
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానికి సంబంధించిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సీజే అరూప్కుమార్ గోస్వామితో పాటు జస్టిస్ బాగ్చి, జస్టిస్ జయసూర్యతో ఏర్పాటైన ఫుల్ బెంచ్ మొత్తం 57 పిటిషన్లపై విచారణ జరిపింది. తదుపరి విచారణ నవంబర్ 15కు వాయిదా వేసింది.