంసించగా, ఫిట్నెస్ పరిశ్రమ గురించి గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉందంటూ మరొకరు విమర్శించారు.ముఖ్యంగా ‘‘నో నూట్రిషనిస్ట్, నో వర్కౌట్..నో నాన్ వెజ్ ..గురూ..(పోషకాహార నిపుణుడు లేడు, వర్కౌట్లు లేవు, మాంసాహారం లేదు గురు) డైటింగ్ అస్సలే లేదు.. కేవలం చురుకైన నడక, సైక్లింగ్, రోజువారీ 900-1000 కిలోల కేలరీలు బర్నింగ్ అని మరో యూజర్ ఒక పోస్ట్ పెట్టడం గమనార్హం. -
మీకు తెలుసా? ప్రముఖ వ్యాపారవేత్తల ఫస్ట్ జాబ్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.గౌతమ్ అదానీభారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.ఇంద్రా నూయీ1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు.అర్దేషిర్ గోద్రెజ్గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్ నిలిచింది. -
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. అతనికి 93, ఆమెకు 67!
ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త, ప్రముఖ పెట్టుబడాదారుడు మీడియా దిగ్గజం రూపెర్ట్ ముర్డోక్ 93 ఏళ్ల వయసులో ఐదోసారి వివాహం చేసుకున్నారు. శనివారం ఎలెనా జుకోవా (67)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరి పెళ్లివార్త హాట్ టాపిక్గా నిలిచింది. ఇంతకీ ముర్డోక్ పెళ్లాడింది ఎవరిని? తెలుసుకుందాం ఈ కథనంలో..!న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం రూపర్ట్ మర్దోక్ లాస్ ఏంజెల్స్లోని బెల్ ఎయిర్లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్లో తన కంటే 25 ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. గత సంవత్సరం ఫాక్స్, న్యూస్ కార్పొరేషన్ బోర్డుల నుండి పదవీ విరమణ చేసిన మీడియా మొగల్, లాస్ ఏంజిల్స్లోని బెల్ ఎయిర్లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్లో ఇరువురూ జంటగా మారారు. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట మార్చిలో తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన సంగతి విదితమే.ఎమీలియా విక్స్టెడ్ రూపొందించిన అద్భుతమైన వైట్ గౌనులో మెరిసిపోగా, మర్డోక్ స్నీకర్స్ బ్లేక్ సూట్లో కనిపించారు. వీరి పెళ్లికి విచ్చసిన ప్రముఖ అతిథులలో న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రాబర్ట్ కె క్రాఫ్ట్, న్యూస్ కార్ప్ సీఈఓ రాబర్ట్ థామ్సన్ తదితరులు ఉన్నారు.ఎలెనా జుకోవా ఎవరు?మాస్కో మేధావి వర్గం కుటుంబానికి చెందిన ఎలెనా జుకోవా ఒక రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. మధుమేహం పరిశోధనలో ఆమె ప్రత్యేకతను సాధించారు. ఈ రంగంలో లాస్ ఏంజిల్స్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె విశేష కృషి చేశారు. 1991లో మాస్కో నుండి అమెరికాకు వలస వచ్చారు. రష్యన్ రాజకీయవేత్త, బిలియనీర్ ఎనర్జీ ఇన్వెస్టర్ అలెగ్జాండర్ జుకోవ్తో వివాహం, మూడేళ్ల తర్వాత వీరు విడిపోయారు. వీరికి దశా జుకోవా అనే కుమార్తె ఉంది. ఇన్నాళ్లకు జుకోవాకు మార్చిలో ముర్డోక్తో నిశ్చితార్థం జరిగింది.వాల్ స్ట్రీట్ జర్నల్, ది సన్, ది టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, హెరాల్డ్ సన్, ఫాక్స్ న్యూస్, ది డైలీ టెలిగ్రాఫ్తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా అవుట్లెట్లకు యజమాని. 2022 నాటికి అమెరికాలోని 31వ ధనవంతుడు. అలాగే ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో 71వ కుబేరుడు. రూపర్ట్ మర్దోక్ నికర విలువ 21.7 బిలియన్ డాలర్లు.ఇక మర్దోక్కు మొదట పాట్రీషియా బుకర్తో పెళ్లి కాగా 1960లో విడిపోయారు. ఆ తర్వాత మరియామన్, విన్డీ డెండ్, జెర్రీ హాల్లనూ పరిణయమాడి పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు.నాల్గవ భార్య, సూపర్ మోడల్ జెర్రీ హాల్కి 2022లో విడాకులు ఇచ్చాడు. అతగాడికి వెండి డెంగ్, అన్నా ముర్డోక్ మాన్ , ప్యాట్రిసియా బుకర్ అనే మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. గత సంవత్సరం పదవీ విరమణ అనంతరం, తన కుమారుడు లాచ్లాన్కు న్యూస్ కార్ప్లో తన ప్రధాన పాత్ర నుండి పగ్గాలను అప్పగించాడు. నలుగురు ద పిల్లలు వాటాలతో కుటుంబ ట్రస్ట్ ద్వారా కంపెనీ నిర్వహణ సాగుతోంది. -
అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది.అయితే ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతకుముందు బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అక్టోబర్ 2017లో తమ అరిన్ జన్మించింది. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఆసిన్ భర్త రాహుల్ శర్మ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్ సక్సెస్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.రాహుల్ శర్మ మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. అనంతరం కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే రాహుల్ శర్మ తన తండ్రి వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. అప్పుడు కేవలం రూ. 3 లక్షల మొదలైన వ్యాపారం ఇప్పుడేమో ఏకంగా రూ. 1300 కోట్లకు చేరుకుంది.రాహుల్ శర్మ మొదట మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి, సీఈఓగా ఉన్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి 2000 మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. ఆ తరువాత 2008లో మొబైల్ రంగంలోకి ప్రవేశించారు. 2010 నాటికి హ్యూ జాక్మాన్ బ్రాండ్ అంబాసిడర్గా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా దేశంలోనే టాప్ లో నిలిచింది. 2017లో భారతదేశపు తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లి కార్ప్ కంపెనీకి వ్యవస్థాపకుడు కూడా రాహుల్ శర్మనే. కేవలం రూ.3 లక్షలతో వ్యాపార మొదలు పెట్టి.. వందల కోట్లకు చేరుకున్న రాహుల్ శర్మ నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. అక్షయ్ కుమార్ వల్లే పరిచయం..ఆసిన్ను పెళ్లి చేసుకోవడానికి రాహుల్ శర్మకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సహకరించాడు. అక్షయ్ కుమార్, అసిన్ కలిసి నటించిన కామెడీ చిత్రం హౌస్ఫుల్ 2. అదే సమయంలో అక్షయ్ తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ శర్మకు ఆసిన్ను పరిచయం చేశాడు. అలా రాహుల్, అసిన్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆసిన్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. వీరికి ఢిల్లీలో ఫామ్హౌస్ ఉంది. అతని వద్ద ఖరీదైన బెంట్లీ సూపర్స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్య్లూ, మెర్సిడెజ్ బెంజ్, రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. -
తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు కలకలం సృష్టించాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ యువతిని అగంతకుడు బెదిరించాడు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్చేసి కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.+92 కోడ్తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ పోలీసులు.. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన బుల్లితెర నటి..!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సినీ తారలు సైతం ఈ ఏడాదిలో ఎక్కువగా వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర నటి, బిగ్బాస్ బ్యూటీ ఆర్తీ సింగ్ పెళ్లికి రెడీ అయిపోయింది. దాదాపు 39 ఏళ్ల భామ ఈనెల 25న ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ చౌహాన్ను పెళ్లాడనుంది. ఈ విషయాన్ని నటి వెల్లడించారు. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ఆర్తి సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 25న ముంబైలోని తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నట్టు ఆర్తి తెలిపారు. హల్దీ, మెహందీతో పాటు ఫెరాస్ వంటి వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే మాది అరెంజ్డ్ మ్యారేజ్ అని వెల్లడించారు. ఢిల్లీలోని గురూజీ ఆలయంలో దీపక్ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. ఈ వివాహానికి నటులు గోవిందా, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా.. ఆర్తి ప్రధానంగా మాయకా, గృహస్తి, ఉత్తరన్, ఉడాన్, పరిచయ్, ససురల్ సిమర్ కా, దేవాన్ కే దేవ్...మహదేవ్, వారిస్ లాంటి టీవీ సీరియల్స్లో నటించింది. 2019లో బిగ్ బాస్ -13 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని నాలుగో రన్నరప్గా నిలిచింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ రియాలిటీ షోలో రెండేళ్లుగా పని లేకపోవడం వల్ల డిప్రెషన్కు గురయ్యానని వెల్లడించింది. ఆర్తి ప్రస్తుతం ఉమ్మీద్ కి రోష్ని శ్రావణి అనే సీరియల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Arti singh sharma (@artisingh5) -
కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేయనున్న బంగారం హీరోయిన్
మాఘమాసం వచ్చేసింది.. పెళ్లి సంబరాలు తెచ్చేసింది.. ఇప్పటికే ఒక్కొక్కరుగా మూడుముళ్ల బంధంలో అడుగుపెడుతుండగా, పలువురూ వారి పెళ్లికి ముహూర్తం పిక్స్ చేసుకుంటున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 21న) రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా తాజాగా మరో బ్యూటీ మీరా చోప్రా వివాహానికి రెడీ అవుతోంది. ఈ ఏడాది కొత్త జీవితం మొదలుపెడతానని గతంలోనే హింటిచ్చింది. అన్నట్లుగానే మార్చి 11 లేదా 12న జైపూర్లో పెళ్లి చేసుకోనుందట! ఇప్పటికే మీరాతో పాటు ఆమె కుటుంబం పెళ్లి పనుల్లో తలమునకలైందట! తన పెళ్లికి 150 మందికిపైగా అతిథులు హాజరవుతారంది మీరా చోప్రా. పెళ్లి తర్వాత సెలబ్రిటీలు, బాలీవుడ్లోని ఫ్రెండ్స్ కోసం ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తానంటోంది. ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్ ప్రియాంక, పరిణీతి చోప్రాకు కజిన్ అవుతుంది. కాగా మీరా చోప్రా 2005లో అన్బే ఆరుయిరే అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బంగారం, మారో, వాన, గ్రీకువీరుడు సినిమాలు చేసింది. ద టాటూ మర్డర్డ్స్ అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రపంచంలోనూ అడుగుపెట్టింది. ఆమె నటించిన సఫేద్ మూవీ ఈ గతేడాది జీ5లో అందుబాటులోకి వచ్చింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
రాముడు మతాన్ని మించిన వ్యక్తి - ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే పారిశ్రాక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టవేళ ఒక ఫోటోను తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం. ఈ రోజు నా మండే మోటివేషన్ ఆశ్చర్యం కలిగించలేదు, ఎందుకంటే అయోధ్య రాముడు మతాన్ని మించిన వ్యక్తి, ఒకరి విశ్వాసం ఏమైనప్పటికీ.. మనమందరం గౌరవంగా, మంచి విలువలతో జీవించడానికి అంకితమైన వ్యక్తి భావనకు ఆకర్షితులౌతాము. అతని బాణాలు చెడును, అన్యాయాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రామరాజ్య పాలన అనేది సమాజం ఆకాంక్ష, రామ్ అనే పదం ప్రపంచానికి చెందినదని.. ఆనంద్ మహీంద్రా రాముని ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ.. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్.. వేలమందిని ఆకర్శించింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. యావత్ భారతదేశం మొత్తం ఈ రోజు రామ నామం జపిస్తోంది. ఈ రోజు అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆనంద్ మహీంద్రా కూడా హాజరుకానున్నారు. It won’t surprise you that my #MondayMotivation this morning is the #MaryadaPurushottam Lord Ram. Because he is a figure that transcends Religion. No matter what one’s faith, we are all drawn to the concept of a being that is dedicated to living with honour and with strong… pic.twitter.com/MLX4tWYsft — anand mahindra (@anandmahindra) January 22, 2024 -
ట్రాన్స్ జెండర్పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
Vibrant Gujarat: తొలిరోజే రూ.2.35 లక్షల కోట్లు!
గాంధీనగర్: గత రెండు దశాబ్దాలుగా వైబ్రంట్ గుజరాత్ సదస్సు అంతర్జాతీయ బిజినెస్ నెట్వర్కింగ్ ఈవెంట్గా ఆవిర్భవించింది. తద్వారా కార్పొరేట్ ప్రపంచం నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటోంది. తాజాగా 10వ వైబ్రంట్ గుజరాత్(2024) సదస్సులో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, సుజుకీ మోటార్ కార్ప్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తదితరులు పెట్టుబడులకు ఆసక్తిని ప్రదర్శించారు. వెరసి తొలి రోజే రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. దేశ, విదేశీ దిగ్గజాల నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటున్న రాష్ట్రాలలో గుజరాత్ ఒకటిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం.. రిలయన్స్.. కార్బన్ ఫైబర్ ప్లాంట్ హజీరాలో దేశంలోనే తొలి కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్ కేంద్రంగా రిలయన్స్ కార్యకలాపాలు కొనసాగనున్నట్లు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో ప్రపంచస్థాయి ఆస్తులు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో దేశవ్యాప్తంగా 150 బిలియన్ డాలర్లు(రూ. 12 లక్షల కోట్లు) వెచ్చించినట్లు వివరించారు. వీటిలో మూడో వంతు పెట్టుబడులను గుజరాత్లోనే చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ ప్రాంతానికి తామిస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించారు. టాటా.. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఈ ఏడాది(2024) చివరిలో నూతన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దేశీయంగా చిప్స్ తయారీకి ప్రధాని మోడీ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ సాణంద్లో లిథియమ్ అయాన్ బ్యాటరీల తయారీ కేంద్రానికి తెరతీయనున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దశలో 20 గిగావాట్ స్టోరేజీ బ్యాటరీ సామర్థ్యంతో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఎలక్ట్రిక్ వాహనా (ఈవీ)లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు వివరించారు. రెండు దశలలో చేపట్టనున్న ప్రాజెక్ట్ పనులు రెండు నెలల్లోగా ప్రారంభంకానున్నట్లు తెలియజేశారు. ఆర్సెలర్మిట్టల్.. అతిపెద్ద స్టీల్ప్లాంట్ ప్రపంచంలోనే ఒకే ప్రాంతంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీని హజీరాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్సెలర్మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ పేర్కొన్నారు. జేవీ ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ద్వారా 2029కల్లా ప్లాంటు నిర్మాణం పూర్తికాగలదని తెలియజేశారు. ప్లాంటును వార్షికంగా 2.4 కోట్ల టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. 2026లో తొలి దశ ప్రారంభంకావచ్చని తెలియజేశారు. మైక్రాన్.. రూ. 6,760 కోట్లు సెమీకండక్టర్ల తయారీలో భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా నిలపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా ప్రశంసించారు. ఈ యూఎస్ చిప్ తయారీ దిగ్గజం సాణంద్లో 2.75 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ ప్లాంటు నిర్మాణాన్ని సెప్టెంబర్లోనే ప్రారంభించింది. పెట్టుబడుల్లో మైక్రాన్ 82.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,760 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. మిగిలిన నిధులను ప్రభుత్వం రెండు దశలలో సబ్సిడీ రూపంలో సమకూర్చనుంది. -
సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన ఎన్నో సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో మహమ్మద్ అలీకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో 10 సెకన్లలో ప్రత్యర్థి 21 పంచ్ల నుంచి తప్పించుకోవడం చూడవచ్చు. ఈ సంఘటన ఒకప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ 2023లో ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడగలిగాము. మొత్తానికి 2023 ముగియనుంది. రాబోయే కొత్త సంవత్సరం 2024లో సందడి చేయడానికి సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. The world in 2023. It managed to survive a flurry of potential knock-out blows. We’re all alive and ready to rumble in ‘24. Bring it on… (Muhammad Ali. Dodging 21 punches from Dokes in 10 seconds) pic.twitter.com/MpZa60R5kv — anand mahindra (@anandmahindra) December 29, 2023 -
ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అధికారులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త టెక్నాలజీ ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ట్రాలీలు టెర్మినల్ చుట్టూ ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా.. విమానాశ్రయ ప్రవేశ మార్గాలు, బయలుదేరే సమయం, గేట్లకు రూట్, ఆఫర్స్ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేస్తూ చాలా సహాయపడతాయి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో 3 వేల బ్యాగేజీ ట్రాలీలు ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీ సదుపాయాన్ని తొలిసారిగా మ్యూనిక్ ఎయిర్పోర్టులో తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కావడం విశేషం. వినియోగదారు ఈ ట్రాలీని నో జోన్ ఏరియాలోకి తీసుకెళ్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఫ్లైట్ లేట్ అయితే కూడా ముందస్తుగా నోటిఫికేషన్ రూపంలో డిస్ప్లే చేస్తుంది. ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే? ఈ ట్రాలీపై ఉన్న డ్యాష్ బోర్డులో మన బోర్డింగ్ పాస్ వివరాలను ఎంటర్ చేస్తే.. ఫ్లైట్ టైమింగ్స్తో పాటు గేట్ నంబర్ వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. గేట్ వద్దకు చేరుకొనే మార్గాన్ని కూడా అదే చూపుతుంది. బోర్డింగ్కు టైమ్ ఉంటే షాపింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో షాపులు, దాని వివరాలు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటితో పాటు వాష్ రూంలు, రెస్టారెంట్లు, ఫుడ్ వివరాల గురించి వివరాలు కనిపిస్తాయి. ఆనంద్ మహీంద్రా ట్వీట్.. స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ టెక్నాలజీ చాలా బాగుందని, విదేశాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ చూడలేదని ఇది 'ప్రెట్టీ కూల్' అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిపైన తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. That IS pretty cool. I’ve never encountered such trolleys in overseas airports…but I may be wrong. Are we truly amongst the very first to introduce these? 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/IEbZVI4BbM — anand mahindra (@anandmahindra) December 15, 2023 -
దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్ (ట్విటర్)లో వాణిజ్య ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు అమెరికన్ సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. దీనిపైన తాజాగా మస్క్ స్పందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. అమెరికన్ కంపెనీలైన యాపిల్, డిస్నీ, ఐబీఎం, ఒరాకిల్, లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్, బ్రావో టెలివిజన్ నెట్వర్క్, కామ్కాస్ట్ ఇక మీద ఎలాంటి ప్రకటనలు ఇవ్వబోమని గత వారంలో వెల్లడించాయి. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేఖ పోస్టులు వెల్లువెత్తాయి. వీటికి మస్క్ మద్దతు పలకడంతో అగ్రరాజ్యం మండిపడింది. ఇది యూదు కమ్యూనిటినీ ప్రమాదంలో పడేస్తుందని మస్క్ తీరుపైన మండిపడ్డారు. ఈ కారణంగానే దిగ్గజ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ప్రకటనలు నిలిపివేస్తామన్న కంపెనీలపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా తీసుకుని, బెదిరించాలనుకున్నట్లు, అలాంటి ప్రకటనలు తమకు అవసరం లేదని.. వెళ్లాలనుకునే వారి వెళ్లిపోవచ్చని కఠినంగా వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలపై సదరు కంపెనీలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సిన విషయం. -
రూ.7250 కోట్లు విరాళం ప్రకటించిన వారెన్ బఫెట్ - ఎవరికో తెలుసా?
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'వారెన్ బఫెట్' (Warren Buffett) గతంలోనే తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని వెల్లడించారు. అన్నమాట ప్రకారమే చేస్తున్న బఫెట్ తాజాగా స్వచ్ఛంద సంస్థలకు 876 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్షైర్ హాత్వే షేర్లను అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ తమ పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు వేలకోట్లు విరాళాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగానే గత మంగళవారం 876 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7250 కోట్లు) షేర్లను గిఫ్ట్గా ప్రకటించారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. వారెన్ బఫెట్ భార్య పేరు మీద ఉన్న 'సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్'కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్లను ప్రకటించారు. తమ పిల్లలు నిర్వహిస్తున్న మూడు ఫౌండేషన్లకు (షేర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్) ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చేసారు. గత ఏడాది కూడా భారీ షేర్లను విరాళంగా అందించారు. -
వ్యాపారి భార్యపై దొంగల అఘాయిత్యం: సిగరెట్లతో కాల్చి టార్చర్
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతని భార్యను గ్యాంగ్ రేప్ చేసి, సిగరెట్లతో కాల్చిన ఘటన సంచలనం రేపింది. యూపీ బిజోర్లోని నగీనా దేహత్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచరం పెయింట్-హార్డ్వేర్ హోల్సేల్ వ్యాపారి తన తల్లి ,పిల్లలతో కలిసి మందులు కొనడానికి బయటకు వెళ్లారు. అదును చూసిఇంట్లోకి చొరబడిన ఐదుగురు దొంగలు మహిళపై దాడి చేసి, ఆమెను కట్టేసి, సిగరెట్ పీకలతో కాల్చి టార్చర్ పెట్టారు. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె స్పృహ తప్పడంతో ఇంట్లోని అల్మారాల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, సుమారు రూ. 1.5 లక్షల విలువైన నగదును దోచేశారు. అనంతరం ఇంట్లో ఉన్న స్కూటర్తో అక్కడినుంచి పరారయ్యారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వైద్య పరీక్షల కోసం పంపించామని రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ రామ్ అర్జ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
అంబానీని బెదిరించింది తెలంగాణ కుర్రాడే! ఏం జరిగిందంటే..
Threat emails to Mukesh Ambani: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్లు పంపిన వ్యక్తిని ముంబై గాందేవి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించిన పోలీసులు అతడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించినట్లు తెలిపారు. గత వారంలో ముఖేష్ అంబానీకి ఐదు బెదిరింపు ఈమెయిల్లు వచ్చాయని, కోట్ల కొద్దీ డబ్బు డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని పోలీసులు తెలిపారు. “ఇది కొంతమంది టీనేజర్లు చేసిన అల్లరి పనిగా తెలుస్తోంది. మా దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం ” అని ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ‘బిజినెస్మేన్’ సినిమాలో మాదిరిగా.. 2012లో వచ్చిన మహేష్బాబు సినిమా ‘బిజినెస్మేన్’ను నిందితుడు ఫాలో అయినట్టున్నాడు. అందులో హీరో ముంబైలో బడా వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు సంపాదిస్తాడు. అచ్చం అలాగే ఈ నిందితుడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ఈమెయిల్స్ ద్వారా రూ.కోట్లు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు. మా దగ్గర మంచి షూటర్లున్నారు.. గత అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే పేరుతో ముఖేష్ అంబానీకి మొదటి బెదింపు ఈమెయిల్ వచ్చింది. “మీరు (అంబానీ) మాకు రూ. 20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం. మా వద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్లు ఉన్నారు” అని అందులో పేర్కొన్నారు. తర్వాత మరొక ఈమెయిల్ వచ్చింది. అందులో మొదటి ఈమెయిల్ స్పందించనందుకు రూ. 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. "డిమాండ్లు నెరవేర్చకపోతే, డెత్ వారెంట్ (అంబానీకి) జారీ అవుతుంది" అని బెదిరించారు. అక్టోబర్ 31న అంబానీ అధికారిక ఈమెయిల్ ఐడీకి మూడో ఈమెయిల్ పంపించిన నిందితుడు ఈ సారి రూ.400 కోట్లు డిమాండ్ చేశాడు. నవంబర్ 1, 2 వ తేదీల్లో కూడా అలాంటి మరో రెండు ఈమెయిల్లు వచ్చాయి. ఈమెయిల్స్లోని ఐపీ అడ్రస్లను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
అదే నిజమైతే బిలియనీర్కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే?
ఇటలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లంబోర్ఘిని కారు ప్రమాదంలో చిక్కుకుందని, ఈ సంఘటనలో వారు గాయపడగా, ఒక ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుని అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ సంఘటన మీద విచారణ జరుగుతోంది. నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఒబెరాయ్ దోషిగా తేలితే సుమారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగంలో కోట్లు సంపాదిస్తున్న బిలియనీర్ వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారుని.. ఫెరారీ కారు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. రోడ్డుపై అనేక సూపర్ కార్లు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఒబెరాయ్ తన భార్యతో లంబోర్ఘిని కారులో ముందు వెళ్తున్న ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేయడానికి వెళ్తాడు, అదే సమయంలో వెనుక వస్తున్న ఫెరారీ కారు లంబోర్ఘినిని ఓవర్టేక్ చేయడానికి వెళ్ళింది. ఈ సందర్భాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. ఈ ప్రమాదంలో ఫెరారీ కారులోని ఇద్దరు స్విస్ వ్యక్తులు మరణించారు, కాగా ఒబెరాయ్ అతని భార్య గాయత్రి జోషి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒబెరాయ్ వేగవంతమైన ఫెరారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వికాస్ ఒబెరాయ్పై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
నకిలీ వెబ్సైట్లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే?
ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు చాలా పెరిగిపోయాయి. ఆదమరిస్తే డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. ఇలాంటి సంఘటలను గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరుకు చెందిన 43ఏళ్ల వ్యాపారవేత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో భాగంగా నకిలీ కేఎఫ్సి వెబ్సైట్లో రూ. 11 లక్షలు కోల్పోయాడు. దీనిపైన ఈస్ట్ CEN పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి అతడు ఫ్రాంచైజీని కొనుగోలు చేసి నగరంలో అవుట్లెట్ను ఏర్పాటు చేయడానికి కేఎఫ్సి సంప్రదింపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసారు. అతడు ఓపెన్ చేసిన కేఎఫ్సి వెబ్సైట్ అతనికి సంబంధించిన వివరాలు కోరింది. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. వారు కేఎఫ్సి ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. వారు అతనితో మాట్లాడిన తరువాత ఒక ఇమెయిల్ వచ్చింది. దీని ద్వారా కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. దాదాపు ఒక నెల రోజులు సంభాషణ తరువాత అతని అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి డబ్బు అడిగారు. నిజమని నమ్మిన వ్యాపారవేత్త రూ. 11.8 లక్షలు బదిలీ చేసాడు. వారికి డబ్బు పంపిన తరువాత వారు ఎటువంటి సమాచారం అందించకపోగా.. ఆ కాంటాక్ట్ నంబర్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించి.. మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో పోలీసులకు పిర్యాదు చేసాడు. కేఎఫ్సి నోటీసు: కేఎఫ్సి తన అధికారిక వెబ్సైట్లో ఇటువంటి మోసాలు & నకిలీ కేఎఫ్సి ఫ్రాంచైజీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేసింది. బ్రాండ్ పేరుతో మోసం చేసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా మోసపూరిత వెబ్సైట్లు ఉన్నాయని తెలిపింది. కావున వినియోగదారులు చాలా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది. -
నిజమైన ఇంజనీర్ నమ్మేది ఇదే! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
మనిషి అనుకుంటే కొండను సైతం పిండి చేస్తాడనే మాటకు నిలువెత్తు నిదర్శనం 'దశరథ్ మాంఝీ' (Dashrath Manjhi). పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, టెక్నాలజీ గురించి తెలియదు.. కానీ ఈ పేరు తెలియని వారు భారతదేశంలో దాదాపు లేదు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే నేడు దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈయన గురించి ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న ఒక కొండను ఒక సాధారణ మనిషి 22 సంవత్సరాలు పాటు శ్రమించి నిలువుగా చీల్చి రోడ్డు మార్గం ఏర్పాటు చేసాడు. దీంతో ఈ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 61 గ్రామాలు ఈ రోడ్డుని ఉపయోగించుకుంటున్నాయి. దశరథ్ మాంఝీ, పేరు కోసమో.. ప్రతిష్ట కోసమో, డబ్బు కోసమో పని చేయలేదు. మొదట ఈ పని తన భార్య కోసం ప్రారభించినప్పటికి.. చివరికి గ్రామం కోసం పాటుపడ్డారు. చివరకు అనుకున్నది సాధించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాంఝీ సేవకు మెచ్చి ఆ రహదారికి మాంజీ మార్గ్ అని పేరు పెట్టింది. ఒక సందర్భంలో ఆయనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించాడు. ఇంజినీరింగ్ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా.. దశరథ్ మాంఝీని ఉద్దేశించి, నేను ఈ వ్యక్తి నమస్కరిస్తున్నాను, అంటూ.. అతడు ఇంజినీర్ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందలేదు, కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, ఎటువంటి యంత్రాలను రూపొందించలేదు, కానీ నిజమైన ఇంజనీర్ నమ్మేదాన్ని అతను నమ్మాడు. అనుకుంటే ఏదీ అసాధ్యం కాదంటూ తెలిపాడు. ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు! ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది లైక్ చేయగా.. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆనంద్ మహీంద్రా గతంలో ఈయనకు కంపెనీ ట్రాక్టర్ గిఫ్ట్గా అందించాడు. అప్పట్లో ఈ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. On #EngineersDay2023 I bow low to this man. No, he wasn’t an engineer. No, he didn’t graduate from any Institute of Technology. No he wasn’t even computer literate nor did he design any machines. But he believed what every true Engineer believes:: “NOTHING is impossible.” https://t.co/zwyDe4Swr0 — anand mahindra (@anandmahindra) September 15, 2023 -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోనే రైతుల ఆర్థిక ప్రగతి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కె. తారక రామా రావు ఆదివారం షికాగోలో ఫుడ్ ప్రాసె సింగ్ రంగంపై అధ్య యనం చేశారు. ఇందులో భాగంగా పలు కంపెనీల ప్రతినిధుల తో పెట్టుబడులకు సంబంధించి వరుస సమావేశాలు నిర్వహించారు. ‘‘షికాగో ఫుడ్ స్టాప్‘ను సందర్శించి అక్కడ వరల్డ్ బిజినెస్ షికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లా డారు. షికాగో ఫుడ్ స్టాప్లో ఏర్పాటు చేసిన అనేక షాపులను పరిశీలించారు. స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. షికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతులపైన చర్చించారు. షికాగో ఫుడ్ స్టాప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. షికాగో ఫుడ్ స్టాప్ మాదిరి తెలంగాణలో కూడా.. షికాగో ఫుడ్ స్టాప్ మాదిరిం ఫుడ్ ప్రాసెసింగ్ పురోగతికి తెలంగాణ ఫుడ్ స్టాప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నో వేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉందని, ఇది కేవలం ఫుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంపైన ఆధార పడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఫుడ్ ఇన్నోవేషన్ హబ్గా మారేందుకు కావలసిన అన్ని రకాల అవకాశాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ బలోపేతానికి.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఆ మేరకే తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కోకా కోల, పెప్సీకో, ఐటీసీ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం పదివేల ఎకరాలకు పైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కేటీఆర్ వివరించారు. నిజామాబాద్ ఐటీ హబ్లో క్రిటికల్ రివర్ సంస్థ నిజామాబాద్ ఐటీ హబ్ లో అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు అంగీకరించిన్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. -
రూ. 600 జీతం.. ఐఏఎస్ కొడుకు - ఎవరీ అజయ్ చౌదరి!
HCL Co Founder Ajai Chowdary Success Story: ఈ రోజు మనకు 'ఫాదర్ ఆఫ్ హార్డ్వేర్ ఇన్ ఇండియా' అని చెప్పగానే 'అజయ్ చౌదరి' గుర్తుకు వస్తారు. అయితే ఈయన ఎవరు? ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి ఎదగటానికి చేసిన కృషి ఏమిటి? ఆయన సంపాదన వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 600 జీతానికి.. నిజానికి 'అజయ్ చౌదరి' ఒక ఐఏఎస్ అధికారి కొడుకు, ఇతడు ఒకప్పుడు రూ. 600 జీతానికి ఉద్యోగం చేసాడు. అయితే ఈ రోజు భారతదేశ ఐటి రంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. HCL టెక్నాలజీస్ వ్యవస్థాపక సభ్యులలో ఈయన కూడా ఒకరు కావడం గమనార్హం. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చి శరణార్థి శిబిరంలో నివసించిన కుటుంబానికి చెందిన అజయ్ చౌదరి ఈ రోజు కోటీశ్వరుల జాబితాలో ఒకరుగా నిలిచారు. జబల్పూర్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చౌదరి తన కెరీర్ను ప్రారంభించాడు. మైక్రో కాంప్ ప్రారంభం.. భారతీయ సాంకేతిక విప్లవంలో అతిపెద్ద వాటాదారులలో ఒకరుగా ఎదిగిన చౌదరి DCM డేటా ఉత్పత్తుల విక్రయాలలో వృత్తిని ప్రారంభించిన తరువాత నాడార్ & మల్హోత్రాతో ఏర్పడ్డ పరిచయం ఈయన జీవితాన్ని మార్చివేసింది. వీరు మొదటి స్టార్ట్ చేసిన కంపెనీకి 'మైక్రో కాంప్' అని పేరుపెట్టారు. ఆ తరువాత వీరు 1970లో హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్కి మరింత చిన్నగా 'HCL' అని నామకరణం చేశారు. ఇదీ చదవండి: ఆలోచన ఏదైనా ఇట్టే పట్టేస్తుంది.. మైండ్ రీడింగ్ టెక్నాలజీలో ఏఐ ముందడుగు! అంతర్జాతీయ విస్తరణ.. కేవలం రూ. 1.8 లక్షలతో ప్రారంభమైన హెచ్సీఎల్ నేడు ఏకంగా రూ. 3,20,000 కోట్ల మార్కెట్ క్యాప్తో దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. మొదట్లో విక్రయాలకు సంబంధించి చౌదరి నాయకత్వం వహించారు. ఆ తరువాత అనతి కాలంలోనే అంతర్జాతీయంగా విస్తరించారు. ఇదీ చదవండి: ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక.. యూఐడీఏఐ కీలక ప్రకటన పద్మభూషణ్.. 1999 - 2012 మధ్య హెచ్సిఎల్ ఛైర్మన్గా కూడా అజయ్ చౌదరి పనిచేశారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ పాట్నా వంటి సంస్థల బోర్డుల్లో పనిచేశారు. అంతే కాకుండా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) ఛైర్మన్గా.. ఐటీ మంత్రిత్వ శాఖ కోసం సెమీకండక్టర్ల సలహా బోర్డులో సభ్యుడుగా కూడా పనిచేశాడు. 2011లో భారత ప్రభుత్వం ఈయన సేవలకుగాను పద్మభూషణ్ అవార్డుని అందించింది. -
లెజెండ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కాస్తా లేటయింది అంతే!
లెజెండ్ శరవణన్ ఈ పేరు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒకే ఒక్క సినిమాతో ఎంట్రీ అందరినీ ఆకట్టుకున్నారు. వ్యాపారవేత్త అయినప్పటికీ నటనపై మక్కువతో లెజెండ్ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ శరవణన్కు మాత్రం ఓ రేంజ్ గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత కాస్తా సైలెంట్ అయిన ఆయన.. మళ్లీ వార్తల్లో నిలిచాడు. మరో చిత్రం చేసేందుకు రెడీ అయిపోయారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: సలార్తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా?) ఆగస్టు 15న 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లెజెండ్ శరవణన్ తమిళనాడులోని ఓ పాఠశాలలో ప్రత్యక్షమయ్యారు. పిల్లలతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్న శరవణన్.. వారందరికీ గిఫ్ట్స్ అందజేశారు. అంతేకాకుండా పిల్లలతో కలిసి జైలర్ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. అంతేకాకుండా ఆయన ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కాగా మీరు మళ్లీ ఎప్పుడు చిత్రంలో నటిస్తారు? అని పిల్లలు అడగడంతో.. త్వరలోనే కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కథ రెడీ కావడానికి కాస్తా టైం పట్టిందని లెజెండ్ శరవణన్ ప్రకటించారు. చిన్న పిల్లల మధ్య ఈ విషయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ తాజా చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. (ఇది చదవండి: జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార.. అసలేమైంది?) அடுத்த படத்தின் அப்டேட்டை குழந்தைகளுடன் பகிர்ந்த தருணம்#Legend #Legendsaravanan @yoursthelegend pic.twitter.com/LocspXpDuX — Legend Saravanan (@yoursthelegend) August 15, 2023 -
రణ్వీర్ సింగ్ రీల్ లగ్జరీ బంగ్లా: రియల్ ఓనర్ ఎవరో తెలిస్తే షాకవుతారు
Rocky RandhawaParadise: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ,స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిట్టాక్ సొంతం చేసుకుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ మూవీలో ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ లాంటి బి-టౌన్కు చెందిన ప్రముఖులు నటించిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం విడుదలైనప్పటి నుంచి రణ్వీర్ సింగ్ పాత్ర నివసించిన లగ్జరీ బంగ్లా హాట్ టాపిక్గా నిలిచింది. ‘రాకీ రంధావా పారడైజ్’ గా సినిమాలో చూపించిన సుందరమైన 'రాకీ రాంధావా' భవనంలోని అద్బుతమైన షాట్లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే ఈ భవనంలోని దృశ్యాలు మంత్రముగ్దులను చేశాయి. షెహజాదా మూవీ చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగిందట. విలాసవంతమైన భవనం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిఅందమైన భవనం లండన్లో ఉందని కొందరు , స్విట్జర్లాండ్లో ఉందని సినీ ప్రియులు ఊహాగానాలు చేశారు. కానీ ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది, ఇందులో విశేషాలేంటి తెలుసుకుందా రండి! గౌర్ మల్బరీ మాన్షన్స్ స్వర్గధామంగా చిత్రీకరించిన ‘రాకీ రంధావా’ అసలు పేరు ది గౌర్ మల్బరీ మాన్షన్స్ ఇదిగ్రేటర్ నోయిడా సెక్టార్-1లో ఉంది. దాదాపు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు ఈ ఐకానిక్, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ భవనాన్ని కూడా పోలి ఉంటుందని కూడా అంచనా. ఫర్నీచర్, కళాఖండాలు, అలంకార వస్తువులు, ఫ్లోరింగ్, షాన్డిలియర్లు, కిటికీలు, మిర్రర్.. ఒకటేమిటి సర్వం పచ్చదనానికి మారు పేరుగా ఉన్నాయి. గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,ఎండీ మనోజ్ గౌర్ బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ సొంతంఈ గౌర్ మల్బరీ మాన్షన్స్ . రియల్ ఎస్టేట్ దిగ్గజం మనోజ్ క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మరియు క్రెడాయ్ (NCR) అధ్యక్షుడు కూడా. గత 28 సంవత్సరాలుగా, గౌర్స్ గ్రూప్కు లీడ్ చేస్తున్న మనోజ్ అనేక ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తిచేశారు. డెలివరీ నుంచి నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్ల నాణ్యతతోపాటు అందుబాటులో ధరల్లో గృహాలను అందిస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మాత్రమేకాదు మనోజ్ గౌర్ కూడా పర్యావరణ పద్ధతులను పాటించడంలోనూ దిట్ట. సోలార్ పవర్ ప్లాంట్లో రూ.80 కోట్లు పెట్టుబడులున్నాయి.. -
ఇన్స్టాలో భార్యకు విపరీతమైన ఫాలోవర్స్ .. అనుమానంతో భర్త కిరాతకం
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూసి అసూయ, అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా చంపాడు భర్త... కన్న పిల్లల ఎదుటే భార్య గొంతు నులిమి హత్య చేశాడు. వివరాలు.. లక్నోలోని పారా ప్రాంతంలో వ్యాపారవేత్తకు భార్య 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి భార్య గృహిణి. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంతేగాక ఇన్స్టాగ్రామ్లో భార్య తనను బ్లాక్చేయడంతో భర్తకు కోపం వచ్చింది. తన భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందని, తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను సోషల్ మీడియా ఫాలోవర్స్ కలుస్తున్నారన్న అనుమానం ఏర్పడింది. ఈ విషయం భార్య, భర్తల మధ్య గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఆదివారం పిల్లలతో కలిసి కారులో రాయ్బరేలికి బయలుదేరారు. మధ్యలోనే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే వైపు కారును తిప్పాడు. నిందితుడు మధ్యలో సుల్తాన్పూర్లోని ముజేష్ కూడలి దగ్గర కారు ఆపాడు. అక్కడ తన భార్యతో సోషల్ మీడియా వ్యవహారంపై వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అదే వాహనంలో లాక్ చేసుకుని ఉండిపోయాడు. ఊహించని ఘటనతో పిల్ల్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తల్లి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే.. అనుమానాస్పదంగా కారు పార్కింగ్ చేయడంతో పెట్రోలింగ్ బృందం ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీలు చేపట్టగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమ కళ్ల ముందే తల్లిని దారుణంగా చంపాడని కుమార్తె, కుమారుడు తెలిపారు. వారి వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్ - ఫైట్కి ముందే సర్జరీ అవసరం అంటూ..
Elon Musk Tweet: ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్బర్గ్ మధ్య కేజ్ ఫైట్ జరగనున్న సంగతి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇంతలో మస్క్ చేసిన ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా.. నేను రేపు నా మెడ, అప్పర్ బ్యాక్ ఎమ్ఆర్ఐ చేయించుకుంటున్నాను, బహుశా సర్జరీ అవసరం కావొచ్చు అంటూ ట్వీట్ చేసాడు. ఖచ్చితమైన డేట్ ఈ వారంలో తెలుస్తుందన్నాడు. ఇప్పటికే ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అంతే కాకుండా ఈ పోరాటానికి తానూ పూర్తిగా సిద్దమవుతున్నట్లు, అయితే వర్కవుట్ చేసే సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మస్క్ జుకర్బర్గ్తో "కేజ్ ఫైట్ కోసం సిద్ధంగా ఉన్నాను" అని పేర్కొన్నాడు, దానికి "నాకు లొకేషన్ పంపండి" అని బదులిచ్చాడు. కాగా జుకర్బర్గ్ తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. ఇక వీరి కేజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. Exact date is still in flux. I’m getting an MRI of my neck & upper back tomorrow. May require surgery before the fight can happen. Will know this week. — Elon Musk (@elonmusk) August 7, 2023 -
గెలిచింది 5 కోట్లు.. పోగొట్టుకుంది 58 కోట్లు..
ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆన్లైన్లో జూదమాడి 5 కోట్లు సంపాదించాడు. తక్కువ సమయంలో కూర్చున్న చోట కూర్చుని ఉండగానే కోట్లు కొల్లగొట్టడంతో ఇదేదో బాగుందనిపించి అదేపనిగా గ్యాంబ్లింగ్ ఆడాడు. ఇంకేముంది చూస్తుండగానే 58 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగ్పూర్కు సమీపంలోని గొండా సిటీకి చెందిన అనంత్ అలియాస్ శొంటు నవరతన్ జైన్ బాధితుడైన వ్యాపారస్తుడికి గ్యాంబ్లింగ్ లో ఆనతి కాలంలోనే కోట్లు గడించవచ్చని ఆశ చూపించాడు. మొదట్లో వెనకడుగు వేసిన వ్యాపారి తరవాత ఎందుకో నవరతన్ జైన్ ప్రలోభానికి లొంగిపోయాడు. వెంటనే జైన్ కు హవాలా ద్వారా రూ.8 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. జైన్ వ్యాపారికి వాట్సాప్లో ఒక లింకు పెట్టగా దాని ద్వారా తన అకౌంట్లో రూ. 8 లక్షలు డిపాజిట్ అయినట్టు చూపించింది. దీంతో వ్యాపారికి ఆశతో పాటు నమ్మకం కూడా కలిగింది. ఆలస్యం చేయకుండా వెంటనే గ్యాంబ్లింగ్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో హస్తవాసి కలిసొచ్చి 5 కోట్లు లాభం సంపాదించాడు. అక్కడ వరకు అంతా బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు జూదం. ఒక్కొక్కటిగా సంపాదించిన ప్రతి రూపాయి వెనక్కి పోవడం మొదలైంది. పోయిన రూపాయిని తిరిగి రాబట్టుకోవాలన్న అతడి తాపత్రయం ఏకంగా 58 కోట్లు నష్టపోయేలా చేసింది. ఎంత ఆడినా జూదం కలిసిరాకపోవడంతో విసుగు చెందిన వ్యాపారి నవరతన్ జైన్ ను కలిసి తన డబ్బు తనకు తిరిగివ్వాలని కోరాడు. అతడు నిరాకరించడంతో చేసేదేమీ లేక తమకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే గొండా సిటీలోని నిందితుడి ఇంటికి వెళ్ళేసరికే జైన్ పారిపోయాడని.. ఇల్లంతా సోదా చేయగా 14 కోట్లు నగదు నాలుగు కేజీల బంగారు బిస్కెట్లు దొరికినట్లు తెలిపారు పోలీసులు. వారంతా దుబాయ్ పారిపోయి ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు. గ్యాంబ్లింగ్ కారణంగా ఎందరో జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అయినా కూడా ఏదో ఒక మూల అదృష్టదేవత కనికరించక పోతుందా అన్న చిన్న నమ్మకంతో అనేకులు ఈ మహమ్మారి బారిన పతున్నారు. అదృష్టం సంగతి అటుంచితే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిన సందర్భాలే ఎక్కువ. ఇది కూడా చదవండి: మణిపూర్ అరాచకపర్వంలో మరో ఘోరం.. -
రూ. 300 లక్షల కోట్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపకుడు ఈయనే..
భారతదేశ ఆర్థిక రాజధాని మొదటి వ్యాపార దిగ్గజాలలో ప్రేమ్చంద్ రాయ్చంద్ జైన్ ఒకరు. ఆయన్ను ముంబైలో (అప్పట్లో బొంబాయి) బిగ్ బుల్, బులియన్ కింగ్, కాటన్ కింగ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. జమ్సెట్జీ టాటా, డేవిడ్ సాసూన్, జమ్సెట్జీ జెజీబోయ్లతో పాటు నలుగురు బాంబే వ్యాపార యువరాజులలో ఒకరిగా పేరు పొందారు. ప్రేమ్చంద్ తన కాలంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ స్థాపనతో అందరికీ గుర్తుండిపోయారు. అదే ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్గా మారింది. బీఎస్ఈ దేశంలో రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. దాంట్లోని అన్ని లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ రూ. 300 లక్షల కోట్లకు మించి ఉంది. 1865లో దీనిని స్థాపించినప్పుడు, దక్షిణ బొంబాయిలోని ఒక మర్రిచెట్టు కింద 22 మంది బ్రోకర్లు, ఒక్కొక్కరి నుంచి కేవలం రూపాయి మూలధనంతో ఇది ఏర్పడింది. మొదటి స్టాక్ బ్రోకర్ రాయ్చంద్ 1832లో సూరత్లో రాయ్చంద్ డిప్చంద్ అనే కలప వ్యాపారికి జన్మించారు. ఆయన చిన్నప్పుడే వారి కుటుంబం బొంబాయికి వచ్చేసింది. ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో రాయ్చంద్ విద్యాభ్యాసం సాగింది. అదే ఆయన ఇంగ్లిష్లో మాట్లాడగల, చదవగల, రాయగల మొదటి భారతీయ బ్రోకర్గా అవతరించడానికి సహాయపడింది. రాయ్చంద్ 1852లో ఓ విజయవంతమైన స్టాక్ బ్రోకర్కు సహాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. అసమాన్య జ్ఞాపకశక్తి అసమానమైన జ్ఞాపకశక్తి ప్రేమ్చంద్ సొంతం. ఆయన ఎప్పుడూ పెన్ను, పేపర్ వాడలేదు. రాసుకోవడానికి బదులు తన వ్యాపారాలన్నింటినీ కంఠస్థం చేసిన ఆయన కేవలం 6 సంవత్సరాలలో 1858 నాటికి దాదాపు రూ. 1 లక్ష సంపదను ఆర్జించారు. 1861లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పత్తి వ్యాపారానికి భారత్ హాట్స్పాట్గా మారింది. దీన్ని ఆయన మరింత విస్తృతం చేశారు. దాతృత్వంలోనూ.. భారీ లాభాలను చవిచూసిన ప్రేమ్చంద్ రాయ్చంద్, అంతర్యుద్ధం ముగిశాక 1865లో పత్తి వ్యాపార ప్రాభవం తగ్గడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత తిరిగి పుంజుకుని దాతృత్వం వైపు నడిచారు. ఇందులో భాగంగా బాంబే విశ్వవిద్యాలయంలో రాజాబాయి క్లాక్ టవర్కు నిధులు అందించారు. బాలికా విద్యను ప్రోత్సహించారు. అవార్డులు, స్కాలర్షిప్లు అందించేందుకు ఆర్థికంగా సహకరించారు. ప్రేమ్చంద్ 1906లో మరణించారు. అతని కుటుంబంలోని నాలుగో తరం ఇప్పుడు ప్రేమ్చంద్ రాయ్చంద్ అండ్ సన్స్ సంస్థను నడుపుతోంది. వ్యాపార పరంగా ఒక చిన్న సంస్థే అయినా గొప్ప చరిత్ర దీనికి ఉంది. బైకుల్లాలోని ప్రేమ్చంద్ నివసించిన బంగ్లాను తరువాత అనాథాశ్రమం, పాఠశాలగా మార్చారు. -
చిరుజల్లుల్లో చిన్నారి.. నెట్టింట్లో వైరల్ వీడియో!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి అందరికి తెలుసు. ఈయన తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ.. అప్పుడప్పుడు కొంతమంది ప్రశ్నలకు రిప్లై ఇస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఒక వీడియో తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసాడు. ఆరు సెకన్ల వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఋతుపవనాలు మొదలయ్యాయి, ఇప్పటికే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భానుడి భగభగలకు అల్లాడిపోయిన జనం ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి చిరు జల్లులలో తడుస్తూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ సంఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!) ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొంత మంది తమ కామెంట్లను కూడా షేర్ చేశారు. వర్షాకాలంలో ముంబై ఒక అట స్థలంగా మారుతుందని, చిన్న నాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చాయని రకరాలుగా కామెంట్స్ చేస్తున్నారు. That just about sums up how it feels to come home to Mumbai to see that the monsoon has finally arrived… (the inner child in every Indian will never tire of finding joy in the first showers…) pic.twitter.com/0TaBHfAy3v — anand mahindra (@anandmahindra) June 27, 2023 -
టైటాన్ జలాంతర్గామిలో మేము వెళ్ళాలి.. కానీ అదృష్టవశాత్తూ..
అమెరికా: అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ ల స్థానంలో తానూ తన కుమారుడు ప్రయాణించాల్సి ఉందని కానీ చివరి నిముషంలో తప్పుకోవడంతో ప్రాణాలు నిలుపుకున్నామాని అన్నారు లాస్ వేగాస్ కు చెందిన పెట్టుబడిదారుడు జే బ్లూమ్. జీవితంలో ఇలాంటి అనుభూతిని ఒక్కసారైనా పొందాలని, సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూడటమంటే అదృష్టముండాలని ఎలాగైనా తనను ఈ సాహస యాత్రకు ఒప్పించే ప్రయత్నం చేశారు ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ రష్. అయినా కూడా నాకెందుకో ఆ బుల్లి జలాంతర్గామి భద్రత విషయమై ఎక్కడో అనుమానం ఉండేది. రష్ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఒక హెలికాఫ్టర్లో ప్రయాణం కంటే ఇది చాలా సురక్షితమైనది చెప్పేవారు. కానీ ఎందుకో నా మనసు అంగీకరించక నేను చివరి నిముషంలో అతడి అభ్యర్ధనను తిరస్కరించానని చెప్పుకొచ్చారు జే బ్లూమ్. లేదంటే పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ స్థానంలో తానూ.. అతని కుమారుడు సులేమాన్ స్థానంలో 20 ఏళ్ల మా అబ్బాయి సీన్ ఉండేవారమని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు బ్లూమ్. ఓషన్ గేట్ అధినేత స్టాక్ టన్ ఎంతగా చెప్పినా కూడా బ్లూమ్ ఒప్పుకోవకపోవడానికి ఆ వాహనం రిమోట్ ఆపరేటింగ్ వాహనం కావడం కూడా ఒక కారణమని చెప్పారు జె బ్లూమ్. సొంతంగా ఒక హెలికాఫ్టర్ ఉన్న బ్లూమ్ కు టైటాన్ భద్రతా ప్రమాణాలపై చాలా అనుమానాలు ఉండేవి. ఆరోజు నాకున్న స్పష్టమైన అవగాహన కారణంగానే నేను ఈ యాత్రకు ఒప్పుకోలేదు. అందుకే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామని, షాహ్జాదా దావూద్ - సులేమాన్ ఫోటోలు చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తుకు వస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: ఈజిప్టులో మోదీ తొలి అడుగు -
అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!
పుట్టింది ఒక మూరుమూల గ్రామం. చిన్నపుడే కష్టాలు. అయితేనేం అమ్మ ఆశీస్సులు ఫలించాయి. సంకల్పానికి ..కాలం కలిసి వచ్చింది. జీవితం కొత్త మలుపు తిరిగింది. దాన్ని అందిపుచ్చుకుని రూ. 22000 కోట్ల పడగలెత్తాడు. దుబాయ్కి చెందిన భారతీయ వ్యాపారవేత్త ప్రముఖ ప్యాకేజింగ్ కంపెనీ హాట్ప్యాక్ గ్లోబల్ గ్రూప్ ఎండీ పీబీ అబ్దుల్ జెబ్బార్ స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ .. కేరళలోని త్రిసూర్ జిల్లాలోని చమక్కలా అనే గ్రామంలో జన్మించారు పీబీ అబ్దుల్ జెబ్బార్. ఆరేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో కష్టాలు తప్పలేదు. పిల్లల్ని పెంచిపోషించి వారిని గొప్పోళ్లను చేయాలని తల్లి భావించడమేకాదు దాన్నొక సవాలుగా తీసుకుంది. అమ్మకు అండగా కొంచెం కొంచెం సంపాదిస్తూ తన చదువు ఖర్చులను తానే భరించేవాడు. దుబాయ్ లాంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారిలో కేరళ వాసులే ఎక్కువ. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారి నుంచి వస్తువులను కొనుగోలు చేసి లాభాలకు అమ్మేవాడు. ఈ వ్యాపారమే అతనికి, కుటుంబానికి సాయంగా నిలిచింది.అయితే ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లడంతో జబ్బార్ జీవితం కీలక మలుపు తిరిగింది. విదేశాలకు వెళ్లాలని,విజయవంతమైన వ్యాపారవేత్త కావాలని కలల సాకారానికి తొలి అడుగు పడింది. టర్నింగ్ పాయింట్ 1990లో ఉద్యోగం వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లే అవకాశం రావడమే పీబీ అబ్దుల్ జెబ్బార్ జీవితంలో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. ఇండెంట్ కంపెనీలో మేనేజర్గా తొలి ఉద్యోగంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. విదేశీ పార్టనర్స్తో ఎలా మెలగాలో కూడా బాగా తెలిసి వచ్చింది. సేల్స్,అకౌంటింగ్, మనీ మేనేజ్మెంట్ , నిర్వహణ ఇలా అన్ని రంగాల్లోనే ఆల్ రౌండర్గా ఆరితేరాడు. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ ) 1995లో మజేద్ ప్లాస్టిక్స్ అనే తన ప్యాకేజింగ్ కంపెనీని ప్రారంభించాడు. పదేళ్లలో,తొలి తయారీ యూనిట్ను ప్రారంభించాడు. పేపర్ కప్పులు, క్లాంగ్ ఫిల్మ్లు, డిస్పోజబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ సహా 3500కి పైగా ఉత్పత్తులు కంపెనీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. హాట్ప్యాక్ నేడు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకుఎగుమతి చేస్తోంది. సస్టైనబుల్ ప్యాకేజింగ్లో అగ్రగామిగా కంపెనీ స్పెయిన్,యూకే, అమెరికా, ఆస్ట్రేలియాతో సహా 75 దేశాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి ఎదిగింది. 29 శాఖలు, 3500 మంది ఉద్యోగులు , 25000 క్లయింట్లతో మూడు పువ్వులు ఆరు కాయలుగా రూ. 22000 కోట్ల టర్నోవర్ కంపెనీగా వెలుగొందుతోంది. అక్కడే ఆగిపోలేదు శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టు తిరిగి ఇవ్వకపోతే లావే పోతాం అనుకున్నాడేమో ఎమో గానీ..తన పుట్టిన గడ్డ కేరళకు తిరిగి ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. త్రిసూర్లో ఎన్విరోగ్రీన్ క్యారీ బ్యాగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించాడు. ఇది పర్యావరణ అనుకూలమైన కాగితం ఉత్పత్తులను తయారు చేస్తుంది. దయా హాస్పిటల్, యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా నడుపుతున్నాడు. వీటి ఆరోగ్య సంరక్షణ విద్యా రంగంలో సేవలందిస్తూ పలువురి ప్రశంసలందుకుంటున్నారు. అమ్మ ఆశీస్సులు, కల ఈ విజయం తన తల్లికి అంకితమని ఆమె ఆశీస్సులే తనను విజయపథంలో నడిపించాయని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జెబ్బార్. ఏదైనా కొత్త వెంచర్ను ప్రారంభించే ముందు ఎపుడూ ఆమె ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) అవార్డులు గ్లోబల్ మీడియా ఈవెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ అవార్డు ఎన్ఆర్ఐ ఎంటర్ప్రెన్యూర్ కైరాలి టీవీ అవార్డు సీఈవో ఫర్ లైఫ్ 2021 ప్యాకేజింగ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021 (ప్రైమ్ అవార్డ్స్) 2022 మిడిల్ ఈస్ట్ మీడియా (సీఈఓ) ఐటీపీ మీడియా -
రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ
ఇంటర్, పదవతరగతి, ఇతర పోటీ పరీక్షల ఫలితాలు వచ్చాయంటే..చాలు విద్యార్థుల సక్సెస్ కంటే.. అందర్ని భయపెట్టే మరో అంశం కూడా మరొకటి ఉంది. అవును మీరు ఊహించింది కరెక్టే. ఫెయిల్ అయ్యామన్న బాధతో ఎంతమంది పిల్లలు ఉసురు తీసుకుంటారో ననే ఆందోళన ఎక్కువ. ఈ విషయంకేవలం తల్లిదండ్రులను మాత్రమేకాదు చాలామందిని పట్టి పీడిస్తోంది. అలాంటి వారికి జీవితంలో ఒక్కోసారి ఓడిపోయినా, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి సక్సెస్ స్టోరీల గురించి చెప్పాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాల్సిందే...కానీ అదే సందర్భంలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసి పోయినట్టు కాదు.. అని మానసికంగా ముందే వారిని సన్నద్ధం చేయాలి. రెండుసార్లు పెయిలైనా వ్యాపారంలో రాణించి 29 ఏళ్లకే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ బిహారీ కాలేజీ డ్రాపౌట్ సక్సెస్ జర్నీ చూద్దాం ఈ స్టోరీలో మన హీరో పేరు మిస్బా అష్రఫ్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. బిహార్లో పుట్టి పెరిగిన ఈయన తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. అష్రాఫ్ ఐఐటీ ఢిల్లీలో చదువుతూ తొలి ఏడాదే కాలేజీ మానేశాడు. ఆ తరువాత Pulse.qa (YC), Pursuit, Toymail (YC),Spangle లాంటి సంస్థలలో పనిచేశాడు. మధ్యతరగతి కుటుంబం..ఇటు ఆర్థిక ఇబ్బందులు అయినా వ్యాపారవేత్త అవ్వాలనేది అతని కల సాకారానికి ఇందుకు తండ్రే స్పూర్తి. ఎలా అంటే తండ్రి ప్రేరణ ఒక రోజు ఎప్పుడూ రోడ్డు మీద చురుగ్గా నడిచే తండ్రిని అడిగాడుమిస్బా "ఎందుకు నెమ్మదిగా నడవడం లేదు?" దానికి చిరు మందహాసంతో చెప్పాడు ఇలా "నువ్వు నెమ్మదిగా నడిస్తే..కొట్టుకుపోతావు" అని. దీన్నుంచే అతను జీవిత పాఠాన్ని నేర్చుకున్నాడు. తన కల సాకారం కోసం వేగాన్ని పెంచాడు. (స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) అలా సెప్టెంబరు 2013లో ఐఐటీ-ఢిల్లీకి చెందిన తన స్నేహితులతో కలిసి చెల్లింపుల సంస్థ సిబోలా అనే కంపెనీనీ స్థాపించాడు. కానీ నాలుగు నెలలకే దాన్ని మూసి వేయాల్సి వచ్చింది. ఎందుకంటే స్టార్టప్ కావడం,ప్రభుత్వం పేమెంట్స్ లైసెన్స్రాలేదు. మళ్లీ నాలుగేళ్ల తరువాత ఆగస్ట్ 2017లోమార్స్పే అనే స్టార్టప్ లాంచ్ చేశాడు. ఇంతలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. అయితే భారీగా వృద్ధిని నమోదు చేయడంతో ఫిబ్రవరి 2021లో బ్యూటీ షాపింగ్ ,లైవ్ వీడియో కామర్స్ యాప్ అయిన ఫాక్సీ ఈ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే మే 2021లో, జార్ అనే తన మూడవ వెంచర్ను ప్రారంభించాడు. జార్లో నిశ్చయ్ మరో కో ఫౌండర్. అతను చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసరుగా ఉన్నారు. స్టార్టప్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన పొదుపు , పెట్టుబడి. 18 నెలల తర్వాత, ఇది 11 మిలియన్ల వినియోగదారులను దాటింది. ఫిన్టెక్ సంస్థ 58 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. జార్ రూ. 2463 కోట్లు (22.6 మిలియన్ డాలర్ల) ను సేకరించింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే రూ. 2463 కోట్లకు చేర్చాడు కంపెనీని. అంతేకాదు నిధుల సమీకరణకు అనేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మల్టీ-మిలియన్ డాలర్ల బిగ్డీల్ను సాధించాడు. ఇండియాలోని మైక్రో-సేవింగ్స్ యాప్ అయిన జార్, టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని సిరీస్ బీ ఫండింగ్లో ఈ నిధులను సమకూర్చుకుంది. అలాగే ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ (2023)లో ఫోర్బ్స్ 30 అండర్ లిస్ట్లో 30 వాడిగా ఎంపికకావడం విశేషం. జార్ ఆఫ్ గోల్డ్ ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తుకు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో జార్ ను స్టార్ట్ చేశారు.ఈ యాప్లో అందరూ డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంత చిన్న మొత్తంలో అయినా. 10 రూపాయలతో కేవలం 45 సెకన్లలో 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టొచ్చు. -
అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు
బిలియనీర్లు అనగానే సాధారణంగా టాటాలు, అంబానీ, అదానీలే గుర్తువస్తారు. వీరితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త,భారతదేశపు అత్యంత సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన, దుబాయ్లోని నివసిస్తున్న రవి పిళ్లై కూడా ఒకరు. ఈ ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్లై(68) కు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. 100 కోట్ల రూపాయల విలువైన ఎయిర్బస్ హెలికాప్టర్ను కొనుగోలు చేసిన రికార్డు మాత్రం రవి పిళ్లై సొంతం. (ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త!) కేరళలోని కొల్లంకు చెందిన రవి పిళ్లై చాలా కష్టపడి బిలియనీర్గా ఎదిగిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన రవి పట్టుదలగా తన వ్యాపార సామ్రాజ్యాన్నిబిల్డ్ చేసుకున్నారు. లోప్రొఫైల్ మెంటైన్ చేసే ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా పాపులర్. ప్రస్తుతం ఆఫ్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవోగా రవి పిళ్లై 2.8 బిలియన్ డాలర్ల (18,200 కోట్లు) సంపదతో అత్యంత సంపన్న కేరళీయులలో ఒకరు. 2022, జూన్లో అత్యాధునిక ఎయిర్బస్ H145 హెలికాప్టర్ను అప్పట్లోనే దీనివిలువ. రూ. 100 కోట్లు. ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు,మరో ఏడుగురు ప్రయాణించ వచ్చు. ఇది సముద్ర మట్టానికి 20వేల అడుగుల ఎత్తు నుంచి లాంచింగ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం దీని సొంతం. (టాప్ పెయిడ్ హీరోయిన్ల లిస్ట్లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్వుతారు) రైతు కుటుంబ నేపథ్యం: లక్ష అప్పుతో మొదలై వ్యాపార సామ్రాజ్యం సెప్టెంబర్ 2, 1953లో జన్మించిన రవి పిళ్లై కొచ్చి విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్లోని ఎక్సెల్సియర్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందాడు. లక్ష రూపాయల అప్పుతో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించించారు. 1978లో, రవి పిళ్లై సౌదీ అరేబియా వెళ్లి చమురు సంపన్న గల్ఫ్ దేశంలో తన నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ పేరే నాసర్ ఎస్. అల్ హజ్రీ కార్పొరేషన్ (NSH). కుమార్తె పెళ్లి ఒక విశేషం రవి పిళ్లైకి సంబంధించిన మరోవిషయం ఏమిటంటే నవంబర్ 26, 2015లో తన కుమార్తె వివాహానికి 42 దేశాల నుండి 30వేల గెస్ట్లను ఆహ్వానించారు. అనేక కంపెనీలు, సీఈవీలో,పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, మిడిల్ ఈస్టర్న్ రాజకుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అతిథులు హాజరుకావడంతో అపుడు విశేషంగా నిలిచింది. కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుతో తన కుమార్తె డాక్టర్ ఆరతి రవి పిళ్లై వివాహానికి రూ.55 కోట్లు ఖర్చు చేశారు. చిత్ర కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలోని 200 మంది నిపుణుల బృందం పెళ్లి మండపాన్ని రూపొందించారు. బాహుబలి సినిమా సెట్ కంటే వెడ్డింగ్ సెట్ చాలా గొప్పగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. రవి పిళ్లై కుమారుడు గణేష్ పిళ్లై వివాహం కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ 2010లో భారత ప్రభుత్వం విశిష్ట పురస్కారం పద్మశ్రీ ని అందుకున్నారు. 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ సత్కరాన్నిపొందారు. -
బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి..
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే చరిత్రలో భారతీయులు అనేక విషయాల్లో కేంద్ర బిందువులుగా నిలిచారు. అలాగే వ్యాపారంలోనూ చరుకైన పాత్ర పోషించిన భారతీయులు ఉన్నారు. విర్జీ వోరా మొఘల్ పాలనలో పెద్ద పేరున్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఆయనను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫైనాన్షియర్ చరిత్రకారుల ప్రకారం.. విర్జీ వోరా 1617 - 1670 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్. 1590లో జన్మించిన విర్జీ వోరా 1670లో మృతి చెందారు. హోల్సేల్ వ్యాపారి అయిన ఆయన వ్యక్తిగత సంపద అప్పట్లో సుమారు రూ. 80 లక్షలు. అంటే ఇప్పట్లో అది కొన్ని లక్షల కోట్లకు సమానం. ఆ మేరకు ఆయన ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అని అర్థం చేసుకోవచ్చు. చారిత్రక పత్రికల ప్రకారం.. విర్జీ వోరా మిరియాలు, బంగారం, ఏలకులు, ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిర్వహించేవారు. 1629 - 1668 మధ్య కాలంలో బ్రిటీష్ వారితో అనేక విధాలుగా వ్యాపార సంబంధాలు నెరిపిన విర్జీ వోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మించుకున్నారు. అప్పట్లో అన్ని వ్యాపారాల్లో విర్జీ వోరాదే ఏకైక గుత్తాధిపత్యం. ఉత్పత్తుల మొత్తం స్టాక్ను కొనుగోలు చేసి వాటిని భారీ లాభంతో విక్రయించేవాడు. షాజహాన్కు అరబ్ గుర్రాలు విర్జీ వోరా వడ్డీ వ్యాపారి కూడా. సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే బ్రిటిష్వారికి ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు డబ్బు కోసం విర్జీ వోరాను ఆశ్రయించినట్లు చెబుతారు. విర్జీ వోరా మొఘల్ రాజు షాజహాన్కు నాలుగు అరబ్ గుర్రాలను బహుమతిగా ఇచ్చాడని కూడా చరిత్రకారులు పేర్కొంటారు. -
అంతా మిస్టరీగా ఉంది.. ఉదయం వాకింగ్ వెళ్లి.. మధ్యాహ్నం నాటికి ఓ గుంతలో
మైసూరు(బెంగళూరు): నిర్మాణంలో ఉన్న భవనం గుంతలో ఒక వ్యాపారవేత్త కుమారుని మృతదేహం లభించింది. మైసూరు హెబ్బాళు పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సెన్ ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని చెరియన్ కుమారుడు క్రిస్టోఫర్ చెరియన్ మృతుడు. సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లిన క్రిస్టోఫర్ మధ్యాహ్నం నాటికి గుంతలో శవమై కనిపించాడు. ఏడాదిన్నర క్రితం మరియా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక శిశువు కూడా జన్మించింది. మూడు నెలల కిందట ఒక ప్రమాదంలో క్రిస్టోఫర్కి కాలు విరిగింది. అప్పటి నుంచి ఎక్కడా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా అనేదానిపై విజయనగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు -
సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్మేన్
దేశంలోని అతిపెద్ద పైపుల బ్రాండ్కు బిలియనీర్ యజమాని, సందీప్ ఇంజనీర్ బిలియనీర్గా అవతరించడం వెనుక చాలా కష్టాలున్నాయి. జీవితంలో చాలా హెచ్చుతగ్గులు చవి చూశారు. కానీ విజయవంతమైన పారిశ్రామికవేత్త కావాలనే అతని సంకల్పం ముందు అన్నీ ఓడిపోయాయి. 2019లో ఆస్ట్రల్ పైప్స్ వ్యవస్థాపకుడిగా సందీప్ ఇంజనీర్ గౌరవనీయమైన బిలియనీర్స్ క్లబ్లోకిఎంట్రీ ఇచ్చారు. మామూలు ఫార్మ ఉద్యోగి నుంచి 21 వేల కోట్ల రూపాయల కంపెనీకి యజమానిగా సందీప్ సక్సెస్ఫుల్ జర్నీ..! గుజరాత్లోని అహ్మదాబాద్లోని కాడిలా ల్యాబ్స్లో పనిచేసేవారు సందీప్. 20 ఏళ్ల వయసులో 1980లలో వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.. ఆ సమయంలో అతనికి వ్యాపారం చేయడంలో అనుభవంలేదు కుటుంబ నేపథ్యమూ లేదు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేశారు. ఇసాబ్గోల్ అనే తొలి వెంచర్ను స్టార్ట్ చేశారు. కానీ అక్కడ విజయం సాధించలేకపోయారు. వ్యాపారంలో విఫలమయ్యారు. ఒక దశలో చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ క్రమంలో పంకజ్ పటేల్ అనే బిలియనీర్ వ్యాపారవేత్త సందీప్కు మార్గదర్శకత్వం వహించడంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది పంకజ్పటేల్ మద్దతుతో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల (API) వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇక్కడ లాభనష్టాలతో పోరాటం తప్పలేదు. తమ ఉత్పత్తులు నిరుపయోగంగా మారడంతో వాటిని మార్చాల్సి వచ్చింది. కానీ ఆ తరువాత ఇంజనీర్ క్లోరినేటెడ్ పాలీ వినైల్ క్లోరైడ్ (సీపీవీసీ) పైపుల వ్యాపారంలో జాక్పాట్ కొట్టారు. ఆస్ట్రల్ పైప్స్ కంపెనీ అమెరికా నుంచి వచ్చిన కొత్త ఆవిష్కరణ 1998లో సందీప్ ఇంజనీర్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ అనే కొత్త వ్యాపారానాకి నాంది పలికింది. మొదట్లో దీన్ని చాలామంది విశ్వసించ నప్పటికీ, క్రమం బలం పుంజుకుంది. 2000ల ప్రారంభంలో సందీప్ ప్లంబింగ్ పైపుల తయారీ సంస్థగా బ్రాండ్ను స్థాపించారు. ఆ తరువాత 2010ప్రారంభంలో కుమారులు కైరవ్, సౌమ్య అందిరావడంతో సందీప్కు మరింత కలిసి వచ్చింది. 2003లో రూ 15 కోట్ల ఆదాయం ఒక్క ఏడాదిలోనే 25 కోట్లకు పెరిగింది. 2007లో, 60కోట్ల వాల్యూతో ఆస్ట్రాల్కు ఐపీఓవకు వచ్చింది. దీని ద్వారా రూ. 35 కోట్లను సేకరించింది. 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆస్ట్రల్ స్పాన్సర్గా ఉంది. (సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్) దబాంగ్ సిరీస్, బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ వీటన్నింటికి మించి 2014లో ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో రెండేళ్ల ఒప్పందం కంపెనీ బ్రాండ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేసింది. అంతకుమందు సల్మాన్ నటించిన 'దబాంగ్-2' చిత్రంతో భాగస్వామ్యం సక్సెస్ కావడం గమనార్హం. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) కాగా 2023, ఏప్రిల్ నాటికి సందీప్ నెట్వర్త్ 21 వేల కోట్ల రూపాయలు. అసలు బిలియనీర్ కావాలనేది తన కోరిక కాదు. ఇదంతా శరవేగంగా జరిపోయిందని గతంలో ఫోర్బ్స్తో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు సందీప్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ రిటైల్, రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్స్, ఇతర పరిశ్రమలోని అన్ని రంగాలలో బలమైన క్లయింట్ బేస్ ఉంది. ఆస్ట్రల్కు అమెరికా, యూకే, కెన్యాలో సహా పలు ప్రదేశాల్లో ఫ్యాక్టరీలున్నాయి. -
Sanjiv Mehta: తిరుగులేని సీఈఓ - సక్సెస్ స్టోరీ
భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే అతను ఎక్కడ పుట్టాడు, ఎలా అంత గొప్ప స్థాయికి ఎదిగాడు, వార్షిక ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు తెలిసి ఉండవు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో జన్మించిన సంజీవ్ మెహతా ముంబై, నాగ్పూర్లలో చదువుకున్నాడు. అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు పూర్తి చేసి, ఆ తరువాత అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కోసం చేయడానికి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లాడు. ఆయన భార్య మోనా కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కావడం గమనార్హం. 2013లో సంజీవ్ మెహతా హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క CEO & MDగా నియమితుడయ్యాడు. ఆ తరువాత 2018లో ఛైర్మన్గా పదవి చేపట్టాడు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లోని వ్యాపారాలను కలుపుతూ క్లస్టర్ ప్రెసిడెంట్గా దక్షిణాసియాలో యూనిలీవర్ వ్యాపారానికి కూడా నాయకత్వం వహిస్తున్నాడు. (ఇదీ చదవండి: Mahindra Scorpio-N: సన్రూఫ్ లీక్పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు) 2021-22 మధ్య కాలంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా, ఎయిర్ ఇండియా బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు. HULకి విజయవంతంగా నాయకత్వం వహించడంతో సక్సెస్ సాధించిన మెహతా అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 17 బిలియన్ డాలర్ల నుంచి 75 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆయన వార్షికాదాయం 2021లో రూ. 15 కోట్ల నుంచి 2022 నాటికి రూ. 22 కోట్లకు చేరింది. -
పెళ్లికుదిరినా అందుకు ఒప్పుకోలేదు.. వ్యాపారవేత్తను హత్య చేసిన 'గే'..
సాక్షి, బెంగళూరు: కొద్దిరోజులక్రితం కర్ణాటక బెంగళూరులో 44 ఏళ్ల వ్యాపారవేత్త దారుణహత్యకు గురయ్యాడు. అతని సన్నిహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఆర్థిక తగాదాలే ఈ హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు తొలుత అనుమానించారు. కానీ విచారణలో వెలుగుచూసిన అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. హత్యకు గురైన వ్యాపారవేత్త పేరు లియాకాత్ అలీ ఖాన్. ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. నిందితుడి పేరు ఇల్యాజ్ ఖాన్(26). ఇతని దగ్గరే చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరు స్వలింగసంపర్కులు. కరోనా లాక్డౌన్లో వీరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి రెండేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 28న కూడా మైసూరు రోడ్డులోని నయందహల్లిలో పాత భవనంలో రాత్రి ఇద్దరూ కలిశారు. అనంతరం తనకు అమ్మాయితో పెళ్లి కుదిరిందని, ఇకపై రిలేషన్ కొనసాగించలేనని ఇల్యాజ్ చెప్పాడు. దీనికి లియాకాత్ ఒప్పుకోలేదు. రిలేషన్ కొనసాగించాల్సిందేనని పట్టుబట్టాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో లియాకాత్ను ఇల్యాజ్ తలపై సుత్తితో బాదాడు. ఆపై కత్తెర్లతో అతడ్ని పొడిచాడు. తీవ్రగాయాలపాలైన లియాకాత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లియాకాత్ కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట ఈ హత్యలో ముగ్గురి ప్రమేయం ఉండవచ్చని అనుమానించారు. కానీ ఇల్యాజ్ను విచారించగా అసలు విషయం తెలిసింది. అతనొక్కడే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. కాగా.. లియాకాత్ అలీకి ఓ మహిళతో పెళ్లైంది. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిపోర్టులో మరోసారి కవిత పేరు -
నా కూతురి పెళ్లిని కోటి రూపాయలతో నిర్వహించండి అంటూ..ఓ తండ్రి..
మధ్యప్రదేశ్లోని ఓ వ్యాపారి సూసైడ్ నోట్ తీవ్ర కలకలం రేపింది. అతను చనిపోవడానికి ముందు ఓ వీడియో తీసుకున్నాడు. అందులో నా కూతురు పెళ్లిని దాదాపు ఒక కోటి రూపాయాలు ఖర్చుపెట్టి నిర్వహించండి అని చెప్పడం అందర్నీ కంటతడిపెట్టించింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సంజయ్ సేథ్ అనే ప్రముఖ వ్యాపారి తన భార్య మీనుతో కలిసి మధ్యప్రదేశ్లోని కిషోర్గంజ్ అనే ప్రాంతంలో నివస్తున్నాడు. ఏమోందో ఏమో! తన భార్యను హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సంజయ్ సేథ్. ఈ ఘటన జరిగినప్పుడూ ఆ గదిలో వారిద్దరే ఉన్నారు. ఆ కాల్పుల శబ్దం విని కుటుంబసభ్యులు వచ్చి చూడగా..అతడి భార్య మృతి చెందగా, సంజయ్ కొన ఊపిరితో కొట్టుకుంటూ కనిపించాడు. ఐతే అతను కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సంజయ్ ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు ఓ సెల్ఫీ వీడియో కూడా తీశాడు. అందులో సంజయ్ ఏడుస్తూ తాను కొందరికి అప్పు ఇచ్చాను వారు తిరిగి చెల్లించలేదని చెప్పాడు. దయచేసి నా పిల్లలు, నా కుమార్తె వివాహం కోసం నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి. ఆమె పెళ్లిని సుమారు రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టి జరిపించండి. నా కుమార్తె ఖాతాలో డబ్బు ఉంది. అలాగే లాకర్లో సుమారు రూ. 29 లక్షలు ఉందని, తన కూతురికి చాలా నగలు ఉన్నాయని చెప్పాడు. పిల్లలు నన్ను క్షమించండి. నా భార్య, నేను బతకలేక వెళ్లిపోతున్నాం అని కన్నీటిపర్యంతమయ్యాడు. చివర్లో తాను బాగేశ్వర్ ధామ్ భక్తుడునని, గురూజీ నన్ను క్షమించండి మరో జన్మ లభిస్తే కచ్చితంగా మీకు మంచి భక్తుడిగా ఉంటానని వాపోయాడు. అలాగే సంఘటనా స్థలం వద్ద లభించిన సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..ఈ ఘటన చాలా బాధకరం. ఇది గృహ వివాదానికి సంబంధించినదిగా గుర్తించాం. ఈ సంఘటనలో బయట వ్యక్తి ప్రమేయం లేదని ఎందుకంటే ఆ సమయంలో వారిద్దరే ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. (చదవండి: మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు.. ఛాతీలో దిగిన బుల్లెట్లు..) -
సెర్బియా జైల్లో హైదరాబాద్ వ్యాపారి.. ఆరా తీస్తున్న అధికారులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి వ్యాపార నిమిత్తం సెర్బియాకు వలసవెళ్లిన ఫెరోజ్ ఖాన్ అక్కడి జైల్లో మగ్గుతున్నాడు. పది నెలలుగా ఆయన విషయంపై సిటీలో ఉంటున్న తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేదు. సెర్బియాలోనే స్థిరపడిన ఫెరోజ్ సోదరి ఆరా తీయగా జైల్లో ఉన్న విషయం బయటపడింది. నేరుగా జోక్యం చేసుకోవడానికి అక్కడి భాతర రాయబార కార్యాలయం నిరాకరించడంతో సహాయం చేయాల్సిందిగా కోరుతూ ఫెరోజ్ సోదరుడు నూమన్ హుస్సేన్ జునైదీ విదేశాంగ శాఖకు లేఖ రాశాడు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్కు చెందిన అధికారులు సోమవారం ఫెరోజ్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. బెల్గ్రేడ్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసి.. ఫస్ట్ లాన్సర్లోని ఖాజానగర్ ప్రాంతానికి చెందిన ఫెరోజ్ ఖాన్ (44) తండ్రి మాజీ ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం తండ్రి, తల్లి కూడా అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితయ్యారు. పదిహేనేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న ఫెరోజ్ అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నారు. సెర్బియాలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఫెరోజ్ బిజినెస్ వీసాపై 2020లో అక్కడికి వలస వెళ్లాడు. బెల్గ్రేడ్లో ఉన్న బ్రాంకోవా–19లో ఇండో–అరబ్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. భారత్తో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వెళ్లి సెర్బియాలో స్థిరపడిన వారు ఫెరోజ్ రెస్టారెంట్కు రెగ్యులర్ కస్టమర్లుగా ఉండే వాళ్లు. నాటకీయ పరిణామాల మధ్య మిస్సింగ్... సెర్బియా నుంచి అనునిత్యం నగరంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడే ఫెరోజ్ ఆఖరుసారిగా గతేడాది మార్చి 10న కాల్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఫోన్లు పని చేయకపోవడంతోపాటు ఆచూకీ లేదు. దీంతో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కొన్నాళ్లు ఎదురుచూశారు. చివరకు సెర్బియాలో ఉన్న ఫెరోజ్కు సోదరి వరుసయ్యే మహిళను సంప్రదించారు. బ్రాంకోవాలోని ఇండో–అరబ్ రెస్టారెంట్ వద్దకు వెళ్లిన ఆమె అది చాన్నాళ్ల క్రితమే మూతపడినట్లు గుర్తించింది. చుట్టుపక్కల ఆరా తీయగా గతేడాది మార్చి 9న రెస్టారెంట్లో కొందరు భారతీయులు–బంగ్లాదేశీయుల మధ్య గొడవ జరిగిందని, వారికి ఫెరోజ్ సర్దిచెప్పాడని, ఆ మర్నాడే అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేశారని తెలిసింది. ఈ విషయం నగరంలో ఉన్న ఫెరోజ్ తల్లిదండ్రులకు చెప్పిన ఆమె... సెర్బియాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్నీ సంప్రదించింది. ఢిల్లీ నుంచి ఉత్తర్వులు రావాలనడంతో... అక్కడి జైల్లో మగ్గుతున్న ఫెరోజ్ వివరాలు ఆరా తీయడానికి నిరాకరించిన రాయబార కార్యాలయం తాము జోక్యం చేసుకోవాలంటే ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) నుంచి ఆదేశాలు రావాలని స్పష్టం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫెరోజ్ సోదరుడు, ఆలియాబాద్ వాసి నూమన్ శుక్రవారం భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. దీనికి సంబంధించి ఎంబీటీ పార్టీ నేత అమ్జదుల్లా ఖాన్ ఎంఈఏకు ట్వీట్ చేస్తూ ఫెరోజ్పై సెర్బియాలో నమోదైన కేసు వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఆయనకు న్యాయం చేయడంతో పాటు భారత్కు రప్పించడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. నూమన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఫెరోజ్ జైల్లో ఎందుకు ఉన్నాడో తెలీదు. దీనిపై అక్కడి పోలీసులు కనీసం అతడి తల్లిదండ్రులకూ సమాచారం ఇవ్వలేదు. విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసిన తర్వాత స్పందన మొదలైంది. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు వచ్చి పూర్తి వివరాలు తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించి ఫెరోజ్కు న్యాయం చేయాలని కోరుతున్నా’ అన్నారు. చదవండి: డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం -
ఇతర రంగాలకూ పీఎల్ఐ స్కీమ్
న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఎంతో ప్రయోజనకరమని మెజారిటీ వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పీఎల్ఐ కింద ఇతర రంగాలకూ ప్రోత్సాహకాలు లభిస్తాయన్న ఆశాభావం వారి నుంచి వ్యక్తమైంది. డిమాండ్ బలోపేతానికి వీలుగా బడ్జెట్లో ప్రకటించే చర్యలు అన్ని రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తాయన్న అభిప్రాయం కంపెనీల ప్రతినిధుల్లో వ్యక్తమైంది. మూలధన వ్యయాలపైనా బడ్జెట్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. డెలాయిట్ సర్వే వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకుంది. మూలధన వ్యయాలు, మౌలిక సదుపాయాలకు రుణాలను అందించడం వృద్ధికి కీలకమన్న అభిప్రాయం వ్యక్తమైంది. భారత ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధులు సమీకరించాలని సర్వేలో 60 శాతం మంది సూచించారు. రానున్న బడ్జెట్ నుంచి పరిశ్రమ ఏమి ఆశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా డెలాయిట్ చేసింది. 10 రంగాల నుంచి 181 మంది ప్రతినిధులు సర్వేలో పాల్గొని అభిప్రాయాలు తెలియజేశారు. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ►70 శాతానికి పైగా పరిశ్రమల ప్రతినిధులు పీఎల్ఐ పథకం తమ రంగం వృద్ధికి మేలు చేస్తుందని చెప్పారు. ► 60% మంది పీఎల్ఐ ప్రోత్సాహకాలను మరిన్ని రంగాలకు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ►పన్నుల్లో మార్పులు తెస్తే అది పరిశ్రమల వృద్ధికి ప్రయోజనం కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రానున్న బడ్జెట్లో ఎక్కువ మంది బలంగా దీన్ని కోరుకుంటున్నారు. ► ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ► ఎంఎస్ఎంఈలను జీవీసీ కిందకు తీసుకొస్తే పరిశ్రమల వృద్ధి స్థిరత్వానికి సాయపడుతుందని, వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయని చెప్పారు. ► 45 శాతం మంది పన్ను బాధ్యతలను ప్రభుత్వం తగ్గిస్తుందని అంచనా వేస్తుంటే, 44 శాతం మంది టీడీఎస్కు సంబంధించి స్పష్టత కోరుకుంటున్నారు. ► మూలధన లాభాల పన్ను నిర్మాణాన్ని మరింత సులభతరంగా మార్చాలని పరిశ్రమ కోరుతోంది. ► కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాలకు పీఎల్ఐ కింద రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. తోలు, సైకిల్, టీకాల తయారీ, టెలికం ఉత్పత్తులకు పీఎల్ఐ విస్తరణ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. చదవండి: స్టార్టప్లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు! -
వివాహేతర సంబంధం..తండ్రిని చంపిన కొడుకులు..ఏమీ తెలియనట్లు..
ముంబై: మహారాష్ట్ర పుణెలోని ఖేడ్ తాలూకాలో డిసెంబర్ 15న అదృష్యమైన వ్యాపారవేత్త దనంజయ నవ్నాథ్ బాన్సోడ్(47) దారుణ హత్యకు గరుయ్యాడు. సొంత కుమారులే ఆయను హతమార్చారు. అనంతరం శవాన్ని తీసుకెళ్లి తమ ఫ్యాక్టరీలోని బట్టీలో కాల్చారు. ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అయితే దనంజయకు నాగ్పూర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయం ఇంట్లో తెలిసి ఆయన భార్య, కుమారులు తరచూ గొడవ పడేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 15న సుజిత్, అభిజిత్లు తమ తండ్రిని హతమార్చారని వెల్లడించారు. ఇద్దరు కుమారులు డిసెంబర్ 15న తండ్రిని హత్య చేసి డిసెంబర్ 16న శవాన్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కాల్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు డిసెంబర్ 19న తమ తండ్రి కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోని దిగిన వారు విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. చదవండి: దారుణం.. ప్రియుడితో కలిసి కూతుర్ని కడతేర్చిన తల్లి -
హెలికాఫ్టర్కు పూజలు నిర్వహించిన తెలంగాణ వ్యాపారవేత్త
భారతదేశంలో కొత్త వాహనాలను వినియోగించే ముందు వాటికి పూజలు చేయడం ఆచారం. అందుకే ప్రజలు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు జరిపిస్తుంటారు. అయితే తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త బోయిన్పల్లి శ్రీనివాస్రావు మాత్రం ఈ సంప్రదాయాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన హెలికాప్టర్ను పూజలు జరిపించారు. తెలంగాణకు చెందిన ప్రతిమ గ్రూప్కు యాజమాని బోయినపల్లి శ్రీనివాసరావు ఇటీవల ఎయిర్బస్ ACH-135హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. కొత్త వాహనం కావడంతో హెలికాఫ్టర్కు వాహన పూజ జరిపేందుకు హైదరాబాద్కు 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న యాదాద్రి గుట్టపైకి వెళ్లారు. ముగ్గురు పూజారుల నేతృత్వంలో హెలికాఫ్టర్కు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. మరో వైపు హెలికాప్టర్కు పూజలు చేస్తుంటే చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం ఈ హెలికాప్టర్ "వాహన్ పూజ" వీడియో సోషల్ మీడియాలో వైరల్ నెట్టింట హల్చల్ చేస్తోంది. Boinpally Srinivas Rao, the proprietor of the Prathima business, bought an Airbus ACH 135 and used it for the "Vahan" puja at the Yadadri temple dedicated to Sri Lakshmi Narasimha Swamy. Costing $5.7M, the opulent helicopter. #Telangana pic.twitter.com/igFHMlEKiY — Mohd Lateef Babla (@lateefbabla) December 15, 2022 చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్కు అప్పగింత!
లండన్: రూ.11వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో షాక్ తగిలింది. తనను భారత్కు అప్పగించే విషయంపై అక్కడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లు అయింది. ఫలితంగా ఆయనను త్వరలోనే భారత్కు తీసుకువచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేర మోసం చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో 2018లో దేశం వీడి పారిపోయాడు. 2019లో లండన్లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉంటున్నాడు. తనను భారత్కు అప్పగించొద్దని గతనెలలోనూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన అప్పీల్ను రిజెక్ట్ చేసింది. దీంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరుతూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను భారత్కు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని, మానసికంగా సమస్యలున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. న్యాయస్థానం వీటిని తోసిపుచ్చి అప్పీల్ను రిజెక్ట్ చేసంది. అయితే నీరవ్కు ఇంకా ఓ అవకాశం ఉంది. తనను భారత్కు అప్పగించే విషయంపై ఐరోపా సమాఖ్య మానవ హక్కుల కోర్టును ఆయన ఆశ్రయించవచ్చు. చదవండి: రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే -
వలపు వల విసిరి బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట
న్యూఢిల్లీ: వ్యాపారవేత్తకు వలపు విసిరి బ్లాక్మెయిల్ చేసింది ఓ జంట. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరించి రూ.80లక్షలు వసూలు చేసింది. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఆ జంటపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. వివారాల్లోకి వెలితే.. గురుగ్రాం బాద్షాపుర్కు చెందిన వ్యాపారవేత్త ఓ అడ్వర్టైస్మెంట్ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఢిల్లీ షాలిమర్ బాగ్కు చెందిన నామ్రా ఖాదిర్ అనే మహిళను బిజినెస్ విషయాలు మాట్లాడేందుకు కొద్ది నెలల క్రితం ఓ హోటల్లో కలిశాడు. ఆమెతో పాటు విరాట్ అలియాస్ మనీశ్ బనీవాల్ కూడా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని.. తన వ్యాపార పనుల కోసం నామ్రా ఖాదిర్కు రూ.2.50లక్షలు ఇచ్చాడు బాధితుడు. అయితే డబ్బు తీసుకున్నప్పటికీ ఆమె దానికి తగినట్లు పనిచేయలేదు. దీంతో ఆమెను అతడు ప్రశ్నించాడు. ఆ సమయంలోనే ఆమె అతడ్ని ఇష్టపడ్డానని, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ క్లోజ్ అయ్యారు. పెళ్లి ప్రపోజల్ తర్వాత నమ్రా ఖాదిర్తో వ్యాపారవేత్త చాలా రోజలు కలిసితిరిగాడు. ఇద్దరూ పలుమార్లు హోటల్లో గడిపారు. ఈ క్రమంలోనే వీరిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు విరాట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత వాటిని లీక్ చేస్తామని, రేప్ కేసు పెడతామని బెదిరించి వ్యాపారవేత్త నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇలా మొత్తం రూ.80లక్షలు కాజేశారు. అయినా ఇంకా బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక చివరకు పోలీస్ స్టేషన్ వెళ్లాడు ఆ బిజినెస్మేన్. ఖాదిర్, విరాట్పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్టోబర్ 10న ఈ జంటకు నోటీసులు పంపారు. అయితే వాళ్లు బెయిల్ కోసం గురుగ్రామ్ కోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం నవంబర్ 18న వారి పిటిషన్ను తిరస్కరించింది. దీంతో వాళ్లిద్దరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ జంటను అదుపులోకి తీసుకుంటామన్నారు. చదవండి: ప్రియుడు మాట్లాడలేదని విషం తాగుతూ వీడియో తీసి.. -
పనిమనిషితో వివాహేతర సంబంధం.. బెడ్పై గుండెపోటుతో మృతి
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో కొద్ది రోజుల క్రితం ప్లాస్టిక్ బ్యాగ్లో ఓ శవం లభించిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ 67 ఏళ్ల వ్యాపారవేత్తకు తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. నవంబర్ 16న ఆమె ఇంటికి వెళ్లి శృంగారం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. తన యజమానితో వివాహేతర సంబంధం ఉందని అందరికీ తెలిస్తే పరువు పోతుందని మహిళ భావించింది. దీంతో అతడు చనిపోయిన విషయాన్ని భర్తతో పాటు సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత వాళ్లు వచ్చాక ముగ్గురు కలిసి శవాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. అనంతరం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. అని పోలీసులు వివరించారు. చనిపోయిన వ్యక్తి పేరు బాల సుబ్రహ్మణ్యం. జేపీ నగర్లో నివసించేవాడు. నవంబర్ 16 సాయంత్ర 4:55 గంటలకు తన మనవడ్ని బ్యాడ్మింటన్ కోర్టులో డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత తనకు వ్యక్తిగత పని ఉందని, ఆలస్యంగా వస్తానని కోడలుకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఆ తర్వాత బాల సుబ్రహ్మణ్యం ఇంటికి తిరిగివెళ్లలేదు. దీంతో ఆయన కుమారుడు మరుసటి రోజే పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ మరునాడే పోలీసులకు ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో బెడ్ షీట్లు చుట్టి ఉన్న ఓ శవం కన్పించింది. అతడ్ని బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పనిమనిషి అసలు విషయం చెప్పింది. ఆయనతో చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. అతను శృంగారం చేస్తూ బెడ్పైనే చనిపోయాడని చెప్పింది. తామే శవాన్ని బ్యాగులో చుట్టి రోడ్డు పక్కన పడేశామని అంగీకరించింది. చదవండి: యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో.. -
పెళ్లయిన వ్యక్తితో మాజీ ప్రపంచసుందరి డేటింగ్..ఇంతకీ ఎవరో తెలుసా..!
మాజీ మిస్ వరల్డ్, నటి, మోడల్ మానుషి చిల్లర్పై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. హర్యానాకు చెందిన నటి ఓ వ్యాపారవేత్తతో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది. 2021 నుంచి ఈ జంట తరచూ విహారయాత్రలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు కూడా తెలుసని బాలీవుడ్లో టాక్. (చదవండి: 'అలా ఆలోచించే వాళ్లయితే ఓకే'.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర కామెంట్స్..!) అయితే వ్యాపారవేత్త నిఖిల్ కామత్కు ఇదివరకే పెళ్లయింది. 2019లో పెళ్లి చేసుకున్న కామత్ గతేడాదే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. అతను ప్రస్తుతం మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్తో డేటింగ్లో ఉన్నారని నెట్టింట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మానుషి ప్రస్తుతం సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించింది. అయితే డేటింగ్ వార్తలపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. -
పెళ్లైన మొదటి రోజే నటి పూర్ణకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన భర్త
సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయిన పూర్ణ ఇటీవలె దుబాయ్కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే,కెరీర్లోనూ దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా పూర్ణకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పూర్ణకు ఆమె భర్త షానిద్ కపూర్ పెళ్లైన తొలిరాత్రే సర్ప్రైజ్ చేశాడట. కాస్ట్లీ అండ్ రేర్ డైమండ్ రింగును ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. అంతేకాదు ఆ రింగ్ నార్మల్గా చూస్తే పూర్ణ పేరు ఉండేలా రివర్స్లో చూస్తే షానిద్ పేరు కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ గిఫ్ట్ చూసిన పూర్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ఇప్పటికే పూర్ణకు ఆమె భర్త దాదాపు 170 తులాల బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లాను కూడా ఆమె పేరు మీద గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటి ఖరీదు సుమారు రూ. 30కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
వ్యాపారవేత్తకు భారీ షాక్: రూ. కోటి ఖాళీ, ఏం జరిగిందంటే?
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు హద్దే లేకుండా రోజురోజుకు మితిమీరుతున్నాయి. టెక్నాలజీ తెలియని అమాయక ప్రజలనే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ కోట్లను దోచేస్తున్నారు. తాజాగా ఒక వ్యాపారవత్త మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి కోటి రూపాయలను మాయం చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని థానే నగరంలో వ్యాపారవేత్త ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ను హ్యాకింగ్ గురైందనీ, ఆ తరువాత రూ. 99.50 లక్షలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఈ నెల 6-7 తేదీల మధ్య వ్యాపారవేత్త ఫోన్ హ్యాక్ చేసి మరీ, బ్యాంకు ఖాతాలోని సొమ్మును నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇతర ఖాతాలకు తరలించారని వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
షాకింగ్ ఘటన: చూస్తుండగానే...హఠాత్తుగా కుర్చిలోంచి కుప్పకూలిపోయాడు
ఒక వ్యక్తి క్లినిక్ వచ్చి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....61 ఏళ్ల దిలీస్ కుమార్ మదానీ పంటి నొప్పికి చికిత్స కోసం క్లినిక్కి వచ్చాడు. అతను క్లినిక్ వెలుపల కుర్చిలో పేపర్ చదువుతూ కూర్చొన్నాడు. కాసేపటికి కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అంతే అందరూ చూస్తుండగానే కుర్చిలోంచి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటేనే క్లినిక్ సిబ్బంది అతనికి సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. ఐతే వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు మృతుడు సోదరుడు మహేంద్ర మదానీ మాట్లాడుతూ...దిలీప్ గార్మెంట్ వ్యాపారం చేస్తున్నాడని, అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. వారంతా బార్మెర్లోని పంచపద్రలో ఉంటారని అన్నారు. ఒక పనిపై బార్మెర్ వచ్చాడని, అనుకోకుండా పంటినొప్పి రావడంతో క్లినిక్కి వచ్చినట్లు తెలిపారు. అతను ఉదయం బాగానే ఉన్నాడని అకస్మాత్తుగా ఇంత ఘోరం జరిగిపోయిందని భాదగా చెప్పారు. इस तरह की घटनाएं चिंता बढाने वाली है। पचपदरा (बाड़मेर) निवासी दिलीप जी जैन अचानक अखबार पढ़ते पढ़ते चल बसे। कोरोना के बाद लगातार ऐसी घटनाएं बढ़ रही है।#Rajasthan pic.twitter.com/SoUNn4D4mV — Vivek Shrivastava (@Viveksbarmeri) November 6, 2022 (చదవండి: మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ) -
ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ!
దీపావళి.. భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఇది కూడా ఒకటి. దివాళి వచ్చిందంటే సంస్థలు తమ ఉద్యోగులకు బహామతులు ,బోనస్లు ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఓ యజమాని మాత్రం జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్ని తన ఉద్యోగులకు ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ సూరత్లోని శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్టర్ అత్యంత ప్రసిద్ధ వజ్రాల కంపెనీల్లో ఒకటి. దీని యజమాని గోవింద్ ధోలాకియా. ఆయన గతంలో కార్లు, ఇళ్లు అంటూ తన ఉద్యోగులకు అనేక బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బహామతులను ఇవ్వదలచుకున్నాడు. అయితే అది జీవితాంతం గుర్తుండడంతో పాటు వాళ్లకు ఉపయోగపడేలా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారి కంపెనీలో పని చేస్తున్న 1000 మంది ఉద్యోగులకు దీపావళి కానుకగా సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్లను అందించారు. దీని ద్వారా వారికి జీవితకాలం కరెంట్ ఉచితంగా అందించాలనుకున్నాడు. ఇప్పటికే 550 మంది ఉద్యోగులకు ఈ గిఫ్ట్ అందించినట్లు మిగిలిన వాళ్లకి కూడా అతి త్వరలో అందజేయనన్నారు. పర్యావరణానికి కూడా ఇది బోనస్! ధోలికియా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం వల్ల కేవలం ఉద్యోగులు లాభపడటమే కాక.. పర్యావరణానికి సైతం మేలు జరగుతంది. ఇంతకు ముందు కూడా SRK నాలెడ్జ్ ఫౌండేషన్ ద్వారా SRK ఎక్స్పోర్టర్ సాంఘిక సంక్షేమ విభాగం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ! -
తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు.. తీరా దొంగ ఎవరంటే?...
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటరు కదా. మన మధ్య, మనతోనే ఉంటూ మోసం చేస్తే ఈ సామెత వాడుతుంటాం ఔనా! అచ్చం అలాంటి సంఘటన ఒక వ్యాపారవేత్తకి ఎదురైంది. అసలేం జరిగిందంటే...ముంబైకి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్కాదర్ షబ్బీర్ ఘోఘవాలా ఇంట్లో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం అవ్వడం జరిగింది. దీన్ని సదరు వ్యాపారవేత్త గుర్తించాడు కూడా. ఇలా కొద్ది నెలలోనే చాలా నగలు పోయాయి. కానీ అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ఇంట్లో వస్తువులు ఏదో మంత్రం వేసినట్లు మాయవుతున్నాయని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దమొత్తంలో నగదు చోరికి గురైంది. దీంతో ఇక చేసేదేమి లేక వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాపారవేత్త ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదుకి సంబంధించి దాదాపు 40 లక్షలకు పైనే దొంగతనం జరిగింది. పోలీసులు వెంటనే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగాలంటే వ్యాపారవేత్తకు తెలిసిన వ్యక్తి చేసి ఉండాలి లేదా ఇంట్లో ఉండే వ్యక్తే అయ్యి ఉండాలన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. తీరా విచారణ చేస్తే అసలు దొంగ ఆ వ్యాపారవేత్త 12 ఏళ్ల మేనకోడలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు. పోలీసుల విచారణలో సదరు వ్యాపారవేత్త మేనకోడలు గుజరాత్లోని సూరత్లో ఉండే తన బంధువుని తన మావయ్య ఇంట్లో దొంగతనం చేయమని చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు బంధువుని అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40 లక్షలు వరకు రికవర్ చేశారు. ఐతే సదరు వ్యాపారవేత్త మేనకోడలుపై ఎలాంటి చర్య తీసుకోలేదని, ఈ దొంగతనంలో ఆమె పాత్ర ఎంత వరుకు ఉందో నిర్థారించిన తర్వాత జువైనల్ జస్టీస్ బోర్డుకు వివరణాత్మక నివేదికను పంపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: దగ్గు సిరప్కి కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి...ఉత్పత్తికి చెక్!) -
గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 17 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: కోల్కతాకు చెందిన ఓ వ్యాపారి ఆవరణలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో ఈడీ సుమారు రూ. 12 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త అమీర్ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యాపారి నివాసంలో ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను పటిష్టంగా మోహరించారు. ఈ నగ్గేట్స్ అనే మొబైల్ గేమింగ్ యాప్తో వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు అమీర్ఖాన్తోపాటు మరికొంత మంది పై ఫెడరల్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేను నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ గేమింగ్ స్కామ్ గురించి మాట్లాడుతూ....తొలుత వినియోగ దారులకు గేమింగ్ యాప్ ప్రారంభంలోనే మంచి కమిషన్ వాలెట్లు అందించి విశ్వాసాని పొందుతాయి. ఆ తర్వాత వారి నుంచి ఎక్కుక కొనుగోళ్లను చేయించి అనుహ్యంగా వారి వాలెట్లో ఉన్న మనీ అంతా స్వాహా చేసి అకస్మాత్తగా యూప్ పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత రీ ఇన్స్టాల్ చేసుకోవాలంటు రావడం మొదలవుతుంది. ఈలోగా అందులో ఉన్న మన డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడికి గానీ వినియోగదారుడి మోసపోయినట్లు గ్రహించలేడు అని ఈడీ వివరించింది. (చదవండి: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన అమిత్ షా... సీఎం సొంత గడ్డ నుంచి ప్రచారం) -
సారీ! నేనింతలా ఎప్పడూ సిగ్గుపడలేదు
గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాఫియా బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబానికి క్షమాపణలు చెబుతూ...ఉద్వేగానికి గురయ్యారు. సదరు బాధిత కుటుంబానికి 'సారీ' అని క్షమాపణ చెబుతూ...తానెప్పుడూ ఇంతలా సిగ్గుపడలేదన్నారు. పోలీస్ యంత్రాంగం ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడే సాహసం చేసిందంటే...నిజంగా ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. ఈ మేరకు దిబ్రూఘర్లో 32 ఏళ్ల వినిత్ బగారియా అనే యువ వ్యాపారవేత్త మాఫియా బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుటుంబానికి చెందిన ఓ షాపులోని వ్యక్తితో సహా ముగ్గురు తననను బెదిరిస్తున్నారని, ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ..ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసి మరీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సదరు వ్యక్తి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు బాధితుడు తెలిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మీడియా సమావేశంలో ఆ ఘటన గురించి మాట్లాడుతూ... ప్రజలతో పోలీసులు స్నేహ పూర్వకంగా మెలగాలని పదేపదే చెబుతున్నప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి గోడుని పట్టించుకోని పోలీసుల పై తగిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. (చదవండి: కాంగ్రెస్లో కలవరం.. బీజేపీతో టచ్లో కీలక నేతలు!) -
మహిళా రచయిత్రి పై అత్యాచారం...డాన్ పేరుతో బెదిరింపులు..
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతమే లేదన్నట్లుగా నేరాలు జరుగుతున్నాయి. ఈ అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లంతా సమాజంలో మంచి స్థానంలో ఉన్న ప్రముఖులు లేదా ప్రుముఖుల పిల్లలే కావడం బాధకరం. స్టార్ హీరోయిన్ దగ్గర నుంచి మంచి ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న మహిళలందరూ ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రబుద్ధులు చట్టాలను సైతం లెక్కచేయకుండా మహిళలపై అయిత్యాలకు తెగబడుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక రచయిత్రి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకెళ్తే....ముంబైలోని ఉంటున్న ఒక రచయిత్రి అత్యాచారానికి గురైంది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఫైవ్స్టార్ హోటల్లో 35 ఏళ్ల రచయిత్రి పై 75 ఏళ్ల వ్యాపారవేత్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా ఆ వ్యాపారవేత్త ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ డాన్ దావుద్ ఇబ్రహీం పేరుతో బెదిరించాడు. దీంతో ఇక ఆమె చేసేదిలేక ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు నిందితుడు బాధిత మహిళ వద్ద రూ.2 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా... నిందితు డాన్ పేరుతో బెదిరించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ.. బొల్సోనారో బలుపు వ్యాఖ్యలు) -
సోదాల పేరుతో సీబీఐ అధికారుల రచ్చ
న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు గుంజేందుకు సోదాల పేరుతో హంగామా సృష్టించిన సీబీఐ అధికారులు నలుగురు అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు వారిని డిస్మిస్ చేయడంతోపాటు అరెస్ట్ చేశారు. ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులమని చెబుతూ కొందరు తన ఆఫీసులోకి వచ్చి, నానా హంగామా సృష్టించారని చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేశారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి, రూ.25 లక్షలివ్వాలని డిమాండ్ చేశారని అందులో పేర్కొన్నారు. తమ సిబ్బంది ఒకరిని పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్కుమార్ జైశ్వాల్ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఈ నలుగురూ ఢిల్లీ సీబీఐ ఆర్థిక నేరాలు, ఇంటర్పోల్ ప్రొటోకాల్ డివిజన్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సైలు సుమిత్ గుప్తా, అంకుర్ కుమార్, ప్రదీప్ రాణా, అకాశ్ అహ్లావత్లుగా గుర్తించారు. వీరి నివాసాలపై సోదాలు చేపట్టి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ అరెస్ట్ చేయడంతోపాటు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిపై ఆరోపణలు రుజువైతే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
సున్నం కొడుతుంటే రహస్య గది కనిపించింది.. అందులోకి వెళ్లి చూడగా..
సాక్షి, చెన్నై: ఓ పారిశ్రామిక వేత్త ఇంటికి సున్నం కొట్టేందుకు వెళ్లిన నలుగురు కార్మికులు కన్నం వేశారు. ఏకంగా రూ. 2.5 కోట్ల నగదును అపహరించుకెళ్లారు. ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో నలుగుర్ని అరెస్టు చేశారు. వివరాలు.. తిరుప్పూర్కు చెందిన దురైస్వామి (56)పారిశ్రామిక వేత్త. ఆయనకు బనియన్ ఉత్పత్తి పరిశ్రమలు, నూలు ఉత్పత్తి మిల్లులు ఉన్నాయి. ఆయన కుమార్తెకు ఇటీవల వివాహం అయ్యింది. ఇంట్లో భార్య ధనలక్ష్మితో పాటుగా దురైస్వామి ఉన్నారు. వీరికి సేవల్ని అందించేందుకు కొందరు పని వాళ్లు కూడా ఉన్నారు. పోలీసుల అదుపులో నిందితులు ఈ పరిస్థితుల్లో లెక్కల వ్యవహారాల్ని పరిశీలించే క్రమంలో ఇంట్లో ఉన్న నగదు, నగలు మాయం కావడంతో తనకు కావాల్సిన వారి ద్వారా చెన్నై పోలీసుల్ని ఆశ్రయించారు. ఇక్కడి నుంచి తిరుప్పూర్కు కేసు బదిలీ అయ్యింది. రెండు నెలల క్రితం ఆయన కుమార్తె వివాహం జరగ్గా, అంతకు ముందు ఇంటిని శుభ్రం చేసేందుకు కార్మికులు రంగంలోకి దిగారు. సున్నం కొట్టే వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. వీరిలో తిరువణ్ణామలైకు చెందిన సతీష్, దామోదరన్, శక్తి, నీలగిరికి చెందిన రాధాకృష్ణన్పై అనుమానాలు నెలకొన్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సున్నం కొట్టే సమయంలో దురై స్వామి ఇంట్లో తమకు ఒక రహస్య గది కనిపించిందని, అందులోకి వెళ్లి చూడగా, కొన్ని చిన్న చిన్న సంచుల్లో రూ. 2 వేల నోట్లను మూటలు కట్టి పడేసి ఉన్నాయని, అందులో ఓ సంచితో తాము ఉడాయించినట్టు అంగీకరించారు. దీంతో ఈ నలుగుర్ని బుధవారం అరెస్టు చేశారు. వీరు పట్టుకెళ్లిన నగదు రూ. 2.5 కోట్లుగా తేల్చారు. ఆ నగదు ఎక్కడ దాచి పెట్టారో తదితర వివరాల్ని నిందితుల వద్ద సేకరిస్తున్నారు. అలాగే, 75 లక్షలు విలువైన బంగారంతో తమకు సంబంధం లేదని ఈ నిందితులు పేర్కొనడంతో ఆ దొంగల కోసం వేట ప్రారంభించారు. చదవండి: Banjara hills: వివాహితతో రెండేళ్లుగా సహజీవనం..దూరం పెడుతోందని.. -
అపహరణకు గురైనవాడే నేరస్తుడు, ఫిర్యాదుదారుడే నిందితుడు
న్యూఢిల్లీ: మనం ఎన్నో విచిత్రమైన కేసులు గురించి విన్నాం. కానీ ఈ కేసు అత్యంత విచిత్రమైంది. పోలీసులకు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నప్పుడూ అత్యంత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అత్యంత విస్తుపోయే విషయమేమిటంటే..అపహరణకు గురైనవాడిపై గతంలో చీటింగ్ కేసు నమోదైంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే నిందితులే బాధితులుగా మారడం. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....గ్రేటర్ నోయిడాలోని కస్నా ప్రాంతంలో వ్యాపారవేత్త అమిత్ కుమార్ కిడ్నాప్కి గురయ్యారు. వ్యాపారవేత్త కారుని ఒక రౌండ్అబౌట్ వద్ద ఆపి, అతనిని, అతని డ్రైవర్ కుందన్ను కొట్టి హెచ్చరిక కాల్పులు జరిపారు. అనంతరం కుమార్తో కలిసి వేగంగా వెళ్లిపోయారు. అయితే వ్యాపారవేత్త డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకుని విచారించడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనలోని ప్రధాన నిందితుడుగా పర్వీందర్ తెవటియాని గుర్తించి అరెస్టు చేయడమే కాకుండా నేరానికి ఉపయోగించిన కారు, పిస్టల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు తాలుకా షాకింగ్ విషయాలు విని ఆశ్చర్యపోయారు. అపహరణకు గురైన వ్యాపారవేత్త పై సుమారు రెండున్నర కోట్ల చీటింగ్ కేసు నమైదైందని గుర్తించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ వ్యాపారవేత్త మీద ఫిర్యాదు చేసినవాడే అపహరించాడని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. "వ్యాపారవేత్త అమిత్ కుమార్ తనకు మంత్రిత్వ శాఖలో పరిచయాలు ఉన్నాయని చెప్పి నిందితుడు తెవతియాకి భూమికి సంబంధించిన సమస్యలో సాయం చేశాడు. ఆ తర్వాత తనకు హోమంత్రితో ఉన్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పించగలనని చెప్పాడు. దీంతో తెవతియా అతని కూతురు, పలువురు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు రెండున్నర కోట్లు ఈ వ్యాపారవేత్తకు ఇచ్చారు. ఏడాది గడుస్తున్న ఉద్యోగాలు రాకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తేవటియా కుమార్ కారుకు జీపీఎస్ సిస్టమ్ను అమర్చి, అతడిని అనుసరించి మరీ అపహరించాడు" అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. (చదవండి: ఇరు కుటుంబాల మధ్య పాతకక్షలు...హంతకుడిగా మారిన పెళ్లి కొడుకు) -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. షాక్తో చనిపోయిన సోవియట్ బిజినెస్మేన్?
రష్యా ఏకపక్షంగా చేపట్టిన యుద్ధం కారణంగా తమ భవిష్యత్తు ఎలా ఉంటోందోననే భయం రష్యన్ వ్యాపారుల్లో నెలకొంది. ఇప్పటికే అనేక మంది తమ వ్యాపారాలను అందిన కాడికి అమ్మేస్తున్నారు. ఈ తరుణంలో యూకేలో ఓ ఉక్రెయిన్ వ్యాపారి అనుమానస్పదంగా మరణించడం సంచలనంగా మారింది. ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దాడి ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వివిధ దేశాలతో భారీ ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్న సోవియట్ కుబేరులు.. తాజా పరిణామాలతో బెంబెలెత్తిపోతున్నారు. ఈ దేశం ఎప్పుడు ఏ చర్యలు తీసుకుంటుందో.. తమ భవిష్యత్తు ఏమైపోతుందనే అనే సందేహాలు వారిని చుట్టుముడుతున్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్లో అంతర్భాగమైన ఉక్రెయిన్లో 1995లో జన్మించాడు మిఖైల్ వాట్ఫోర్డ్. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ను వీడి యూకేలోని లండన్లో సెటిల్ అయ్యాడు. గ్యాస్, ఆయిల్ సరఫరా బిజినెస్తో ధనవంతుడయ్యాడు. ఆ తర్వాత తన మకాంని లండన్ నుంచి సర్రే కౌంటీకి మార్చాడు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన మరుసటి రోజే సర్రేలోని తన ఇంటిలో ఆయన శవమయ్యాడు. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మిఖైల్ మరణానికి యుద్ధానికి సంబంధం ఉండకపోవచ్చని యూకే అధికార వర్గం వాదిస్తోంది. అయితే మిఖైల్ సన్నిహితులు మాత్రం ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడి మిఖైల్ని తీవ్రంగా కలచివేసందంటున్నారు. అతని మరణానికి స్పష్టమైన కారణాలు తాము వివరించలేకపోయినా.. యుద్ధం తదనంతర పరిస్థితులు అతని ఆలోచనలను కచ్చితంగా ప్రభావితం చేశాయంటున్నారు. యుద్ధం మొదలైన మరుసటి రోజే ఆరోగ్యంగా మిఖైల్ అకస్మాత్తుగా చనిపోవడం యాదృచ్ఛికం కాదంటున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలైన తర్వాత రష్యాతో పాటు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యాపారవేత్తలను పశ్చిమ దేశాలు టార్కెట్ చేశాయి. వారి వ్యాపార సామ్రాజ్యం ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక మిఖైల్ విషయానికి వస్తే యూకే తయారు చేసిన పుతిన్ ఇన్నర్ సర్కిల్ వ్యాపారవేత్తల జాబితాలో అతని పేరు లేదని తెలుస్తోంది. కానీ యుద్ధతదనంతర పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆలోచన మిఖైల్ మరణానికి కారణమనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చదవండి: పుతిన్తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్ బిలియనీర్లు -
యజమానులు ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయన ఇస్తున్నాడు!!
కేరళకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పద్మశ్రీ అవార్డ్ గ్రహిత,వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియాను గుర్తు చేస్తున్నారు. తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బెంజ్ కార్లతో పాటు మరెన్నో బహుమతుల్ని అందిస్తూ హాట్ టాపిగ్గా నిలుస్తున్నారు. కేరళకు చెందిన ఏకే షాజీ మైజీ డిజిటల్ రీటైల్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ సంస్థలో చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సీఆర్ అనీష్ 22ఏళ్లుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 22 సంవత్సరాలుగా వ్యాపారవేత్త ఎకె షాజీతో కలిసి పనిచేస్తున్న సీఆర్ అనీష్ విధేయతకు గుర్తుగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ క్లాస్ 220 డి కారును ప్రజెంట్ చేశాడు. ఈ సందర్భంగా ప్రియమైన అనీ గత 22 సంవత్సరాలుగా మీరు నాకు బలమైన స్తంభంలా ఉన్నారు. మీరు మీ కొత్త క్రూజింగ్ భాగస్వామిని ప్రేమిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ వ్యాపారవేత్త ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులకు బ్లాక్ లగ్జరీ ఎస్యూవీని బహుమతిగా ఇచ్చిన ఫోటోల్ని జత చేస్తూ ఇన్స్ట్రాగ్రామ్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. గతంలో ఉద్యోగులకు విశ్వసనీయతకు ప్రతిఫలమివ్వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం షాజీ తన ఉద్యోగులకు ఆరుగురు చొప్పున కారును బహుమతిగా ఇచ్చాడు. కాగా, గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా తన ఉద్యోగులకు విలాసవంతమైన బహుమతుల్ని అందించారు. 018లో దీపావళికి తన ఉద్యోగులకు 600 కార్లు ఇచ్చాడు. 3 కోట్ల విలువైన మూడు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్యూవీలను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. -
నువ్వైనా నా మాట వినూ! భర్త విషం తీసుకోవడం చూసి ఆ భార్య..
కరోనాతో కోట్లాది మంది బతుకులు తలకిందులు అయ్యాయి. ఉపాధి లేక ఎంతో మంది ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ తమ జీవితాలన్ని తలకిందులు చేసిందంటూ బాధపడేవాళ్లూ ఉన్నారు. ఈ జాబితాలో రాజీవ్ తోమర్ కూడా ఉన్నారు. కరోనా దెబ్బకి కోలుకోలేకుండా అయిన ఈయన.. ఏకంగా ప్రాణం తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడీ ఉదంతం ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. కరడుగట్టిన బీజేపీ అభిమాని కాస్త విమర్శలు చేయడం పొలిటికల్ హీట్ పెంచేసింది. ఉత్తరప్రదేశ్లోని భాగ్పట్కు చెందిన బూట్ల వ్యాపారి రాజీవ్ తోమర్ (40) దంపతులు లైవ్లో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో రాజీవ్ భార్య మరణించగా, రాజీవ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన ఫేస్బుక్ లైవ్లో సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీపై, ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మరణానికి మోదీనే కారణం అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు రాజీవ్. భార్య అడ్డుకుంది కానీ.. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆ లైవ్ వీడియోలో రాజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, చిన్న వ్యాపారులకు మోదీ ఎంతమాత్రమూ హితుడు కాదని విమర్శించారు. ప్రధానికి చేతనైతే పరిస్థితులు చక్కదిద్దాలని హితవు పలికారు. ‘‘ప్రభుత్వం నాలాంటి వాళ్ల మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా విను’’ అంటూ విసురుగా విషం తాగేశారు. భర్త విషం తాగడంతో షాక్ తిని.. ఆమె కూడా ఆ వెంటనే విషం తీసుకున్నారు. కాసేపటికి లైవ్ ద్వారా స్పందించిన కొందరు.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పూనం మరణించినట్టు నిర్ధారించారు. రాజీవ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2020లో విధించిన కరోనా లాక్డౌన్ కారణంగా రాజీవ్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీసుకున్న రుణాలు చెల్లించే వీలులేకపోయిందన్నారు. బీజేపీ అభిమాని నుంచి.. రాజీవ్ తోమర్ కరడుగట్టిన బీజేపీ అభిమాని. ఈ మేరకు బీజేపీ మీద అభిమానంతో కట్టిన బ్యానర్లలో ఆయన ఫొటోలు ఉండడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలువురు కీలక నేతలతో ఆయన సన్నిహితంగా దిగిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. భాగ్పట్ ఎంపీ సత్యపాల్ సింగ్(ఎడమ)తో రాజీవ్(కుడి) వీడియోలో చెప్పినట్లుగా బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోవడం వల్లే చనిపోయి ఉంటారని సన్నిహితులు చెప్తున్నారు. అయితే బీజేపీ మాత్రం వ్యక్తిగత కారణాలకు.. పార్టీని నిందించడం సరికాదని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనాతో ఎంతో మంది నష్టపోయారని, కేవలం పార్టీ ప్రతిఫలాలు అందలేదన్న ఉద్దేశంతో నిందించడం సబబేలా అవుతుందని రాజీవ్ వీడియోను ఖండిస్తున్నారు పలువురు బీజేపీ నేతలు. ఇక ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అన్యాయం జరిగినా వదలం. ఈ పోరాటంలో మీరు ఒంటరివారు కాదు - నేను మీతో ఉన్నాను అంటూ రాజీవ్ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రాజీవ్ భార్య మృతికి సంతాపం తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. बागपत के राजीव तोमर जी व उनकी पत्नी के वीडियो ने छोटे व्यापारियों की लाचारी का दर्दनाक सच दिखाया है। तोमर जी के स्वस्थ होने की कामना व उनकी पत्नी के दुखद देहांत पर मेरी शोक संवेदनाएँ। अन्याय के सामने हम हार नहीं मानेंगे। इस लड़ाई में आप अकेले नहीं हैं- मैं आपके साथ हूँ। — Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022 बागपत में एक व्यापारी एवं उनकी पत्नी की आत्महत्या के प्रयास और उनकी पत्नी की मृत्यु के बारे में जान कर बेहद दुःख हुआ। परिजनों के प्रति मेरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि श्री राजीव जी को जल्द स्वास्थ्य लाभ मिले। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022 -
వ్యాపారవేత్త ప్రవీణ్ రావత్ అరెస్టు
సాక్షి, ముంబై: మనీ ల్యాండరింగ్ కేసులో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్ రావత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం(ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ(హెచ్డీఐఎల్)లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ రావత్ పేరు బయటకు వచ్చింది. పంజాబ్, మహరాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ)లో జరిగిన సుమారు రూ. 4,300 కోట్ల అక్రమాలపై ఈడీతోపాటు ఇతర నేర దర్యాప్తు సంస్థలు కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్ రావత్కు సంబంధాలున్నా యని ఆరోపణలు రావడంతో ఈడీ ఆయనను అరెస్టు చేసి ముంబైలోని కార్యాలయానికి తీసుకెళ్లింది. ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో కూడా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ దర్యా ప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. సబర్బన్ ముంబైలోని మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంహెచ్డీఏ)కు చెందిన ఓ భవనం పునర్నిర్మాణానికి ఎంహెచ్డీఏ నుంచి గురుఆశిష్ నిర్మాణ సంస్థ అనుమతి తెచ్చుకుంది. కాగా, ఈ ప్రాజెక్టులో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) సంబంధించి జరిగిన అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఈడీ దర్యాప్తులో తేలింది. అయితే ఈ గురుఆశిష్ నిర్మాణ సంస్థ ప్రవీణ్రావత్దిగా ఈడీ విచారణలో తేలింది. ఇప్పటికే మనీల్యాండరింగ్ కేసుకింద ప్రవీణ్రావత్కు చెందిన రూ.72కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ విచారణలో హెచ్డీఐఎల్ ద్వారా పీఎంసీ బ్యాంకునుంచి అడ్వాన్సులు, రుణాల రూపంలో ప్రవీణ్ రావత్ రూ.95కోట్ల మేర లబ్ధి పొందినట్లు తేల్చింది. చదవండి: బుధవారం వ్యాపారవేత్త ప్రవీణ్ రావత్ను అరెస్టు చేస్తున్న ఈడీ బృందం కాగా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు లేవని ఈడీ చెబుతోంది. హెచ్డీఐల్కు చెందిన లెడ్జర్లో పాల్ఘర్ ప్రాంతంలో స్థల సేకరణ నిమిత్తం ప్రవీణ్ రావత్కు ఈ నిధులు ఇచ్చినట్లుగా ఉంది. పీఎంసీ బ్యాంకు కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రావత్ భార్య వర్షా రావత్ను గతేడాది ఈడీ విచారణ చేయగా ప్రవీణ్ రావత్ భార్య పేరు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రవీణ రావత్ రూ.1.6 కోట్లను తన భార్య మాధురి రావత్కు ట్రాన్సఫర్ చేయగా..ఆమె రూ.55 లక్షలను వడ్డీ లేని రుణంగా వర్షా రావత్కు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. వీటి ఆధారంగా ఈడీ 2020 అక్టోబర్లో మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. చదవండి: జాతీయ గీతాన్ని అవమానించిన సీఎం మమతా బెనర్జీ.. కోర్టు సమన్లు జారీ -
మిస్డ్ కాల్ వచ్చింది..రూ.46లక్షలు పోయాయి
ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా? ఇప్పుడు దీని గురించి సైబర్ నేరస్తులు ఆలోచిస్తున్నారు. ఓవైపు కరోనా, కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు.వెరసీ సైబర్ నేరస్తులు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అవుతుంది. కోవిడ్ కారణంగా సైంబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఫోన్ కాల్స్, ఓటీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది ఆ సూచనల్ని లైట్ తీసుకుంటున్నారు. దీన్ని అదునుగా చేసుకొని కేటుగాళ్లు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్లలో మనీనీ కాజేస్తున్నారు. అహ్మాదాబాద్ శాటిలైట్ ఎక్స్టెన్షన్లో నివాసం ఉండే రాకేష్ షా కెమికల్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న రాకేష్కు గుర్తు తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. మిస్డ్ కాల్ వచ్చిన తర్వాత మొబైల్లో సిగ్నల్ లేకపోవడం, సిమ్ కార్డులు బ్లాక్ అయ్యాయి. దీంతో తన సిమ్ కార్డులు పనిచేయడం లేదని సదరు టెలికాం నెట్వర్క్కు చెందిన కస్టమర్ కేర్కి కాల్ చేశాడు. రాకేష్ ఫిర్యాదుతో నిర్వాహకులు నాలుగు గంటల్లో సిమ్లు యాక్టివేట్ అవుతాయని చెప్పారు. సరిగ్గా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని మరోసారి కంపెనీకి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం సిమ్ను యాక్టివేట్ చేసే సమయంలో మళ్లీ రెండు సిమ్ కార్డ్లు బ్లాక్ అయినట్లు గుర్తించాడు. వెంటనే సంబంధిత సిమ్ నెట్ వర్క్కు సంబంధించిన స్టోర్ నిర్వాహకుల్ని నేరుగా సంప్రదించాడు. రాకేష్ ఫోన్ను చెక్ చేసిన స్టోర్ ప్రతినిధులు కోల్కతాలో రెండు సిమ్ కార్డ్లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు తనకు తెలియకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు అనుమానించాడు. సంబంధిత బ్యాంక్లను సంపద్రించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరస్తులు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.46 లక్షలు కాజేశారని కంగుతిన్నాడు. ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా సోనాయ్ దాస్, రోహిత్ రాయ్, రాకేష్ విశ్వకర్మ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన రాకేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.46.36 లక్షలు విత్డ్రా అయ్యాయని, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలను సేకరించడం ద్వారా బ్యాంక్లో డబ్బులు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! -
నోట్ల గుట్టల మాయగాడు.. కొత్త ట్విస్ట్
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు. అలా అనలేదు.. మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు. పొలిటికల్ డ్రామా.. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్రాజ్ జెయిన్కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా. ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు. చదవండి: పీయూష్పై ఇంతకాలం అనుమానం ఎందుకు రాలేదంటే.. -
ఖాకీ క్రౌర్యం: నేను చెప్పింది చెయ్.. అంతే.. లేదంటే చుక్కలే..
‘పోలీసైతే చాలు.. లైసెన్స్ లేదని వంద నొక్కేయొచ్చు... దొంగోడి దగ్గర సగం కొట్టేయొచ్చు.. ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరి దగ్గరా దండుకోవచ్చు.. అంతెందుకు అసలు ఎవడినైనా తొక్కేయొచ్చు.. ’’ ఓ సూపర్ హిట్ తెలుగు సినిమాలో అవినీతి పోలీసులపై పూరీ జగన్నాథ్ పంచ్ డైలాగ్ ఇది.. ఇప్పుడు ఇదే డైలాగ్ జిల్లాలోని ఒకరిద్దరు అక్రమార్కులకు కచ్చితంగా వర్తిస్తుందనే చెప్పాలి. చాలామంది పోలీసులు నిజాయితీగానే పని చేస్తున్నప్పటికీ.. కొద్దిమంది చేతివాటం, అడ్డగోలు అక్రమార్జన ఇప్పుడు వివాదాస్పదమై జిల్లా పోలీసు శాఖలోనే చర్చనీయమైంది. అసలు విషయమేమిటంటే... సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న హథీరాంజీ కాలనీలో బొడ్డు జయ చంద్ర అనే వ్యాపారి రెయిన్బో కలెక్షన్స్ పేరిట చిన్నపాటి రెడీమేడ్ దుస్తుల షాపు పెట్టుకున్నారు. ఈ మేరకు షాపు భవన యజమాని మాధవీదేవితో 2018 మే నెల 9వ తేదీన అగ్రిమెంట్ రాయించుకున్నారు. కనీసం ఐదేళ్లపాటు ఆ షాపును అక్కడే కొనసాగించేందుకు సమ్మతిస్తూ ఇరువర్గాలు మాట్లాడుకున్నాయి. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో ఆ క్రమంలో అక్కడ జయచంద్ర దాదాపు ఏడులక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇదిలా ఉండగా, సరిగ్గా 16 నెలలకు మాధవీలత తరఫున కొందరు వచ్చి షాపు ఉన్నట్టుండి ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ‘ఇదేమిటి.. ఇప్పుడే చాలా పెట్టుబడి పెట్టాను.. ఐదేళ్ల వరకు కాకపోయినా కొన్నాళ్లు ఆగండి’ అని జయచంద్ర చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. వాదోపవాదాలు, ఘర్షణల స్థాయికి వెళ్తుండడంతో అతను 2019 నవంబర్లో తిరుపతి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. అప్పటి నుంచి వివాదం కోర్టులోనే ఉంది. ఇక్కడి వరకు జరిగిన పరిణామాలు చాలా చోట్ల అందరూ చూసే ఉంటారు. వినే ఉంటారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అక్రమంగా చొరబడి.. దౌర్జన్యం చేసినా.. వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈనెల 5వ తేదీన ఆదివారం ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి షాపులోకి జొరబడి.. అక్కడ పనిచేస్తున్న ఓ యువతిని బయటకి పంపివేసి.. షాపునకు తాము తెచ్చుకున్న తాళం వేసి వెళ్లిపోయారు. ఇదంతా సీసీ రికార్డుల్లో నమోదు కావడంతో ఆ ఫుటేజీని తీసుకుని జయచంద్ర పోలీస్స్టేషన్కు వెళ్లారు. అప్పటికే తన షాపులోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఆ స్టేషన్లోని ఓ అధికారి ముందు కూర్చుని ఉన్నారు. దీంతో జయచంద్ర ‘సర్.. వీళ్లు నేను లేని సమయంలో నా షాపులోకి వచ్చి దౌర్జన్యం చేశారు... కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆ పోలీసు అధికారి ఫిర్యాదుదారుడైన జయచంద్రపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషాలు చేస్తున్నావా.. వెంటనే ఖాళీ చేయి.. లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి లోపలేస్తా.. అని బెదిరించారు. దీంతో బిత్తరపోయిన జయచంద్ర వెంటనే ఉన్నతాధికారిని కలిసి విషయం చెప్పడంతో ఎట్టకేలకు 6వ తేదీన ఎఫ్ఐఆర్(నెం721) నమోదైంది. 448, 427, 341, 506 డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద మాధవీదేవీపైనా కేసు నమోదు చేశారు. కానీ షాపు తాళాలు మాత్రం ఇప్పించేందుకు పోలీసులు నిరాకరించారు. విషయం కోర్టులో ఉంది కదా.. వేచిచూడాలంటూ దాటవేశారు. అయితే ఇదిలా ఉండగానే డిసెంబర్ 21వ తేదీన మరోసారి గుర్తుతెలియని దుండగులు వచ్చి షాపు షట్టర్ తెరిచి లోపల ఉన్న దుస్తుల సరుకును చిందర వందర చేసి పడేశారు. మొత్తం సరుకుతో పాటు టేబుల్స్, రాక్స్, హాంగర్స్, డిస్ప్లే మోడల్స్ అన్నీ తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై వెంటనే బాధితుడు జయచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా. ఎఫ్ఐఆర్ (నం.735)తో 448, 427 సెక్షన్ల కింద మాధవీదేవిపైనా కేసులు నమోదు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా దౌర్జన్యం చేసినా, దానిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడమే ఇప్పుడు చర్చకు తెరలేపింది. పోలీసులే నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోవడం విడ్డూరం నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు అప్పులు చేసి జీవనోపాధికి బట్టల షాపు పెట్టుకున్నాను. ముందుగానే మాట్లాడుకుని ఓనరుతో ఒప్పందం కుదుర్చుకున్నాను. కానీ వివాదం రేగడంతో కోర్టును ఆశ్రయించాను. కానీ ఓనర్ తరఫున వాళ్లు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఓ అధికారి అయితే స్వయంగా బెదిరించారు. కనీసం షాపు వద్దకు వచ్చి విచారణ చేయాల్సిందిగా ఎన్నిమార్లు బతిమాలినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఘటనా స్థలానికి కూడా రాలేదు. పోలీస్స్టేషన్కు 200 అడుగుల దూరంలోనే మా షాపు ఉంటుంది. ఇలాగైతే ఫిర్యాదు దారులు పోలీస్స్టేషన్ మెట్లు ఎలా ఎక్కుతారు? – జయచంద్ర, ఫిర్యాదుదారు -
డబ్బు, నగలు తీసుకుని.. మాజీ ప్రియుడితో పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య
సాక్షి,తిరువొత్తియూరు(చైన్నై): ప్రియుడితో రెండోసారి పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా మార్తాండం కొదుంకులం కనియన్ విలై ప్రాంతానికి చెందిన మోహన్ రాజు (41) కార్లు కొనుగోలు చేయడంతోపాటు విక్రయాలు చేస్తుంటాడు. అతనికి భార్య సోనియాగాంధీ (35), కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో సోనియాగాంధీ కుమార్తెతో సహా అదృశ్యమైంది. 45 సవర్ల నగలు, రూ.13 లక్షలు తీసుకువెళ్లింది. పోలీసులు గాలింపు చర్యలుచేపట్టి 68 రోజుల తర్వాత ఆమె ప్రియడు మనోజ్తో ఉండగా పట్టుకుని తీసుకువచ్చారు. వారిని కోర్టులో హాజరుపరచగా సోనియాగాంధీ భర్తతో కలిసి జీవించడానికి సమ్మతించింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్కూలుకు వెళ్లిన పిల్లలను తీసుకువస్తానని బయటికి వెళ్లిన సోనియాగాంధీ మళ్లీ ప్రియుడు మనోజ్తో వెళ్లిపోయింది. ఆమె భర్త మోహన్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదు, 12 సవర్ల బంగారు చైను తీసుకెళ్లిందని పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Kukatpally Rave Party: సడన్గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా.. -
బడా వ్యాపారవేత్తకు షాక్: అటు కుమార్తె పెళ్లి, ఇటు స్టార్ హోటల్లో భారీ చోరీ
జైపూర్: ఒకవైపు అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంటే మరోవైపు కేటుగాళ్లు రెచ్చి పోయారు. అదను చూసి తమ పని కానిచ్చేశారు. ముంబై వ్యాపారవేత్తకు చెందిన ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దోచు కొనిపోయారు. ఈ భారీ చోరీ ఫైవ్స్టార్ హోటల్లో గురువారం జరిగింది. విషయం తెలిసి వ్యాపారవేత్త కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది. (ఎప్పుడంటే అప్పుడు బరువు తగ్గిపోవచ్చా? నిజంగానే ఇదొక సవాలా?) వివరాలను పరిశీలిస్తే ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ భాటియా కుమార్తె వివాహ వేడుక జైపూర్లోని ఫైవ్స్టార్ హోటల్ క్లార్క్స్ అమెర్లో ఘనంగా జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా భాటియా, ఇతర కుటుంబ సభ్యులు ఏడో అంతస్తులో బస చేశారు. కింద లాన్లో సంగీత్ వేడుక జరుగుతోంది. అంతా ఆ హడావిడిలో ఉండగా అదును చూసిన దుండగులు రూ. 2 కోట్లకు పైగా విలువైన డైమండ్, బంగారు నగలతోపాటు 95 వేల నగదు చోరీకి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నామని, సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అపహరించినట్లు పోలీసులు రాధారామన్ గుప్తా శుక్రవారం తెలిపారు. (World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!) హోటల్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం జరిగిందని రాహుల్ భాటియా తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో హోటల్ మేనేజ్ మెంట్, ఇతర సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వధువు తరపు బంధువులే ఈ పనిచేసి ఉంటారని హోటల్ యాజమాన్యం చెబుతోంది. -
అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. గంటల్లో..
చెన్నె: ఇటీవల కొత్త తరహా నేరాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త తరహాలో నేరాలు జరుగుతుండడంతో పోలీసులకు సవాల్గా మారింది. అయితే సినిమాల్లో చూపించిన మాదిరి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అచ్చం సినిమా కథ మాదిరే తమిళనాడులో ఓ సంఘటన జరిగింది. వ్యాపారి కుమారుడిని కొందరు కిడ్నాప్ చేసి డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. డబ్బుతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ యువకుడు కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడ్డాడు. తిరుప్పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈశ్వరమూర్తి కుమారుడు శివప్రదీప్ (22) కడయూరులోని రైస్ మిల్లుకు ఆదివారం రాత్రి కారులో శివప్రదీప్ వెళ్తున్నాడు. వీరచోళపురం ప్రాంతానికి చేరుకోగానే మొత్తం ఏడు మందితో కూడిన గ్యాంగ్ అతడి వాహనాన్ని అడ్డుకున్నారు. శివప్రదీప్ను వెంటనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం డబ్బుల కోసం యువకుడి తండ్రికి ఫోన్ చేశారు. రూ.3 కోట్లు ఇస్తేనే కుమారుడిని వదిలేస్తామని హెచ్చరించారు. కిడ్నాపర్ల హెచ్చరికలతో భయపడిన అతడి తండ్రి అడిగిన మొత్తాన్ని ఇచ్చేయడంతో కిడ్నాపర్లు ఆ యువకుడిని వదిలేశారు. (చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్) అయితే రూ.మూడు కోట్లు అప్పనంగా పోయాయని భావించిన ఈశ్వరమూర్తి కాంగేయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని వ్యాపారవేత్తకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. వారిలో ముగ్గురి నుంచి రూ.1.69 కోట్లు, మరొకరి నుంచి రూ.20.44 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఆరు గంటల వ్యవధిలోనే పోలీసులు కేసు చేధించడంపై పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును సులువుగా చేధించారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
మధుసూదన్రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో విచారణ ముమ్మరం
హైదరాబాద్: మధుసూదన్రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దర్యాప్తులో.. మధుసూదన్రెడ్డిని గంజాయి మాఫియానే హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులు కర్ణాటక బీదర్కు చెందిన సంజయ్, జగన్నాథ్, హరీష్, సంజీవ్గా పేర్కొన్నారు. గత నెలలో గంజాయి తీసుకొస్తుండగా సంజయ్ గ్యాంగ్ను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. కాగా గంజాయి స్మగ్లింగ్ కోసం లారీ, డబ్బుని మధుసూదన్రెడ్డి సమకూర్చారు. చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా అనుకోకుండా గంజాయ్ గ్యాంగ్ పోలీసులకు పట్టుబడటంతో డబ్బు తిరిగి ఇవ్వాలని అతను ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో కిడ్నాప్ చేసి హత్యకు స్కెచ్ ప్లాన్ చేశారు. రౌడీషీటర్ ఎల్లంగౌడ్ హత్య కేసులో మధుసూదన్రెడ్డి నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మధుసూదన్రెడ్డి హత్య వెనకాల ప్రతికారం కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఇంటి నుంచి పనిచేయడానికేనా ఉద్యోగం? -
ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతి రేఖ
సాక్షి, హైదరాబాద్: కరోనా విసిరిన సవాళ్లకు ఎదుర్కొనేందుకు పలు రూపాల్లోని ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు, సామగ్రి ఎంతో ఉపకరించాయి. ఫ్రంట్లైన్ వారియర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఎంతో భద్రత కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం భారీగా పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు మెక్సికోకు చెందిన 21 ఏళ్ల యువ వ్యాపారవేత్త, విద్యార్థిని తమార ఛాయో రీ యూజబుల్ పీపీఈ కిట్లు తయారు చేశారు. దీంతో ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతిరేఖ విరిసినట్లు అయ్యింది. 3 రోజుల పాటు వైరస్ వాడి పారేసిన పీపీఈ కిట్ల ద్వారా ప్లాస్టిక్ కాలుష్యంతో పాటు వాటిపై మూడు రోజుల పాటు సజీవంగా ఉండే వైరస్తోనూ ముప్పేనని నిపుణులు చెబుతున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని తమార ఛాయో గతేడాది సహ స్థాపకురాలిగా ఓ సంస్థ ప్రారంభించి, పీపీఈ కిట్ల కొరత ఏర్పడినప్పుడు ఎంఈడీయూ ప్రొటెక్షన్ అభివృద్ధి చేశారు. వైరల్ రీసెర్చి ల్యాబ్స్లో ఉపయోగించే కోటింగ్ త రహాలో ఉన్న వస్త్రంతో ఆమె ఈ దుస్తులు తయారు చేశారు. ఈ కిట్ను 50 సార్ల వరకు ఉతికి ఉపయోగించొచ్చని, అయినా తన రక్షణ గుణాలు కోల్పోదని తమారా చెబుతోంది. ఈ దుస్తులకు క్యూఆర్ కోడ్ను కూడా అంతర్భాగంగా చేయడం ద్వారా దీన్ని ధరించే వారికి స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా దాన్ని ఎన్ని సార్లు ఉపయోగించారన్న సమాచారం వస్తుంది. దానిని 50 సార్లు ఉపయోగించాక ప్యాకేజింగ్ ఉత్పత్తులకు సంచులుగా వాడుకోవచ్చు. ఆస్పత్రి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు భారత్, బ్రిటన్ తదితర దేశాల్లోని వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ పీపీఈ కిట్లు, మాస్కులను ఎలా రీసైకిల్ చేయాలన్న దానిపై నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇంగ్లండ్లోని వేల్స్లో థర్మల్ కంపాక్షన్ గ్రూప్ (టీసీజీ) హాస్పిటల్ గౌన్లు, మాస్కులు, వార్డు కర్టెన్లు తదితరాలను ప్లాస్టిక్ ఇటుకలుగా తయారు చేసే మెషీన్లను రూపొందించింది. ఇలా ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ద్వారా పాఠశాలల కుర్చీలు, త్రీడీ ప్రింటర్ ఫిలమెంట్లు, దుస్తుల తయారీకి ఉపయోగించే దారంగా కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు. టీసీజీ గ్రూపు కెనడా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాలకు తమ యంత్రాలను ఎగుమతి చేసేందుకు సన్నద్ధమౌతోంది. రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. వాడేసిన పీపీఈ కిట్లతో ఇటుకలు, కన్స్ట్రక్షన్ ప్యానెళ్లు తయారు చేసి తక్కువ ఖర్చులో హౌసింగ్, స్కూళ్ల నిర్మాణానికి భారత్లో 27 ఏళ్ల బినిష్ దేశాయ్ అనే వ్యాపారవేత్త దోహదపడుతున్నాడు. యుక్తవయసు నుంచే వ్యర్థాల నుంచి ఇటుకల తయారీ నేర్చుకున్నాడు. డిస్ఇన్ఫెక్ట్ చేసిన, ముక్కలు చేసిన మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను, కాగితం మిల్లు వ్యర్థాలు, బైండర్తో మిక్స్ చేసి కొత్త ఇటుకలు తయారు చేయడాన్ని కనుగొన్నాడు. దేశాయ్ను ది రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటున్నారు. -
విందుకు పిలిచి అశ్లీల వీడియోలు తీసి హనీట్రాప్
యశవంతపుర: మంగళూరు ఉళ్లాలలో హనీట్రాప్ వెలుగుచూసింది. ఇక్కడి అపార్టుమెంటులో సప్నా, అఫ్రీన్ అనే యువతులు తమ పక్క ఫ్లాట్లో ఉండే వ్యాపారవేత్తను ఈ నెల 19న రాత్రి భోజనానికి పిలిచారు. అంతకుముందు అతనితో పథకం ప్రకారం పరిచయం పెంచుకున్నారు. అతడు విందుకు రాగానే మద్యం తాగించి రూ.2.12 లక్షలు నగదు, బంగారు అభరణాలను దోచుకున్నారు. మత్తులో ఉన్న అతనితో అశ్లీలంగా వీడియోలు, ఫోటోలను సప్నా తీసుకుంది. మరుసటి రోజు తేరుకున్న వ్యాపారవేత్త తన డబ్బు, నగలను ఇవ్వాలని కోరగా, అశ్లీల వీడియోలను విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో అతడు ఈనెల 23న ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇద్దరు యువతులనూ అరెస్ట్ చేశారు. -
హీరోయిన్పై అత్యాచారయత్నం, చంపుతామని బెదిరింపులు!
బడా వ్యాపారవేత్త తనపై అత్యాచారం చేసి చంపేందుకు ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్ హీరోయిన్ పోరి మోని(షామ్సున్నాహర్) ఫేస్బుక్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కించమంటూ దేశ ప్రధాని షేక్ హసీనాను కోరింది. ఆమెను తల్లిగా సంబోధించిన మోని నిందితులపై చర్యలు తీసుకోమని అర్థించింది. "న్యాయం కోసం ఎక్కడని వెతకాలి? నాలుగు రోజులుగా నేను న్యాయం కోసం తిరుగుతున్నాను. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను అమ్మాయిని, నటిని. వీటన్నింటికన్నా ముందు నేనూ ఒక మనిషినే. ఇక నేను సైలెంట్గా ఉండలేను" అని రాసుకొచ్చింది. నాలుగు రోజుల క్రితం ఓ క్లబ్లో బడా వ్యాపారవేత్త నజీర్ యు మహ్మూద్ తనపై అత్యాచారానికి యత్నించడంతో పాటు చంపుతామని బెదిరించాడని మోని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వ్యాపారవేత్తతో పాటు మరో నలుగురిని రైడ్ చేసి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారు మద్యంతోపాటు డ్రగ్స్ సేవించారని అధికారులు మీడియాకు తెలిపారు. ఇదిలా వుంటే పోరి మోని 2015లో వెండితెరకు పరిచయమైంది. సుమారు 24 బంగ్లాదేశీ చిత్రాల్లో కథానాయికగా అలరించింది. గతేడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన '100 డిజిటల్ స్టార్స్ ఆఫ్ ఆసియా' జాబితాలో చోటు దక్కించుకుంది. చదవండి: బన్నీ అస్సలు తగ్గట్లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులతో దండయాత్రకు రెడీ -
కరోనా నిబంధనలు బ్రేక్.. కుక్క అరెస్టు
ఇండోర్: చట్టం ముందు అందరూ సమానమే అని ఓ నిబంధన మన రాజ్యాంగంలో ఉంది. ఇండోర్ పోలీసులు ఈ నిబంధనను తూచా తప్పకుండా పాటించారు. ఎలా అంటారా ? కరోనా నిబంధనలు పాటించలేదని యజమానితో పాటు ఉన్న కుక్కను కూడా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భారత్లో విలయతాండవం చేస్తోంది. దీంతో వైరస్ కట్టడికి ఇప్పటికే రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకురాగా.. పలు రాష్ట్రాలు లాక్డౌన్ కూడా విధించాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం నైట్కర్ఫ్యూను అమలు చేస్తోంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమలులో ఉండగా ఇండోర్లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు తీసుకువచ్చాడు. అదే సమయంలో కర్ఫ్యూను అమలు చేసేందుకు పోలీస్ బృందం పెట్రోలింగ్ వచ్చారు. ఆ బృందానికి ఈ వ్యక్తి కుక్కతో బయట తిరగడం కనిపించింది. ఇంకేముంది యజమానినే గాక కుక్కని కూడా అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. అయితే.. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అరెస్టు సోషల్ మీడియాల్లో సంచలనంగా మారింది. ( చదవండి: వైరల్: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు.. ) -
బెంగళూరులో హత్య, హైదరాబాద్లో గాలింపు!
సాక్షి, సిటీబ్యూరో: కటక్ జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్స్టర్ షేక్ హైదర్ కోసం గాలిస్తున్న ఒడిస్సా పోలీసులు సిటీకి చేరుకున్న 48 గంటల్లోనే వేరే హత్యకేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన మరో బృందం హైదరాబాద్కు వచ్చింది. తమ పరిధిలో ఈ నెల 4న చోటు చేసుకున్న దారుణ హత్యకు నగరానికి చెందిన సూత్రధారి కీలకమని తేలడంతో ఈ బృందం గాలిస్తోంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఆ వ్యాపారి పేరును మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ♦ కర్ణాటకలోని బీదర్కు చెందిన వివేకానంద బతుకుతెరువు కోసం బెంగళూరుకు వలసవెళ్లాడు. అక్కడ సహకార్నగర్లో తన సోదరుడు సురేష్ నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ సంస్థలో పని చేస్తున్నాడు. ♦ హైదరాబాద్కు ఓ వ్యాపారితో ఏడాది క్రితం సురేష్కు పరిచయం ఏర్పడింది. తన సంస్థకు కొన్ని ప్రాజెక్టులు ఇప్పించేలా, దాని నిమిత్తం 5 శాతం కమీషన్గా చెల్లించేలా వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ♦ దీని ప్రకారం నగర వ్యాపారి గత ఏడాది సురేష్ సంస్థకు ఓ ప్రాజెక్టు ఇప్పించాడు. దానికి కొనసాగింపుగా అతడు మరో ప్రాజెక్టు పొందాడు. అయితే మొదటి దానికే తనకు కమీషన్ ఇచ్చావని, రెండో దానికి ఇవ్వలేదని నగర వ్యాపారి వాదిస్తున్నాడు. ♦ ఆ రెండో ప్రాజెక్టు తనను తానుగా తెచ్చుకున్న నేపథ్యంలో కమీషన్ చెల్లింపు సాధ్యం కాదని సురేష్ స్పష్టం చేశాడు. దీంతో వీరి మధ్య ఏర్పడిన విభేదాలు ఇటీవల తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే సురేష్కు నగర వ్యాపారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ♦ ఇదిలా ఉండగా ఈ నెల 4న వివేకానంద, సురేష్ సహకార్నగర్లోని తమ కార్యాయంలో ఉండగా ఆరుగురు వ్యక్తులు ఓ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. నగర వ్యాపారికి ఇవ్వాల్సిన డబ్బు విషయం మాట్లాడుతూ హఠాత్తుగా కత్తులతో దాడికి దిగారు. ♦ ఈ ఉదంతంలో వివేకానంద ప్రాణాలు కోల్పోగా... సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. తన సోదరుడి హత్య, తనపై హత్యాయత్నం జరగడానికి హైదరాబాద్కు చెందిన వ్యాపారితో ఉన్న విభేదాలే కారణమని అక్కడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సురేష్ పేర్కొన్నారు. ♦ దీని ఆధారంగా కేసు నమోదు చేసిన సహకార్నగర్ పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం హంతకులు వినియోగించిన వాహనానికి నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించారు. దీంతో పాటు ఇతర ఆధారాలను బట్టి వాళ్లు కూడా హైదరాబాద్కు చెందిన వారేనని అనుమానిస్తున్నారు. ♦ ఆ హంతకులతో పాటు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం సోమవారం సిటీకి చేరుకుంది. ప్రస్తుతం సదరు వ్యాపారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పేరును మాత్రం బెంగళూరు అధికారులు బయటపెట్టట్లేదు. అరెస్టు తర్వాతే వివరాలు వెల్లడిస్తామంటున్నారు. చదవండి: జంటహత్యల నిందితునిపై తూటా రూ.1.04 కోట్ల ఆభరణాల పట్టివేత -
రొయ్యల వ్యాపారి దారుణ హత్య
సాక్షి, పశ్చిమగోదావరి: నాలుగు రోజుల క్రితం కిడ్నాపైనా రొయ్యల వ్యాపారి కోదండ రామారావు దారుణ హత్యకు గురయ్యారు. భీమవరం బలుసుమూడికి చెందిన రామారావును ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. నగదు లావాదేవీలే హత్యకు గల కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన వీరాస్వామి, కోదండ రామారావుల మధ్య రొయ్యల వ్యాపారం విషయంలో కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్నాయని సమాచారం. వీరస్వామి, గుమస్తా మోహన్లపై మృతుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో -
మ్యాజిక్ ఇసుక : మండిస్తే.. బంగారమా?!
సాక్షి, ముంబై: నమ్మిన వాడినే నట్టేట ముంచిన వైనం ఒకటి వెలుగులోకి వచ్చింది. మ్యాజిక్ సాండ్ పేరుతో ఏకంగా బంగారు వ్యాపారికే టోకరా ఇచ్చాడో ఘరానా మోసగాడు. తాను తీసుకొచ్చిన మహిమ గల ఇసుకను మండిస్తే మేలిమి బంగారం పుట్టుకొస్తుందని వ్యాపారిని నమ్మించాడు. అలా నాలుగు కిలోల ఇసుకను విక్రయించి 50 లక్షల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టాడు..ఈ విచిత్రమైన సంఘటన పుణేలో నమోదైంది. వివరాల్లో వెళితే..బంగారు ఉంగరం కొనడానికి షాపునకు వచ్చిన నిందితుడు పూణేకు ఆభరణాల వ్యాపారితో గత ఏడాది కాలంనుండి పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు, పాల ఉత్పత్తులు, బియ్యం, ఇతర వస్తువులను విక్రయిస్తూ మంచివాడిగా నటించి నమ్మకాన్ని పొందాడు. ఆ తరువాత తనప్లాన్ను అమలు చేశాడు. తన దగ్గర ఉన్న ప్రత్యేక ఇసుకను మండిస్తే.. బంగారం తయారవుతుందంటూ వ్యాపారిని బురిడీ కొట్టించాడు. స్వయంగా ఆభరణాల వ్యాపారి అయి ఉండి కూడా, అమాయకంగా అతని మాయలో పడిపోయిన వ్యాపారి ఆ మాయా ఇసుకను తీసుకొని రూ .30 లక్షల నగదు, సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ముట్టజెప్పాడు. ఆనక విషయం తెలిసి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
కాబోయే భర్తతో కలిసి బాస్ను హత్యచేసిన మహిళ
సాక్షి, ఢిల్లీ: కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్యచేసిందో మహిళ. ఢిల్లీలో నీరజ్ గుప్తా అనే వ్యాపారవేత్త వాయువ్య ఢిల్లీలో ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. అయితే అతను తప్పిపోయినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని, ఈ ఘటన వెనుక ఫైజల్ అనే మహిళ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కోణంలో విచారించగా గుప్తాను హత్య చేసినట్లు తేలింది. ఇందులో పైజల్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఫైసల్ గుప్తా దగ్గర పనిచేసేదని, గత 10 సంవత్సరాలుగా అతనితో వివాహేతర సంబంధం కలిగి ఉందని వెల్లడైంది.చదవండి:(భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా) వివరాల్లోకి వెళితే.. పైజల్కు జుబేర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం కాగా, ఆ విషయాన్ని నీరజ్ గుప్తాకు తెలిపింది. అయితే వివాహానికి గుప్తా అభ్యంతరం తెలపడంతో నవంబరు 13న ఆదర్శ్ నగర్ లో కేవాల్ పార్క్ ఎక్స్టెన్షన్లో పైజల్ అద్దె ఇంటికి వచ్చి తల్లి, జుబెర్, తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య వాగ్వాదం తీవ్ర కావడంతో ఫైజల్ కాబోయే భర్త గుప్తా తలపై ఇటుకతో కొట్టి , కడుపులో పొడిచిన తరువాత అతని గొంతును కోశారు. మృతదేహాన్ని తరలించడంలో పైజల్. ఫైజల్ తల్లి జుబెర్కు సహయాన్ని అందించారు.అతని మృతదేహాన్ని సూట్కేస్లో ఉంచి రాజధాని ఎక్స్ప్రెస్లో తీసుకెళ్లారు. గుజరాత్ భరూచ్ సమీపంలో రైలు నుంచి బయటకు విసిరేశారు. హత్య చేసిన నిందితులు పైజల్ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), కాబోయే భర్త జుబెర్ (28)ను అరెస్టు చేసినట్లు నార్త్వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు. -
వ్యాపారి అదృశ్యం వెనుక బెట్టింగ్ కోణం?
అమలాపురం టౌన్: పట్టణంలో అదృశ్యమైన విజయవాడకు చెందిన బంగారు నగల వ్యాపారి జైన్ కౌశిక్ ఆచూకీ మిస్టరీగా మారింది. నగల ఆర్డర్ల కోసం నాలుగు రోజుల క్రితం అమలాపురం వచ్చిన జైన్ కౌశిక్ ఆ రాత్రి ఓ లాడ్డిలో బస చేశాడు. ఆ మర్నాడు విజయవాడలోని తన కుటుంబీకులకు అమలాపురం నుంచి బయలుదేరుతున్నట్టు ఫోన్లో చెప్పినప్పటికీ అతను ఇంటికి చేరుకోలేదు. ఆ మర్నాడు కూడా అతడి జాడ తెలియకపోవడంతో చివరకు జైన్ కౌశిక్ కుటుంబీకులు అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు పెట్టారు. పట్టణ సీఐ బాజీలాల్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయించారు. ఈ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. మలుపు తిరిగిన కేసు దర్యాప్తు: ముప్పై ఏళ్ల యువకుడైన జైన్ కౌశిక్ నగల వ్యాపారిగా అమలాపురం వచ్చి, అదృశ్యం కావడంపై డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా దృష్టి పెట్టారు. ఆయన విజయవాడ పోలీసులతో మాట్లాడి అక్కడ జైన్ కౌశిక్కు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో కౌశిక్ 2016లో అరెస్టయినట్టు తేలింది. ఇప్పటి అతడి అదృశ్యానికి... నాటి క్రికెట్ బెట్టింగులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేశారు. కౌశిక్ ఫోన్ కాల్స్ డేటాను సేకరించి అదృశ్యానికి ముందు అతడు ఎవరెవరిని కాంటాక్ట్ చేశాడో వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు డీఎస్పీ బాషా నాలుగు పోలీసు బృందాలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు పంపించారు. కౌశిక్ బస చేసిన లాడ్జిలో పోలీసులు ఆరా తీయగా ఆ రోజు ఉదయమే అతడు లాడ్జి రూమ్ ఖాళీ చేసి వెళ్లినట్టు సమాచారం వచ్చింది. లాడ్జిలో రూమ్ ఖాళీ చేసిన తర్వాత నగల వ్యాపారి ఉదయం నుంచి రాత్రి వరకూ అమలాపురంలోనే ఉన్నాడా...? అతడిని బయట నుంచి వచ్చిన అపరిచితులు ఎవరైనా కలిశారా తెలియాల్సి ఉంది. -
సినీ ఫక్కీలో కిడ్నాప్: తెల్లవార్లూ కారులో తిప్పి..
నల్లజర్ల(పశ్చిమగోదావరి): ఓ వ్యాపారిని దుండగులు కారులో కిడ్నాప్ చేసి అతని నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు అపహరించి గుంటూరు జిల్లా కాజ టోల్గేట్ వద్ద విడిచి పరారయ్యారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దూబచర్లకు చెందిన కలగర రామకృష్ణ నల్లజర్లలో సూర్య రెడీమెడ్ షాపు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో షాపు మూసి స్కూటీపై ఇంటికి బయలుదేరాడు. పుల్లలపాడు వీరమ్మ చెరువు సమీపంలోకి వచ్చేసరికి అటుగా ఇన్నోవా కారులో వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తులు ద్వారకాతిరుమలకు ఎటువెళ్లాలంటూ అతనిని అడిగారు. రామకృష్ణ సమాధానం చెప్పేలోపే అతని స్కూటీని వారిలో ఒక వ్యక్తి లాక్కోగా, మరో ముగ్గురు అతని నోరునొక్కి కారులోకి బలవంతంగా ఎక్కించారు. (చదవండి: వీడిన మిస్టరీ: ఒంటరి మహిళపై కన్నేసి..) వ్యాపారి బ్యాగులో ఉన్న రూ.1 లక్షా 35 వేల నగదు, 28 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు, సెల్ఫోన్, మూడు ఏటీఎం కార్డులు లాక్కున్నారు. పిన్ నంబర్ కూడా తెలుసుకున్నారు. కారు వెళుతుండగానే ఈ తతంగం అంతా జరిగింది. ముగ్గురు కారులో ఉండగా, మరోక వ్యక్తి రామకృష్ణ స్కూటీపై వెనక అనుసరించాడు. గుండుగొలను జంక్షన్లో మరో ఇద్దరిని కారులో ఎక్కించుకున్నారు. దూబచర్ల, కైకరం, భీమడోలు చుట్టూ మూడు సార్లు తిప్పారు. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించడమే కాక రాడ్డుతో కొట్టడంతో రామకృష్ణ ముఖంపై గాయమైంది. (చదవండి: ఢిల్లీ చూడాలని.. 15 ఏళ్ల బాలిక..) దారిలో ఓచోట ఏటీఎం వద్ద ఆగి రామకృష్ణ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో పరిశీలించారు. చివరిగా తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో గుంటూరు జిల్లా కాజ టోల్గేట్ సమీపంలో కారు ఆపి రామకృష్ణకు రూ.500 ఇచ్చి ‘ఇంటికి పో.. పోలీసు కేసు పెట్టినా, ఎవరికైనా చెప్పినా చంపేస్తాం’ అని బెదిరించి గుర్తు తెలియని దుండగులు పరారయ్యారు. రామకృష్ణ అక్కడ ఒక వ్యక్తి సెల్ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు గుంటూరు వెళ్లి రామకృష్ణను ఇంటికి తీసుకువెళ్లారు. గురువారం ఉదయం నల్లజర్ల పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం రామకృష్ణ ఏటీఎం కార్డు నుంచి ఒంగోలులో దుస్తులు కొనుగోలు చేసినట్లు అతని సెల్ఫోన్కు సమాచారం రావడంతో ఈ దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కారుతో ఢీకొట్టడమే కాకుండా పోలీసులకే కట్టుకథ
ఢిల్లీ : కారుతో గుద్ది ఒక వ్యక్తిని చంపడమే గాక స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకే కట్టుకథ చెప్పిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. ఢిల్లీకి చెందిన సోనిత్ జైన్ అనే వ్యాపారవేత్త సెప్టెంబర్ 8న తన ఎస్యూవీ రేంజ్రోవర్ కారులో పని ముగించుకొని గ్రేటర్ కైలాష్ పార్ట్ 1లో ఇంటికి బయలుదేరాడు. బదార్పూర్లోని అలీ విహార్ మార్గ్కు రాగానే ఎదురుగా సైకిల్పై వస్తున్న సంజేష్ అవాస్తీ అనే వ్యక్తిని గుద్దాడు. సంజేష్ అవాస్తీని ఆసుపత్రిలో చేర్పించి పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులకు కట్టుకథ చెప్పాడు. తాను ఇంటికి వచ్చే మార్గంలో ఓక్లామండి వద్దకు రాగానే సైకిల్పై వెళ్తున్న వ్యక్తి సృహతప్పి కిందపడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయం తగిలి అపస్మారకస్థితికి వెళ్లాడని..అతన్నిఆసుపత్రిలో చేర్చి వచ్చినట్లు తెలిపాడు. (చదవండి : హృదయ విదారకం.. పెళ్లయిన 15 రోజులకే) అయితే అసలు విషయానికి వస్తే.. సంజేష్ అవాస్తీ పనికి వెళ్లేందుకుకని ఫరీదాబాద్లోని తన ఇంటి నుంచి సైకిల్పై బయలుదేరాడు. అదే దారిలో గ్రేటర్ కైలాష్ మార్గ్లోని తన ఇంటికి వెళ్లేందుకు ఎస్యూవీ కారులో సోనిత్ జైన్ వేగంగా వస్తున్నాడు. బదార్పూర్ వద్దకు రాగానే సంజేష్ ఉన్న సైకిల్ను వెనుక నుంచి బలంగా గుద్దడంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. అయితే పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే అనుమానం వస్తుందేమోనని మూల్ చంద్ ఆసుపత్రికి తరలించి ఆసుపత్రి సిబ్బందికి ఓక్లా మండి రోడ్డు మీద సృహ లేకుండా పడి ఉన్నాడని, తీవ్ర గాయాలయ్యాయని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. సోనిత్ వెళ్లిన కాసేపటికే సంజేష్ మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం అమర్ కాలనీ పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. వారి ఫిర్యాదు ఆధారంగా ట్రేస్ చేసి చూడగా ఒక్లా మండి సెంటర్ వద్ద ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదని పోలీసులు కనుగొన్నారు. ఇదే సమయంలో సంజేష్ బంధువులు బదార్పూర్ ఫ్లైఓవర్ వద్ద రక్తంతో తడిసిన బ్యాగ్, సైకిల్ పడి ఉన్నాయి. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు సంజేష్ బందువులు, ఆసుపత్రి సిబ్బంది చెప్పిన చనిపోయిన వ్యక్తి గుర్తులు ఒకేలా ఉన్నాయని గుర్తించారు. దీంతో సోనిత్ తనను తాను రక్షించుకోవడానికి కట్టుకథ అల్లినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం సోనిత్ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
ఈ మాస్క్ ధర, యజమాని గురించి తెలిస్తే...
కరోనా మహమ్మారి కాలంలో సాధారణ కాటన్ మాస్క్ నుంచి కొంచెం ఖరీదైన ఎన్99 మాస్క్ లు ధరించడం సర్వసాధారణంగా మారిపోయింది. అలాగే బంగారు, డైమండ్ మాస్క్ లు ఇలా.. వారి వారి స్థాయిలను బట్టి ధరించడం కూడా చూశాం. మాస్క్ ధరించడం కేవలం ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాదు. ఇపుడొక స్టేటస్ సింబల్ కూడా. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి ఖరీదైన జిగేల్.. జిగేల్.. మాస్క్ రూపుదిద్దుకుంటోంది. ఇజ్రాయెల్ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కరోనావైరస్ మాస్క్ ను తయారు చేస్తోంది. టాప్-రేటెడ్ ఎన్99 ఫిల్టర్లు, బంగారం, అతి ఖరీదైన వజ్రాలు పొదిగిన ఈ మాస్క్ ధర 1.5 మిలియన్ డాలర్లు (సుమారు 11.2 కోట్లు రూపాయలు) గా ఉండనుంది. అమెరికాలో ఉంటున్న చైనా వ్యాపారవేత్త దీనిని ఆర్డర్ చేశారు. ఇంతకుమించి ఈ మాస్క్ కొనుగోలుదారుని వివరాలను అందించేందుకు జ్యుయల్లరీ సంస్థ వైవెల్ యజమాని, డిజైనర్ ఐజాక్ లెవీ నిరాకరించారు. జెరూసలేం సమీపంలోని తన కర్మాగారంలో ఒక ఇంటర్వ్యూలో ఈ ఖరీదైన మాస్క్ వివరాలను అందించారు డిజైనర్ ఐజాక్ లెవీ. 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో రూపొందిస్తున్న మాస్క్ చుట్టూ, 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని తెలిపారు. అలాగే కొనుగోలుదారుడి అభ్యర్థన మేరకు ఈ స్పెషల్ మాస్క్ తయారుచేస్తున్నట్టు చెప్పారు. ఇది ఈ సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా తమ మాస్క్ నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు కరోనా సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోతూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నసమయంలో తమకు మంచి అవకాశం లభించిందన్నారు. తమ సిబ్బందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందంటూ కొనుగోలు దారుడికి కృతజ్ఞతలు తెలిపారు లెవీ. World's most expensive mask? An Israeli jewelry company is making a $1.5-million gold #coronavirus mask for a Chinese businessman living in the US. The 18-karat white gold mask will be decorated with 3,600 diamonds and fitted with top-rated N99 filters. pic.twitter.com/D9r91HsU3B — Global Times (@globaltimesnews) August 10, 2020 -
కరోనా బిల్లుకు భయపడిన వ్యాపారి ఏం చేశారంటే
సూరత్: కరోనా బిల్లు చూసి గుండె గుభేలుమన్న సూరత్కు చెందిన ఒక వ్యాపారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచిత చికిత్స అందించేందుకు తన కార్యాలయాన్ని 85 పడకల ఆసుపత్రిగా మార్చారు. కరోనా వైరస్ నుండి కోలుకున్న వ్యాపారవేత్త తనలాగా పేదలు కష్టపడకూడదని భావించి పెద్ద మనసు చేసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది. సూరత్కు చెందిన, ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఒక ప్రైవేట్ క్లినిక్లో 20 రోజులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ సందర్భంగా లక్షల్లో ఉన్న ప్రయివేటు ఆసుపత్రి బిల్లు చూసి ఒక్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు. వ్యాపారవేత్తనైన తన పరిస్థితే ఇలా ఉంటే..ఇక పేదవాళ్ల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఫలితంగా తన 30,000 చదరపు అడుగుల (2,800 చదరపు మీటర్లు) కార్యాలయ ప్రాంగణం కోవిడ్-19 ఆసుపత్రిగా మారిపోయింది. తన మనవరాలు ‘హిబా’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను షేక్ పొందారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చులు చాలా భారంగా ఉన్నాయని, తానూ పేద కుంటుంబంలోంచే వచ్చాననీ, ఆర్థిక సమస్యలతో చాలా కష్టపడ్డానని షేక్ చెప్పారు. అందుకే పేదలకు తన వంతు సహాయంగా ఏదైనా చేయాలని భావించానన్నారు. కుల,మత భేదం లేకుండా అందరూ ఇక్కడ చికిత్స పొందవచ్చని వెల్లడించారు. సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, మంచాలు, పరుపులతో పాటు విద్యుత్, ఇతర ఖర్చులను తాను భరించనున్నట్టు చెప్పారు. వంట, భోజనాల గది, వంటవారు, రోగుల రోజువారీ ఆహార అవసరాలు ఇలా అన్ని వసతులను సమకూర్చుతామన్నారు. తద్వారా కరోనా మహమ్మారి బారిన పడిన పేదలు ఇక్కడ ఉచితంగా చికిత్స పొందుతారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. దాదాపు 35,000 మంది మరణించారు. -
క్షణాల్లో 31.50 లక్షలు మాయం
కోటా : ఆనుపానూ చూసి, తమ చోర కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే కేటుగాళ్లు నిరంతరం మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్లో చోటు చేసుకుంది. క్షణం ఏమరుపాటు కారణంగా కిరాణా వ్యాపారి ఒకరు ఏకంగా 31.50 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆనక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన బారన్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు చార్ మూర్తి సర్కిల్ బ్రాంచ్లో సోమవారం జరిగింది. కోటాకు చెందిన కిరాణా వ్యాపారి మహావీర్ గోయల్ నగదును బ్యాంకులో జమ చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్కు వెళ్లాడు. అక్కడ పే-ఇన్-స్లిప్లో వివరాలు నింపి, దాన్ని పక్కనే ఉన్న కౌంటర్లో జమ చేయడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా 31.50 లక్షల రూపాయలున్న బ్యాగును నగదు కౌంటర్ వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. అయితే ఈ అదును కోసమే ఎదురు చూస్తున్న మాయగాళ్లు బ్యాగు తీసుకొని ఉడాయించారు. ఇదంతా కొన్ని సెకన్ల సమయంలో జరిగిపోయిందని గోయల్ వాపోయారు. ఈ దొంగతనంలో ఒకటి కంటే ఎక్కువ మంది నిందితుల ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీస్ అధికారి మంగిలాల్ తెలిపారు. కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కేసులో మలుపులు
-
వ్యాపారవేత్త కుటుంబం విషాదాంతం..
లక్నో : నూతన సంవత్సరం తొలి రోజే విషాదం చోటుచేసుకుంది. మధుర హైవేలో బుధవారం ఓ కారులో వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా పడిఉండటం గుర్తించారు. ఘటనా స్ధలంలో పిస్టల్ లభించడంతో మృతులు తుపాకితో కాల్చుకుని మరణించినట్టు భావిస్తున్నారు. ఘటనా స్ధలం నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతులను నీరజ్ అగర్వాల్, నేహ అగర్వాల్, ధన్య అగర్వాల్లుగా గుర్తించారు. వ్యాపారవేత్త ఆయన భార్య, కుమార్తె ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్ధలంలోనే తీవ్ర గాయాలతో బాధపడుతున్న శౌర్య అగర్వాల్ అనే బాలుడిని గుర్తించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
పన్ను ఎగవేసిన వ్యాపారవేత్తకు జైలు
సాక్షి, బెంగళూరు : పన్ను ఎగవేత కేసులో కర్నాటకకు వ్యాపారవేత్తకు ఊహించని షాక్ తగిలింది. రూ .7.35 కోట్లను ఆదాయపు పన్ను బకాయిల ఎగవేత కేసులో ఆదాయపన్ను శాఖ అధికారులు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించింది. ఆదాయ పన్ను బకాయిలపై ఎన్ని రిమైండర్లు పంపించినా స్పందించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు వ్యాపారవేత్తను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఆరునెలల జైలు విధించి, సిటీ సెంట్రల్ జైలుకు తరలించామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తూమకూరుకు చెందిన వ్యాపారి అన్న సమాచారం మినహా, అతని పేరును, వ్యాపార వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. -
వ్యాపారవేత శ్రీనివాస్ ఇంటిపై ఈడీ అధికాతులు దాడులు
-
స్వయంకృషి
శిఖరాన్ని అధిరోహించేటప్పుడుఒక్క తప్పటడుగు వేసినా పాతాళంలో పడేస్తుంది!జీవితం కూడా అంతే!! ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయకపోతే.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయిముందున్నది ముళ్లబాటైనా..తెలివిగా దాటిన వారే విజేతలుగా నిలుస్తారుజీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారుకుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడుదొడ్డక వెంకట సుబ్బారావు స్వయం కృషిని నమ్ముకున్నారు నేడు పది మందికీ ఉపాధి చూపుతున్నారు. ఒంగోలు సబర్బన్: గుంటూరు జిల్లా కాకుమాను మండలం వళ్లూరు గ్రామానికి చెందిన దొడ్డక వెంకట సుబ్బారావు సామాన్య రైతు కూలీ కుటుంబంలో జన్మించాడు. 1987లో పదో తరగతి పాసైన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తండ్రి ఒక్కరే కష్టపడుతుండటం చూసి సొంతూరులోనే కాకా హోటల్లో పనిలో చేరాడు. ఆ తర్వాత కొంతకాలానికి సొంతగా కాకా హోటల్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే కుటుంబ బాధ్యతలు పెరగడం, ఆదాయం సరిపోకపోవడంతో హోటల్ను వేరే వాళ్లకు ఇచ్చారు. 2002లో ఒంగోలు పట్టణానికి చేరుకున్నారు. తన స్నేహితుని సాయంతో ఇక్కడి కర్నూలు రోడ్డులోని వీఐపీ బ్యాగుల దుకాణంలో గుమాస్తాగా చేరారు. కొంతకాలానికి వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని తాను పనిచేస్తున్న దుకాణాన్నే లీజుకు తీసుకున్నారు. వీఐపీ బ్యాగుల షాపును నిర్వహిస్తూనే నలుగురికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. బ్యాగులు కొనేందుకు దుకాణానికి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇనుప మంచాలు, స్టడీ చైర్లు, చెప్పుల స్టాండ్లు అడగడం ప్రారంభించారు. దీంతో సుబ్బారావు ఆలోచన వాటి తయారీ వైపు మళ్లింది. అనుకున్నదే తడవుగా పరిశ్రమ స్థాపనకు అవసరమైన వనరులను సమకూర్చుకున్నారు. 2009లో ఒంగోలు దక్షిణ బైపాస్లో ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని షెడ్లు నిర్మించి ఇంజినీరింగ్ వర్క్స్ పరిశ్రమను స్థాపించారు. తొలుత ఐదుగురు కార్మికులతో మొదలుపెట్టిన పరిశ్రమ దినిదినాభివృద్ధి చెందింది. 110 మందికి పైగా ఉపాధి సుబ్బారావు నెలకొల్పిన ఇంజినీరింగ్ వర్క్స్ పరిశ్రమలో ప్రస్తుతం 110 మందికి పైగా కార్మికులు పరిచేస్తున్నారు. స్కిల్డ్ వర్కర్స్, రోజువారీ కార్మికులతోపాటు ఇంకా ఎవరైనా పనికోసం వస్తే లేదనేదే ఉండదు. ఈ క్రమంలోనే పరిశ్రమలో అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రో స్ట్రాటిక్ మిషన్లు, పౌడర్ కోటింగ్ ఎక్విప్మెంట్, హీటింగ్ మిషన్లు, వెల్డింగ్, కటింగ్ మిషన్లతోపాటు వివిధ రకాల యంత్ర పరికరాల సాయంతో పనిచేయిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలలు, కళాశాలల్లో హాస్టళ్లకు అవసరమైన ఇనుప మంచాలు, నవారు మంచాలు, లాడ్జిలకు ఉపయోగపడే మంచాలు, పడక కుర్చీలు, స్టడీ చైర్లు, ఆఫీస్ టేబుల్స్, చెప్పుల స్టాండ్లు ఇలా ఒకటేమిటి ఇంజినీరింగ్ వర్క్స్కు సంబంధించి టోకుగా ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా తయారు చేసి ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన ఈ–టెండర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలకు ఐరన్ షీట్తో కూడిన ఇనుప మంచాలను సరఫరా చేసే అవకాశం దక్కించుకున్నారు. ఏటా వేలాది మంచాలు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసే సామగ్రిని తీసుకెళ్లి, నగదును నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తూ 50 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. పది మందికీ ఉపాధిచూపడంలో సంతృప్తి ఒక్కరమే జీవించడం కాదు.. పది మందికీ జీవనోపాధి కల్పించాలనేదే నా లక్ష్యం. మా తండ్రి పొలం పనికి వెళ్తూ మరో పది మందిని ముఠా కట్టి తీసుకెళ్లేవారు. పది మంది ఒక పొలంలో పనికెళ్తే వారందరికీ ఉపాధి దొరికినట్టే. నేను స్థాపించిన పరిశ్రమలో కూడా అలాగే ఉపాధి కల్పించాలని భావించా. 2002లో ఒంగోలు వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నా. ఇందుకోసం దాదాపు 10 సంవత్సరాలు కష్టపడ్డా. పదుల సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నానన్న సంతృప్తి సంతోషాన్నిస్తోంది. – దొడ్డక వెంకట సుబ్బారావు -
గన్ చూయించి రూ.70 లక్షలు దోచుకెళ్లారు
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో రద్దీగా ఉండే ఓ ప్లైఓవర్పై గురువారం దోపిడీ జరిగింది. ఈ దోపిడీకి సంబంధించి ఓ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. కాశీష్ బన్సాల్ అనే వ్యక్తి తన ఇంటి నుంచి గుర్గావ్కు కారులో వెళ్తుండగా బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు ఢిల్లీ నరైనా ప్రాంతంలోని ఓ ప్లైఓవర్పై అడ్డగించారు. తుపాకీ చూయించి కారు డిక్కీలో ఉన్న రూ.70 లక్షలు ఎత్తుకెళ్లారు. అయితే ఈ తతంగాన్ని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేశాడు. అనంతరం పోలీసులకు వీడియోను చూయించాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు, వ్యాపారికి బాగా తెలిసిన వాళ్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నాకు పెద్ద మనసు
(చిన్నా) ఆర్థికంగా స్థితిమంతుడైన ఓ యువ వ్యాపారి. అతను కావాలనుకుంటే పెళ్లికి కోట్ల రూపాయలు కట్నకానుకలుగా వస్తాయి. కానీ చిన్నా మాత్రం ఓ అనాథ యువతిని భార్యగా చేసుకోవాలని భావించాడు. ఆ మేరకు విశాఖలోని ప్రేమసమాజంలో ఉంటున్న ఓ అనాథ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూడా సాదాసీదా కాకుండా అనాథ పిల్లల మధ్య ఈనెల 21న చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారస్తుడైనా..ఉద్యోగస్తుడైనా..పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత కట్నం ఆశిస్తాడు. ఉద్యోగస్తుడైతే సుమారుగా రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు..వ్యాపారస్తుడైతే..రూ.15 నుంచి రూ.20లక్షలు కట్న రూపంలో గానీ...ఆస్తుల రూపంలో గానీ ఆశించడం సహజం. చిన్నా మాత్రం పెద్ద మనసు చాటుకున్నాడు. కట్న కానుకలు వద్దనుకున్నాడు. ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాడు. సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : మమతల కోవెలలో పెళ్లి సందడి. వేద మంత్రాలు..పచ్చని తోరణాలు..బాజా భజంత్రీలు..మంగళ వాయిద్యాలు..దాతల దీవెనలు..విందు భోజనాలు. కల్యాణ కాంతులతో ప్రేమసమాజం కళకళలాడుతోంది. పెద్దల దీవెనలతో ప్రేమసమాజం అమ్మాయికి..పాయకరావుపేటకు చెందిన కక్కిరాల వెంకటరమణ (లేటు) సత్యవతి దంపతుల కనిష్ట పుత్రుడు వెంకట సత్యనారాయణ(చిన్న)కు ఈ నెల 21న పెళ్లి జరగనుంది. అందుకు ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియం వేదిక కానుంది. అనాథ పిల్లలే పెద్దలను కల్యాణానికి ఆహ్వానించనున్నారు. 21 ఉదయం 10.59 గంటలకు ఈ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇరవై ఏళ్లుగా ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మకు పాయకరావుపేటకు చెందిన యువ వ్యాపారి వెంకట సత్యనారాయణతో వివాహం కానుంది. ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం, కార్యదర్శి మట్టుపల్లి హనుమంతరావు పాలకవర్గం సమక్షంలో ఈ వివాహం జరగనుంది. మమతల కోవెల ప్రేమసమాజంలో ఇది 110 వివాహం. ప్రేమ సమాజంలో పెళ్లి రాట ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మను, పాయకరావుపేటకు చెందిన కక్కిరాల సత్యనారాయణతో ఈ నెల 21న ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియంలో జరగనున్న వివాహంలో భాగంగా సోమవారం ప్రేమసమాజంలో పెళ్లిరాట వేశారు. పలువురు ముత్తైదువులు పద్మను పెళ్లి కుమార్తెను చేసి ఆశీర్వదించారు. ప్రేమసమాజం పూర్వపు కార్యదర్శి పి.గణపతిరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేమసమాజం కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు, సహాయ కార్యదర్శులు జగదీశ్వరరావు, సత్యనారాయణ, జి.రాధాకృష్ణ, పీఆర్వో ఎం.వి.రాజశేఖర్ ప్రేమసమాజం సిబ్బంది పాల్గొన్నారు. ముందుకొచ్చిన దాతలు..పెద్ద ఎత్తున కానుకలు.. ప్రేమసమాజం అమ్మాయికి పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పలువురు దాతలు ముందుకొచ్చారు. కనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఉప్పల భాస్కరరావు, వరాహలక్ష్మి దంపతులు కన్యాదాతగా నిలిచారు. ప్రేమసమాజం మాజీ కార్యదర్శి గణపతిరావు దంపతులు దగ్గరుండీ పెళ్లి కుమార్తెను చేశారు. ఇదిలా ఉండగా..ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం రూ.10వేలు, హైదరాబాద్కు చెందిన సీహెచ్ కల్యాణ్కుమార్ రూ.10,116, ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరావు రూ.10వేలు, ప్రేమసమాజం మాజీ కార్యదర్శి ఎం.వి.రమణ రూ.5వేలు, ఏ.కె.చైతన్య రూ.5వేలు, కటిల్, జగన్ పటేల్ రూ.6,500, సీహెచ్ శేఖర్ రూ.15వేలు, కిరణ్ రూ.6,500, టి.వినీష్ రూ.10వేలు ఇవ్వగా అగర్వాల్ మహాసభ ప్రతినిధులు పుస్తుల తాడు, చెవి రింగులు, పుస్తులు, సంపతి గొట్టాం, పట్టీలు, కాళ్ల మెట్టెలు వంటి పెళ్లి సామాన్లు, అనేక మంది చీరలు, సారె సామగ్రి అందజేశారు. ఆదర్శ వివాహమే చేసుకోవాలనుకున్నా.. తల్లిదండ్రులు మంచివారు. ఇద్దరు అక్కలు, బావలు చాలా మంచివారు. అన్నయ్య ఐదేళ్ల కిందట ప్రమాదవశాత్తు చనిపోయాడు. నేను..నాన్న ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం. పాయకరావుపేటలోనే మా ఇల్లు. వ్యాపార నిమిత్తం తుని వెళ్తుంటాం. అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నన్ను, నాన్నను, అక్కలు, బావల్ని బాగా చూసుకునే అమ్మాయి కావాలనుకున్నా. అందుకు ఆదర్శ వివాహమైతే బాగుంటుందని అనుకున్నా. ప్రేమసమాజంలో అమ్మాయిని చూశాను. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నా. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేరని తెలుసుకున్నా. అటువంటి అమ్మాయికి జీవితం ఇచ్చిన వాడినవుతానని అనుకున్నా. వెంకట సత్యనారాయణ(చిన్నా), పెండ్లి కుమారుడు ప్రేమసమాజమే అమ్మా..నాన్న తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే చనిపోయారు. ఐదేళ్ల వయస్సులో నన్ను, అన్నయ్య లక్ష్మణ్ను బంధువులు ప్రేమసమాజంలో చేర్పించారు. అప్పటి నుంచి మా ఇద్దరికి అమ్మా..నాన్న అంటే ప్రేమసమాజమే. చిన్నప్పటి నుంచి మా ఇద్దర్ని ప్రేమసమాజం ఎంతగానో ఆదుకుంది. తల్లిదండ్రులు లేని మా ఇద్దరికి ప్రేమసమాజమే దైవం. ఇంటర్మీ డియట్ వరకు చదివించారు. అధ్యక్షుడు రాంబ్రహ్మం, కార్యదర్శి హనుమంతరావు ఇక్కడి పిల్లల శ్రేయస్సు కోసం పరితపిస్తుంటారు. పదిహేడేళ్ల పాటు ఇక్కడే ఉన్నాను. కొత్త జీవితంలో అడుగుపెడతున్నాను. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా. ఆదర్శ వివాహంచేసుకుంటున్న..కాబోయే భర్త సత్యనారాయణ(చిన్న), అందుకు సహకరించి ముందుకొచ్చిన మావయ్య వెంకటరమణకు కృతజ్ఞతలు. వారికి మంచిపేరు తెస్తాను. –పద్మ, ప్రేమసమాజం పుత్రిక..పెళ్లి కుమార్తె కుమారుడి అభీష్టం మేరకే.. భార్య సత్యవతి అనారోగ్యంతో ఏడాది కిందట చనిపోయింది. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లి చేసేశాను. ఇద్దరు కుమారుల్లో పెద్దోడు ఐదేళ్ల కిందట వినాయక చవితి ఉత్సవాల నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి చనిపోయాడు. చిన్నోడు వెంకటసత్యనారాయణ(చిన్నా)ఇంటర్మీడియట్ వరకు చదివాడు. నాతోనే తునిలో కారం(మసాల సామాన్లు విక్రయం) పనులు చేస్తుంటాడు. ప్రేమ సమాజం అమ్మాయిని చేసుకుంటే ఒకరికి దారి చూపిన వాడినవుతానని చెప్పడంతో సరేనన్నా. నాలుగేళ్ల కిందట రూ.25 లక్షలతో ఇల్లు నిర్మించాను. 300 గజాల ఖాళీ స్థలం ఉంది. నా కుమారుడికి ఆదర్శ వివాహమంటే ఇష్టం. అందుకే ప్రేమసమాజం అమ్మాయితోనే పెళ్లి చేస్తున్నాం. – కక్కిరాల వెంకటరమణ, పెళ్లి కుమారుడు తండ్రి -
భార్య, కుమార్తెలను హతమార్చాడు..
సాక్షి, అహ్మదాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ వ్యాపారి ఉదంతం వెలుగుచూసింది. అహ్మదాబాద్లోని జడ్జీల బంగళా రోడ్డులోని రత్నం టవర్స్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణరంగ వ్యాపారి ధర్మేష్ షాను నిందితుడిగా గుర్తించారు. నిందితుడిపై మంగళవారం ఉదయం వస్త్రపూర్ పోలీస్ స్టేసన్లో ముగ్గురిని హతమార్చిన కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..రూ 15 కోట్ల అప్పులతో ఇబ్బందిపడుతున్న షా తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు.. సోమవారం రాత్రి ఘర్షణ జరగడంతో క్షణికావేశంలో భార్య, కుమార్తెలను కాల్చిచంపాడు. అనంతరం సోదరుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో పాటు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడతానని చెప్పాడు. ఇంతలోగా సోదరుడు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని డీసీపీ కేఎన్ఎల్ రావు చెప్పారు. -
అత్యాచారం, వేధింపులు.. వ్యాపారి అరెస్ట్
అగర్తలా: కఠిన చట్టాలు చేస్తూ నిందితులకు శిక్షలు వేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా త్రిపురలో ఇలాంటి కీచక ఘటన వెలుగుచూసింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు వ్యాపారవేత్త, బీజేపీ మద్దతుదారుడు మనోజ్ డెబ్(54)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలిలా.. త్రిపుర ఖోవాయి జిల్లా తెలియమురాకు చెందిన మనోజ్ డెబ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. బీజేపీ నేతగా ప్రచారం చేసుకునే ఈ నిందితుడు ఛంప్లాయ్లోని తన ఫామ్హౌస్లో బాలిక(14)పై ఈ ఏడాది ఫిబ్రవరి 11న తొలిసారి అత్యాచారం చేశాడు. ఆపై ఆ కీచకపర్వాన్ని అలాగే కొనసాగించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు బాధితురాలిపై లైంగికదాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో బాలిక పేర్కొంది. గతవారం మళ్లీ ఫామ్హౌస్కు రావాలని నిందితుడు మనోజ్ కోరగా.. బాలిక తన స్నేహితురాలికి విషయం చెప్పింది. బిషాల్గఢ్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫ్రెండ్ సూచించగా.. ధైర్యం తెచ్చుకుని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఖోవాయి ఎస్పీ క్రిష్ణేందు చక్రవర్తి మాట్లాడుతూ.. నిందితుడు మనోజ్ డెబ్కు తెలియమురాలో పెద్ద వ్యాపారవేత్త అని, కేసును ప్రభావితం చేయగల వ్యక్తి కూడా అని తెలిపారు. బాలిక ఫిర్యాదు చేయగా అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. -
మోడల్పై రేప్ అటెంప్ట్.. ఊహించని మలుపు
దుబాయ్ : ఆమె ఓ పేరుగాంచిన మోడల్. ఓ కాంట్రాక్ట్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లి ఓ హోటల్లో బస చేసింది. అయితే అదే హోటల్లో దిగిన ఓ వ్యాపారవేత్త ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. అతన్ని నుంచి తప్పించుకునేందుకు ఆరో అంతస్థు నుంచి దూకేసింది. వెన్నెముకకు గాయం కాగా ప్రాణాలతో ఆమె బయటపడింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేయటం ఇక్కడ విశేషం. భాదితురాలి కథనం ప్రకారం... సైబీరియాకు చెందిన 22 ఏళ్ల ఎక్టెరీనా.. ఓ కాస్మోటిక్ సంస్థతో కాంట్రాక్ట్ పని కోసం దుబాయ్కు వెళ్లింది. అక్కడ ఓ పాకిస్థానీ వ్యాపారవేత్త(39) ఒప్పందం కోసం హోటల్ గదికి ఆమెను ఆహ్వానించాడు. ఆమె వెళ్లే సరికి అతను ఫుల్గా తాగేసి ఉన్నాడు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించటంతో ఓ కత్తితో ఆమెను బెదిరించి బట్టలిప్పాలని బెదిరించాడు. ప్రాణ భయంతో అతను చెప్పినట్లుగా ఆమె చేసింది. ఆపై అతని నుంచే తప్పించుకునేందుకు నగ్నంగానే హోటల్ బిల్డింగ్ నుంచి దూకేసింది. ఘటన తర్వాత పారిపోయేందుకు యత్నించిన వ్యాపారవేత్తను ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్టెరీనా వెన్నెముకకు తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు రెండు సర్జరీలను చేశారు. బాధితురాలి అరెస్ట్... అయితే ఆమె తనను కత్తితో చంపే యత్నం చేసిందని నిందితుడు ఫిర్యాదు చేశాడు. బాధితురాలు చెబుతున్నట్లు అత్యాచారం ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైగా అతని ఒంటిపై కత్తి గాయాలు ఉన్నాయి. దీంతో మోడల్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆమెను జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఆమె మోడలింగ్తోపాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తోందని.. అందుకే దుబాయ్ వచ్చిందని సదరు వ్యాపారవేత్త ఆరోపిస్తున్నాడు. మరోవైపు ఎక్టెరీనా తల్లి మాత్రం వాటిని ఖండిస్తోంది. దుబాయ్లోని రష్యన్ కాన్సులేట్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది. -
ఆ జాబితాలో 31 మంది..
సాక్షి, న్యూఢిల్లీ : విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ..ఇలా ఆర్థిక నేరాలకు పాల్పడి విచారణను తప్పించుకునేందుకు 31 మంది వ్యాపారవేత్తలు విదేశాలకు పారిపోయారని ప్రభుత్వం గురువారం లోక్సభలో వెల్లడించింది. ఈడీ, సీబీఐలు విచారణ చేపట్టిన పీఎన్బీ స్కాం నిందితులు నీరవ్, మెహుల్ చోక్సి సహా ఆర్థిక నేరాలకు పాల్పడిన 31 మంది విదేశాల్లో తలదాచుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ జాబితాలో నీరవ్ మోదీ, ఆయన భార్య అమీ, కుమారుడు నిషాల్, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, లలిత్ మోదీ, ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ తదితరులున్నారు. విజయ్ మాల్యా, అశిష్ జబన్పుత్ర, పుశ్పేష్ కుమార్ వైద్, సంజయ్ కల్రా, వర్షా కల్రా, ఆర్తి కల్రాల అప్పగింతపై సీబీఐ నుంచి మంత్రిత్వ శాఖకు వినతులున్నాయని మంత్రి చెప్పారు. నిందితుల బదలాయింపులపై సంబంధిత దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కాగా ప్రభుత్వం వెల్లడించిన జాబితాలో ఇంకా సౌమిత్ జెనా, విజయ్కుమార్ రెవాభాయ్ పటేల్, సునీల్ రమేష్ రూపాని, సురేందర్ సింగ్, ఆనంద్ సింగ్, హర్సాహిబ్ సింగ్, హర్లీన్ కౌర్, జతిన్ మెహతా, చేతన్ జయంతిలాల్ సందేశర, దీప్తి చేతన్, నితిన్ జయంతిలాల్, సవ్యసేథ్, నీలేష్ పరేఖ్, ఉమేష్ పరేఖ్, హేమంత్ గాంధీ, ఈశ్వర్భాయ్ భట్, ఎంజీ చంద్రశేఖర్, చెరియా వనరక్కల్ సుధీర్, నౌషా కదీజత్, చెరియా విటీల్ సాధిక్లున్నారు. -
అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి..
-
అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి..
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ నగరంలో దుండగుల అగడాలు పెరిగిపోతున్నాయి. ఓ వ్యాపారిపై చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్ర కత్తులతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముగశిర్ అనే వ్యక్తికి కోఠిలో కార్ డెకరేషన్ షాపు ఉంది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బైక్పై ఇంటికి వెళ్తున్న అతనిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న నగదు బ్యాగ్ను లాక్కొనే ప్రయత్నాం చేశారు. ఆ వ్యాపారి బ్యాగ్ను ఇవ్వకపోవడంతో కత్తులతో పొడిచి నగదు బ్యాగ్తో పరారయ్యారు. అందరూ చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్రం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్జోన్ డీసీపీ మాట్లాడుతూ.. త్వరలోనే దుండగులను అదుపులోకి తీసుకుంటామన్నారు. వారి కోసం అన్ని వైపుల గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని అన్నారు. వ్యాపారి బ్యాగ్లో రూ. 1.90 లక్షలు ఉన్నట్లు ఆయన తెలిపారు. -
పారిపోయి పరువు పోగొట్టుకోలేక...
