
మలయాళ ప్రముఖ హీరోయిన్ పార్వతి నిశ్చితార్థం ఇటీవలె జరిగింది

చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్ను ప్రేమించిన ఆమె ఏడడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది

పార్వతీ నాయర్ కేరళలో జన్మించినప్పటికీ ఆమె పెరిగింది మాత్రం అబుదాబిలో అని తెలిసిందే..

ఆమె తండ్రి వ్యాపారవేత్తగా దుబాయ్లో రాణిస్తున్నారు

15 ఏళ్లకే మోడలింగ్లోకి ఎంట్రీ ఇచ్చిన పార్వతి.. ఇంజనీరింగ్ చదువుతూనే మోడలింగ్లో రాణించింది

'మైసూర్ శాండల్' సోప్ బ్రాండ్ అంబాసిడర్గా పార్వతి నాయర్ వ్యవరించడంతో ఆమె పేరు మరింత పాపులర్ అయింది

2012లో ‘పాపిన్స్’ అనే మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటి వరకు సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించింది

తెలుగులో హీరో నాని నటించిన జెండాపై కపిరాజు (2015) సినిమాలో వందన పాత్రలో మెప్పించింది

చివరగా గతేడాదిలో విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు






