- ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా నిలిపేసిన అధికారులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో నివేశన స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి 29 గ్రామాల్లోని అధికార, అనధికార లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మౌఖిక ఆదేశాల మేరకు వీటిని నిలిపేసినట్టు సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. ఈ విషయమై గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస్ కూడా ఐజీ మౌఖిక ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే లిఖిత పూర్వక ఆదేశాలు వస్తాయని ఐజీ వివరించినట్టు చెప్పారు.