సూరత్ : పీకల లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఓ వ్యాపారవేత్త... ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి తాముంటున్న అపార్ట్మెంట్ 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మీడియాలో యువ వ్యాపారవేత్త ఆత్మహత్యా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సర్థనా ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారవేత్త విజయ్ వాఘాసియా(35).. భార్య రేఖ(30), కొడుకు వీర్(4)లతో యోగి చౌక్లోని మేజిస్టిక్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్నారు. గత కొంత కాలంగా ఆయన వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన అప్పులు చేశారు. అయినప్పటికీ కోలుకోకపోవటంతో వాటిని తీర్చే దారి తెలీక దారుణానికి తెగబడ్డారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన విజయ్ అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న గౌరవ్ అనే స్నేహితుడితో కాసేపు మాట్లాడారు. ఆపై మంచి నీళ్లు మరిచిపోయానంటూ మళ్లీ పైకి వెళ్లిన కాసేపటికే భార్య, పిల్లలతో దూకినట్లు తెలుస్తోంది. గౌరవ్ అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్ జేబులో ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘మా కుటుంబ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. అప్పులు తీర్చేందుకు నా ముందు దారులు లేవు. ఆర్థిక సమస్యలతోనే ఇలా చేస్తున్నాం. నా తదనంతరం వ్యాపార బాధ్యతలు నా సోదరుడివే’ అని విజయ్ ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. పారిపోలేక.. పరువు పోగొట్టుకోలేక... ప్రాణాలే విడిచారంటూ స్థానిక మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
‘ఐపీ’తో టోపీ
చిట్టీల పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేయడం.. విచ్చలవిడిగా అప్పులు చేయడం.. ఇలా సేకరించిన సొమ్ముతో ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు చేయడం.. అదను చూసి ‘ఐపీ’ పెట్టేసి భాగస్వాములు, ప్రజల నెత్తిన టోపీ పెట్టేయడం.. ఇలాంటి ఘటనలు కామారెడ్డిలో తరచూ వెలుగు చూస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన ‘రక్షణ’.. కొందరికి ఆయుధంగా మారింది. భాగస్వాములు, జనాల నమ్మకమే పెట్టుబడిగా భారీగా కూడబెట్టుకొని, ఆ తర్వాత దివాళా తీశామని కోర్టు తలుపు తట్టడం షరా మామూలుగానే మారింది. సాక్షి, కామారెడ్డి: ఐపీ.. ఈ పదం వింటేనే కామారెడ్డి వ్యాపారుల్లో ఇప్పుడు వణుకు పుడుతోంది. చిట్టీలు వేసిన వారి గుండెల్లో దడ పుట్టిస్తోంది. చిన్నా చితకా పొదుపు చేసిన సొమ్మును ఫైనాన్సుల్లో చిట్టీలు, పెట్టుబడుల రూపంలో పెట్టిన వారిలో కలకలం రేపుతోంది. దివాళా పేరిట టోకరా వేస్తూ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపుతుండడంతో మార్కెట్లో తీవ్ర అయోమయం, గందరగోళం నెలకొంది. గత రెండేళ్ల కాలంలో జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో ఎనిమిది మంది ఐపీ బాట పట్టి, నమ్మిన వారికి సుమారు రూ. 20 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. 2016లో నలుగురు, 2017లో ముగ్గురు, ఈ సంవత్సరం ఆరంభంలోనే ఒకరు ఐపీ బాట పట్టారు. నాలుగైదు జిల్లాలకు కూడలిగా, వ్యాపార వాణిజ్య కేంద్రంగా పేరున్న కామారెడ్డి పట్టణంలో ఇప్పుడు ఎక్కడికెళ్లినా ‘ఐపీ’ల ముచ్చట్టే వినిపిస్తున్నాయి. నమ్మి నిండా మునిగిన వారు ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో తెలిసిన వారినల్లా కలుస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. మోసపోయిన వారికి అసలు ఐపీ అంటే ఏమిటి? దాని పర్యవసానాలు ఏమిటి? అన్న దానిపై అవగాహన లేకపోవడంతో ఐపీ పెట్టాడని తెలిస్తేనే హడలి పోతున్నారు. నోటీసులు అందుకున్న వారు డబ్బులు పోవడం ఏమో గాని ఎలా వ్యవహరించాలో తెలియక అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకు పెడుతున్నారు..? చిట్టీలు, ఫైనాన్స్ రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్న వ్యాపారులు కొందరు ఇష్టారీతిన డబ్బును సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. మరికొందరు ‘రియల్’ వ్యాపారంలో పెట్టి బురిడీ కొడుతుంటే, ఇంకొందరేమో ఆస్తులను కూడబెట్టుకొంటున్నారు. ఇంకొందరు అధిక వడ్డీలు చెల్లించడం ద్వారా నష్టపోతున్నారు. అయితే, నష్టాలను కప్పిపెడుతూ నమ్మిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకుంటున్నారు. చివరకు ఆస్తులను ఇతరుల పేరిట మార్చడం, అమ్ముకోవడం ద్వారా వచ్చిన సొమ్మును దాచుకుని ఐపీ బాట పడుతున్నారు. అయితే, ఈ పిటిషన్లు దాఖలయినప్పుడు కోర్టుకు వచ్చి న్యాయ æపోరాటం చేసే వ్యాపారులు తక్కువగా ఉండడంతో వంచకుల ఆటలు సాగుతున్నాయి. కొందరు నమ్మిన వారికి టోపీ పెట్టడానికి ముందస్తు ప్రణాళికతో ఐపీ ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే, బడా వ్యాపారులు ఐపీ జాబితాలో ఉన్నపుడు వారి వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా లోలోపల సెటిల్మెంట్లు చేసుకుని, చిన్న పెట్టుబడిదారులను నిండా ముంచుతున్నారు. ‘టోపీ’ పెడితే ఏం చేయాలి..? మన వద్ద సొమ్ము తీసుకున్న వారెవరైన ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసినప్పుడు మన వద్ద ఉన్న డాక్యుమెంట్లు, ప్రామీసరీ నోట్లు, చెక్ల ద్వారా కోర్టులో కేసు నమోదు చేసి, కోర్టు డిక్రీ తీసుకునే అవకాశం ఉంది. ఇలా డిక్రీ తీసుకుంటే దాని విలువ 12 ఏళ్ల వరకు ఉంటుంది. ఐపీ పెట్టిన వ్యక్తి తిరిగి వ్యాపారంలో పుంజుకుంటే అతని వద్ద నుంచి డబ్బు తిరిగి రాబట్టుకునే అవకాశం ఈ డిక్రీ కల్పిస్తుంది. అయితే, చాలా సందర్బాల్లో ఐపీ పిటిషన్ దాఖలు కాగానే రుణదాతలు మిన్నకుండి పోతున్నారు. మరికొందరు పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చాం.. ఇన్కం ట్యాక్స్ బాధలుంటాయని భయపడి ఐపీ పెట్టిన వారితో రాజీ కుదుర్చుకుంటున్నారు. చాలా సందర్చాల్లో రుణ దాతల వద్ద అప్పు ఇచ్చినట్టు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండడం లేదు. అయితే, ‘నష్టపోయిన’ వ్యాపారులు రుణ దాతల పేర్లను ఐపీ కేసులో చూపుతున్నందువల్ల దాని ఆధారంగా రుణ వసూలు చేసుకోవడానికి దావా వేసే అవకాశాలు ఉన్నట్టు న్యాయవాదులు చెబుతున్నారు. రాజీ నాటకం.. ఐపీని అడ్డం పెట్టుకుని కొందరు రాజీ పేరిట సగానికి పైగా సొమ్ము ఎగ్గొంట్టేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇటీవల ఐపీ పెట్టిన ఓ వ్యాపారి తాను ఇవ్వాల్సిన వారి పేర్లను ఇన్సాల్వెన్సీ పిటిషన్లో చేర్చకుండా బినామీ పేర్లు చేర్చినట్టు సమాచారం. అసలు అప్పు ఇచ్చిన వారికి మాత్రం ‘మీ పేర్లు ఐపీలో లేవు.. మీతో ఎంతో కొంతకు సెటిల్మెంట్ చేసుకుంటానంటూ’ నమ్మబలుకుతున్నట్టు తెలుస్తోంది. ఐపీ అంటే.. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటీషన్. వ్యాపారంలో నష్టాలు వచ్చినపుడు రుణ గ్రహీతలను రక్షించడానికి తయారు చేసిన చట్టమిది. నష్టాల బారిన పడిన వ్యకి తాను దివాళా తీసినట్టు ప్రకటించమని కోర్టును ఆశ్రయించి, తనకున్న అప్పులు, ఆస్తుల జాబితాను సమర్పించి, నష్టాలకు కారణాలను వివరించి కోర్టునుంచి రక్షణ పొందే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది. అయితే, ఈ రక్షణ ప్రస్తుతం మోసగాళ్లకు వరంగా మారింది. ఐపీని అస్త్రంగా చేసుకుని ‘కొందరు’ నమ్మిన వారికి టోపీ పెడుతున్నారు. అయితే, ఈ చట్టం అప్పులు తీసుకున్న వారికే కాదు, ఇచ్చిన వారికి సైతం రక్షణ కల్పిస్తోంది. రుణ గ్రహీత నుంచి తమకు రావాల్సిన రొక్కం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించి సదరు వ్యక్తిని దివాళాకోరుగా ప్రకటించమనే అవకాశం చట్టం కల్పిస్తోంది. దివాళా పిటిషన్ దాఖలా చేసిన వ్యక్తి ఆస్తులను, అప్పులను ఇతర సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కోర్టు సదరు వ్యక్తి దివాళా తీసినట్టు ప్రకటిస్తుంది. అయితే, దివాళా పిటిషన్లు దాఖలు అవుతున్నప్పటికీ కోర్టు విచారణ పూర్తయి దివాళా తీసినట్టు ప్రకటించిన కేసులు చాలా చాలా తక్కువే. -
జనతా దర్బార్లో కలకలం: బీజేపీకి షాక్
ఉత్తరా ఖండ్ బీజేపీ ఆఫీసులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. స్థానిక వ్యాపారి పాండే విషం తీసుకొని డెహ్రాడూన్లోని బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకు రావడం కలకలంరేపింది. దీంతో అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. ఆసుపత్రిలో పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ మంత్రి సుబోధ్ ఉనియాల్ శనివారం నిర్వహించిన జనతా దర్బార్లో ప్రజల సమస్యలను వింటుండగా ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా త్రివేంద్ర రావత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తూ ఈ చర్యకు దిగారు. నోట్ల రద్దు, జీసీటీ కారణంగా తాను వ్యాపారంలో బాగా నష్టపోయాననీ, అప్పులు ఊబిలో కూరుకుపోయానని ఆయన ఆరోపించారు. గత అయిదు నెలలనుంచి ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ముఖ్యమంత్రి నాగోడు వినడం లేదు.. నాలాంటి వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఇక బతకాలని లేదు. అందుకే విషం తీసుకున్నానంటూ విలపిస్తూ పాండే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పాండే విషం తీసుకున్న విషయాన్ని ఆసుపత్రి సీనియర్ అధికారి ధవీకరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందనీ, తదుపరి 24 గంటలు కీలకమని వైద్యులు ప్రకటించారు. మరోవైపు జీఎస్టీ, డిమానిటైజేషన్ మూలంగా తాను విషం సేవించానని పాండే చెప్పారని మంత్రి ఉనియాల్ మీడియాకు వివరించారు. వ్యాపారంలో నష్టం వ్యక్తిగత సమస్య కాదు. అయితే దీనివెనుక రాజకీయకుట్ర దాగి వుందని భావిస్తున్నానన్నారు. కాగా గత అయిదేళ్లుగా రవాణా బిజినెస్లో ఉన్న పాండే ఇటీవల తీవ్ర నష్టాలపాలైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన పరిస్థితిని వివరిస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్కు తన ఫిర్యాదుల గురించి రాశారు. -
వ్యాపారి ఆత్మహత్య, సెల్ఫీ వీడియో వైరల్
సాక్షి, పుత్తూరు : ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడంతో మనస్థాపం చెందిన ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం బజారువీధికి చెందిన మదన్ కుమార్ అనే వ్యాపారి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాను ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో తనకు ఎవరెవరు అప్పు ఉన్నారో వివరించాడు. అందులో అధికార పార్టీ నేతలు ఉండడం సంచలన రేపుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పుత్తూరు ఎంపీపీ గంజి మాధవయ్య రూ.25 లక్షలు, స్వర్ణకుమారి రూ.5 లక్షలు, పిచ్చాటూరుకు చెందినరో డాక్టర్ రూ.50 లక్షలు తనకు బకాయి ఉన్నారని మదన్ కుమార్ ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. వ్యాపారి ఆత్మహత్య, సెల్ఫీ వీడియో వైరల్ -
విమానంలో వ్యాపారవేత్తకు చేదు అనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : ఓ వ్యాపారవేత్తకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. భారత కరెన్సీ చెల్లక పోవడం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇండియన్ బిజినెస్ మ్యాన్ ప్రమోద్ కుమార్ జైన్ ఇటీవల బెంగళూరు నుంచి దుబాయికి ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఏదో వస్తువు కొనుగోలు చేయడం లేదా అవసరాల నిమిత్తం మన కరెన్సీని చెల్లించాలని చూడగా కరెన్సీ చెల్లదంటూ సిబ్బంది వాటిని తిరస్కరించారు. దేశానికి చెందిన కరెన్సీ చెల్లదని భారత్ నుంచి వెళ్తున్న విమానంలో చెప్పడంతో వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ కంగుతిన్నారు. దేశం నుంచి నడుస్తున్న విమానంలో భారత కరెన్సీ చెల్లదని చెప్పడం దేశద్రోహ చర్యగా పరిగణిస్తారు. దీనిపై తాను ఢిల్లీ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. భారతీయుల గౌరవ చట్టం 1971 ప్రకారం స్వదేశంలోనే కరెన్సీ చెల్లదని, స్వీకరించకపోవడం ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. తాను ఫిర్యాదు చేసిన కేసుపై డిసెంబర్ 15న విచారణ జరగనున్నట్లు ప్రమోద్ కుమార్ జైన్ వివరించారు. స్వదేశం నుంచి తిరుగుతున్న విమానాల్లోనే మన కరెన్సీ చెల్లదంటూ, ఆ డబ్బును వెనక్కి ఇవ్వడం చాలా దారుణమని అభిప్రాయపడ్డారు. -
వ్యాపారవేత్తలే బ్రాండ్ అంబాసిడర్లు!
ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్ - ఈఓడీబీపై వ్యాపారవేత్తలకు అవగాహన సదస్సు - 350 ఈఓడీబీ సంస్కరణలను అమల్లోకి తెచ్చామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అక్కడ కేంద్ర పరిశ్రమల శాఖ అధికారులను, ఆ శాఖ మంత్రిని కలుస్తుంటాను. ఇటీవల కొత్తగా బాధ్యత లు స్వీకరించిన మంత్రి సురేశ్ ప్రభును మర్యాదపూ ర్వకంగా కలిశాను. ‘దేశంలోనే అత్యంత ప్రగతి శీల రాష్ట్రానికి చెందిన మంత్రి ఇతను’ అని ఆయన నన్ను అక్కడున్న వారికి పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి ఈ రోజు దేశంలో ఉన్న గుర్తింపు అది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో అత్యంత ప్రగతి శీల, క్రీయా శీల ప్రభుత్వం’’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సరళీకృత వ్యాపారం (ఈఓడీబీ)పై శనివారం పారిశ్రామికవేత్త లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసి డర్లని కొనియాడారు. వ్యాపారవేత్తలు తమ అనుభ వాలను ఇతరులకు చెబుతుంటారని, వారి వల్ల రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్న పరిస్థితి గురించి ఇతర పారిశ్రామికవేత్తలకు అవగాహన కలుగుతుం దన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు బాగుందా, అవినీతి ఉందా, వ్యాపారం చేయాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా యి, తదితర అంశాలపై ఇక్కడి పారిశ్రామికవేత్తలు చెప్పే సమాధానాలకే విశ్వసనీ యత అధికంగా ఉంటుందన్నారు. పరిశ్రమల మనుగడకు సహకరించాలి.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను సరిగ్గా చూసుకుంటేనే కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల రాకకు మార్గం ఏర్పడుతుందనికేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్ర మల సమస్యలను పరిష్కరించి వాటి మనుగడకు సహకరించాలని, కొత్త పరిశ్రమల రాకకు ఇది దోహదపడుతుందని సీఎం కేసీఆర్ తమకు చెబుతుం టారని, దాన్నే అమలు చేస్తున్నామన్నారు. సరళీకృత వ్యాపార విధానానికి సంబంధించి 373 సంస్కర ణల్లో ఇప్పటికే 350 సంస్కరణలను అమలు చేశా మని, మిగిలిన సంస్కరణలను అమల్లోకి తెస్తా మన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతోందని ఇటీవల అసోచాం నివేదించిం దని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు లోటు పాట్లను సరిదిద్దుకోవడం ప్రగతిశీల ప్రభుత్వం చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యమని అభిప్రాయపడ్డారు. 13వ ర్యాంకు నుంచి ప్రథమ స్థానానికి.. ‘రెండేళ్ల నుంచి కేంద్రం రాష్ట్రాలకు ఈఓడీబీ ర్యాంకులు ఇస్తోంది. తొలి ఏడాది 13వ ర్యాంకు వచ్చినప్పుడు మేమంతా బాధపడ్డాం. ఇలా ఎందుకు జరిగిందని ఆత్మ విమర్శ చేసుకుంటే రెండు లోపాలు బయటపడ్డాయి. పారిశ్రామిక విధానం బాగా వచ్చినా, ఇంకా పూర్తిగా అమలు కాలేదని తేలింది. ఈఓడీబీ ర్యాంకులను మూల్యాంకనం చేసిన వారు ఇతర రాష్ట్రాలు చెప్పిన విషయాలను గుడ్డిగా పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని అనిపించింది. రెండో ఏడాది మాత్రం పట్టుదలతో 13వ ర్యాంకు నుంచి తొలి ర్యాంకుకు ఎగబాకడం సంతోషకరం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బ్యాంకులు ఎడాపెడా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నోటీసులిచ్చి వేలం వేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరామని తెలిపారు. -
దారి దోపిడీకి గురైన కడప జిల్లా వ్యాపారి
సాక్షి, శంషాబాద్: కారులో ప్రయాణికుల మాదిరి ఉన్న నలుగురు వ్యక్తులు ఓ వ్యాపారిని దోచుకున్న వైనమిది. ఈ సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుoది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెoదిన షావలి(19) ఉల్లిగడ్డ వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్ బేగంబజార్లో ఉల్లిగడ్డ అమ్మకుని వచ్చిన డబ్బులతో ప్రొద్దుటూరు తిరిగి వెళ్లే ప్రయత్నంలో శుక్రవారం రాత్రి ఆరాంఘర్ వద్ద నిలబడ్డాడు. కడప వైపు వెళ్తున్నానంటూ ఓ కారు డ్రైవర్ చెప్పడంతో ఎక్కాడు. అయితే అప్పటికే మరో నలుగురు వ్యక్తులు అందులో ఉన్నారు. కారు శంషాబాద్ మండలంగండిగుడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చేసరికి రోడ్డుపక్కకు కారు ఆగింది. అందులోని వారంతా చావలి వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని అడగ్గా షావలి నిరాకరించడంతో కొట్టి రూ.40వేల నగదు, సెల్ఫోన్ లాక్కుని అతడిని అక్కడే రోడ్డుపై వదిలి కారులో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. -
ఉదయ్పూర్లో పట్టపగలే కిడ్నాప్
-
సీటు బెల్ట్ తీసుకునే లోపే..దారుణం
బెంగళూరు:కారులో ప్రయాణిస్తున్నపుడు సీటు బెల్ట్ పెట్టుకోవడం..ద్విచక్ర వాహనంపై వెళుతున్నపుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అయితే దురదృష్టవశాత్తు ఆపదలో రక్షించాల్సిన ఆ సీట్ బెల్టే బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి ప్రాణాలను బలితీసుకుంది. కారు ఇంజీన్కు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆయన సజీవ దహనమైన ఘటన కలకలం రేపింది. అయితే చివరి నిమిషంలో తన కుటుంబ సభ్యుల కాపాడుకున్నా ఆయన మాత్రం మంటల్లో కాలి బూడిద కావడం మృతుని కుటుంబ సభ్యులను మరింత కలవర పరిచింది. దురదృష్టకరమైన ఈ సంఘటన ఆదివారం ఉదయం మదుక్కారై టోల్ గేటు సమీపంలో చోటు చేసుకుంది. నగల వ్యాపారి దిలీప్కుమార్ (38 )భార్యా పిల్లలతో కారులో కొచ్చికి బయలుదేరారు. ఇంతలో వాహనం ఇంజిన్కు హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే తేరుకున్న దిలీప్ కుమార్ తన భార్య ఇద్దరు పిల్లల్ని బయటకు తోసేసి మరీ ప్రమాదంనుంచి రక్షించారు. ఇంతలో మంటలు బాగా వ్యాపించడంతో సీట్ బెల్టు తీసుకునే లోపే భార్యా పిల్లల చూస్తుండగానే ఆయన మంటలకు ఆహుతైపోవడం తీవ్ర విషాదాన్ని రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
కరెన్సీతో వ్యాపారి వైరైటీ 'లక్ష్మీ'పూజ
-
వ్యాపారి ఇంట్లో చోరీ
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని మార్వాడీ బజార్లో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న ఓంప్రకాశ్ అనే వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఓం ప్రకాశ్ వరంగల్లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికి వచ్చిన వ్యాపారి ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. తాళం పగలగొట్టి ఇంట్లో దాచిన రూ.2.13 లక్షల నగదు దోచుకెళ్లినట్లు సమాచారం. బాధిత యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల కోసం క్లూస్ టీం ప్రయత్నిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి దేవినేని అనుచరుడి బెదిరింపులు
విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు, వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రభుత్వం చేతిలో ఉందన్న పొగరు, ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. బెదిరింపులు, దందాలు చాలా మామూలుగా చేసేస్తున్నారు. తమ్ముళ్ల ఆగడాలు భరించలేక ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండిపోతున్నారు. తాజాగా మరో తెలుగు తమ్ముడు, మంత్రి దేవినేని అనుచరుడు సీతారామయ్య బెదిరింపులకు పాల్పడుతున్నాడు. విజయవాడ, ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ వ్యాపారిని ఫోన్లో బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో సదరు వ్యాపారీ, సీతారామయ్యపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. పైగా తిరగి తనపైనే అక్రమ కేసులు బనాయించినట్లు బాధితుడు వాపోయాడు. -
‘నా కారును ఆపి.. నన్నే లైసెన్స్ అడుగుతావా..?’
చండీగఢ్: పంజాబ్లో ఓ వ్యాపార వేత్త తన అహంకారాన్ని బయటపెట్టాడు. బాధ్యతగా తన విధులు నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీసుపై చేయిచేసుకున్నాడు. తన బీఎండబ్ల్యూ కారునే ఆపుతావా అంటూ చెలరేగిపోయాడు. ఎవ్వరు అతడిని పట్టుకునే సాహసం చేసినా ఏ మాత్రం ఆగకుండా దాడికి తెగబడ్డాడు. అనంతరం పలువురు అక్కడికి చేరుకొని అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాడు. పాటియాలలో రాంగ్ రూట్లో హిమాంషు మిట్టల్ అనే వ్యక్తి బీఎండబ్ల్యూ కారు నడుపుకుంటూ వస్తుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓం ప్రకాశ్ అనే ట్రాఫిక్ పోలీసు కారును ఆపేశాడు. లైసెన్స్ చూపించాలని కోరాడు. దీంతో అందులో ఉన్న హిమాంషు తాను ఎవరో తెలుసా అని బీరాలు పోతూ.. తన కారునే ఆపుతావా అని ఊగిపోతూ నేరుగా ఓం ప్రకాశ్ను చెంపమీద కొట్టాడు. అనంతరం పిడిగుద్దులు కురిపించాడు. ఇదంతా చూస్తున్న పాదచారుల్లో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా పెద్ద దుమారమై కూర్చుంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడికి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. -
మోసం కేసులో వ్యాపారి అరెస్టు
హైదరాబాద్: కోట్లాది రూపాయల మేర మోసానికి పాల్పడిన కేసులో ఓ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. వీఎం కోలాజిక్స్ అనే సంస్థకు కె.వెంకటరామ విద్యాసాగర్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 2011-12 సంవత్సరాల కాలంలో ఆయన జింపెక్స్ అనే సంస్థ నుంచి ఈయన రూ.9.14 కోట్ల విలువైన బొగ్గును కొనుగోలు చేశారు. ఆ బొగ్గును కె.వెంకటరామ విద్యాసాగర్ వేరొకరికి అమ్మేశారు. కానీ, జింపెక్స్ సంస్థకు డబ్బు మాత్రం పూర్తిగా చెల్లించలేదు. పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచే విద్యాసాగర్ తప్పించుకు తిరుగుతున్నారు. దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. -
రేప్ చేసి, వీడియోలు బయటపెడతానని..
కోల్కతా: ఉన్నత చదువుల కోసం ఒడిశా నుంచి కోల్కతా వెళ్లిన ఓ పెళ్లికాని మహిళ(30)పై ఓ వ్యాపారవేత్త దారుణానికి తెగబడ్డాడు. ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి ఆమె పారిట శాపంలా మారాడు. దాదాపు ఏడాదిపాటు లైంగికి దాడికి పాల్పడ్డాడు. రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. క్రమంగా అతడి వేధింపులు మరింత ఎక్కువకావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..ఒడిశాకు చెందిన 30 ఏళ్ల మహిళ కోల్కతాలో ఉండి చదువుకుంటోంది. తన స్నేహితురాళ్లతో కలిసి జోద్పూర్ గార్డెన్స్లో ఓ ఫంక్షన్కు వెళ్లింది. ఆ పార్టీలోనే రాకేశ్ చౌదరీ, ఆయన భార్య ఆమెకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒకసారి పార్టీకి రావాలంటూ ఆహ్వానించిన రాకేశ్ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బాధితురాలిని కోల్కతాలోని బైపాస్ రోడ్డులో ఉన్న తన గెస్ట్హౌజ్కి తీసుకెళ్లాడు. పూర్తిగా మద్యం తాగించి స్పృహకోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తర్వాత తాను పిలిచిన ప్రతిసారి రాకుంటే ఫొటోలు బయటపెడతానని బెదరించి ఏడాదిపాటు దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత కూడా అతడు వేధింపుల స్థాయి పెంచడంతో భరించలేని బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. -
పండ్ల వ్యాపారి ఆత్మహత్య
హిందూపురం అర్బన్ : హిందూపురం హస్నాబాద్కు చెందిన పండ్ల వ్యాపారి హిదాయత్(32) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక వన్టౌన్ పోలీసులు తెలిపారు. హిదాయత్ అత్తవారింట్లోనే ఇల్లరికంగా ఉంటున్నాడు. ఇటీవలే మామ చనిపోవడంతో కుటుంబ పోషణ అతనిపై పడింది. ఈ నేపథ్యంలో భార్యకు ఇటీవలే కాలు విరిగి ఆపరేషన్ జరగడంతో నడవలేని స్థితిలో ఉంది. దీంతో మనస్థాపానికి గురైన అతను బుధవారం రాత్రి భోజనం చేసి పైగదికి వెళ్లి పడుకున్నాడు. ఉదయం చూసే సరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులకు సమాచారం అందించగా, వారొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుడికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. కేసు విచారణలో ఉంది. -
హిట్ అండ్ రన్ కేసులో బిజినెస్మెన్ అరెస్ట్
న్యూఢిల్లీ : మెర్సిడిస్ హిట్ అండ్ రన్ కేసులో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 ఏళ్ల బిజినెస్మెన్ సవ్నీత్ సింగ్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతుల్ అరోరా అనే విద్యార్థి ఆదివారం రాత్రి స్కూటర్పై తన స్నేహితుడిని డ్రాప్ చేసి వస్తుండగా.. మెర్సిడెస్ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ్ విహార్ ప్రాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిన కారు విద్యార్థిని సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగాక కనీసం ఆగి కూడా చూడకుండా.. మెర్సిడెస్ కారులోని వ్యక్తి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని రాజౌరీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మెర్సిడిస్ కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలో సవ్నీత్ సింగ్ పీకల్లోతు వరకు తాగి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సవ్నీత్ సింగ్ తన స్నేహితునితో కలిసి రెస్టారెంట్కు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బడాబాబుల విలువైన కార్లు ఢిల్లీ పౌరుల పాలిట శాపంగా మారుతున్నాయి. హై ఎండ్ వాహనాలు.. అదుపులేని వేగంతో దూసుకొస్తూ మనుషుల ప్రాణాలు బలిగొనడం ఇటీవల దేశ రాజధానిలో పరిపాటిగా మారింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బీఎమ్డబ్ల్యూ కారు అతివేగం మూలంగా ఓ ఉబర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జనవరిలో జరిగింది. అదే నెలలో ఢిల్లీ శివార్లలో జరిగిన మరో ఘటనలో ఆడీ స్పీడు.. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సహా నలుగురిని పొట్టనబెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో 97 శాతం అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ మూలంగానే జరుగుతున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. -
అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య
కర్నూలు: వ్యాపారం కోసం చేసిన అప్పులు చెల్లించలేక లక్ష్మినగర్లో నివాసం ఉంటున్న వెంకటరమణ(35) ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఫుట్పాత్పై పాన్ బంకు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం, కుటుంబ అవసరాలకు కర్నూలులో తెలిసిన వారి వద్ద సుమారు రూ.20 లక్షలు అప్పు చేశాడు. తిరిగి చెల్లించలేక కొన్నాళ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుదారుడు శ్రీనివాసరెడ్డి, అక్బర్, రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ తదితరులు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచారు. పాన్దుకాణాన్ని రామకృష్ణ తన పేరిట రాయించుకున్నాడు. దీంతో వెంకటరమణ కలత చెంది శుక్రవారం మధ్యాహ్నం భార్య రాజేశ్వరిని దుకాణం వద్ద కూర్చోబెట్టి పిల్లలను స్కూలు వద్ద వదిలివస్తానంటూ ఇంటికి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. భర్త దుకాణం వద్దకు ఎంత సేపటికి రాకపోవడంతో రాజేశ్వరి ఇంటికి వెళ్లింది. అప్పటికే ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్క నివాసితులతో కలిసి తలుపులు తెరిచి కిందకు దించగా అతను అప్పటికే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు అప్పు ఇచ్చిన రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, అక్బర్, వెంకటేశ్వరమ్మ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడవ పట్టణ సీఐ మధుసూదన్రావు తెలిపారు. మృతునికి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం. -
బడా వ్యాపారి కుటుంబం ఆత్మహత్య
గయ: బిహార్ లోని గయ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధామి తోలా ప్రాంతానికి చెందిన బడా వ్యాపారవేత్త కుటుంబం అనుమానాస్పదంగా మరణించారు. గయా పట్టణంలో పప్పుధాన్యాల విక్రయించే అతిపెద్ద వ్యాపారి అయిన రవి గుప్తా భార్య, ఓ చిన్నారి సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం రవి గుప్తా అలియాస్ విక్కీ (36) పట్టణంలో పేరొందిన పెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా ఉన్నారు. ఏమైందో, ఏమో తెలియదు గానీ , అతని భార్య నిసి దేవి (30), వారి మూడు ఏళ్ల పాప వారి నివాసంలో అనూహ్యంగా మరణించారు. గురువారం ఉదయం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఇటీవల ఫిబ్రవరి 13 న రవి గుప్తా తల్లి గీతా దేవి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అతని సోదరి నిషా గుప్తా రవిదంపతులపై కేసు నమోదు చేశారు. వారి వేధింపుల కారణంగానే తన తల్లి ఆత్మహత్యకు కారణమని నిషా ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన ఈ జంట ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఔరంగాబాద్ శ్రీమంతుడి వినూత్న కానుక
-
బెంగళూర్ వ్యాపారవేత్తతో బొమ్మాళి పెళ్లి?
యోగా టీచర్ అనుష్కకు వరుడు దొరికాడా..? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారుు సినీ వర్గాలు. తమిళ, తెలుగు భాషల్లో అగ్ర నాయకిగా రాణిస్తున్న నటి అనుష్క. 2005లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ భామ ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారు. ప్రస్తుతం 35వ ఏట అడుగుపెట్టారు. దీంతో అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రాకు చెందిన ఒక వ్యాపారవేత్తను అనుష్క పెళ్లాడబోతున్నారనే ప్రచారం ఆ మధ్య హల్చల్ చేసింది. అయితే నిజంగానే అనుష్క పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూర్కు చెందిన వ్యాపారవేత్తతో బొమ్మాళి పెళ్లి నిశ్చయం అయింయందని తాజా సమాచారం. ఆయనకు బెంగళూర్, ఆంధ్రాలో భారీగా ఆస్తులున్నట్లు టాక్. వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందని సినీ వర్గాల సమాచారం. అనుష్క సూర్యకు జంటగా నటించిన ఎస్-3 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం బాహుబలి-2, భాగమతి చిత్రాలతో పాటు నాగార్జున సరసన నమో వెంకటేశాయ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత పెళ్లి పీటలెక్కనున్నారని, ఆ తరువాత నటనకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
లాస్ రాకూడదని.. డైరెక్టర్కు చెక్ పంపాడు!
‘మీ సినిమా చూడటం ఇష్టంలేదు. అయినా ఈ సినిమా వల్ల మీరు నష్టపోవడం సాటి వ్యాపారవేత్తగా నాకు బాధ కలిగిస్తోంది. అందుకే ఈ చెక్కు పంపిస్తున్నా’ అంటూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. 350 చెక్కును కరణ్ జోహార్కు పంపించాడు. (ఆ సీన్ కట్.. అప్పుడే మొదలైన లీకులు!) పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించినందుకు ‘యే దిల్ హై ముష్కిల్’ విడుదలపై ఎమ్మెన్నెస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో చర్చలతో ఈ సినిమా విడుదలకు ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే అంగీకరించారు. అయితే, భవిష్యత్తులో పాక్ నటులతో సినిమాలు తీయవద్దని, పాక్ నటులతో సినిమాలు తీస్తే.. రూ. 5 కోట్లు భారత ఆర్మీ సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని రాజ్ ఠాక్రే షరతులు పెట్టారు. ఇందుకు కరణ్ జోహార్, బాలీవుడ్ నిర్మాతల సంఘం ఒప్పుకోవడంతో వివాదానికి తెరపడింది. పాక్ నటులతో నిర్మితమైన కరణ్ జోహార్ సినిమాలు ’యే దిల్ హై ముష్కిల్’, ’డియర్ జిందగీ’ సినిమాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే, అంతకుముందు తన సినిమాల విడుదలకు అడ్డంకులు కల్పించవద్దని సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియోలో కరణ్ జోహార్ అభ్యర్థించారు. ఇలా అడ్డుకోవడం వల్ల తాను భారీగా నష్టపోతానని వాపోయారు. దీంతో కరణ్ జోహార్ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆయన ముఖం చూసి ఓ వ్యాపారవేత్త సినిమా చూడకూండానే చెక్కు పంపించారనే శిల్పీ తివారీ ట్విట్టర్లో వెల్లడించారు. కళ కోసం కాకుండా తనకొచ్చే నష్టాల కోసం కరణ్ బాధపడ్డారని, అందుకే ఆయన సినిమా చూడాలనే ఉద్దేశం లేకపోయినా.. ఆయన నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండు టికెట్ల ధర (రూ. 160 చొప్పున)ను ఆయనకు పంపిస్తున్నట్టు ఆ వ్యాపారవేత్త తన లేఖలో తెలిపారు. -
అనుష్కకు కల్యాణ ఘడియలు?
మూడు పదుల వయసు పైబడిన నటీమణులకు ఇంటా బయట పెళ్లి ఒత్తిడి పెరగడం సర్వసాధారణం. 34 ఏళ్ల నటి అనుష్కకు అలాంటి తాకిడి ఉంటుందనడం అనూహ్యమేమీ కాదు. ఉన్నత విద్యను పూర్తి చేసిన అనుష్క ఆదిలో యోగా శిక్షణ పొంది, తర్వాత యోగా టీచర్గా పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాంటి బ్యూటీని విధి నటిని చేసింది. అనుష్క 2005లో వెండితెరకు పరిచయం అయ్యారు. అలా తొలి రోజుల్లో అందాలారబోస్తూ అవకాశాలు పెంచుకుంటూ వచ్చిన అనుష్కకు అరుంధతి చిత్రం ఆమె నట దిశను ఒక్కసారిగా మార్చేసింది. స్టార్ నాయకిగా తమిళం, తెలుగు భాషల్లో అగ్రనాయకిగా రాణిస్తున్నారు. ఈ రెండు భాషల్లో అగ్రనాయకులందరితోనూ డ్యూయెట్లు పాడేసి ఆ సరదాను తీర్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఎస్-3 చిత్రంలో సూర్యతోనూ, ద్విభాషా చిత్రం బాహుబలి-2, హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం భాగమతి, భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో నటిస్తున్నారు. వీటిలో ఎస్-3 చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇలా ఉండగా అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జోరందుకుంది. కారణం ఈ అమ్మడి కి కల్యాణ ఘడియలు దూసుకొస్తున్నాయని సమాచారం. నటిగా ప్రశంసలు అందుకుంటున్న అనుష్క వ్యక్తిగతంగా పలు వదంతులను ఎదుర్కొంటున్నారన్నది గమనార్హం. నటుడు ఆర్యతో ప్రేమకలాపాలంటూ అప్పట్లో గాసిప్స్ హల్చల్ చేశాయి. ఇక ఒక తెలుగు నటుడితో డేటింగ్ అంటూ ప్రచారం హోరెత్తింది. ఇటీవల వివాహితుడైన నిర్మాతను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం కలకలం పుట్టించింది. కాగా వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టే విధంగా అనుష్క కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడంలో వేగం పెంచినట్లు తాజా సమాచారం. అదే విధంగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లిని నిశ్చయించినట్లు సినీ వర్గాల టాక్. బాహుబలి-2 విడుదల తరువాత అనుష్కకు డుండుండుం...పీపీపీనేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
సిండి‘కేట్లు’
క్వింటా ఉల్లి ధర రూ.100 – సరుకు బాగుంటే సైగలతో సిండికేట్ – ఎకరాకు కనీస పెట్టుబడి రూ.50వేలు – దిగుబడి అమ్మితే వచ్చేది రూ.9వేలు – రవాణా చార్జీలూ దక్కని వైనం – రోడ్డెక్కిన ఉల్లి రైతులు – దిగుబడులు పారబోసి నిరసన కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతు దగా పడుతున్నాడు. ఒక్క ఏడాదిలో పరిస్థితి తలకిందులయింది. గత ఏడాది లాభాలను ఆర్జించిన రైతు ఈ విడత నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. క్వింటా ఉల్లి ధర రూ.100లకు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. వ్యాపారులు నాణ్యత కలిగిన ఉల్లి లాట్ కనిపిస్తే చాలు.. సిండికేట్ అయిపోతున్నారు. సైగలతో ధర పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. తక్కువ ధరతో కొనుగోలు చేసిన నాణ్యమైన ఉల్లిని ఆ తర్వాత పంచుకోవడం కర్నూలు మార్కెట్లో పరిపాటిగా మారింది. బుధవారం వేలం రూ.50లతో మొదలుపెట్టి రూ.100లకే ముగించడం రైతుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు క్వింటా ఉల్లి రూ.700 ప్రకారం కొంటున్నట్లు చెబుతుండగా.. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉండటం గమనార్హం. రిటైల్ మార్కెట్లో ఒక మాదిరి నాణ్యత కలిగిన ఉల్లి కిలో రూ.10 చొప్పున విక్రయిస్తుంటే.. మార్కెట్లో క్వింటా ధర రూ.100 ప్రకారం కొంటామని వ్యాపారులు చెప్పడం రైతులను కలచివేస్తోంది. సీఎం డౌన్డౌన్ మోసపూరిత వేలం పాటను బంద్ చేయించిన రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ధర్నా చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన మధ్యాహ్నం ఒంటి గంటకు పైగా సాగింది. చూడండి.. ఈ ఉల్లి బాగోలేదా అంటూ బస్తాల కొద్దీ ఉల్లిని రోడ్డుపై గుమ్మరించారు. ధర్నాతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించింది. ఆ తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ద చర్చలు జరుగుతున్నాయంటూ పోలీసులు రైతులచేత బలవంతంగా ధర్నాను విరమింపజేశారు. రైతులకు సీపీఎం నేతలు మద్దతుగా నిలిచారు. గత ఏడాది రూ.4వేలతో కొనలేదా? ‘‘గత ఏడాది ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం క్వింటా రూ.4వేలతో కొనుగోలు చేసి ప్రజలకు కిలో రూ.20 చొప్పున పంపిణీ చేసింది. ఇప్పుడు ధరలు పడిపోయిన నేపథ్యంలో కనీసం రూ.1000లతో కూడా కొనుగోలు చేయకపోవడం ఏమిటి.’’ అని రైతులు ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి, కార్యదర్శి నారాయణమూర్తి, వైస్ చైర్మన్ దేవేంద్రరెడ్డిలు రైతుల వద్దకు చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఉల్లి ధర పూర్తిగా పడిపోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి తెలిపారు. రైతులు నష్టపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ను కోరినట్లు చెప్పారు. తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఈ ఉల్లిలో నాణ్యత లేదా.. ఈ ఉల్లిలో నాణ్యత లేదా.. ఇదే ఉల్లిని రిటైల్గా కిలో రూ.10 ప్రకారం అమ్ముతున్నారు. మార్కెట్లో మాత్రం వేలం పాట రూ.50 దగ్గర మొదలు పెట్టి రూ.100 వద్ద ముగిస్తున్నారు. ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి పెడితే.. ఇలా యాభై వంద రూపాయలకు అమ్మితే ఎట్లా బతికేది. రవాణా ఖర్చులు కూడా వస్తలేవు. – చిన్న రామాంజనేయులు, గుమ్మకొండ -
మెకానిక్కు బుర్జ్ ఖలీఫాలో 22 అపార్టుమెంట్లు
దుబాయ్: ఒక్కోసారి ఓ మాట వ్యక్తిని ఉన్నతుడిని చేస్తుందంటారు. అతడికి లేని శక్తులు వచ్చేలా తయారుచేస్తుందని చెప్తుంటారు. సరిగ్గా ఓ భారతీయుడి విషయంలో ఇదే జరిగింది. తన స్నేహితుడు అపహాస్యం చేసినట్లుగా మాటలు అన్నందుకు ఆ వ్యక్తి దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. విన్నవారంతా అవాక్కయ్యే స్థాయికి వెళ్లాడు. అతడే మెకానిక్ నెరియాపరాంబిల్. నెరియాపరాంబిల్ ఓ భారతీయుడు. 1976 మధ్యాసియాకు వెళ్లిపోయాడు. స్వతహాగా మెకానిక్ అయిన అతడు అదే పనిచేసుకుంటూ గడపడంతోపాటు తండ్రి చేసే పనిలో సహాయంగా ఉండేవాడు. ఒకసారి అతడి స్నేహితుడు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనాన్ని చూపిస్తూ.. ఇందులోకి నీ జీవితంలో వెళ్లలేవు అంటూ అపహాస్యం చేసి వెకిలి నవ్వు నవ్వాడు. ఓ రోజు ఆ భవనంలో ప్లాట్ లు అద్దెకు ఉంటాయని పేపర్ లో చదివి సరిగ్గా 2010లో అందులో అద్దెకు దిగాడు. అనంతరం ఒక బిజినెస్మేన్గా మారి తన తెలివితేటలతో అనతికాలంలోనే ఏకంగా అందులో 22 అపార్టుమెంట్లు సొంతం చేసుకున్నాడు. 828మీటర్లు ఉండి మొత్తం 900 అపార్ట్మెంట్లు ఉన్న బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్మెంట్లు మన మెకానిక్ నెరియాపరాంబిల్వే. అయితే, తన కలను ఇంతటితో ఆపనని, ఇలా కలకంటూనే మరెన్నో అపార్టు మెంట్లను కొనుగోలు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ అనితర మెకానిక్. -
డీల్కు వచ్చి.. కిడ్నాప్నకు గురై..
కలకలం సృష్టించిన బెల్లం వ్యాపారి అపహరణ హసన్పర్తి : నిజామాబాద్ జిల్లాకు చెందిన బెల్లం వ్యాపారి కిడ్నాప్నకు గురి కావడం జిల్లాలో కలకలం సృష్టిం చింది. తన దందాలో భాగంగా ఓ వ్యక్తితో బిజినెస్ డీల్ కుదుర్చుకు నేందుకు వచ్చి అనూ హ్యంగా కిడ్నాప్ కావడం చర్చనీయాం శమైంది. నిమాజాబాద్ జిల్లా బిక్కనూర్కు చెందిన బెల్లం వ్యాపారి శ్యామల భరత్కుమార్ను నమ్మించి, ఇక్కడికి రప్పించి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. భరత్కుమార్ వద్ద పనిచేస్తున్న గుమస్తాతోనే హసన్పర్తికి చెందిన ఓ వ్యక్తి బెల్లం డీలింగ్ కుదర్చుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ గుమస్తా తన యజమానికి వద్ద ప్రస్తావించాడు. రెండు లారీల బెల్లం విక్రయానికి రావడంతో సదరు యజమాని మాట్లాడడానికి హసన్పర్తికి వచ్చాడు. కానీ మాట్లా డేందుకు వెళ్లిన భరత్ కుమార్ ఫోన్ నుంచి అతడి భార్యకు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరింపు ఫోన్ కాల్ రావ డంతో విషయం బయటికి వచ్చింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన కిడ్నాపర్ ఇటీవల ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పోలీసుల విచారణ.. వ్యాపారి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాజీపేట ఏసీపీ జనార్దన్, సీఐ రవికుమార్ వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు. కాగా, కారు డ్రైవర్తోపాటు గుమస్తాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
18రోజుల దీక్షతో కర్ర వినాయకుడు తయారీ
-
సోనమ్ కపూర్ లవ్లో పడిందా ?
-
ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
గూడూరు : విద్యార్థులు చదువయ్యాక ఉద్యోగానికే పరిమితం కాకుండా వ్యాపారం చేసి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్టెక్ గ్రూపు సీఈఓ విమాన్ అన్నారు. స్థానిక ఆదిశంకర కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విమాన్ మాట్లాడుతూ ఓ విద్యార్థి వ్యాపారవేత్తగా మారాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు సన్నద్ధం కావాలన్నారు. తన అనుభవాలు చెప్పారు. కళాశాల ౖyð రెక్టర్ కష్ణకుమార్, డాక్టర్ విచమ్, మనీష్శర్మ, తిరుపతి వడకన్లు ప్రసంగించారు. ఎస్వీ రమణ, మల్లికార్జున, కొడాలి, ప్రభుకర్ తదితరులు పాల్గొన్నారు. -
డీసీ దృష్టికి వ్యాపారుల సమస్యలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వ్యాపారాలు సన్నగిల్లాయని, దీంతో వ్యాపారులు చాలా ఇబ్బందులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారని శ్రీకాకుళం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విజయనగరం వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్ ఎల్.శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఆయన ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపార సంఘాల తరఫున డీసీని సత్కరించారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వాణిజ్యపన్నుల విభాగం వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తమకు సహకరించాలని డీసీకి విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్ అధికారులతో మాట్లాడి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. డీసీని కలిసిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అందవరపు వరహానరసింహం (వరం), ప్రధాన కార్యదర్శి పీవీ రమణ, ఉపాధ్యక్షులు కె.వాసు, పేర్ల సాంబమూర్తి, గుమ్మా నాగరాజు, కోశాధికారి గుమ్మా నగేష్, ఇతర ప్రతినిధులు ఏఎన్ఆర్ రాజు, కోణార్క్ శ్రీను, తంగుడు బాబు, ఎస్వీడీ మురళి, అమరావతి శ్రీను, కి ల్లంశెట్టి నరసింహమూర్తి, నవతా బాబ్జి, కోరాడ రమేష్, గుడ్ల చక్రధరరాజు, పేర్ల మహేష్, సుప్రీమ్ దివాకర్, దీర్ఘాశి సూర్యనారాయణ, గెంబలి శ్రీను, వీఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
గుర్గ్రామ్లో వ్యాపారి దారుణ హత్య
-
విరాట్..'బిజీ'మ్యాన్!
న్యూఢిల్లీ: దేశంలో అధిక మొత్తాన్ని తీసుకునే బ్రాండ్ అంబాసిడర్లలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఒకడు. సుమారు 15 పెద్ద బ్రాండ్లకు విరాట్ అంబాసిడర్గా ఉన్నాడు. అటు ఆడిదాస్ నుంచి ఆడి కారు వరకూ, ఇటు టిస్సోట్ వాచెస్ నుంచి పెప్సీ శీతలపానీయం వరకూ కోహ్లినే బ్రాండ్ అంబాసిడర్. దీంతో 2015లో బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సంపాదించే ఆటగాళ్లలో విరాట్ స్థానం సంపాదించాడు. దాంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిల సరసన కోహ్లి నిలిచాడు. ఈ ప్రకటనలతోనే కాదు.. క్రికెట్ ఫీల్డ్లో కూడా విరాట్ది ప్రత్యేకం స్థానం. క్రికెట్ మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉండే విరాట్ తన ఖాతాలో చాలా ఘనతలనే వేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సగటు, ఐపీఎల్ లో ఒకే సీజన్లో నాలుగు శతకాలు, ఒకే సీజన్లో అత్యధిక పరుగులు. ఇలా క్రికెట్లో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న కోహ్లి.. వ్యాపారవేత్తగా కూడా బిజీగా ఉన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్లో గోవా ఫ్రాంచైజీ సహ యజమానిగా ఉండటంతో పాటు, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ లో యూఏఈ జట్టుతో విరాట్ భాగస్వామ్యమయ్యాడు. మరొకవైపు ప్రొ రెజ్లింగ్ టీమ్ బెంగళూరు యోధాస్ జట్టును కూడా విరాట్ కొనుగోలు చేశాడు. దీంతోపాటు గతేడాది లండన్కు చెందిన సోషల్ మీడియా స్టార్టప్ స్పోర్ట్ కాన్వోతో పాటు, సింగపూర్కు చెందిన మరొక స్పోర్ట్స్ స్టార్టప్ కంపెనీతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు. 2015లో జిమ్నాజియం (జిమ్ చైన్) ను విరాట్ ఏర్పాటు చేశాడు. గతేడాది రూ.190 కోట్ల పెట్టుబడితో 75 ‘చిసెల్’ జిమ్లను ఏర్పాటు చేసిన కోహ్లి... ఆ జిమ్ సెంటర్లను మరింత పెంచడంపై దృష్టి సారించాడు. 2018 నాటికి ఆ జిమ్ సెంటర్లను 100కు పైగా విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇలా క్రికెటర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా, బిజినెస్ మ్యాన్ గా దూసుకుపోతున్న కోహ్లి తదుపరి ప్రణాళిక ఏమిటో మరి? -
బిజినెస్మెన్ తల నరికేందుకు వెళుతూ..
న్యూఢిల్లీ: బుర్ద్వాన్ రైల్వే స్టేషన్ లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ సానుభూతి పరుడి గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ వ్యాపార వేత్త తల నరికేందుకు అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఆ దిశగానే తాను పావులు కదుపుతున్నట్లు చెప్పాడు. ఈ వివరణను ఎన్ఐఏ అధికారులు ఓ వీడియో రూపంలో రికార్డు చేశారు. అనుమానిత ఉగ్రవాది కదలికలు ఉన్నాయని, అతడు ఓ దారుణం సృష్టించేందుకు వెళ్లాలనని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారం తరలిన ఎన్ఐఏ అధికారులు అబు ముసా అనే వ్యక్తిని బుధవారం బుర్ద్వాన్ రైల్వే స్టేషన్ లో ఓ పాస్ట్ ప్యాసింజర్ రైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడితోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడిని విచారించిన అధికారులకు ఈ విషయం చెప్పాడు. అతడు షపీ అర్మార్ అలియాస్ యూసఫ్ అల్ హిందీ అనే బంగ్లాదేశ్ కు చెందిన ఐసిస్ రిక్రూటర్ నుంచి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. కాగా, ఆ వ్యాపార వేత్త వివరాలు మాత్రం అధికారులు గుట్టుగా ఉంచారు. నిందితుడి వద్ద పొడవైన కత్తితోపాటు ఓ పెన్సిల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. -
నలుగురు నాలుగు కత్తులతో వచ్చి..
లూథియానా: పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. పొద్దున్నే తన షాపు తెరుచుకుని కూర్చున్న వ్యక్తిపై నలుగురు దుండగులు కత్తులతో దాడులు చేశారు. పదేపదే తలపై, కాళ్లపై కత్తులతో నరకడంతో అతడు ప్రస్తుతం అతడు ఆస్పత్రి పాలయ్యాడు. ఇదంతా కూడా అతడి దుకాణంలో పెట్టిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పూర్తి వివరాల్లోకి వెళితే గురప్రీత్ సింగ్ అనే చిన్న వ్యాపారస్తుడు లూథియానాలో బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయాన్నే తన షాపు తీశాడు. అలా అతడు తీసి ఒక 20 నిమిషాలు అయిందో లేదో వెంటనే ఓ నలుగురు వేగంగా కత్తులు తీసుకొని వచ్చారు. కౌంటర్ లో కూర్చున్న అతడిపై నలుగురు ఒకేసారి పదేపదే దాడి చేశారు. పదే పదే నరికేసి పారిపోయారు. అనంతరం అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. గుర్ ప్రీత్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. అయితే, అతంతకు ముందు అతడి కారు ఎవరో వ్యక్తిని ఢీకొట్టిందని, ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్లే వచ్చి దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
బ్యాంకు ముందు బట్టలిప్పి నిరసన
అబిడ్స్: హైదరాబాద్ నగరంలోని గన్ఫౌండ్రీ ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం ఓ వ్యాపారి హల్చల్ సృష్టించాడు. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ప్రకాష్ అనే వ్యాపారి బాసరలో హోటల్ నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం తన బిల్డింగ్ను నిజామాబాద్ జిల్లా ఎస్బీహెచ్ శాఖలో మార్టిగేజ్ చేశాడు. మార్టిగేజ్ తొలగించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో బ్యాంకు రీజనల్ అధికారిని కలిసేందుకు వచ్చాడు. కానీ అక్కడ సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో తన షర్టు, బనియన్ను విప్పేసి అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. దీంతో బ్యాంకు వినియోగదారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. సిబ్బంది సైతం కలవరానికి గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ గంగారాం బ్యాంక్కు చేరుకొని వ్యాపారి ప్రకాష్కు నచ్చజెప్పారు. బ్యాంకు రీజనల్ అధికారితో అపాయింట్మెంట్ ఇప్పించారు. అనంతరం అబిడ్స్ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి కొద్దిసేపు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
నేరాలకు ప్రేరణ.. ఈ సినిమాలే!
సినిమాకు చాలా సందర్భాల్లో నిజజీవితమే ప్రేరణ. వాస్తవ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చాలా సినిమాలు తెరమీదకొచ్చాయి. అయితే ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. నిజజీవితం ఆధారంగా వచ్చే సినిమాల కన్నా.. సినిమాల ఆధారంగా జరిగే నేరాల సంఖ్యే అధికంగా కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో 15 ఏళ్ల అభయ్ మోధానిని అపహరించి.. అతని మరణానికి కారణమైన ఘటనకు కూడా ఓ సినిమా కథనే ప్రేరణ తీసుకున్నట్టు తేలింది. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రాన్ని ప్రేరేపణగా తీసుకొని ఈ కిడ్నాప్ దారుణానికి పాల్పడినట్టు నిందితులు ఒప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో దారుణాలకు స్ఫూర్తిగా నిలిచిన టాలీవుడ్ సినిమాలు గురించి ఓ కథనం ఇది. డాన్! నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ముంబైలో ఓ దారుణానికి కారణమైంది. 2015 జూలైలో ముంబై నలాసోపారా ప్రాంతంలో 13 ఏళ్ల నిలేశ్ తివారీని అతని పాఠశాలకు చెందిన ఇద్దరు సీనియర్లు హత్య చేశారు. నాగార్జున 'డాన్' హిందీ డబ్బింగ్ ను టీవీలో పలుసార్లు చూసిన ఆ ఇద్దరు అబ్బాయిలు తాము కూడా స్థానిక దాదాలు కావాలని కలలు కన్నారు. సినిమాలో మాదిరిగా దాదాగిరి చేస్తూ స్థానిక పిల్లల్ని వారు బెదిరించారు కూడా. ఈ సినిమాలో నాగార్జున మంచి డాన్ గా కనిపించినప్పటికీ, విలన్ పాత్ర పోషించిన కెల్సీ డోర్జీనే ఆ పిల్లల్ని ఎక్కువగా ఆకర్షించాడు. ఆఖరికీ వాళ్ల దాదాగిరి హత్యకు దారితీసింది. బిజినెస్ మ్యాన్! మహేశ్ బాబు విజయ్ సూర్యగా నటించిన ఈ సినిమాలో మంచి-చెడు రెండూ కలిసి ఉన్న బిజినెస్ మ్యాన్ గా కనిపించాడు. అయితే నేరస్తులకు ఈ సినిమాలోని చెడ్డ మహేశ్ బాబే ఎక్కువగా ప్రేరణ ఇచ్చాడు. 2012లో 2,11,256 మంది నేరస్తులను అరెస్టు చేయగా, అందులో 85శాతం మంది యువతే ఉన్నారని, ఈజీ మనీతో లావిష్ లైఫ్ గడుపాలన్న ఆలోచనే వారితో నేరాలు చేయించిందని జాతీయ నేర నమోదుబ్యూరో వెల్లడించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే 'బిజినెస్ మ్యాన్' సినిమా విడుదలైన తర్వాత నేరాల రేటు పెరిగిందని, ఈ సినిమా స్ఫూర్తితో నేరాలు పెరిగిపోయాయని స్వయంగా ఓ పోలీసు అధికారే అప్పట్లో పేర్కొన్నారు. బాడీగార్డ్ ఈ సినిమా కొచ్చి బ్లాక్ మెయిల్ కేసుకు ప్రేరణగా నిలిచింది. రుక్సానా, బిందియా అనే మహిళలు ఓ ఎన్నారై వ్యాపారవేత్తకు వలపుల గాలం వేశారు. బాడీగార్డ్ సినిమాలో 'వాయిస్ చేంజింగ్' సాఫ్ట్ వేర్ తో వెంకటేశ్ ను బురిడీ కొట్టిస్తుంది. అదే తరహాలో ఈ ఇద్దరు మహిళలు ఓ వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేశారు. వెంకటేశ్ మరో సినిమా 'దృశ్యం' తరహాలో తమ సెల్ ఫోన్ ను కర్ణాటక ఆర్టీసీ బస్సులో వదిలేసి.. తాము మాత్రం త్రివేండ్రం పరారయ్యారు. చివరకు పోలీసులకు దొరికిపోవడంతో అసలు గుట్టు రట్టయింది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ యువత చైన్ స్నాచింగ్ చేస్తూ.. కిడ్నాప్ లకు పాల్పడుతూ డబ్బు సంపాదించే కథనంతో రూపొందిన ఈ సినిమా చాలా నేరాలకే ప్రేరణగా నిలిచింది. తాజాగా హైదరాబాద్ వాసులను దిగ్భ్రాంత పరిచిన 15 ఏళ్ల అభయ్ మోధాని కిడ్నాప్, హత్య వ్యవహారానికి ఈ సినిమానే ప్రేరేపణ అయింది. ఒక రొమాంటిక్ ప్రేమ కథలోని ఓ సీన్ చూసి.. అభయ్ కిడ్నాప్ కు పథకం రచించామని, ఈ కిడ్నాప్ ద్వారా భారీగా డబ్బు రాబట్టాలని అనుకున్నామని 20, 23 ఏళ్ల మధ్య వయసున్న అందరూ నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. నిజానికి ఈ సినిమా విడుదల కాగానే ఒక్క వరంగల్ లోనే 26 చైన్ స్నాచింగ్ ఘటనలు నమోదయ్యాయి. ఈ సినిమాలో మహిళలు ముఖానికి స్కాఫ్ కట్టుకొని.. ఆ ముసుగులో నేరాలకు పాల్పడినట్టు చూపారు. ఇదే తరహాలో ఇద్దరు బాలికలు ముఖానికి ముసుగు ధరించి ఓ దుకాణానికి వచ్చి.. కారం కొంటామంటూ ఆ కారాన్ని యజమాని కంట్లో కొట్టి రూ. 50వేలతో ఉడాయించారు. సింగం! అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన ఈ హిందీ సినిమా ముంబైలో ఓ కిడ్నాప్ కు ప్రేరేపణగా నిలిచింది. సినిమాలోని దృశ్యాల తరహాలోనే హరీశ్ మోహన్ పురోహిత్ అనే వ్యక్తి ఓ వ్యాపారవేత్త ఐదేళ్ల కొడుకును కిడ్నాప్ చేశాడు. ఆ పిల్లాడిని విడిచిపెట్టేందుకు రెండో వాయిదాగా రూ. 10 లక్షలు తీసుకుంటూ అడ్డంగా అతడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయాడు. ఇక మలయళంలో మొదట తెరకెక్కి ఆ తర్వాత ఇతర భాషల్లో రిమేక్ అయిన 'దృశ్యం' సినిమా కూడా పలు నేరాలకు ప్రేరణగా నిలిచింది. ముఖ్యంగా సునీతా అహిరే అనే యువతిని ఆమె ప్రియుడు వికాస్ మహత్రే హత్య చేసి.. సినిమా తరహాలోనే దొంగ సాక్ష్యాలు అల్లేందుకు అతడు ప్రయత్నించాడు. -
హీరోయిన్ నన్ను పెళ్లాడి మోసగించింది
నటి మేఘనారాజ్పై తమిళనాడు వ్యాపారవేత్త జనార్దన్ ఫిర్యాదు సాక్షి, బెంగళూరు: తెలుగు, కన్నడతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించిందంటూ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త జనార్దన్ బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఆయన కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే.. ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో కేసును మూసేసినట్లు బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సినీనటి మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించడంతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా దొంగలించారంటూ జనార్దన్ కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జేపీనగర పోలీసులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారు. జనార్దన్ను పోలీస్స్టేషన్కు పిలిపించి వివరాలను సేకరించారు. నటి మేఘనారాజ్తో వివాహమైనట్లుగా ఆయన ఎలాంటి సాక్ష్యాలనూ చూపలేకపోయారు. నగరంలో మేఘనారాజ్ నివాసం ఎక్కడున్నదీ కూడా చెప్పలేకపోయారు. దీంతో ఫిర్యాదు దశలోనే ఈ కేసును మూసేశారు. ఈ విషయంపై మేఘనా రాజ్ తల్లి ప్రమీలా జోషాయ్ మాట్లాడుతూ....‘అసలు జనార్దన్ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలీదు. సినీ రంగంలో నా కూతురు ఎదుగుదలను చూసి సహించలేని కొందరు ఈ విధంగా దుష్ర్పచారానికి దిగుతున్నారు. జనార్దన్పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామ’ని చెప్పారు. -
దండ... దండనం!
ట్రాఫిక్-టాపిక్ మూత్రాతురాణాం న భయం న లజ్జ.ఇలా అయితే ఎలా అన్నది సమాజం వర్రీ. ఎక్కడ పడితే అక్కడా...? ఇదీ పోలీసుల క్వెర్రీ. ఒక దశకు వచ్చాక క్లాస్లో చిటికనవేలు చూపించడానికే బిడియపడతామే! మనమే పబ్లిక్లో ఇలా చేస్తే ఎలా? అందుకోసమే పోలీసులు వెరైటీగా దండతో దండిస్తున్నారు. కుక్కలు కూడా ఈమధ్య స్తంభాలపైకి కాలెత్తడం లేదు. అలాంటిది మనుషులమైన మనం దిక్కులు చూడకుండా ఇలా చేయడం సబబు కాదేమో ఆలోచించమంటున్నారు మన సికింద్రాబాద్ పోలీసులు. అంతేకాదు... తమదైన శైలిలో ఖాకీగిరీ చేయకుండా గాంధీగిరీ చేసి మరీ యోచించమంటున్నారు. ఈ ఖాకీగిరీ ఏమిటా అనే సందేహం మిమ్మల్ని పట్టి పీడించి, ఝాడించి, వేధిస్తుంటే ఈ నాలుగు ముక్కలూ చదవాల్సిందే. ముంబైకి బిజినెస్మ్యాన్ రూపంలో ప్రిన్స్ మహేశ్బాబు వెళ్లినట్లుగా మన రాష్ట్రాలకు ఎవరూ రాలేదు. అయినా కొంతమంది మూత్రాతురులు గోడల్ని అదేపనిగా తడిపేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్ వెళ్లండి... ఆరోగ్యానికి అదే లాభదాయకం అన్నా వినడం లేదు. పక్కలకైనా చూడకుండా, మహిళలు ఎవరైనా వస్తున్నారా అనే ధ్యాస కూడా లేకుండా గోడవారగా నిలబడి మూత్రవిసర్జనం గావిస్తున్నారు కొందరు ఆత్రపరులు. అవేమైనా అప్పుడే కొత్తగా కట్టిన సిమెంట్ గోడలా క్యూరింగ్ చేయడానికి? ఈ జబ్బును క్యూర్ చేయడం ఎలా అని ఆలోచించారు మహంకాళి పోలీస్ స్టేషన్కు చెందిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి. అంతే... ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమల్లోకి వచ్చాక ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాల్సిందే. అదే సమయంలో అల్పబుద్ధుల తాలూకు అల్పాచమనం అరికట్టాల్సిందే. అందుకు ఇన్స్పెక్టర్ రామస్వామికి ఒక ఉపాయం తట్టింది. దానికి ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకున్నారు. పరిసరాలెరగకుండా ప్రకృతి పిలుపునకు పరవశించిపోయేవారి పని పట్టాలనుకున్నారు. ప్రకృతిలోనే బహిరంగ విసర్జనకు పాల్పడుతుండేవారిని గుర్తించేందుకు కొందరు సిబ్బందిని నియమించారు. వారు సికింద్రాబాద్ బస్స్టాప్లోనూ, ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ సిగ్గుపడకుండా చిటికెనవేలి పనిని కానిస్తున్న వారిని చూశారు. కొట్టలేదూ... తిట్టలేదు. దండ వేసి, దండం పెట్టారంతే. పాటలూ అవీ ఏవీ పాడకుండానే ‘మా మూత్రవీరులకూ మంచిపూదండా’ అంటూ సెలైంట్ సందేశం ఒకటి పంపించారు. అంతే... జనాలు నడవాల్సిన ఫుట్పాత్లను మడుగులా మార్చడానికి మాది గుండా, చెరువా అని సిగ్గుపడేలా చేశారు ఆ ఇన్స్పెక్టర్. దండ దండనానికి దడిసిపోయిన మూత్రాసురులు నలుగురూ తిరిగే రోడ్డును మరెప్పుడూ మురికిచేయబోమంటూ సిగ్గులమొలకలైపోతూ చెబుతున్నారు. ఇలా రోజూ సన్మానం చేయించుకునేవారి సంఖ్య కనీసం పదిహేను మందివరకూ ఉంటుందంటున్నారు ఇన్స్పెక్టర్ రామస్వామి. ‘‘ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ పీక్ అవర్స్. ఆ సమయంలో మేం ట్రాఫిక్కు అవరోధం కల్పించము. ఆ తర్వాతే రోడ్డు మీద ఈ రకమైన చిటికెనవేలి ఘనాఘన విసర్జనపరులను సత్కరిస్తున్నాం. ఇలా చిటికెలో ముగించవచ్చులే అనుకునే చిటికెనవేలి వీరులను సన్మానించడం వల్ల రోడ్డు మీద ఈ వ్యవహారం క్రమంగా తగ్గుతోంది. ఈ రోజు కూడా సికింద్రాబద్లోని ప్యాట్నీ సెంటర్లో ఈ సత్కార సత్కార్యాన్ని చేశాం. ఇలా ఈ శుక్రవారం వరకు కొనసాగిస్తాం’’ అన్నారు ఇన్స్పెక్టర్ రామస్వామి. అంతేకాదు... ఆయన వినూత్న కార్యకలాపాల్లో ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచేలా ఇంకొన్ని విధులూ ఉన్నాయి. ‘‘ట్రాఫిక్లో ద్విచక్రవాహనాలపై హెల్మెట్ లేనివాళ్లను ఆపుతున్నాం. అయితే వాళ్లకు మేం జరిమానాలు వేయడం వంటివి చేయడం లేదు. సుప్రీం కోర్టు పేర్కొన్న హెల్మెట్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాదు... ఇదే సమయంలో హెల్మెట్ పెట్టుకొని ఉన్న వారిని అభినందిస్తూ, వాళ్లకు ‘చాక్లెట్’లను బహూకరిస్తున్నాం’’ అని అన్నారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి. -
సీపీఎం నాయకుని నిర్వాకం
తిరువనంతపురం: కేరళలో వామపక్ష పార్టీ నాయకుడు దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కాసర్ గోడ్ జిల్లాకు చెందిన ప్రముఖ సీపీఎం నాయకుడు రాఘవన్ ఒక విదేశీయుడి ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించినపుడు రికార్డైన దృశ్యాలను పోలీసులు బుధవారం విడుదల చేశారు. దీంతో కలకలం రేగింది. పోలీసులు అందించిన ప్రకారం మొహమ్మద్ యూనుస్ అనే వ్యాపారి కుటుంబం విదేశాల్లో ఉంటోంది. వారికి సంబంధించిన ఒక విలాసవంతమైన భవనంలో దొంగతనం జరిగినట్టుగా చుట్టు పక్కల వారు యూనుస్ బంధువులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడతో ఈ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు నిందితుడు సీపీఎం నాయకుడు రాఘవన్ గా గుర్తించారు. పెద్ద ఐరన్ రాడ్, ఒక బ్యాగు పట్టుకొని ఆ వ్యాపారి ఇంటిముందు తచ్చాడుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. నిందుతుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. విచారణ జరుగుతోందని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడి చేస్తామని పోలీసులు తెలిపారు. అటు తమ నాయకుడి నిర్వాకంపై వెంటనే స్పందించిన పార్టీ అతడిని పార్టీనుంచి సస్పెండ్ చేసింది. కాగా కేరళ విదేశాలలో నివసించే భారతీయులకు, ఎన్నారైలు కు చెందిన విలువైన ఆస్తలుకు, లగ్జరీ గృహాలకు కేరళ నిలయం. దీంతో ఈజీగా ఇక్కడి ఇళ్లు దొంగలకు టార్గెట్ గా మారాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని పోలీసులు యజమానులను హెచ్చరించారు. ఫలితంగా 2013 లో తిరువంతపురంలో కరుడు కట్టిన నేరస్తుడు బంటీ చోర్ ఆటకట్టించిన సంగతి తెలిసిందే.