క్షణాల్లో కారు దగ్ధం...తృటిలో బయటపడ్డారు.. | car caught fire in Nidamanuru, none hurt | Sakshi
Sakshi News home page

క్షణాల్లో కారు దగ్ధం...తృటిలో బయటపడ్డారు..

Published Wed, May 1 2019 10:20 AM | Last Updated on Wed, May 1 2019 12:23 PM

 car caught fire in Nidamanuru, none hurt - Sakshi

సాక్షి, నిడమానూరు : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద హైవేపై బుధవారం ఉదయం ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి పాలకొల్లు వెళుతున్న ఐ-టెన్‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారును డ్రైవ్‌ చేస్తున్న మల్లాది నరసింహ శాస్త్రి మంటలను గమనించి వెంటనే వాహనాన్ని పక్కకు తీశారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారంతా దిగగానే మంటలు ఒక్కసారిగా చెలరేగి, క్షణాల్లో కారు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని  ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న నరసింహ శాస్త్రి పాలకొల్లులోని తమ బంధువులు ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంపై అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement