capital
-
అసలు సమస్య ముంపే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించడానికి తొలి దశలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఎత్తిపోతలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించేలా నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్పై నాలుగు చోట్ల పది క్యూసెక్కులను ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసింది. షెడ్యూళ్ల దాఖలుకు ఫిబ్రవరి 14ను తుది గడువుగా నిర్దేశించింది. రాజధానిని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు 2018లో ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై 5 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా రూ.260.48 కోట్లతో ఎత్తిపోతలను పూర్తి చేసింది. దీంతో పాటు ఇప్పుడు శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.10, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.. కొండవీటి వాగు, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా వెడల్పు చేయడం, కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించడానికి నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వే పనులకు రూ.1,404.14 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి.. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు, వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మించాలని ప్రపంచ బ్యాంకు–ఏడీబీ ప్రతినిధులు సూచించారని ప్రభుత్వం చెబుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించే పనుల వ్యయమే తడిసి మోపేడయ్యేలా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.222 మి.మీ వర్షం కురిసినా ముప్పు ఉండకూడదురాజధాని అమరావతి ప్రాంతంలో వందేళ్లలో నమోదైన వర్షపాతం గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది. వందేళ్లలో ఒకసారి అమరావతి ప్రాంతంలో గరిష్టంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ స్థాయిలో వర్షం కురిసినా రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి తప్పించేలా ముంపు నివారణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల ప్రణాళిక మేరకు రాజధాని ముంపు నివారణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ ప్రణాళికలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.» రాజధాని ప్రాంతంలో ప్రవహించే వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి కొండల్లో పేరిచెర్ల వద్ద జన్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 421 చదరపు కిలోమీటర్లు. కొండవీటి కొండల నుంచి ప్రవాహించే ఈ వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత నీరుకొండ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తుంది. » రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. కృష్ణా నది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే.. కృష్ణా వరద కొండవీటి వాగులోకి 23.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంది. ఇది రాజధాని ముంపునకు దారితీస్తుంది. » రాజధానికి కొండవీటి వాగు ముంపు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహ సామర్థ్యాన్ని అనంతవరం నుంచి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు (11.6 కి.మీ నుంచి 23.6 కి.మీ వరకు) 2,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు(4.6 కి.మీ నుంచి 11.6 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలి. కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు (4.6 కి.మీ నుంచి 0 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. » నీరుకొండ వద్ద 0.4, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలి. » ఉండవల్లి వద్ద కొండవీటి వాగు నుంచి 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్లోకి.. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి ఎత్తిపోసేలా ఇప్పటికే ఎత్తిపోతలను నిర్మించారు. దానికి అనుబంధంగా 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల నిర్మించాలి. » పాల వాగు సామర్థ్యాన్ని కృష్ణాయపాలెం నుంచి దొండపాడు వరకు 16.7 కి.మీల పొడవున 8,830 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.» నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.843 కి.మీల పొడవున 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కెనాల్ తవ్వాలి. ఈ కెనాల్పై నాలుగు చోట్ల పది క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలి. ఈ పనులన్నీ తొలి దశలో పూర్తి చేయాలి.» రెండో దశలో రాజధాని అమరావతి ఆవల ప్రాంతం నుంచి కొండవీటి వాగు వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు మళ్లించేలా లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వాలి. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించాలి. కొండవీటి వాగు వరద ప్రవాహం 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల నిర్మించాలి. » రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రిజర్వాయర్లను ఖాళీ చేయాలి. వరద నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
ఇరాన్ సంచలన నిర్ణయం? మారనున్న రాజధాని?
ఇరాన్ తన పొరుగు దేశమైన ఇజ్రాయెల్తోనూ, అగ్రరాజ్యం అమెరికాతోనూ ఉన్న వివాదం కారణంగా గత కొంతకాలంలో ప్రపంచం దృష్టిలో పడింది. ఇరాన్.. ఇజ్రాయెల్పై అప్రకటిత యుద్ధ ధోరణిలో ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే ఇరాన్ తన రాజధానిని టెహ్రాన్ నుండి వేరే ప్రదేశానికి మార్చాలనుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.ఈ చర్చల నేపధ్యంలో ఇరాన్(Iran) ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా రాజధానిని మార్చాలనే నిర్ణయం తీసుకోలేదని మొహజెరానీ అన్నారు. అయితే ఇరాన్ నిర్ణయం వెనుక పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో టెహ్రాన్ను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని అంటున్నారు. ఇండోనేషియాలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. జకార్తాను విడిచిపెట్టి, మెరుగైన నగరాన్ని నిర్మించే దిశగా ఇండోనేషియా ప్రయత్నాలు ప్రారంభించింది.టెహ్రాన్(Tehran) మహానగరం అటు జనాభా, ఇటు పర్యావరణం పరంగా అనేక సమస్యలను ఎదుర్కొటోంది. ఫలితంగా నగరంలోపై మరింత ఒత్తిడి పెరుగుతోందని మొహజెరానీ తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభా కారణంగా నీటితో పాటు విద్యుత్ కొరత పెరుగుతోంది. కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీనికితోడు భూకంపాలు సంభవించే ప్రాంతంలో టెహ్రాన్ ఉండటం వల్ల మరింత అసురక్షితంగా మారిందని మొహజెరానీ వివరించారు. అటువంటి పరిస్థితిలోనే ఇరాన్ ప్రభుత్వం రెండు కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. రాజధానిని టెహ్రాన్ నుండి మక్రాన్ ప్రాంతానికి మార్చడంపై ఈ కౌన్సిళ్లు విశ్లేషించాయి.ఇది కూడా చదవండి: UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ -
ప్రాజెక్టుల పేరుతో భూముల్ని సేకరిస్తే సహించం
తాడికొండ: రాజధాని ప్రాజెక్టుల పేరుతో భూములు సేకరిస్తుండటంపై మంత్రి పి.నారాయణను కలిసి సమస్య వివరిస్తే.. కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ముచ్చట్లు చెబుతున్నారని రాజధాని భూసేకరణ బాధిత రైతుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు యెడ్డూరి వీరహనుమంతరావు, కంచర్ల శివరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడికొండలో రైల్వే ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు ఆధునికీకరణ, ఇతర కనెక్టివిటీ రోడ్ల పేరుతో భూములు సేకరించేందుకు ముందుకెళుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఐదు గ్రామాల రైతులు సమావేశమయ్యారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం, న్యాయపోరాటానికి సిద్ధమని వెల్లడించడం విశేషం. పలువురు రైతులు మాట్లాడుతూ రైతుల అంగీకారం లేకుండా భూముల సేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూస్తామని హెచ్చరించారు. ఓ పద్ధతి లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ చేస్తే సహించేది లేదని, సమీకరణ ద్వారా తీసుకుంటే భూములిచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సంప్రదించగా సానుకూలంగా స్పందించలేదని, మంత్రి నారాయణ కూడా స్పష్టత ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి వస్తున్న భూములను కోల్పోకుండా ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసి కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం లీగల్, పొలిటికల్, ఫైనాన్స్ కమిటీలను ఏర్పాటు చేసి కోర్టులో న్యాయపోరాటానికి దిగనున్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ప్రాజెక్టు పేరుతో పంట పొలాలను తొక్కించుకుంటూ అధికారులు పెగ్ మార్క్ సర్వే చేస్తుంటే.. తాము అడ్డుకొని రాళ్లు తొలగించామని, కొప్పురావూరు, ఇతర గ్రామాలకు చెందిన రైతులు కూడా రాళ్లు తొలగించాలని సూచించారు.పూలింగ్ ప్యాకేజీ వర్తింపజేయాలిరాజధానిలో రైతుల భూములకు ఇచ్చిన ప్యాకేజీని తమకూ వర్తింపజేయాలని, 1,250 చదరపు గజాల భూమిని అమరావతిలో అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీని ప్రభుత్వమే తీసుకుని రైతులకు మాత్రం పూలింగ్ ప్యాకేజీ ఇస్తే తప్ప రూ.కోట్ల విలువ చేసే భూములకు తగిన న్యాయం జరగదన్నారు. ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ టీడీపీకి చెందిన నాయకులే కమిటీ సభ్యులుగా ఉండి పార్టీలకు అతీతంగా పోరాడతామనిప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటివరకు గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ముందుకెళ్లడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అడ్డగోలు భూసేకరణకు దిగుతున్న ప్రభుత్వానికి బుద్ధిచెప్పి హక్కులు సాధించుకుంటామని హెచ్చరించారు. -
దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాలా?: శశి థరూర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాల్సి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన స్పందిస్తూ.. ‘ప్రపంచంలో రెండవ అత్యంత కలుషితమైన నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి దాదాపు ఐదు రెట్లు అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితిని ఏళ్ల తరబడి చూస్తున్నా. కేంద్ర ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమవ్వడం విడ్డూరం. దేశ రాజధానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని పేర్కొన్నారు.Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితి విషమించినా గ్రాప్–4 నిబంధనల అమలులో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఏక్యూఐ 450 దిగువకు వచ్చినా గ్రాప్–4 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి 10, 12 తరగతులకు కూడా ఆన్లైన్ కాస్టులనే నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం ఆతిశి ‘ఎక్స్’లో వెల్లడించారు. వీరితో పాటు మిగతా కాస్లులకు ఇదివరకే అమలవుతున్నట్లుగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. -
రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్కు చెందిన డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మారుత్ డ్రోన్టెక్ నిధులు సమీకరించేందుకు పూనుకుంది. అందులో భాగంగా తాజాగా 6.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.55 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. లోక్ క్యాపిటల్ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలిపింది. వార్షికంగా 3,000 డ్రోన్ల స్థాయికి తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యకలాపాలు పటిష్టం చేస్తున్నట్లు మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విశ్లావత్ పేర్కొన్నారు.అధునాతన వ్యవసాయ డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు, ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోకి చానల్ పార్ట్నర్ నెట్వర్క్ను విస్తరించేందుకు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ప్రేమ్ వివరించారు. దేశీయంగా కేంద్రం నమోదీదీ పేరుతో స్వయం సహాయక సంఘాల మహిళలకు డ్రోన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ కంపెనీల ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ ఏర్పడుతుందని సంస్థలు భావిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు ఉపాధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: మార్కెట్.. ‘ట్రంపె’ట్!మారుత్ డ్రోన్టెక్ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించింది. తన డీలర్ల నెట్వర్క్ను విస్తరిస్తున్నట్టు, 2028 నాటికి డీలర్ల సంఖ్యను 500కు పెంచుకోనున్నట్టు గతంలోనే ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది. -
రాజధాని నిర్మాణానికి కొత్తగా టెండర్లు
సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసి త్వరలో కొత్తగా టెండర్లను పిలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వివరించారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.38 వేల కోట్ల పనులను ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు, రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఈ పనులను కొనసాగించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు. పాత టెండర్ల సమస్యలను పరిష్కరించి నూతన టెండర్లకు విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 23 పాయింట్లతో గతనెలలో నివేదిక ఇవ్వగా, ఈ సమావేశంలో దానిని ఆమోదించినట్టు చెప్పారు. దాని ప్రకారం హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణానికి జనవరిలోగా, మిగతా పనులకు వచ్చేనెల 31 లోపు టెండర్లు పిలుస్తామని, మూడేళ్లలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. వరద నివారణ పనులుఅమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అయితే నిబంధనల మేరకు వరద నివారణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిందని తెలిపారు. అందుకనుగుణంగా అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరద నివారణ పనులను ఆమోదించామన్నారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ను విస్తరిస్తామని చెప్పారు. నీరుకొండ వద్ద 0.04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీలు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల స్టోరేజి సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల పంపింగ్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని చెప్పారు. -
జానీ మంచి కళాకారుడు..!
-
8,352 చ.కి.మీ.లలో సీఆర్డీఏ పరిధి
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) 8,352 చదరపు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2015లో ఇచ్చిన జీవో 207 ప్రకారం.. అప్పట్లో గుర్తించిన విస్తీర్ణం మేరకు సీఆర్డీఏ పరిధిని కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ సమావేశాన్ని నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో 130 సంస్థలకు కేటాయించిన భూములు, వాటి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికే భూమి కేటాయించాలన్నారు. గతంలో భూములు పొందిన వ్యక్తులు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలి.. అనే అంశంపైనా చర్చించారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. దేశంలో టాప్ 10 కళాశాలు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆస్పత్రులను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలన్నారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన పలు గ్రామాలను తిరిగి రాజధాని పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.మళ్లీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తాం : మంత్రి నారాయణ రాష్ట్రంలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం మళ్లీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘సీడ్ క్యాపిటల్ను చెన్నై–కలకత్తా హైవేకు అనుసంధానిస్తాం. ఇందుకు ప్రస్తుతం నిర్మిస్తున్న సీడ్ యాకిŠస్స్ రోడ్డుతో పాటు మరో నాలుగు రోడ్లను అభివృద్ధి చేస్తాం. గతంలో రాజధాని మాస్టర్ ప్లాన్లో అనుకున్న విధంగా హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి నవ నగరాలు నిర్మిస్తాం’ అని తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డును సెంట్రల్ డివైడర్ ఉండేలా నాలుగు లేన్లతో నిర్మించేలా వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతిలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా మరో నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలు వస్తాయన్నారు. 2019కు ముందు రాజధానిలో పలు కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించామని.. ఆయా సంస్థలు వీలైనంత త్వరగా సంస్థలను నెలక్పొలేలా చర్చిస్తామని తెలిపారు.సీఆర్డీయే పరిధిలోకి బాపట్ల, పల్నాడు జిల్లాలురాజధాని ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన కట్టడాల పరిశీలనకు ఐఐటీ హైదరాబాద్ బృందం అమరావతిలో పర్యటించిందని, శనివారం ఐఐటీ మద్రాస్ నిపుణులు ఐకానిక్ భవనాల కట్టడాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. వచ్చే వారంలో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడతామని చెప్పారు. అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ కూడా తిరిగి ప్రారంభించేలా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఆర్5 జోన్ అంశం న్యాయస్థానంలో ఉండటంతో న్యాయ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. ఇప్పుడున్న వారితో పాటు మరో 32 మంది కన్సల్టెంట్స్ను నియమిస్తామని వెల్లడించారు. సీఆర్డీయే పరిధిలోకి కొత్తగా పల్నాడు, బాపట్ల జిల్లాలు కూడా వస్తున్నట్టు మంత్రి వివరించారు. పథకాలు.. ఫలితాలుప్రజలకు కేవలం పథకాలు అందించడమే కాదని, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమం, విద్యుత్ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్యతో చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని మహిళా హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ అందాలి వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగు పరచడంతో పాటు కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. తక్కువ ఖర్చుతో డిమాండ్కు తగ్గట్టుగా విద్యుదుత్పత్తితోపాటు సరఫరా మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్తుకు ప్రాధాన్యత క ల్పించే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పరిస్థితిని వివరించారు. ఇంధన శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఏపీ జెన్కో ఎండీ చక్ర«దర్ బాబు, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కీర్తి తదితరులు పాల్గొన్నారు. ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలిరాష్ట్రంలో నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సచివాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణను అస్తవ్యస్తంగా మార్చిందని ఆరోపించారు. ధాన్యం సొమ్మును చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం చేశారని, ఇకపై ఎలాంటి అవరోధాల్లేకుండా ధాన్యం సేకరణ చేయాలని సూచించారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన ఎండీయూ విధానం లోప భూయిష్టంగా సాగిందని ఆరోపించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ సిద్ధార్థ్జైన్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త మద్యం విధానం సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఎక్సైజ్ విధానాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని, గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీల ఫైళ్లను సీజ్ చేయాలని ఆదేశించారు. -
అమెరికాలో నెతన్యాహు పర్యటన.. క్యాపిటల్ హౌస్ వద్ద టెన్షన్!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. అమెరికాలో పర్యటిస్తున్న వేళ నిరసనలు మిన్నంటాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి.కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మనం కలిసి పనిచేస్తే గెలుస్తాం. వారు ఓడిపోతారు. ఇది జాతుల మధ్య యుద్ధం కాదు. మనం ప్రస్తుతం చరిత్ర నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాం. మన ప్రపంచం ఉపద్రవంలో ఉంది. అందుకే ఇజ్రాయెల్వైపు అమెరికా నిలవాలి. పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలు అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ స్నేహదేశాలకు ఇబ్బందికరంగా మారాయి. నా దేశాన్ని రక్షించుకునేందుకు, నా దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చా’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇదే సమయంలో నెతన్యాహు పసుపు రంగు పిన్ ధరించి హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలకు సంఘీభావం తెలిపాడు.అయితే, సభలో ఆయనకు తొలుత స్పీకర్ మైక్ జాన్సన్తోపాటు రిపబ్లికన్ సభ్యులు స్వాగతం పలికారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. 50 మంది డెమోక్రాట్లు, స్వత్రంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్.. నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ సమావేశానికి రాలేదు. కొంత మంది సభ్యులు గైర్హాజరయ్యారు. A man bravely removed the American flag from being set aflame by pro-Palestinian protestors. The crowd proceeded to yell “chase him.” pic.twitter.com/3QE4zMKYEy— Eyal Yakoby (@EYakoby) July 24, 2024ఇక, అమెరికాలో నెతన్యాహు పర్యటన సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలు తెలిపారు. క్యాపిటల్ హౌస్ వద్ద నెతన్యాహుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెతన్యాహు ఓ క్రిమినల్ అంటూ నినదించారు. మరోవైపు.. వాషింగ్టన్ డీసీలోని వాటర్గేట్ హోటల్లో నెతన్యాహు, అతడి భార్య, ప్రతినిధి బృందంతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా ఆ హోటల్ వద్దకు పలువురు పాలస్తీనా మద్దతుదారులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఎరుపు రంగు టీషర్టులు ధరించి నిరసనలో పాల్గొన్నారు.🚨🇮🇱🇺🇸 Protesters in Washington DC are now BURNING an effigy of Benjamin Netanyahu! pic.twitter.com/0RE8oYYqEm— The Saviour (@stairwayto3dom) July 24, 2024pic.twitter.com/3cOYomr7sj wow pro Palestine anti Americans stormed the capital today. This is why we need trump in the white house so things like this never happen again. Democrats hate us they proved that for 4 years when they helped illegals and Ukraine but never helped us at all— Trump 2024 MAGA 🇺🇲 (@VinnyPhilly) July 23, 2024ఇదే సమయంలో నెతన్యాహుపై కోపంతో వాటర్ గేట్ హోటల్లోని బ్యాంకెట్ టేబుల్, ఇతర అంతస్తుల్లో పాలస్తీనా యూత్ మూమెంట్కు చెందిన కొందరు వ్యక్తులు.. పురుగులు, మిడతలు వదిలినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. పురుగులు వదిలిన టేబుల్పై ఇజ్రాయెల్, అమెరికా జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Gaza protesters have removed the American flags from Union Station, lit then on fire with a Netanyahu effigy and replaced them with Palestine flags. pic.twitter.com/c8hz90phqL— Andrew Leyden (@PenguinSix) July 24, 2024 The DC Palestinian Youth Movement released maggots and crickets were released throughout the Watergate Hotel where Netanyahu is staying. The protestors also pulled multiple fire alarms throughout the night. This is an utter security failure. pic.twitter.com/3O0XbOvoGx— Eyal Yakoby (@EYakoby) July 24, 2024 -
భూములమ్మి రాజధాని నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: అమరావతిలో రైతులిచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా రాజధాని నుంచి వచ్చే సంపదతోనే అమలు చేస్తామన్నారు. గురువారం రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాల నుంచి ప్రారంభించి ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి భూమి పూజ చేసిన ప్రాంతం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం నిర్మించ తలపెట్టిన భవనాల సముదాయాలను పరిశీలించారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డులోని సీఆర్డీఏ భవనం వద్ద సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరాన్ని సంపద సృష్టించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దక్షిణాదిలో గోదావరి భారీ జల నిధి లాంటిదన్నారు. పోలవరం పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకూ నీళ్లివ్వచ్చన్నారు. విభజన అనంతరం రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా అమరావతికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రజారాజధానిగా అమరావతి ఐదు కోట్ల మందికి దశ, దిశను నిర్దేశిస్తుందన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే గర్వంగా పనులు చేసుకోవచ్చన్నారు. రాజధానిని వైఎస్ జగన్ అతలాకుతలం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. రాజధానిపై శ్వేతపత్రం.. రాజధానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 16 వేల గ్రామాలు, దేశవ్యాప్తంగా పవిత్రమైన ప్రాంతాల నుంచి మట్టి, నీళ్లు తెచ్చి అందరు దేవుళ్ల ఆశీర్వాదాలతో శంకుస్థాపన చేశాం. ఆ మహిమే నేడు రాజధానిని కాపాడింది. ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ జగన్ ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారు. రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వుకుపోయారు. ఒక్క బిల్డింగ్ను కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, మంత్రులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల భవన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపేశారు. రాజధాని ప్రస్తుత పరిస్థితపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది. కన్సార్టియంపైనా విషం చిమ్మారు.. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకు తిరిగే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. రాజధానిపై బురద జల్లి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, స్విస్ ఛాలెంజ్లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే గుంటూరు కేంద్రంగా అమరావతిని రాజధానిగా గుర్తించాం. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలిపి 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్లో ‘ఏ’ అంటే అమరావతి.. ‘పీ’ అంటే పోలవరంగా గుర్తుంటుంది. నదులు అనుసంధానిస్తాం.. ప్రజలు కూటమికి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద విజయం లభించింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పనికిరాడని తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేళ్లలో చూశాం. పోలవరం, అమరావతి వ్యక్తిగత అంశానికి సంబంధించినవి కాదు. వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఖర్చు కూడా రెట్టింపు అయ్యింది.అప్పులెంతో తెలియదు..ప్రభుత్వ విధానాలతోనే ప్రజల జీవితాలు మారుతాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తాం. దీర్ఘకాలంలో ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకే ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం. రౌడీయిజాన్నిఅణచివేస్తాం. రాజధానిలో నిర్మాణాలను ఉన్మాది బారి నుంచి దేవుడే కాపాడాడు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు. జగన్ లాంటి వ్యకు్తలకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలియదు. అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలియదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారుల ప్రవర్తన మార్చుకోవాలి. -
అత్యుత్తమ రాజధానిగా అమరావతి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసి, ఐదు అత్యుత్తమ రాజధానుల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల ఆవరణలోని తన స్వగృహంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2015 జనవరిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను రైతులు అందజేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములను రాజధాని ఏర్పాటుకు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. వివిధ దశల్లోనే నిలిచిపోయిన భవనాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సుమారు రెండున్నరేళ్లలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషిచేస్తామన్నారు. సీఎం చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాజధాని అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట..ఇక 2014 నుంచి 2019 వరకు తమ పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలోని 114 మున్సిపాల్టీల్లో పెద్దఎత్తున పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి నారాయణ చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన క్షణాల్లోనే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఎటువంటి చార్జీలు కూడా ప్రజల నుంచి వసూలుచేయలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్త పన్నుతో ప్రజలు బాగా ఇబ్బందులుపడ్డారని మంత్రి చెప్పారు. అధికారులతో సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో టిడ్కో ఇళ్ల పూర్తిపై దృష్టిసారిస్తామని.. అలాగే, అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చిస్తామన్నారు. -
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు. "14 ఏళ్లుగా సీఎంగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేస్తాం. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజాహితం కోసం ముందుకెళ్తాం. మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా అజెండా అని అన్నారు.""ఎన్డీయే శాసనాసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కలిసి పని చేయడం వల్ల కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ తీర్పు వల్ల మనకు ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ నన్ను పరామర్శించి పొత్తు పెట్టుకుందామని చెప్పారు. బీజేపీతో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేయడం వల్ల సీట్లు, ఓట్లు వచ్చాయి"అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడా ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేను, పవన్ సామాన్యులమే. ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తాం అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు.. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చంద్రబాబును తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
ముగియనున్న ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని గడువుపై కొమ్మినేని విశ్లేషణ
-
వార్షిక కౌలు జీవో అమలును నిలిపేయండి
సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం రూ.240 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది మే 5న జారీ చేసిన జీవో 286 అమలును నిలిపేయాలని కోరుతూ విశాఖపటా్ననికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నార్త్ ఆంధ్రా జిల్లాల అధ్యక్షుడు పాక సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్ 2015, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017ను శాసనసభ ఆమోదం లేకుండానే అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలను రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు తెచ్చారని తెలిపారు. అయితే వీటిని శాసనసభ ముందు ప్రవేశపెట్టనందున ఇవి చట్ట విరుద్ధమవుతాయన్నారు. వాస్తవానికి సీఆర్డీఏ 2014 చట్టంలో ఎక్కడా రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదని, అందువల్ల రాష్ట్ర ఖజానా నుంచి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదని వివరించారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం మొత్తం భూమిలో 5 శాతం భూమిని పేదల నివాసం కోసం గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కేటాయించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. అయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుందని వీఆర్ రెడ్డి తెలిపారు. అలా అయితే ఉపసంహరణ వల్ల చట్ట నిబంధనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో తెలియజేయాలని వీఆర్ రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రైతుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
టాటా కన్జూమర్ చేతికి 2 సంస్థలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా క్యాపిటల్ ఫుడ్స్తోపాటు, ఆర్గానిక్ ఇండియా లిమిటెడ్ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్ ఫుడ్స్లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్ ఫుడ్స్ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్ వెల్లడించింది. ఇక ఫ్యాబ్ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్ సప్లిమెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర ఆర్గానిక్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
AP: ఆ పిటిషన్కు అర్హతే లేదన్న ఏజీ
సాక్షి, గుంటూరు: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారణ అర్హతే లేదని.. పైగా పిటిషనర్లు అమరావతిలో భూముల్ని కలిగి ఉన్నారనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష కోసం.. కాబోయే పాలనా రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో నెంబర్ 2283 జారీ చేసింది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వేయాలని కోర్టును పిటిషన్ ద్వారా కోరారు వాళ్లు. అయితే ఇవాళ్టి విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) రూపేనా కోర్టు ముందుకు రావాలే తప్ప రిట్ రూపంలో కాదని ఏజీ శ్రీరామ్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్గా దాఖలు చేశారు. రాజధానితో ముడిపడి ఉన్న అంశం చీఫ్ జస్టిస్ బెంచ్ లేదంటే ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ పిటిషనర్లు కావాలనే రిట్ వేశారు. పైగా పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు. కాబట్టి ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్నారు (ఫోరమ్ షాపింగ్పై పలు తీర్పులను న్యాయస్థానానికి వివరించారాయన.. ). ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు -
ఐపీవోకు మరో రెండు కంపెనీలు రెడీ
క్రియోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ కంపెనీ స్టాన్లీ లైఫ్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఐనాక్స్ ఇండియా ఐపీవోకింద 2.21 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లు, వాటాదారులకు చేరనున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐనాక్స్ ఇండియా క్రియోజెనిక్ ట్యాంకుల తయారీలో కార్యకలాపాలు కలిగి ఉంది. డిజైన్, ఇంజినీరింగ్, పరికరాల ఇన్స్టాలేషన్, క్రియోజెనిక్ సిస్టమ్స్ ఏర్పాటు తదితర సర్వీసులు అందిస్తోంది. రూ. 200 కోట్ల ఈక్విటీ లగ్జరీ ఫర్నీచర్ను రూపొందిస్తున్న స్టాన్లీ లైఫ్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 91.33 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నా రు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 90 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మరో రూ. 40 కోట్లు యాంకర్ స్టోర్లను తెరిచేందుకు వినియోగించనుంది. వీటితోపాటు ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరించేందుకు రూ. 10 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో కొత్త మెషీనరీ, పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు రూ. 8.2 కోట్లు కేటాయించనుంది. -
ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
బోన్ఫైర్ వేడుకలు: ఒకేసారి దీపావళి, భోగి పండుగలా జరిగే సంబరం!
ఇంగ్లండ్ ససెక్స్ కౌంటీ తూర్పు ప్రాంతంలోని లెవెస్ పట్టణం ‘బోన్ఫైర్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా పేరు పొందింది. ఇక్కడ ఏటా నవంబర్లో జరిగే లెవెస్ బోన్ఫైర్ వేడుకలు చూస్తే, ఒకేసారి దీపావళి, భోగి పండుగ జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ పండుగను సాధారణంగా నవంబర్ 5న జరుపుకొంటారు. నవంబర్ 5 ఆదివారం వచ్చినట్లయితే, ముందురోజే నవంబర్ 4న జరుపుకొంటారు. ఈ వేడుకల్లో వీథి వీథినా భోగిమంటల్లాంటి చలిమంటల నెగళ్లను ఏర్పాటు చేస్తారు. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా రకరకాల బాణసంచా కాల్పులతో హోరెత్తిస్తారు. సంప్రదాయ వేషధారణలతో కాగడాలు ధరించి ఊరేగింపులు జరుపుతారు. ఈ వేడుకల్లో స్థానిక ఇంగ్లండ్ వాసులతో పాటు, ఇక్కడ స్థిరపడిన ఆఫ్రికన్ జులు తెగ ప్రజలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలు జరుపుకోవడం వెనుక ఒక చారిత్రక సంఘటన ఉంది. గన్పౌడర్ కుట్ర భగ్నం ఇంగ్లండ్ రాజు ఒకటో జేమ్స్కు వ్యతిరేకంగా 1605 సంవత్సరంలో కొందరు కుట్ర పన్నారు. రాబర్ట్ కేట్స్బీ నాయకత్వంలో కొందరు కేథలిక్ నాయకులు రాజు ఒకటో జేమ్స్ను హతమార్చాలనుకున్నారు. రాజు ఒకటో జేమ్స్ ఇతర మతాల పట్ల ఉదారంగా ఉండటం వల్లనే కేథలిక్ నాయకులు అతణ్ణి హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజైన నవంబర్ 5న సభ కొలువుదీరిన సమయంలో హౌస్ ఆఫ్ లార్డ్స్ను గన్పౌడర్తో పేల్చివేయాలనుకున్నారు. వీరి కుట్ర గురించి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఒకరికి ముందుగానే ఒక ఆకాశరామన్న ఉత్తరం ద్వారా సమాచారం అందింది. భద్రతాధికారులకు చెప్పడంతో వారు సునాయాసంగా ఈ కుట్రను భగ్నం చేశారు. గన్పౌడర్ కుట్ర భగ్నమైన సందర్భంగా లెవెస్ పట్టణంలో ఏటా ఇలా బోన్ఫైర్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్గ్రౌండ్ ఎయిర్పోర్టు..కానీ ఇప్పుడది..) -
దేశంలో మద్యం రాజధాని ఏది?
భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతీ నగరానికి తనదైన కథ ఉంటుంది. కొన్ని నగరాలు అక్కడి ఆహారానికి ప్రసిద్ధి చెందగా, మరికొన్ని సాంస్కృతిక వారసత్వానికి పెట్టిందిపేరుగా నిలిచాయి. దేశంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే మన దేశంలో ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. అంటే భారతదేశ మద్యం రాజధాని. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే తయారవుతుంది. ఈ నగరంలో 52 వైన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ద్రాక్షసాగు చేస్తున్నారు. దీనిలో అధిక భాగం వైన్ తయారీకి ఉపయుక్తమవుతుంది. నాసిక్లోని నేల రెడ్ లేటరైట్ రకానికి చెందినది. అంతే కాదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంది. ద్రాక్ష సాగుకు అవసరమైన నీటి పరిమాణం. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ఇక్కడ ద్రాక్ష విరగకాస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ నగరంలో ప్రతి సంవత్సరం 20 టన్నులకు పైగా ద్రాక్ష ఉత్పత్తి జరుగుతుంది. ఇది కూడా చదవండి: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం? -
విశాఖ రాజధానిపై నేడు సీఎం జగన్ సమీక్ష
సాక్షి, గుంటూరు: విశాఖపట్నం రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. ఏపీకి అతిత్వరలో పాలనా రాజధాని కానుంది వైజాగ్. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. అలాగే.. అక్కడ ఉన్నతాధికారులకు తాత్కాలిక వసతి కేటాయింపులపై అధికారులతో సీఎం జగన్ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్ కమిటీ, ఆయనకు సమర్పించనుంది. -
ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడెక్కడ అనుకూలం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం విశాఖకు తరలివచ్చే ప్రక్రియ వేగవంతమవు తోంది. మునిసిపల్, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులతో కూడిన అధికారుల బృందం వైజాగ్లో పర్యటిస్తోంది. సీఎం కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు అవ సరమైన భవనాలు, అధికారుల వసతి కోసం అనువైన స్థలాలను ఈ బృందం పరి లించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించి.. అనువుగా ఉంటే ఓకే చేసేందుకు అధికా రుల కమిటీ కసరత్తు మొదలెట్టినట్టు సమా చారం. దీనికనుగుణంగా జిల్లా యంత్రాంగంతో సోమవారం సమావేశమైన కమిటీ.. ఖాళీ గా ఉన్న భవనాల వివరాలు సేకరించింది. -
పరిపాలన రాజధానిగా విశాఖ వర్ధిల్లాలి అంటూ ప్రత్యేక పూజలు
-
రాజధాని పేరుతో ఇన్ని ఘోరాలా ?
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కారు పాల్పడిన ఘోరాలు విస్తుగొల్పుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అధికార రహస్యాలను బయట పెట్టబోమని ప్రమాణం చేసిన నాటి మంత్రులు ప్రజలకు ఇంత అన్యాయం చేయడం దారుణమన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ధర్మాన మాట్లాడారు. టీడీపీ సర్కారు రాజధానిపై ఏనాడూ ఒక పద్ధతిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు వినియోగించుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు తప్పు చేసి దొరికిపోవడంతో మూటాముల్లె సర్దుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చెప్పారు. హైదరాబాద్లో చేసినట్లుగానే అమరావతిలోనూ భూముల దోపిడీకి పాల్పడ్డారన్నారు. రాజధానిపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. 2013 చట్టంలోనే భూసమీకరణకు అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టారని, ప్రభుత్వాలు ఇంత అధర్మంగా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. మిగతావారిని దారి మళ్లించి తాము ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలో భూములు కొన్నారని తెలిపారు. తొలుత అతి చౌకగా జిరాయితీ భూములు కొన్నారని, ఆ తర్వాత జీవో 1 విడుదల చేసి అన్ని కేటగిరీల భూములకు భూ సమీకరణ ప్యాకేజీని పేర్కొంటూ అసైన్డ్ భూముల దగ్గర మాత్రం ఖాళీగా వదిలేశారని తెలిపారు. వాటికి రిజిస్ట్రేషన్ జరగదని తెలిసి కూడా వారిని కార్యాలయాలకు రప్పించి రిజిస్ట్రేషన్లను తిరస్కరించేలా చేశారని చెప్పారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ రాదంటూ మూడు మండలాల్లోని అసైన్డ్ రైతులను భయపెట్టి బాబు బృందం దక్కించుకుందన్నారు. ఆ భూములకు లభించే కౌలు, వన్టైమ్ బెనిఫిట్ను తమకు అందేలా చంద్రబాబు మనుషులు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి నారాయణ కాలేజీకి సైతం డబ్బులు జమ అయ్యాయని, పేద రైతులను మాయచేసి దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు తమ చేతికి వచ్చిన తర్వాత వాటికి జీవో 1 వర్తించదు కాబట్టి ఏడాది తరువాత తాపీగా జీఓ 41 తీసుకువచ్చారని చెప్పారు. అసైన్డ్ రైతులను భయపెట్టేందుకే ఆ జీఓను ఒక సంవత్సరం పాటు ఆపారని తెలిపారు. రెవెన్యూ శాఖ ఇవ్వాల్సిన జీవోను మున్సిపల్ శాఖ ఇచ్చేసింది అసైన్డ్ భూములకు సంబంధించిన జీవోను రెవెన్యూ శాఖ ఇవ్వాల్సి ఉండగా మున్సిపల్ పరిపాలన శాఖ ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు. పేదల భూములను బోగస్ వ్యక్తుల పరం చేయటాన్ని అధికారులంతా వ్యతిరేకించినా గత సర్కారు లెక్కచేయలేదన్నారు. మూడు మండలాల్లో అసైన్డ్ రికార్డులను సైతం మాయం చేశారని తెలిపారు. ప్రస్తుతం భూములు ఎవరి వద్ద ఉన్నాయో వారికే హక్కులు ఇద్దామంటూ తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు తమ మనుషులను ప్రవేశపెట్టారని చెప్పారు. పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా, రెవెన్యూ శాఖకు తెలియకుండా మాజీ మంత్రి నారాయణ ఇవన్నీ చేశారన్నారు. జీవో వచ్చిన 22 రోజుల తర్వాత నాటి సీఎం దీన్ని అంగీకరించారని, చట్టానికి వ్యతిరేకంగా ఈ జీవో జారీ అయిందన్నారు. ప్రజల క్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున దోపిడీ చేస్తుంటే దాని పట్ల విశ్వాసం ఏముంటుందని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అనుకూలంగా ఇవ్వలేదని ఆయన్ను తీసేశారని, న్యాయ శాఖ కార్యదర్శి, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ అందరూ వ్యతిరేకించినా దోపిడీని కొనసాగించారని తెలిపారు. ఇంత అడ్డగోలుగా వచ్చిన భూమి ప్లాట్లను కోర్ క్యాపిటల్లోని సచివాలయం, గవర్నర్ బంగ్లా, అసెంబ్లీ ఉన్నచోట ఇచ్చారని, ఇది ఎంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పొట్టగొట్టి గొడవలా? అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు తెలిశాయని, ఇన్ని ఘోరాలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు తాను అవినీతిపరుడిని కాదని ఎలా చెప్పుకుంటారని ధర్మాన ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయేలా ఇవన్నీ చేశారన్నారు. పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పించేందుకు ఇప్పుడు సీఎం జగన్ 50 వేల మందికి అక్కడే ఇళ్ల స్థలాలిచ్చారని తెలిపారు. రాజధాని రైతుల పొట్ట గొట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు తాము రైతులమంటూ గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ సరి చేయడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, ఒక ప్రభుత్వం తప్పు చేసి వ్యవస్థపై విశ్వాసాన్ని పోగొడితే మళ్లీ ఆ విశ్వాసాన్ని నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హెరిటేజ్, నారాయణ కోసం ఇన్నర్ ప్లాన్ మార్చారు: ఎమ్మెల్యే పేర్ని నాని రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంతో తనకు సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. చంద్రబాబు సర్కారు అవినీతి చిట్టాలో ఇన్నర్ రింగు రోడ్డు ఒకటి. దోపిడీ దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. మొదట ఇది మంత్రివర్గ నిర్ణయమని చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా, హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం అలైన్మెంట్ ప్లాన్ మార్చారు. ఐఆర్ఆర్తో తనకేం సంబంధం అంటున్న ఏ–14 నారా లోకే‹శ్ 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు. ఆ తీర్మానంపై లోకేష్ సంతకం చేశారు. దళితులు, పేదల నుంచి చంద్రబాబు, నారాయణ అసైన్డ్ భూములను లాక్కున్నారు. కేసులు ఎక్కువ నమోదైన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నారు? యువతను రెచ్చగొట్టి ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371 కోట్లు టిప్ అని అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు? ఇన్నర్ రింగ్ రోడ్డును అటూ ఇటూ తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే తన కరకట్ట ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్లు లింగమనేని హైకోర్టులో చెప్పారు. బాబుకు సీఎం పదవి పోయిన వెంటనే లింగమనేనికి అద్దె కింద రూ.27 లక్షలు ఇచ్చామని భువనేశ్వరి చెబుతున్నారు. నిజంగానే అధికారికంగా ఇచ్చి ఉంటే అద్దె ఎందుకు చెల్లించారు? ఐటీ రిటరŠన్స్లో ఈ వివరాలను వెల్లడించారా? రూ.27 లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు ఎందుకు మాట్లాడడం లేదు? రాజధానిపై నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కి, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఏర్పాటుకు జీవో ఇచ్చారు. భూసమీకరణకు ఒప్పుకోని వారిని ఏ–2 నారాయణ, ఏ–14 లోకేష్ బెదిరించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం లాక్కుంటుందని భయపెట్టారు. ఎకరం భూమిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే రాయించుకున్నారు. అసైన్డ్ రైతులను దగా చేసిన ఇలాంటి వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. సమగ్ర విచారణ జరగాలి: వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలి. రాజధానిని ప్రకటించకముందే లింగమనేని రమేష్ 355 ఎకరాలను కొనేశారు. పేదలను మోసం చేసి కంతేరు వద్ద భూముల్ని హెరిటేజ్ కొనడం ఏమిటి? ఢిల్లీ కోటను ఢీకొన్న జగన్ కళ్లల్లో భయం చూపిస్తానని లోకే‹శ్ అంటున్నారు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జగన్ ఎక్కడ? ఆయనకు ఉన్న 175 మంది సైనికుల్లో ఒకరి చేతుల్లో ఓడిపోయిన లోకే‹శ్ఎక్కడ? మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు: ఆదిమూలపు సురేష్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేసిన మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు. ఇన్నర్ రింగు రోడ్డు అనకొండలా మలుపులు తిరుగుతూ కొందరు వ్యక్తుల పొలాల దగ్గరకు వచ్చి ఆగింది. ఇందులో చేయని మోసం అంటూ ఏదీ లేదు. టెండర్లు పిలవకుండా నచ్చిన వాళ్లకు నామినేషన్ల విధానంలో పనులు అప్పగించారు. ముగ్గురు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం అలైన్మెంట్ను మార్చారు. గ్రాఫిక్స్తో అమరావతిని అంతర్జాతీయ నగరం అని నమ్మించడానికి ప్రయత్నిస్తే అది అంతర్జాతీయ స్కామ్ అయింది. ఈ స్కామ్కి డైరెక్షన్ చంద్రబాబుది అయితే పర్యవేక్షణ లోకేశ్, నాటి మంత్రులు, ఇతరులది. అమరావతిలో దళిత, పేద రైతుల్ని నిలువునా ముంచారు. నవ నగరాలు, ఐకానిక్ బ్రిడ్జి లాంటివన్నీ బూటకం. ఇన్నర్ రింగురోడ్డు గురించి కాగ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ల విధానంలో సుర్బానా, జురాంగ్ కంపెనీలకు ప్లాన్ తయారీ బాధ్యతను అప్పగించి రూ. 28 కోట్లు రూల్స్కి విరుద్ధంగా చెల్లించినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఇన్నర్ రింగు రోడ్డులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటున్న వారు ఈ డబ్బు గురించి సమాధానం చెప్పాలి. ఎస్టీయూపీ అనే కంపెనీకి మాస్టర్ప్లాన్ తయారీకి రూ.5 కోట్లు ఇచ్చారు. ఇవి డబ్బులు కాదా? రింగురోడ్డు తుది అలైన్మెంట్ను లింగమనేని, హెరిటేజ్ భూముల గుండా మార్చారు. హెరిటేజ్ భూములు కాజ, కంతేరు, చినకాకాని వద్ద ఉండడంతో రింగురోడ్డు అటు వెళ్లింది. అలైన్మెంట్ మార్పు చేసి తనకు సహాయం చేసినందుకే లింగమనేని రమేష్ ప్రతిఫలంగా చంద్రబాబుకి కరకట్ట నివాసాన్ని ఇచ్చారు. క్విడ్ప్రోకు ఇది తిరుగులేని ఉదాహరణ. నారాయణ తన వద్ద పనిచేసిన ఉద్యోగి పేరు మీద భూమిని కొని తర్వాత తన పేరిట మార్చుకున్నారు. అడ్డంగా దొరికిన అవినీతిపరులను వదిలిపెట్టేది లేదు. ఆధారాలతో చట్టం ముందు నిలబెడుతున్నాం. చంద్రబాబు, లోకే‹శ్ను చట్ట ప్రకారం శిక్షించాలి. -
అమరావతి.. ఓ ఆర్థిక అగాధమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం గత సర్కారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని పేరుతో నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ప్రభుత్వ భూములు విస్తారంగా అందుబాటులో ఉండే ప్రదేశాలను వదిలేసి బయటి వ్యక్తుల నుంచి చాలా ఎక్కువ భూమిని పూలింగ్తో సేకరించడమేనని స్పష్టం చేసింది. ఈమేరకు కాగ్ సమర్పించిన తనిఖీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో ప్రధానంగా అమరావతి విషయంలో టీడీపీ సర్కారు అనుసరించిన విధానాలను, భూ సమీకరణను కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతా అసమగ్రం రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు సార్లు ఆడిట్ నిర్వహించినట్లు కాగ్ నివేదికలో వెల్లడించింది. గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకున్న కీలక పరిమితులు, రాజధాని నగర అభివృద్ధికి భూమి వాస్తవ అవసరాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన సాధ్యాసాధ్యాల అధ్యయన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదని కాగ్ తప్పుబట్టింది. రాజధాని నగర అభివృద్ధికి సంబంధించిన మొత్తం ప్రాజెక్టు ప్రణాళిక వివరాల్లో సమగ్రత లేదని పేర్కొంది. అమరావతిలో ఏకరీతిలో భూ కేటాయింపుల విధానాన్ని అమలు చేయలేదని, వివిధ ప్రైవేట్ సంస్థలకు ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని కాగ్ నివేదిక ఎండగట్టింది. చేపట్టిన పనులన్నీ 2017 నవంబర్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు ప్రారంభించలేదని, దీంతో ఎల్పీఎస్ (ల్యాండ్ పూలింగ్ స్కీమ్) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాలేదని కాగ్ పేర్కొంది. రహదారి పనులతో కూడిన ప్రాధాన్యత కలిగిన మౌలిక సదుపాయాలను సరైన అంచనా, ప్రాథమిక సర్వే లేకుండా చేపట్టడంతో పనుల పురోగతి దెబ్బ తిందని కాగ్ తెలిపింది. అమరావతి రాజధాని అభివృద్ధిలో నిపుణుల కమిటీ సిఫార్సులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని తప్పుబట్టింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్లపై తగిన విధానాన్ని అనుసరించకుండా నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేశారని కాగ్ పేర్కొంది. ప్రణాళిక లోపం.. వ్యయంపై ప్రభావం స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్లు రూ.33,476.23 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్యాకేజీల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాగ్ నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నగర అభివృద్ధిపై విధానపరమైన మార్పు ఫలితంగా 2019 మే నుంచి కాల పరిమితి లేని ఒప్పందాల ప్యాకేజీలు అనిశ్చితిగా ఉన్నాయని తెలిపింది. గత సర్కారు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జలవనరుల పరిధిలో అనధికారికంగా గ్రీవెన్స్ సెల్ భవన నిర్మాణానికి ఏపీ సీఆర్డీఏ అనుమతి ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. రాజధాని నగరానికి భూమి వాస్తవ అవసరాలను అంచనా వేసేందుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం రికార్డులను సీఆర్డీఏ అందించలేదని కాగ్ పేర్కొంది. పర్యవసానంగా ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేనందున ఎల్పీఎస్ ద్వారా సేకరించిన భూమి అవసరం హేతుబద్ధతను నిర్ధారించలేకపోయినట్లు కాగ్ వెల్లడించింది. దశలవారీ ప్రణాళిక లేకపోవడంతో ప్రాజెక్టుల వ్యయంపై ప్రభావం పడిందని, కార్యాచరణ ప్రణాళికను సూచించడానికి సలహా కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కమిటీ సిఫార్సులను ఆడిట్కు అందుబాటులో ఉంచలేదని కాగ్ తెలిపింది. కేంద్రం వివరణ కోరినా.. టీడీపీ సర్కారు నిర్దిష్ట విధివిధానాలను అనుసరించకుండా కన్సల్టెన్సీ సంస్థలు, కన్సల్టెంట్లను ఎంపిక చేసినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. రాజధాని నగర ప్రణాళిక ప్రక్రియలో ఏపీ సీఆర్డీఏ టెండరింగ్, కాంపిటేటివ్ బిడ్డింగ్ విధివిధానాలను అనుసరించకుండా మూడు కన్సల్టెన్సీ సంస్ధలకు రూ.28.96 కోట్ల ఒప్పంద విలువతో నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. రాజధాని నగరానికి సంబంధించి రూ.1,09,023 కోట్ల అంచనాతో డీపీఆర్లు రూపొందించినప్పటికీ వీటిలో రూ.46,400 కోట్ల మేర డీపీఆర్లను నీతి ఆయోగ్కు సమర్పించలేదని వెలుగులోకి తెచ్చింది. డీపీఆర్లు లోపభూయిష్టంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ కోరినా గత సర్కారు సమర్పించలేదని కాగ్ తెలిపింది. -
విశాఖలో సీఎంవోకు దశలవారీగా చర్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజధాని అంశానికి ఎవరు సహకరించినా స్వాగతిస్తామని తెలిపారాయన. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి హాజరయ్యారు వైవీ సుబ్బారెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతాం. విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. అలాగే.. అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలోఉన్నట్లు తెలిపారాయన. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారైందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సీఎస్ కీలక వ్యాఖ్యలు అంతకుముందు వీఎంఆర్డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని తెలిపారాయన. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి ప్రస్తావించారు. -
ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?
మీరు ప్రయాణాలను ఇష్టపడేవారైతే అన్ని నగరాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు. పలు నగరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశానికి కేవలం ఒక రోజు రాజధానిగా ఉన్న ఒక నగరం ఉందని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశానికి ఒక్కరోజు కోసం ఏ నగరాన్ని రాజధానిగా చేశారో.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అలహాబాద్ చరిత్ర ఇప్పుడు మన అలహాబాద్ సంగమ నగరం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ప్రస్తుతం ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు. చరిత్రలొని వివరాల ప్రకారం మొఘల్ పాలకుడు అక్బర్ ఈ నగరానికి అలహాబాద్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ‘అల్లా నగరం’. తర్వాత అది అలహాబాద్గా మారింది. మొఘల్ పాలనలో ఈ నగరం ప్రాంతీయ రాజధానిగా ఉండేది. మొఘల్ పాలకుడు జహంగీర్ 1599 నుండి 1604 వరకు నగరంలో తన ప్రధాన పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క రోజు రాజధాని మొఘలులు పతనం అనంతరం భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పుడు అలహాబాద్ ఒక రోజు రాజధానిగా ఉంది. 1772 నుంచి కలకత్తా రాజధానిగా మనదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. కాగా 1857లో మీరట్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనినే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెబుతుంటారు. దీనిని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలని భావించింది. దీనిపై 1858లో క్వీన్ విక్టోరియా ఆర్డర్స్ కలిగిన లెటర్ అప్పటి వైస్రాయ్ జనరల్ లార్డ్ క్యానింగ్కు చేరింది. ఆ సమయంలో ఆయన అలహాబాద్లో ఉన్నారు. ఆయన వెంటనే అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో సమావేశం ఏర్పాటుచేశారు. క్వీన్ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్ను ఇండియాకు రాజధానిగా ప్రకటించారు. ఈ విధంగా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్ చరిత్రలో నిలిచింది. పర్యాటక కేంద్రంగా.. ప్రయాగ్రాజ్ చాలా కాలం పాటు పరిపాలన, విద్యా కేంద్రంగా ఉంది. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. నగరంలో, చుట్టుపక్కల అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఇక్కడ మూడు పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. చూడవలసిన ప్రదేశాలు మీరు ప్రయాగ్రాజ్కు వెళుతున్నట్లయితే సంగమ స్థలితోపాటు ఖుస్రో బాగ్ సందర్శించవచ్చు. ఇక్కడి మొఘల్ వాస్తుశిల్పం అమితంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఆనంద్ భవన్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు పండిట్ నెహ్రూ కుటుంబానికి చెందిన భవనం. 1970లో నాటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ భవనాన్ని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ భవనాన్ని ఆనంద్ భవన్ అని పిలుస్తున్నారు. ప్రయాగ్రాజ్లో అక్బర్ కోట కూడా సందర్శించదగిన ప్రదేశంగా నిలిచింది. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? -
నాలెడ్జ్ క్యాపిటల్గా తిరుపతి
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ కాపిటల్గా ఫిలడెల్ఫియా.. ఫుట్పాత్లపై ‘బానిసల’ వికృత చేష్టలు!
అమెరికాలోని ఫిలడెల్ఫియా డ్రగ్స్ కాపిటల్గా మారిపోయింది. ఇక్కడి జనం ప్రమాదకరమైన డ్రగ్ ‘ట్రాంక్’ బారిన పడి కెన్సింగ్టన్ వీధుల్లో వికృత చేష్టలకు దిగుతున్నారు. మత్తులో మునిగిపోయి, తామేమి చేస్తున్నామో తమకే తెలియని స్థితిలో రోడ్ల మీద తిరుగాడుతున్నారు. ‘ట్రాంక్’కు బానిసగా మారిన ఒక వ్యక్తి తన వీడియో క్లిప్ను టిక్టాక్లో షేర్ చేశాడు. ఇదిమొదలు ఇటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పలువురు జాంబీ డ్రగ్స్ తీసుకుంటూ వింతగా ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇంతేకాకుండా మరికొందరు మద్యం తీసుకోవడం, ధూమపానం చేయడం, కాలి వేళ్లకు డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా మత్తులోకి దిగడం లాంటి దృశ్యాలు ఈ వీడియోలలో కనిపిస్తున్నాయి. ‘ట్రాంక్’ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం? మీడియాకు అందిన సమాచారం ప్రకారం జిలాజైన్ డ్రగ్ లేదా ‘ట్రాంకో’ను విరివిగా వినియోగిస్తున్నవారి సంఖ్య అమెరికాలో విపరీతంగా పెరిగిపోయింది. ‘ట్రాంక్’ని ‘జాంబీ డ్రగ్స్’ అని కూడా అంటారు. తొలుత దీనిని ఇది జంతువుల చికిత్సకు ఉపయోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదించింది. అయితే క్రమంగా దీనిని మత్తు పదార్థంగా ఉపయోగించడం ప్రారంభించారు. ‘ట్రాంక్’ను మత్తుపదార్థాలైన హెరాయిన్, కొకైన్, ఫెంటానిల్లను మరింత శక్తివంతం చేయడానికి ఉపయోగిస్తారు. This is what Philadelphia now looks like thanks to the new drug called “Tranq”. This is what the city where our Declaration of Independence was signed now looks like. Can you believe it? pic.twitter.com/oSZ8RJAtOX — Joey Mannarino (@JoeyMannarinoUS) May 28, 2023 ఫిలడెల్ఫియా ఆరోగ్య అధికారులు గత నెలలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. డ్రగ్స్ మహమ్మారి నగరాన్ని సంక్షోభంలో ముంచిందని పేర్కొన్నారు. ‘జిలాజైన్ డ్రగ్ ఫిలడెల్ఫియాను తీవ్రంగా దెబ్బతీసింది. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మరణాల సంఖ్య పెరిగింది. దీనిని తీసుకునే వ్యక్తులు తీవ్రమైన గాయాల బారిన పడుతున్నారు. ఈ డ్రగ్ మనిషి శరీర భాగాలను క్షీణింపజేస్తుంది. మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడానికి నగరంలోని స్వచ్ఛంద భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని’ ఫిలడెల్ఫియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ బోర్డ్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఈ విషయమై స్పందించిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు డ్రగ్స్ కలిగించే చెడు ప్రభావాలను ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. సావేజ్ సిస్టర్స్ వ్యవస్థాపకురాలు సారా లారెల్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో ఈ డ్రగ్ వినియోగం మరింతగా పెరిగిందన్నారు. దీనిని అరికట్టడంతో అటార్నీ లారీ క్రాస్నర్ విఫలమయ్యారని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో, డ్రగ్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన 2022లో లారీ క్రాస్నర్ సస్పెండ్ అయ్యారు. అయితే దీనికి సంబంధించిన విచారణ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్? Yet another video of my hometown Philadelphia where the zombies roam the streets high on Fentanyl and Tranq. Leaving that shithole of a city was the best move of my life other than marrying my wife and fathering my 3 awesome kids. pic.twitter.com/WW3etvaDPj — Nikki Davis (@BlondeNAmerican) May 26, 2023 -
జాబిల్లిపై మూడు సింహాల అడుగులు
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. భారత్ తన విజయసూచకంగా అశోక ముద్రలు(మూడు సింహాల గుర్తు) జాబిల్లి నేలపై ముద్రించనుంది. చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ అనే రోవర్ బయటకు వస్తుంది. ఈ రోవర్ చంద్రునిపై పరిశోధనలు చేస్తుంది. రోవర్ చక్రాలు జాబిల్లిపై తిరుగుతూ చంద్రునిపై నీటి జాడ, మట్టి, ఖనిజాలు సహా అనేక వివరాలను సేకరిస్తుంది. ఈ క్రమంలో రోవర్ చక్రాలు అశోక చిహ్నాన్ని చంద్రునిపై ముద్రించనున్నాయి. భారత తన విజయసూచకంగా రోవర్ చక్రాలకు అశోక చిహ్నాలను ముద్రించింది. దీంతో రోవర్ తిరిగిన ప్రతిచోట అశోక ముద్రలతో కూడిన అడుగులు ఏర్పడతాయి. సారనాథ్ స్థూపం నుంచి సేకరించిన అశోక ముద్రలను భారత్ తన వారసత్వ గుర్తుగా చంద్రుని మట్టిపై నిలుపుతోంది. Big Breaking News - After landing, Chandrayaan-3 rover will etch an impression of the national emblem depicting the Lion Capital of Ashoka at Sarnath and ISRO on the lunar terrain. It will signify India's presence and legacy on the Moon♥️🔥. India set to create history today… pic.twitter.com/BnGBHrqxls — Times Algebra (@TimesAlgebraIND) August 23, 2023 చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్పై పీఎం మోదీ.. -
చంద్రబాబు నిర్వాకం ఫలితం.. ముంపు ముంగిట్లో రాజధాని అమరావతి
తాడికొండ : ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పిన గొప్పలు చిన్నపాటి వర్షానికే వెక్కిరిస్తున్నాయి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని, శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు వంటి నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను తొక్కిపెట్టిన చంద్రబాబు నారాయణ కమిటీ వేసి తనకు అనుకూలంగా రాజధాని నిర్మించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా రాజధాని ప్రాంతానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొండవీటి వాగు, కోటేళ్ల వాగు, చీకటి వాగుకు వచ్చే భారీ వరద నీటిని మళ్ళించేందుకు గత ప్రభుత్వ హయాంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సచివాలయం, హైకోర్టును వరద నీరు భారీగా చుట్టుముట్టింది. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు వెళ్లే రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొండవీటి వాగుకు భారీగా వచ్చిన వరదతో పెదపరిమి, నీరుకొండ, ఐనవోలు, నేలపాడు ప్రాంతాల్లో పొలాలు, రోడ్లు ముంపునకు గురయ్యాయి. కోటేళ్ల వాగుకు బు«ధ, గురువారాలు ఉప్పొంగడంతో సచివాలయ, హైకోర్టు ఉద్యోగులు మంగళగిరి మీదుగా తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ముందుచూపు లేకుండా ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మించిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అక్కడ పేదలకు ఇళ్లిస్తే..మా భూముల ధరలు పడిపోతాయి
సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే తమ భూముల ధరలు అమాంతం పడిపోతాయని అమరావతి కోసం భూములిచ్చిన వ్యక్తుల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూములిస్తూ చట్టం చేసేందుకు తాము గతంలో ఎంతమాత్రం అంగీకరించలేదన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రికి పేదలపై అంత ప్రేమ ఉంటే రాజధాని ప్రాంతంలో కాకుండా కడపలో ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవాలన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి కేటాయించిన భూముల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాజధానికి ఆదాయాన్ని సమకూర్చే ఎల్రక్టానిక్ సిటీ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే చుట్టుపక్కల తమ భూముల ధరలు దారుణంగా పడిపోతాయన్నారు. రాజధాని వెలుపల పెద్ద సంఖ్యలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని పునరుద్ఘాటించారు. రాజధాని భూముల విషయంలో సీఆర్డీఏ, రైతులకు మధ్య ఉన్నది వ్యాపార ఒప్పందమన్నారు. రైతుల అనుమతి లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు... పట్టాల మంజూరు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందన్నారు. అందువల్ల పట్టాల మంజూరు వ్యవహారం తేలకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడం తగదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడిగా ఏర్పాట్లు చేస్తోందని, గృహ నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. రాజధాని భూములపై సీఆర్డీఏకు పూర్తిస్థాయి యాజమాన్యపు హక్కులు లేవని, కేవలం షరతులతో కూడిన హక్కులు మాత్రమే ఉన్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూ సమీకరణ కింద తీసుకున్న భూములను ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీం బాధ్యతలన్నింటినీ పూర్తి చేసిన తరువాతే రాజధాని భూములపై సీఆర్డీఏకు హక్కులు వస్తాయని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు. మా నినాదమే.. పేదలందరికీ ఇళ్లు ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, రెవెన్యూ శాఖల తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి, కాసా జగన్మోహన్రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ తోసిపుచ్చారు. ఏ ప్రభుత్వమైనా ఇళ్ల పట్టాలు ఇచ్చేది ఇళ్లను నిరి్మంచుకోవడానికేనన్నారు. ఇళ్లు నిర్మాణం లేనప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రయోజనం ఏముంటుందన్నారు. ప్రభుత్వ నినాదమే ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ అని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా ఇళ్లు నిర్మించవద్దని చెప్పలేదన్నారు. ఈ విషయంలో స్పష్టత కావాలనుకుంటే పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి మరో చోట భూమి కేటాయిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం భూమిలో 5 శాతం పేదల ఇళ్ల కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం చెబుతోందన్నారు. చట్ట నిబంధనలకు లోబడి చేసే పనిని ఏ కోర్టు కూడా తప్పుబట్టడానికి వీల్లేదన్నారు. రాజధాని కోసం రైతులు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 వేల ఎకరాలను ఇచ్చిందని రెవిన్యూ శాఖ తరఫు న్యాయవాది సుభాష్ తెలిపారు. అందులో 1,400 ఎకరాలు పేదలకిస్తే పిటిషనర్లు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలువురి చేత టీడీపీ పిటిషన్లను దాఖలు చేయించిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్ దేశానికీ రెండో రాజధాని అయితే స్వాగతిస్తాం
-
హైదరాబాద్ దేశానికీ రెండో రాజధాని..!
-
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
రాజధాని ప్రాంతలో శ్రావణ్ కుమార్ హల్చల్
గుంటూరు: రాజధాని ప్రాంతంలో మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ హల్చల్ చేశారు. రాజధానిలో 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి తుళ్లూరు మండలంలో చొరబడి టీడీపీ నాయకుల ఇళ్లలో బస చేశారు. ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ 24, 25, 26 తేదీలలో పలు రకాల నిరసనలు తెలియజేస్తామంటూ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. బుధవారం తుళ్లూరు దీక్షా శిబిరం వద్దకు వచ్చి హడావుడి చేసేందుకు యత్నించిన శ్రావణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విజయవాడకు తరలించారు. -
సామాజిక న్యాయమే పరమావధి
సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయి రాజధాని కంటే కూడా పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. తమది సామాజిక న్యాయమే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వమని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో కనీసం 5 శాతం భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతున్నా, గత ప్రభుత్వం మాత్రం ధనికుల కోసం ని ర్మిస్తున్న రాజధానిలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ చట్టాన్ని అమలు చేయలేదని తెలిపింది. కేవలం 44 ఎకరాలను మాత్రమే పేదల కోసం కేటాయించిందని, అలాంటి తప్పిదం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే సీఆర్డీఏ చట్టాన్ని సవరించి.. మాస్టర్ ప్లాన్లో ఆర్ 5 జోన్ను సృష్టించామని చెప్పింది. ‘ఈ జోన్లో పేదలకు 1,134 ఎకరాల భూమిని కేటాయించాం. ఈ భూమిని ఇళ్ల స్థలాల కింద పేదలకు పంచాలని నిర్ణయించాం. ఇది ఓర్వలేని గత ప్రభుత్వ పెద్దలు హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేయించి పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పాపమన్నట్లు ప్రభుత్వ తీరును అమరావతి రైతుల పేరుతో తప్పు పడుతున్నారు. సీఆర్డీఏ నుంచి ఈ 1,134 ఎకరాలను రూ.1,100 కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని వల్ల సీఆర్డీఏకు రూ.1,100 కోట్లపైగా మొత్తం సమకూరుతుంది. సీఆర్డీఏకు డబ్బు వస్తేనే రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం సైతం తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపారు. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలివ్వొద్దు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 45 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ అమరావతి రైతులు రకరకాల ఎత్తుగడలతో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ అనుబంధ వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పేదలకు ఇవ్వకుంటే వచ్చే నష్టమేమీ లేదు.. పిటిషనర్ల తరఫున తొలుత దేవ్దత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. పేదలకు ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మిన్ను విరిగి మీద పడదన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్డీఏ వద్ద ల్యాండ్ బ్యాంక్ ఉందని, అందులో నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. మరో సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ, మాస్టర్ ప్లాన్లో చాలా మార్పులు చేశారన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉండగా, క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. సీఆర్డీఏ ప్రతిపాదనలను రైతులు గ్రామ సభల్లో తిరస్కరించారని, అయినా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అనుమోలు జ్యోతిరత్న వివరించారు. అభివృద్ధిలో భాగంగానే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పాండవుల కోసం శ్రీకృష్ణుడు ఉన్నట్లు పేదల కోసం జగన్ ఉన్నారన్నారు. పేదల నివాసానికి కనీసం 5 శాతం భూములు ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా ఉండగా, మాస్టర్ ప్లాన్లో మాత్రం దానికి స్థానం కల్పించలేదన్నారు. ఈ తప్పును సరిదిద్ది చట్ట ప్రకారం పేదల నివాసం కోసం 5 శాతం భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్ధిష్టంగా ఫలానా చోటే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఓర్చుకోలేక హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు, మళ్లీ హైకోర్టు.. అడ్డుకునేందుకు ఇలా తిరుగుతూనే ఉన్నారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకెళ్లగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎలా తప్పు అవుతుందంటూ రైతులను నిలదీసిందని, దీంతో వాళ్లు అక్కడ తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్తృత ధర్మాసనం చెప్పిందని, అందులో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి చేయకుంటే చేయలేదంటున్నారని, చేస్తుంటే ఎలా చేస్తారంటూ కోర్టులకెక్కుతున్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. నవ్వుల పువ్వులు హైకోర్టులో న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు లేవని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని, అయితే ఓ పెద్ద మనిషి తనపై క్రిమినల్ కేసు నమోదు కాగానే భయపడి అప్పటికప్పుడు రాజధానిని అమరావతికి మార్చారని తెలిపారు. దీంతో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వదులుకుని అందరూ హడావుడిగా అమరావతికి వచ్చారన్నారు. దాని పర్యవసానమే సౌకర్యాల కొరత అని వివరించారు. ‘ఆ కోట్ల రూపాయల కోసమే అందరూ ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళుతున్నారా? అంటూ ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. -
‘దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నది అంబేద్కర్ కోరిక’
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజ మార్పు కోసం ప్రయత్నించారన్నారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. శుక్రవారం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరిగిన అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారాయన. అంబేద్కర్ ఆశయాల్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం దళితులకు, ఆదివాసీలకే పరిమితం కాదు. దేశంలో మతమైనారిటీలే కాదు.. కులమైనారిటీలు కూడా ఉన్నారన్నారాయన. అలాగే.. పొట్టీ శ్రీరాములు ఆంధ్రపప్రదేశ్ కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం చేసే వరకు కూడా రాష్ట్రం ఇవ్వలేదు. చిన్న రాష్ట్రాలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అంబేద్కర్ భావించేవారు. మీ అందరి తరపున సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు ఆయన ప్రసంగించారాయన. దేశానికి రెండో రాజధాని అవసరమని రాజ్యాంగ చర్చల్లో అంబేద్కర్ కోరుకున్నారు. అదీ హైదరాబాదే కావాలని అంబేద్కర్ కోరుకున్నారని ప్రకాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరమన్న విషయాన్ని అంబేద్కర్ లేవనెత్తారని, ఆ అవసరం ఇప్పుడు ఉందని ప్రకాష్ పేర్కొన్నారు. -
అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు అడక్కుండానే ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,800 కోట్ల మూలధన నిర్వహణ కసరత్తులో భాగంగా అందజేసినట్లు కాగ్ పేర్కొంది. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్కైనా చెల్లింపులు ఆర్థిక మంత్రిత్వశాఖ కింద బాధ్యతలు నిర్వహించే ఆర్థిక సేవల విభాగం రీక్యాపిటలైజేషన్కు ముందు తన స్వంత ప్రామాణిక పద్దతి ప్రకారం సైతం ఎటువంటి కసరత్తూ నిర్వహించేలేదని స్పష్టం చేసింది. 2019–20లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రూ.798 కోట్లు అడిగితే, డీఎఫ్ఎస్ రూ. 831 కోట్లు అందించినట్లు పేర్కొంది. రుణ వృద్ధికి, నియంత్రణ మూలధన అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రీక్యాపిటలైజ్ చేస్తుంది. -
రాజధానిపై జూలై 11న విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన పిటిషన్లు జూలై 11న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్తోపాటు మరికొన్ని వ్యాజ్యాలు మంగళవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఇతర కేసుల విచారణతో కోర్టు సమయం ముగియడంతో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, నిరంజన్రెడ్డిలు పిటిషన్ విచారణ అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. వీలైనంత త్వరగా విచారణ తేదీ ఖరారు చేయాలని, ఏప్రిల్ 11 జాబితాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే, జూలై 11న జాబితాలో చేర్చాలని ఆదేశిస్తామని ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు కాకుండా ఏప్రిల్లో ఏదో ఒక తేదీ ఖరారు చేయాలని ఏపీ న్యాయవాదులు కోరారు. ఏప్రిల్ 11న ఇప్పటికే 13 అంశాలు జాబితా అయ్యాయని ఆ తర్వాత అంశంగా చేపడతామని జస్టిస్ జోసెఫ్ చెప్పారు. జాబితాలో తొలి అంశంగా చేర్చాలని, గతంలోనూ తొలి అంశంగా చేర్చారని నిరంజన్రెడ్డి తెలిపారు. జూలైలో విచారణ చేపడతామని, ఈ మధ్య కాలంలో సుదీర్ఘ విచారణ సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. విచారణకు ఎంత సమయం తీసుకుంటారని అన్ని పక్షాల న్యాయవాదులను జస్టిస్ బీవీ నాగరత్న కోరారు. ప్రతివాదులుగా సుమారు 250 మంది ఉన్నారని ఓ న్యాయవాది తెలిపారు. ఏపీ తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న చట్టాలపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగని పూర్తిస్థాయి స్టే ఎక్కడా లేదు. పైగా ఈ అంశం కోర్టు పరిధిలోది కాదు. ఇది పూర్తిగా అకడమిక్ (థియరిటికల్ ఆసక్తి ఉంటుంది కానీ ప్రాక్టికల్ రిలవెన్స్ ఉండదు). వాదనలకు ఓ గంట చాలు. రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేశారు. అభివృద్ధి ముందుకు వెళ్లడంలేదు. మీరే త్వరగా విచారణ పూర్తి చేయాలి. ఈ అంశాన్ని తేల్చాలి’’ అని ధర్మాసనానికి వివరించారు. దీనికి జస్టిస్ కేఎం జోసెఫ్ స్పందిస్తూ.. జూన్లో పదవీ విరమణ చేస్తున్నానని, ఈలోగా సుదీర్ఘంగా కేసు వినడం సాధ్యం కాదని చెప్పారు. జూలై 11న జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. -
హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగం గడిచిన పదిహేనేళ్లుగా అతిపెద్ద బూమ్ను చూస్తోందని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈవో విపుల్ రూంగ్తా తెలిపారు. ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక స్థోమత (అఫర్డబులిటీ), సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష తదితర ఎన్నో అంశాలు బూమ్ను నడిపిస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రూంగ్తా మాట్లాడారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన ‘‘గత 15 ఏళ్లలో అతిపెద్ద బూమ్ను నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను. నివాస విభాగంలో మధ్యాదాయ, అందుబాటు ధరల విభాగం అయినా, ప్రీమియం విభాగం అయినా ఇదే పరిస్థితి నెలకొంది’’అని రూంగ్తా అన్నారు. ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటికీ కో చైర్మన్గానూ రూంగ్తా వ్యవహరిస్తున్నారు. రెరా కింద సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఉందని గుర్తు చేస్తూ, ఈ విషయంలో విఫలమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ ఇళ్లకు డిమాండ్.. దేశంలో హౌసింగ్ డిమాండ్ ప్రధానంగా అందుబాటు ధరల, మధ్యాదాయ వర్గాల కేంద్రంగా ఉన్నట్టు విపుల్ రూంగ్తా చెప్పారు. కనుక ఈ విభాగాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇదే సరైన తరుణమని సూచించారు. వడ్డీ రేట్లు గత ఏడాది కాలంలో పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నట్టు చెప్పారు. అఫర్డబుల్ హౌసింగ్లో హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ 3.2 బిలియన్ డాలర్ల ఫండ్ను ప్రారంభించినట్టు తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, గృహ ఆదాయంతో నివాస గృహాలకు అసాధారణ స్థాయిలో డిమాండ్ ఉన్నట్టు ఇదే సదస్సులో పాల్గొన్న ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా ధరల వృద్ధి ఉన్న టాప్–10 హౌసింగ్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో 3.65 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. -
జూలైలో విశాఖకు వెళ్తున్నాం.. మంత్రులతో సీఎం జగన్
సాక్షి, అమరావతి: పరిపాలనా రాజధాని విశాఖ నుంచే త్వరలో పాలన సాగిస్తామని ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సులో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులోనూ ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. తాజాగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించినట్లు తెలిసింది. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో అజెండా అంశాలపై చర్చ ముగిశాక అధికారులు నిష్క్రమించారు. సమకాలీన రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకుని నిబంధనల మేరకు తమకు నిర్దేశించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓటు వేసేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలని జాగ్రత్తలు సూచించారు. రాష్ట్రంలో గత 45 నెలలుగా జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చాటిచెప్పాలని మంత్రులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అత్యంత పారదర్శకంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీ అరాచకాలను ఎండగట్టడంతోపాటు ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందచేస్తున్న తీరును ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. -
‘రాజధాని’పై 3 రోజులు విచారించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వరుసగా మూడ్రోజులు విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అంశాన్ని ఏపీ తరఫు న్యాయవాది గురువారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ముందు ప్రస్తావించారు. రాజధానిపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని కోరారు. సుప్రీంకోర్టు మార్చి 28 మంగళవారంతోపాటు బుధ, గురువారాల్లో కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో.. బుధ, గురువారాల్లో కూడా విచారణ చేపట్టాలంటే సీజేఐ నిర్ణయం తీసుకోవాలని.. ఈ అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించాల్సి ఉంటుందని జస్టిస్ కేఎం జోసెఫ్ తెలిపారు. అయితే, దానికి అనుమతివ్వాలని న్యాయవాది కోరారు. సీజేఐ అనుమతిస్తే తమకేమీ అభ్యంతరంలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో రాజ్యాంగపరమైన అంశాలున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే, ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయా అని జస్టిస్ బీవీ నాగరత్న ప్రశ్నించగా అవునని న్యాయవాది బదులిచ్చారు. ఒక తేదీని నిర్ణయించి కనీసం రెండు రోజులపాటు విచారణ చేయాలని ప్రతివాదులు తరఫు న్యాయవాది కోరారు. అయితే, విచారణ జాబితాలో చివరి అంశంగా తాము చేపట్టగలమని ధర్మాసనం పేర్కొంటూ విచారణను మార్చి 28నే చేపడతామని జస్టిస్ జోసెఫ్ స్పష్టంచేశారు. -
ఏపీ రాజధాని కేసు: ‘28 నుంచి మూడు రోజుల పాటు విచారణ జరపండి’
సాక్షి ఢిల్లీ: ఏపీ రాజధాని కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు విచారించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది.. అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కాగా, ఈ ప్రతిపాదనపై జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం స్పందించి.. సీజేఐ వద్ద మెన్షన్ చేయాలని సూచించింది. ఇక, ఈ కేసుపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం మార్చి 28వ తేదీన విచారణ చేపట్టనుంది. -
త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ : బుగ్గన
-
ట్రెజర్ హంట్ – ఎంపవర్మెంట్!
ఆశయాల నడుమ సంఘర్షణ సహజం. సిద్ధాంతాల నడుమ వైరుద్ధ్యాలు సహజం. ఈ వైరుద్ధ్యాల్లోంచే, సంఘర్షణలోంచే సత్యం ప్రభవిస్తుందని నమ్ముతారు. అందుకే వికాస ప్రియులందరూ భిన్న ఆశయాలను స్వాగతిస్తారు. విభిన్నమైన ఆలోచనల స్వేచ్ఛా ప్రసా రానికి కిటికీలు తెరుస్తారు. జగమెరిగిన మావో జెడాంగ్ సుభాషితాన్ని కూడా మరోసారి ప్రస్తావించవచ్చు. నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీ పడాలన్నారు మావో. ఈ భావ సంఘర్షణ కాలక్రమంలో రకరకాల పరిణామాలకు లోనై ఉండవచ్చు. ఎన్నెన్నో సరికొత్త ఛాయలను ఆవిష్కరించి ఉండవచ్చు. నేటి ఆంధ్రప్రదేశ్లో అది కొందరి ఆశలకు, కోట్లాదిమంది ఆకాంక్ష లకు మధ్యన ఏర్పడిన ఘర్షణగా మారింది. ఇక్కడ ప్రధాన రాజకీయ భూమికగా మారిన ఇతివృత్తం కూడా ఇదే. కొందరి ఆశ – ట్రెజర్ హంట్ అనే మృగయా వినోదం. కోట్లమంది ఆకాంక్ష –ఎంపవర్మెంట్తో సమకూరే ఆత్మగౌరవం. ఈ ట్రెజర్ హంట్ (నిధుల వేట) అనేది ఎంత అమాన వీయమైనదో, ఎంత నేరపూరితమైనదో, ఎంత క్రూరముఖీ నమైనదో మనకు తెలియని విషయం కాదు. ‘మెకన్నాస్ గోల్డ్’ నుంచి ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ వరకు ఎన్నెన్నో సినిమాలు ఆ కర్కశ స్వభావాన్ని మనకు తెరపరిచాయి. నవలల్లో, కథల్లో కూడా చదివి వుండవచ్చు. విని ఉండవచ్చు. ఇక్కడున్న ట్రెజర్ హంట్ ముఠా కార్యస్థానం రాజకీయం కనుక, ప్రజల ఓట్లతోనే పబ్బం గడుస్తుంది కనుక దూసే కత్తులు మెత్తగా, పువ్వుల గుత్తుల్లా ఉంటాయి. మోముల్లో క్రౌర్యానికి బదులు మోసపూరితమైన నవ్వులుంటాయి. కానీ స్వభావం నేరపూరితమే. లక్ష్యం స్వార్థమే. అప్పుడప్పుడూ ఈ వ్యాఘ్రం తగిలించుకున్న గోముఖం ముఖోటా జారిపోతూనే ఉంటుంది. కప్పుకున్న మేక తోలు చెదిరిపోతూనే ఉంటుంది. సాధికారత కోరుకుంటున్న బలహీన వర్గాలపై ఛీత్కారాలు బహిరంగమవుతూనే ఉంటాయి. ఈ చర్చలో ముఖోటాలకూ, ముసుగులకూ తావు లేదు. ఆ ట్రెజర్ హంట్ ముఠా తెలుగుదేశం పార్టీ, దాని అనుంగు ఎల్లో కూటమే. ఇది ఆరోపణ కాదు. విభజిత రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉండగా ఆ పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాలు, ప్రతిపక్షంగా ఈ మూడున్నరేళ్లలో చేపట్టిన కార్యక్రమాల విశ్లేషణ అనంతరమే ఈ నిర్ధారణ. తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధానాలు, కార్యక్రమాలు తెలిసినవే కనుక సొంతంగా విశ్లేషించడానికి ఎవరైనా పూనుకోవచ్చు. సత్యాన్ని నిర్ధారించుకోవచ్చు. పరంపరగా వస్తున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అరకొరగా అమలు చేయడం తప్ప పేదవర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. రాజధాని పేరుతో అమరావతి పలవరింత, కమీషన్ల కోసం పోలవరాన్ని పట్టాలు తప్పించడం మినహా మరో మహత్కార్యం తెలుగుదేశం పార్టీ ఖాతాలో లేదు. ఈ రెండూ ట్రెజర్ హంట్లో భాగం కావడమే అవి చేసుకున్న మహద్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర నిధులతో కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలి. కేంద్రమే నిర్మిస్తే తమకు కమీషన్లు ముట్టవు కదా అనే దుగ్ధ తెలుగుదేశం అధినేతలకు ఏర్పడింది. అప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వాములుగా ఉన్నారు కనుక ఆ పలుకుబడిని వాడుకొని నిర్మాణ కార్యక్రమాన్ని తామే చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టారు. తమ పార్టీ ఎంపీ కంపెనీకి పనులు అప్పగించారు. ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదని తెలిసినా కమీషన్ల కక్కుర్తితో లక్ష్యపెట్టలేదు. చేతగాని సంస్థ బిల్లులెత్తుకోవడమే తప్ప పనులు చేయకుండా కాలయాపన చేసింది. పుణ్యకాలం గడిచిపోతున్న నేపథ్యంలో పట్టిసీమ పేరుతో ఎత్తిపోతల పథకాన్ని రంగంలోకి తెచ్చారు. పోలవరానికి దిగువ నుంచి నీళ్లు ఎత్తి ప్రధాన ప్రాజెక్టు కుడి కాల్వలో పోసే పథకం. ఈ పోలవరం కుడి కాలువ 90 శాతం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయింది. పోలవరం పూర్తయితే ఈ ఎత్తిపోతల ఆరో వేలు అవుతుంది. అయినా 1900 కోట్లు దీని మీద తగలేయడమంటే, సదరు ఔదార్యం వెనుకనున్న మతలబు కమీషన్లేనన్న విషయం సామాన్యుడికి కూడా అర్థమైంది. అలాగే ఎడమ కాలువ గట్టుమీద 1900 కోట్లతో పురుషో త్తమపట్నం ఎత్తిపోతలను తలకెత్తుకున్నారు. ఈ 3800 కోట్లు ప్రధాన ప్రాజెక్టుపై ఖర్చు చేసి ఉంటే కథ వేరుగా ఉండేది. ప్రధాన ప్రాజెక్టులో ఇంకో ఘనకార్యముంది. కాలూ చెయ్యి కదిలించలేకపోయిన సొంత పార్టీ కాంట్రాక్టర్ను తప్పించి మరో అస్మదీయ సంస్థను రంగంలోకి దించారు. ప్రాజెక్టుల ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన డ్యామ్ కట్టే ప్రదేశానికి ఎగువన... దిగువన మట్టి కట్టలు (కాఫర్ డ్యామ్) కట్టి, స్పిల్వే, స్పిల్ ఛానల్ గుండా ప్రవాహాన్ని మళ్లించిన తర్వాతనే ప్రధాన డ్యామ్కు పునాది వేయాలి. ఈ పునాదినే డయాఫ్రమ్ వాల్ అంటారు. మట్టి కట్టలు కడితే కమీషన్లేం గిట్టు బాటవుతాయి. అందుకని ఎగువ కాఫర్ డ్యామ్ను కొంత మేరకు కట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. 2019లో వరదలు వచ్చి నప్పుడు మట్టి కట్ట గ్యాప్లోంచే మొత్తం ప్రవాహం వెళ్లాల్సి రావడంతో ఉరవడి పెరిగి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. దాంతో కథ మొదటికి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పిల్వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్లను పూర్తిచేసినప్పటికీ డయాఫ్రమ్ వాల్ సంగతి తేలవలసి ఉన్నది. ‘చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద’ అనే సామెత తెలుగుదేశం పార్టీ వ్యవహారానికి అతికినట్టు సరిపోతుంది. ట్రెజర్ హంట్ వ్యామోహంలో పడి ప్రాజెక్టు పనిని కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మార్చిపారేసింది. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం మొన్న ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను ఎల్లో మీడియా కవర్ చేసిన తీరును చూస్తే చాలు, ట్రెజర్ హంట్ ముఠా అమరావతి విషయంలో ఎంత ఆకలితో ఉన్నదో, ఎంత ఆత్రంతో ఉన్నదో అర్థమవుతుంది. అమరా వతే రాజధానిగా కేంద్రం అఫిడవిట్లో పేర్కొన్నట్టు, రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదని తేల్చినట్టు పత్రికల్లో, ఛానళ్లలో పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు. కేంద్రం ఆ మాట ఎక్కడా అనలేదు. అందులో కేంద్రం ప్రస్తావించిన అంశాలు ఇవి. 1. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, సెక్షన్ 5 ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజ ధానిగా ఉంటుంది. 2. సెక్షన్ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజ ధానిని సూచించడానికి నిపుణుల కమిటీని నియమించాలి. ఆమేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ను నియమించడం, ఆ కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది. కమిటీ ఇచ్చిన నివేదికను తదుపరి చర్యల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 3. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడం జరిగింది. 4. సెక్షన్ 94 ప్రకారం కొత్త రాజధానిలో వసతుల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయవలసి ఉన్నది. ఇందుకోసం 2500 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రానికి అందజేసింది. 5. 2020లో రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలను తీసుకొచ్చింది. సీఆర్డీఏ (తొలగింపు) చట్టంతోపాటు వికేంద్రీకరణ – అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టాలను రాష్ట్రం చేసింది. దీని ప్రకారం అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉంటాయి. ఈ వ్యవహా రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపలేదు, కనుక పిటిషన్లో లేవనెత్తిన అంశాలతో కేంద్రానికి సంబంధం లేదని మాత్రమే అఫిడవిట్లో పేర్కొన్నారు. రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించినదిగానే కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్నది. పార్లమెంట్ సభ్యులు గతంలో అడిగిన ప్రశ్నలకు కూడా ఇదే వైఖరితో సమాధానాలు ఇచ్చింది. అఫిడవిట్ను పరిశీలిస్తే కూడా అదే అంశం స్పష్టమవుతుంది. చట్టం ప్రకారం కేంద్రం నిపుణుల కమిటీని వేసిందనీ, ఆ నివేదికను రాష్ట్రానికి పంపించిందనీ పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేసిందనే చెప్పారు తప్ప నిపుణుల కమిటీ సిఫారసులకు భిన్నంగా రాజధానిని ఎంపిక చేయడాన్ని కూడా ఎత్తిచూపలేదు. ఎందుకంటే మొదటినుంచీ కేంద్రం దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయంగానే పరిగణిస్తున్నది కనుక! రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన 2500 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 600 కోట్లతో అద్భుతంగా నిర్మించిన తెలంగాణా కొత్త సచివాలయం కళ్లెదుట కనిపిస్తుంటే అంత డబ్బును బాబు ఏం చేసి ఉంటాడనే ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ ఒక కీలకమైన అంశం. తద్వారా పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. అవినీతి తగ్గుతుంది. ఆమేరకు ప్రజల సాధికారత పెరుగుతుంది. రాష్ట్ర విభజనకు ముందు వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్, రాజధాని గుర్తింపు కోసం వేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఈ అంశాలను ప్రస్తావించాయి. వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యా మన్న అభిప్రాయంతో ఉన్నారని విభజనకు ముందే శ్రీకృష్ణ కమిషన్ గుర్తించింది. పరిపాలనను వీలైనంతమేరకు వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కొత్తగా రాజధాని నిర్మాణానికి (గ్రీన్ఫీల్డ్) పూనుకోవద్దనీ, రాజధాని కోసం పంట భూములను వాడుకోవద్దనీ, విజయవాడ – గుంటూరు నగరాల మధ్యన అసలే వద్దని నిపుణుల కమిటీ సూచించింది. ఈ మూడు కీలక సూచనలనూ చంద్రబాబు ప్రభుత్వం నగ్నంగా ఉల్లంఘించింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడానికి కూడా చంద్రబాబు అప్పటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేశారు. అది నిపుణుల కమిటీ కాదు. నారాయణ రిటైర్డ్ న్యాయమూర్తో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారో కాదు. పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణుడో, ఆర్థికవేత్తో కాదు. విద్యను వ్యాపారంగా దిగజార్చిన బేహారుల్లో ముఖ్యుడు. ‘ఆకలితో చావనైనా చస్తాను గానీ సరస్వతీ దేవిని అంగట్లో పెట్టన’ని ప్రతిన చేసి, అమ్మవారి కాటుక కంటి నీరు తుడిచిన పోతన పుట్టిన తెలుగు నేలపై చదువుకు ఖరీదు కట్టి తూకం వేసిన వారిలో అగ్రగణ్యుడు నారాయణ. అటువంటి నారాయణతో కమిటీ వేయడమంటే అది అక్షరాలా ట్రెజర్ హంట్ కాకుంటే మరేముంటుంది? అదే నిజమని ఆచరణలో తేలిపోయింది. బినామీ పేర్లతో వేలాది ఎకరాల సమీకరణ వెనుకనున్న రహస్యం, సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న అభివృద్ధి ఒప్పందాల వెనుకనున్న లోగుట్టు లక్షలకోట్ల కుంభకోణంగా అంచనా వేస్తున్నారు. అరవైమంది ఆందోళనకారులు ఆధార్ కార్డులను చూపలేక చేతు లెత్తేయడంతో అమరావతి రైతుల ఉద్యమం బినామీల ఉద్యమంగా తేలిపోయింది. ఈ మూడున్నరేళ్లలో అమరావతి ట్రెజర్ హంట్ కోసం ఆందోళన చేయడం, అడ్డుగా ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడం, ఆడిపోసుకోవడం, విష ప్రచారాలు ఎక్కు పెట్టడం తప్ప ఎల్లో కూటమి చేసిన ఘన కార్యాలేమీ లేవు. ఇందుకు పూర్తి భిన్నంగా పేద ప్రజల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం నిలబడింది. పరిపాలనా వికేంద్రీకరణను అత్యున్నత స్థాయికి తీసుకొని వెళ్లి పేదవాడి ఇంటి తలుపు తట్టింది. ధనికుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశాన్ని పేద పిల్లలకూ కలుగజేసింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతా లలోని కడగొట్టు వ్యక్తికి కూడా ఆరోగ్య హక్కును కల్పించి, ప్రజారోగ్య విప్లవ పతకాన్ని ఎగురవేసింది. చిన్నరైతు కూడా తలెత్తుకొని నిల బడగలిగేలా చేయందిస్తున్నది. మహిళా సాధికారత కోసం చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవంతంగా ఫలాలనందిస్తున్నాయి. పేద ప్రజల సాధికారత ఈ మూడున్నరేళ్లలో ఉద్యమ రూపం దాల్చింది. పేద ప్రజల ఎంపవర్మెంట్కూ – పెత్తందార్ల ట్రెజర్ హంట్కూ పొత్తు పొసగదు. యుద్ధం జరగవలసిందే. అదే జరుగుతున్నది. పెత్తందార్లది స్వార్థపూరిత యుద్ధం. పేద ప్రజలది న్యాయమైన పోరాటం. న్యాయమే గెలవాలి. గెలుస్తుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏప్రిల్ లోపే విశాఖ నుంచి పాలన.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..
తిరుమల: ఏప్రిల్లోపే విశాఖపట్నం నుంచి పాలన ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని చెప్పారు. భీమిలి రోడ్డులోనే చాలా ప్రభుత్వ ప్రాపర్టీలు, ఐటీ భవనాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వ గెస్ట్ హౌస్ నుంచైనా సీఎం జగన పాలన సాగించవచ్చని సుబ్బారెడ్డి చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నామని, వీలైనంత త్వరగా న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తామని పేర్కొన్నారు. చదవండి: విశాఖే మా రాజధాని.. నేనూ అక్కడికి షిఫ్ట్ అవుతాను: సీఎం జగన్ -
మా రాజధాని విశాఖే: ఏపీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, ఢిల్లీ: ఏపీ కాబోయే పాలనా రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సన్నాహక సదస్సులో.. ఢిల్లీలో మంగళవారం ఆయన పలు కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘మా రాజధాని విశాఖే’ అని ప్రకటించారు. రాబోయే రోజుల్లో మా రాజధానిగా మారనున్న విశాఖపట్నంకు.. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రాబోయే నెలల్లో నేనూ విశాఖపట్నంకు మారబోతున్నాను అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మార్చి 3, 4వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ జరగనుందని ఆయన తెలియజేశారు. తన పిలుపును ఆహ్వానంగా భావించి అక్కడికి రావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తూనే.. అక్కడ జరుగుతున్న వ్యాపారాభివృద్ధిని తోటి ఇన్వెస్టర్లకు తెలియజెప్పాలని సీఎం జగన్ కోరారు. (ఢిల్లీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన.. యథాతధంగా) "Here I am to invite you to Visakhapatnam which is going to be our capital, in the days to come. I myself would also be shifting over to Visakhapatnam in the months to come as well". విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తామని గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా పలు మార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరే నగరానికి లేనంత విశిష్టత, చారిత్రక నేపథ్యం, భౌగోళిక సౌరుప్యం, రవాణా సౌకర్యాలు విశాఖకు ఉన్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన విశాఖపట్నంను రాజధానిగా చేస్తే దాని వల్ల ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని ఇప్పటికే ఎంతో మంది చెప్పారు. దేశంలోని అభివృద్ధి చెందిన టాప్ 10 నగరాల్లో ఒకటైన విశాఖ హైఎండ్ ఐటీ హబ్గా ఎదిగేందుకు ఆస్కారం చాలా ఉంది. -
బ్రెజిల్ అల్లర్లు.. గవర్నర్ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు..
బ్రెజీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు ఆదివారం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 3,000 మంది పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ప్యాలెస్పై దాడి చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయితే భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. దీంతో బ్రెజీలియా గవర్నర్ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడు నెలల పాటు అతన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రెజిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అల్లరిమూకలు దేశ రాజధానిలో హింసకు పాల్పడ్డాయని విమర్శించారు. రాజధానిలో భద్రతా వైఫల్యానికి బోల్సోనారోనే కారణమని లూలా ఆరోపించారు. ఫెడరల్ సెక్యూరిటీ జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, మతోన్మాద స్టాలిన్లు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో పార్టీపై స్వల్ప సీట్ల తేడాతో గెలిచారు లూలా. అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే బోల్సోనారో ఈయన విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి రాజధానిలో బ్రెజీలియాలో ఆదివారం విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
గన్ షాట్ : చంద్రబాబుకు సీమ నేర్పిన పాఠం ఏంటి ..?
-
కర్నూలులో న్యాయరాజధానిను కోరుతూ భారీ ర్యాలీ
-
KSR కామెంట్ : రాజధానిపై కృత నిశ్చయం
-
‘అచ్చం.. టీడీపీకి నువ్వొక్కడివి చాలూ!’
సాక్షి, అమరావతి: పాలనా రాజధాని విశాఖకు అడ్డుపడుతూ.. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం తలపెడుతున్న టీడీపీపై అక్కడి ప్రజాగ్రహం పెల్లుబిక్కుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ సీనియర్ నేతకు ట్విట్టర్ ద్వారా చురకలంటించారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఒక్క అసెంబ్లీ, లోక్సభ స్థానం కూడా గెలవకుండా చేయడానికి నీలాంటి ఒక్కడు చాలు అచ్చం అని వ్యంగ్యం ప్రదర్శించారు విజయసాయిరెడ్డి. ‘టెక్కలిలో నీ ‘టెంకాయ’ ఈసారి ఎలాగూ ముక్కలు అవుతుంది. పాలనా రాజధానిగా వైజాగ్ కాకుండా భ్రమరావతి రియల్ ఎస్టేట్ మాఫియాకు దళారిలా మాట్లాడుతున్నావ్. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్’ అంటూ విమర్శ గుప్పించారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక్క అసెంబ్లీ, లోక్ సభ స్థానం కూడా గెలవకుండా చేయడానికి నీలాంటి ఒక్కడు చాలు అచ్చం. టెక్కలిలో నీ ‘టెంకాయ’ ఈసారి ఎలాగూ ముక్కలవుతుంది. పాలనా రాజధానిగా వైజాగ్ కాకుండా భ్రమరావతి రియల్ ఎస్టేట్ మాఫియాకు దళారిలా మాట్లాడుతున్నావు. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2022 మరో ట్వీట్లో.. బీసీలకు దక్కుతున్న ప్రాముఖ్యత ఓర్వలేకున్నాడంటూ చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కొలీజియానికి లేఖ రాశావే చంద్రం! చెప్పులు మోసేవారిని అందలమెక్కించావు తప్ప పేదలను మనుషులుగా చూశావా? జనాభా ప్రాతిపదికన బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన చరిత్ర జగన్ గారిది. ‘వెన్నుపోటు’ మాత్రమే తెలిసినవాడివి. బ్యాక్ బోన్ కులాల గురించి నీకెందుకు బాబూ? అంటూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేతకు చురకలు అంటించారు. గంజాయి పాత్రుడు, బొల్లి రవీంద్ర, మలమల రాముడు, బండ సత్తిలకు కళ్లు నెత్తికెక్కితే బీసీల స్థితిగతులు మారినట్టా చంద్రం? వీళ్లను అడ్డం పెట్టుకుని బిసిలను మోసం చేశావు. నీ 14 ఏళ్ల పాలనలో బీసీలను నానా రకాలుగా అవమానించినందుకే వారు గుణపాఠం నేర్పారు. మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిస్తారు నిన్ను. pic.twitter.com/M6xZnjg5Zs — Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2022 -
ఉత్తరాంధ్ర గర్జన.. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
ఆ సలహా నాకు గుర్తు రాలేదు.. అమరావతిపై విచారణకు తిరస్కరించిన సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి అంశంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్ తిరస్కరించారు. తాను సభ్యుడిగాలేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, మస్తాన్వలి, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందుకొచ్చాయి. రైతుల తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ.. గతంలో జస్టిస్ యు.యు.లలిత్ సీనియర్ న్యాయ వాదిగా ఉన్న సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమరావతిపై న్యాయసలహా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సుందరం ఇచ్చిన సదరు కాపీని పరిశీలించిన సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ ఈ పిటిషన్లను తాను విచారించనని తెలిపారు. అమరావతిపై న్యాయసలహా ఇచ్చిన విషయం తనకు గుర్తుకురాలేదని, ఈ నేపథ్యంలో తాను ఈ పిటిషన్లపై విచారణ నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నారు. తాను సభ్యుడిగాలేని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ తేదీ తెలపాలని రైతుల తరఫు న్యాయవాదులు కోరగా తాను విచారించని అంశంపై తేదీ నిర్ణయించడం సబబు కాదని, రిజిస్ట్రీ ఖరారు చేస్తుందని పేర్కొన్నారు. చదవండి: (సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ.. పిటిషన్లో కీలక అంశాలివే..) -
శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ మిలియన్ మార్చ్
సాక్షి, కర్నూలు: న్యాయ రాజధానికి మద్దతుగా రాయలసీమ జేఏసీ(నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన ఈ మిలియన్ మార్చిలో మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రాయలసీమ ఉద్యమకారులు పాల్గొన్నారు. కాగా సీమ ముఖద్వారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. రాయలసీమ ఉద్యమకారులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు ఒక్కటై నినదిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించుకోలేమని ఉద్యమబాట పడుతున్నారు. రాయలసీమకు 70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి న్యాయ రాజధానే సరైన పరిష్కారమని నమ్ముతున్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయాల్సిందే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకొచ్చారు. రాజధానుల వికేంద్రీకరణలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టుతోపాటు న్యాయ సంబంధిత సంస్థలన్నింటీని స్థాపించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వికేంద్రీకరణ నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కర్నూలులో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అలాగే వారం రోజుల క్రితం వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ‘న్యాయ’ గళాన్ని వినిపించారు. అక్టోబర్ 30వ తేదీన రాయలసీమ జేఏసీ(నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో 129 ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కర్నూలులో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు జరిగాయి. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోటా న్యాయ రాజధాని కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్పై సంపూర్ణ నమ్మకం మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అమరావతికి జై కొట్టింది. దీంతో రాయలసీమ ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అడ్డుపడుతున్న టీడీపీ నాయకులపై ఉద్యమకారులు ఆగ్రహంతో ఉన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 2014లో రాయలసీమలో రా జధాని ఏర్పాటు చేయాలని, లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరితే చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. ప్రస్తుతం కర్నూలును న్యాయ రాజధాని చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, త్వరలోనే తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావాన్ని రాయలసీమ వాసులు వ్యక్తం చేస్తున్నారు. -
నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ
-
ఐదేళ్ల పాటు రాజధాని పేరిట టీడీపీ గ్రాఫిక్స్
-
విశాఖ పరిపాలన రాజధానిపై వ్యంగ్యంగా మాట్లాడిన పవన్
-
Amaravati: రాజధాని అను ఒక ‘రియల్’ ఎజెండా
పునర్వ్యవస్థీకరణ అనంతరం, కొత్తగా ఏర్పడ బోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం శివరామకృష్ణన్ చైర్మన్గా ఒక కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖకు మాజీ కార్యదర్శి. కమిటీ సభ్యులలో అందరూ సంబంధిత రంగంలో నిపుణులే. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివి : విజిటిఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో ఇప్పటికే భూముల ధరలు పెరిగిపోయాయి కనుక నీటి వనరులు, రవాణా, రక్షణ, చారిత్రక అంశాల ఆధారంగా రాజధాని నిర్మాణ ప్రదేశం ఎంపిక చేయాలి. విశాఖపట్నంలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయవచ్చు. నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండవలసిన అవసరం లేదు. విశాఖపట్నంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి. విశాఖపట్నంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం పట్టవచ్చు. ఇంత స్పష్టంగా శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను అందించినప్పటికీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివేదికను బుట్టదాఖలు చేసి, తన ‘రాజకీయ గురువు’ సూచించిన ‘అమరావతి’ పేరుతో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అందులో భాగంగా 2014 జూలై 14న ‘నారాయణ కమిటీ’ని నియమించారు. ఆ కమిటీలో సభ్యులను చంద్రబాబు ప్రభుత్వమే నియమించింది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్ చౌదరి, మండవ ప్రభాకర్ చౌదరి, మరో ఐదుగురు సభ్యులతో ఆ కమిటీ ఏర్పడింది. అనంతరం రాజధాని ఏర్పాటుపై లీకులు మొదలయ్యాయి. నారాయణ కమిటీ రిపోర్టు పేరుతో దొనకొండ, నూజివీడు, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రాంతం ఉండవచ్చని ప్రచారాలు మొదలు పెట్టారు. అది నమ్మి కొందరు దొనకొండ, నూజివీడుల్లో వేల ఎకరాల భూములు కొని మోసపోయారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు, ఆయన సామాజిక వర్గ నేతలు మాత్రం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రాంతంలో భూములు కొన్నారు. మొదట నాగార్జున యూనివర్సిటీ దగ్గర, విజయవాడ–గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని రావచ్చని చంద్రబాబు తనకు చెప్పారని నక్కా ఆనంద్బాబు ఏబీఎన్ ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు. తర్వాత స్వయంగా చంద్రబాబే నర్మగర్భంగా గుంటూరు–విజయవాడ మధ్య రాజధాని వస్తుందని 2014 సెప్టెంబర్ 4న శాసనసభలో ప్రకటించారు. 2014 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. కానీ 2014 సెప్టెంబర్లోనే కొంతమంది చంద్రబాబు అనుయాయులు 29 గ్రామాల పరిసరాల్లోని భూములు కొని అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు! ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్కు ముందే జరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి నిర్మాణం పేరుతో 34,000 ఎకరాల భూ సేకరణకు పూనుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని శాసన సభ, శాసన మండలి, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను 200 ఎకరాల్లోనే ఉంచడం గమనించాల్సిన విషయం. ఏపీసీఆర్డీఏ యాక్ట్ ఫామ్ 9.14 బీ ప్రకారం ల్యాండ్ పూలింగ్లో ఒక్కో ఎకరానికి 250 సెంట్లు అభివృద్ధి చేసిన ప్లాటు ఇచ్చే విధంగా రైతులతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని ప్రకటనకు ముందు సీఆర్డీఏ ప్రాంతంలో ఎకరం రూ.15 లక్షలు ఉండేది. అయితే ‘హ్యాపీనెస్ట్’ పేరుతో జరిగిన విక్రయాల్లో ఎకరానికి రూ.10 కోట్ల రేటుకు సీఆర్డీఏ అమ్మింది. అంటే ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చిన ప్రతి రైతు ఎకరానికి రూ.2.5 కోట్లు లబ్ధి పొందినట్లేగా! ఇందులో త్యాగం ఎక్కడుంది? 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దండరాయని పాలెంలో రాజధానికి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకు హాజరు కాలేకపోవటానికి కారణాలు చూపుతూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15నే చంద్రబాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కున్న విధానం, కమీషన్ల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా ఇస్తూ సీఆర్డీఏ 42 శాతం తీసుకోవటంలో ఉన్న స్కామ్ను తెలియ జేస్తూ.. చంద్రబాబు తన వర్గాన్ని బినామీలుగా పెట్టుకుంటూ భూదోపిడీకి పాల్పడుతున్నందున శంకుస్థాపనకు తనను ఆహ్వానించవద్దని నిర్మొహమాటంగా తెలియజేశారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) గుంటూరు–విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చింది. నవ నగరాల నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే అమరావతిలో చంద్రబాబు 5 ఏళ్లలో కేవలం రూ.5,674 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు (ఇందులో సుమారు రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది). అంటే ప్రతి సంవత్సరం పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుంటే రాజధాని నిర్మాణానికి మరో 100 ఏళ్లు పడుతుంది. అయితే రాజధానిని ఆర్నెల్లలో పూర్తి చేయాలని 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని భూ యజమానులకు చెందిన పునర్నిర్మిత ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనీ; అమరావతి రాజధాని నగరంలో నివాసానికి అనువుగా ఉండేలా అప్రోచ్ రోడ్లు, తాగునీరు, ప్రతి ప్లాట్కు విద్యుత్ కనెక్షన్, డ్రైనేజీ మొదలైనవి ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది! (క్లిక్ చేయండి: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు) - పొనకా జనార్దన రెడ్డి మహా ప్రశాసకులు, ఏపీ ప్రభుత్వం -
విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటే టీడీపీ నేతలు చరిత్ర హీనులవుతారు: మంత్రి బొత్స
-
విశాఖకు రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి: అవంతి
-
రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం: మంత్రి అమర్నాథ్
-
విశాఖ గర్జన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జేఏసీ మీడియా సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రేపు(శనివారం) విశాఖ గర్జనలో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలుపుతామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఒక వర్గం మీడియా దెబ్బతీస్తోందన్నారు. మా పోరాటంలో భాగస్వామ్యం కాకపోయినా హాని చేయొద్దన్నారు. మేం అమరావతి, రాయలసీమ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ తమ పోరాటానికి సంఘీభావం తెలపాలని మంత్రి కోరారు. విశాఖను రాజధానిగా సాధించుకుని తీరతామన్నారు. చదవండి: టీడీపీ బినామీలు గో బ్యాక్.. వికేంద్రీకరణ ముద్దు అంటూ నినాదాలు విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల హక్కు: అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల హక్కు అన్నారు. విశాఖకు రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. విశాఖలో రూ.5వేల కోట్లు పెడితే బ్రహ్మాండమైన రాజధాని అవుతుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు: జేఏసీ కన్వీనర్ ఉత్తరాంధ్ర దశాబ్ధాలుగా వెనుకబడి ఉందని జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలిపేలా విశాఖ గర్జన జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. జేఏసీ ఉద్యమం అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని జేఏసీ కో కన్వీనర్ దేవుడు అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకుని తీరతామన్నారు. -
టీడీపీ బినామీలు గోబ్యాక్.. గోబ్యాక్
సాక్షి, పశ్చిమ గోదావరి: రైతులుగా చెప్పుకుంటూ అమరావతి పేరిట పాదయాత్ర చేపట్టివాళ్లకు రెండో రోజూ(బుధవారం) నిరసన సెగ తగిలింది. జిల్లాలోని తణుకు పట్టణంలో పాదయాత్రకు వ్యతిరేకంగా అడుగడుగునా నిరసనలు దర్శనమిచ్చాయి. టీడీపీ బినామీలు గోబ్యాక్.. గోబ్యాక్ నినాదాలు చేశారు అక్కడి ప్రజలు. వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మద్య చిచ్చు వద్దంటూ సందేశాలతో పట్టణంలో అమరావతి యాత్రకు స్వాగతం పలికాయి. గోబ్యాక్ సందేశాలతో బ్యానర్లు వెలిశాయి. ఇంకోవైపు మూడు రాజధానులే కావాలంటూ ప్రజలు ఫ్లకార్డులు సైతం ప్రదర్శించారు. ఇదీ చదవండి: చంద్రబాబు పేకలో పవన్కల్యాణ్ జోకర్ -
బిగ్ క్వశ్చన్ : చంద్రబాబు డైరెక్షన్ ... పవన్ కళ్యాణ్ యాక్షన్
-
పవన్ కళ్యాణ్ నోట పూటకో మాట
-
వికేంద్రీకరణకు మద్దతుగా...
-
వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా YSRCP ప్రత్యేక పూజలు
-
మూడు రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి : కొడాలి నాని
-
పాలనా రాజధానికై ఎందాకైనా ఉద్యమిస్తాం : ఉత్తరాంధ్రులు
-
విశాఖ అన్ని విధాలుగా రాజధానికి అనుకూలం : ప్రొ.జీఎన్ రాజు
-
ఆ విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరాం: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే మా లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే సుప్రీంకు వెళ్లామన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకముందే అమరావతి రాజధానిగా ప్రకటించారని తెలిపారు. రాజధానిపై చంద్రబాబు వేసింది ఎక్స్పర్ట్ కమిటీ కాదు.. ఇన్వెస్ట్మెంట్ కమిటీ అని ఎద్దేవా చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవడంతోనే ఉద్యమాలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రాధికారానికి భంగం కలిగించే విధంగా ఉన్న తీర్పుపైనే సవాల్ చేశామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చదవండి: (అనంతపురం బీఈఎల్కు లైన్ క్లియర్) -
ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుపై ముందుకు.. కేంద్రం సానుకూలం!
సాక్షి, ఢిల్లీ: రాజధానుల ఏర్పాటుపై ఆయా రాష్ట్రాలకే అధికారం ఉండాలన్న వైఎస్సార్సీపీ విధానానికి కేంద్రం మద్దతు తెలపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా బీజేపీ అధిష్ఠానం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర అసెంబ్లీకి స్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ మొన్నటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును ప్రవేశపెట్టారు. చదవండి: ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ ఎన్వీ రమణకు విందు రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా తిరుగులేని అధికారం ఉందన్న పార్టీ విధానాన్ని విజయసాయిరెడ్డి పెద్దల సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టికల్ 3కు రాజ్యాంగ సవరణ చేసి 3ఏను చేర్చాలని ఆ బిల్లులో ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై పార్లమెంటు వచ్చే శీతాకాల సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. దీనిపై కేంద్రం కూడా పూర్తి సానుకూలంగా ఉందంటూ జాతీయ మీడియా పేర్కొంది. ప్రైవేట్ బిల్లుకు బదులుగా అధికారపార్టీనే ఆర్టికల్ 3 సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాదు.. ప్రైవేటు బిల్లును ఉపసంహరించుకోవాలని విజయసాయిరెడ్డికి బీజేపీ అధిష్ఠానం సూచించనున్నట్టు తెలిపింది. ఈ మధ్యకాలంలో జనతాదళ్ యునైటెడ్ లాంటి పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లడంతో బీజేపీ బలం రాజ్యసభలో 108కి తగ్గింది. పెద్దల సభలో ప్రతిపక్షాలకు 129 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే.. అధికారపార్టీకి మరో 79 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. -
మన లక్ష్యం రూ.10,000 కోట్లు: గెయిల్
న్యూఢిల్లీ: వాటా మూలధనాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా స్పెషాలిటీ కెమికల్స్, శుద్ధ ఇంధన బిజినెస్లను జత చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. సహజవాయు రవాణా, పంపిణీ బిజినెస్కు జతగా మరిన్ని విభాగాలలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. రానున్న మూడు, నాలుగేళ్లలో అమలుచేయ తలపెట్టిన విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా వాటా మూలధనాన్ని ప్రస్తుత రూ. 5,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు పెంచుకునేందుకు వాటాదారుల అనుమతిని కోరినట్లు వెల్లడించింది. జాతీయ గ్రిడ్ను సృష్టించే బాటలో కంపెనీ నేచురల్ గ్యాస్ పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. 2030కల్లా ప్రధాన ఇంధన బాస్కెట్కు 15 శాతం సహజవాయు సరఫరాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా రానున్న 3–4ఏళ్లలో గెయిల్ సుమారు రూ. 30,000 కోట్ల పెట్టుబడి వ్యయ ప్రణాళికలు వేసింది. వీటిలో కొంతమేర అంతర్గత వనరులు, మరికొంత రుణాలు, ఈక్విటీ మార్గంలో సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వాటాదారులకు గెయిల్ తాజాగా తెలియజేసింది. మరోవైపు వాటాదారులకు బోనస్ షేర్ల జారీ ప్రతిపాదన సైతం ఉన్నట్లు పేర్కొంది. చదవండి: ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే! -
యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ వద్ద కలకలం
వాషింగ్టన్: వాషింగ్టన్లోని యూఎస్ క్యాపిటల్ భవన సముదాయం వద్ద ఆదివారం వేకువజామున అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుతో వచ్చి క్యాపిటల్ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. వాహనం దిగి గాల్లోకి కాల్పులు జరిపాడు. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అతడు దిగగానే మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో భవన సముదాయంలో కొద్ది మంది సిబ్బందే ఉన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్లో ఎఫ్బీఐ సోదాలు జరిపినప్పటి నుంచి ఫెడరల్ అధికారులకు బెదిరింపులు, ప్రభుత్వ భవనాలపై దాడులు జరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. -
త్వరలోనే విశాఖ వేదికగా పరిపాలన రాజధాని: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత విశాఖ రాజధాని అవుతుందన్నారు. ‘‘చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారు. వరద నీటిని పట్టుకుని తాగునీరు అంటూ మాట్లాడతారా? అంటూ దుయ్యబట్టారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందన్నారు. చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు సింగర్ శ్రావణి భార్గవి పాట వివాదంపై.. సింగర్ శ్రావణి భార్గవి పాట వివాదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ఇది టీటీడీకి సంబంధించినది కాదని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటి మీద ఏ విధంగా స్పందిస్తామని ఆయన ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామికి ప్రియ భక్తుడైన అన్నమయ్య పాటకు అపచారం కలిగించడం అంటే మహాపాపం. తొలి వాగ్గేయకారుడిగా అన్నమయ్యను గౌరవించుకుంటున్నాం. అన్నమయ్య పేరు మీద జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. -
నాలుగేళ్లకే 198 రాజధానుల పేర్లు చెప్పి...రికార్డు సృష్టించింది
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): నాలుగేళ్లకే 198 దేశాలు.. వాటి రాజధానులు టకటకా చెప్పేసింది. అదీ కేవలం రెండున్నర నిమిషాల్లో.. చాలా మందికి అసాధ్యమనుకునే ఈ ఘనతను సాధించి రికార్డులకెక్కింది. స్కూల్ ముఖం కూడా చూడని ఆ వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు లిఖించుకుంది. ఆమే ఎండాడకు చెందిన దత్తు ప్రకాష్, దత్తు అపర్ణల ముద్దుబిడ్డ దత్తు శ్రీ నందన. శ్రీనందన చిన్నప్పటి నుంచి టీవీ, మొబైల్కు వంటి వాటికి ఆకర్షణకు గురి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించారు. చిన్నారిలో అంతర్లీనంగా దాగి ఉన్న తెలివితేటలు, జ్ఞాపకశక్తిని గుర్తించి.. కథలో పాటు జనరల్ నాలెడ్జ్ అంశాలు వివరించే ప్రయత్నం చే శారు. అలా 198 దేశాల పేర్లు, రాజధానులు నేర్పించారు. నాలుగేళ్లకే అవన్నీ గుర్తుకు పెట్టుకున్న నందన కేవలం రెండున్నర నిమిషాల్లోనే దేశాలు– రాజధానులు టకటకా చెప్పి.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం చిన్నారి వయసు ఏడేళ్లు. ఇప్పుడు ప్రపంచంలోని మొత్తం దేశాలు వాటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సరిహద్దులను ఠక్కున చెబుతోంది. ఈ చిన్నారి తన మైండ్లో గ్లోబ్ మొత్తం గుర్తుకు పెట్టుకుంది. ప్రపంచ దేశాలు, నాలుగు సరిహద్దులకు సంబంధించి దాదాపు 800 ప్రశ్నలకు సమాధానాలను కొన్ని సెకన్లలో చెప్పేస్తోంది. ఇది కేవలం మైండ్ మ్యాపింగ్ అనే పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యమని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఈవెంట్తోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కోసం ప్రయత్నం చేసింది. ఇటీవల పిక్ ఏ బుక్ వేదికపై జరిగిన ఈవెంట్లో న్యాయనిర్ణేతల సమక్షంలో శ్రీనందన ప్రదర్శనను రికార్డ్ చేసి.. గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించిన నాటి కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ మొదలు స్థానిక నాయకులు, గాయకులు, ప్రముఖులు ఇలా ఎందరో శ్రీనందనను ప్రశంసించారు. పలు టీవీ షోలు, ఎఫ్ఎంలలో శ్రీనందన తన అనుభవాలను పంచుకుంది. (చదవండి: ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ) -
ఉత్తరాంధ్రపై మరోసారి అక్కసు వెల్లగక్కిన చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం : అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించి.. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు కాంక్షిస్తుండగా.. చంద్రబాబు మాత్రం ఈ ప్రాంతం మీద తన అక్కసు మరోసారి వెళ్లగక్కారు. భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో గురువారం నిర్వహించిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజల మనస్సు చివుక్కుమనేలా చేశాయి. ‘అమరావతిని రాజధానిని చేస్తాననీ.. వైజాగ్ని అభివృద్ధి చేస్తానంటూ’ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ను ప్రపంచ పటంలో పెడతానంటూ మరోసారి అదే పాచిపోయిన పాత పల్లవిని అందుకున్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని మరోసారి తేటతెల్లం చేశాయని జనం వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అయితే.. విశాఖ అభివృద్ధి తథ్యమనీ, ఈ విషయం కూడా చంద్రబాబుకు తెలియకుండా సుదీర్ఘ అనుభవం అంటూ ఎలా బాకాలు కొట్టుకుంటున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. రాజధాని ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం కచ్చితంగా అభివృద్ధి చెందుతుందనీ.. ఉత్తరాంధ్ర మొత్తం విశాఖను రాజధానిగా చూడాలని ఎదురు చూస్తుంటే.. దాన్ని అడ్డు కునేందుకు టీడీపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలు ఇకపై సాగవంటున్నారు. వైజాగ్ యువతకు ఉపాధి కల్పించానంటూ ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న సమయంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం చదివితే మొద్దుబారిపోతారంట? పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి చదువులు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టగా.. దాన్ని అడ్డుకునేందుకు టీడీపీ న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం విదితమే. అయితే పేదలకు నాణ్యమైన విద్య అందకూడదన్న చంద్రబాబు కుయుక్తులు మరోసారి బహిర్గతమయ్యాయి. సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘నాడు–నేడు అని జగన్ అంటున్నాడు.. మీ పిల్లలకు ఇంగ్లిష్ నేర్పుతా అన్నాడు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు తయారైంది రాష్ట్రం’ అని చేసిన వ్యాఖ్యలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో ఆయన మనవడు, కొడుకు ఇంగ్లిష్ మీడియంలో చదివారు కదా.. మొద్దబ్బాయిలు అయ్యారా అని గుసగుసలాడుకోవడం కనిపించింది. ఓవైపు పేద విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ తరహా విద్య అందిస్తుంటే.. దాన్ని కూడా చెడగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటం సరికాదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ హయాంలో ఏనాడూ విద్యపై దృష్టి సారించలేదనీ.. ఇప్పుడు పాఠశాలల రూపు రేఖలు మారుతుంటే చూసి ఓర్వలేక.. ఇలా తప్పుడు స్టేట్మెంట్లు చేయడం హేయమని మండిపడుతున్నారు. బాదుడే.. బాదుడు అంటూ సభ నిర్వహించిన చంద్రబాబు ప్రతి మాటలోనూ, ప్రతి పదంలోనూ ఉత్తరాంధ్రపై విషం కక్కడంపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతోంది. విశాఖకు రాజధాని రాకుండా టీడీపీ ఏ విధంగా కుట్రపన్నుతుందో స్పష్టమైందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన సెగ నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఉదయం కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఉత్తరాంధ్ర బీసీ సంఘాల నేతలు, పలు మహిళా సంఘాల నాయకులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజధానిగా అభివృద్ధి చెందకుండా విశాఖపై చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. రాజధానిగా విశాఖకు చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అంటూ ఉత్తరాంధ్ర మహిళా ప్రతినిధులు నినాదాలు చేశారు. బయట జరుగుతున్న ఆందోళన గురించి తెలుసుకున్న చంద్రబాబు.. గొడవ జరుగుతున్నంత సేపూ రాజధాని అంశంపై కిమ్మనకుండా ప్రసంగించడం గమనార్హం. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. అదే వ్యవహారశైలితో చంద్రబాబు విశాఖపై విషం వెళ్లగక్కుతుంటే.. కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు ఆ కల నెరవేరకుండా అడ్డుకుంటున్నారంటూ అధినేత వ్యాఖ్యలపై అసహనం చెందడం కొసమెరుపు. (చదవండి: ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు) -
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం: సీఎం జగన్