మాజీ ఎంపీ హర్షకుమార్‌పై దౌర్జన్యం కేసు | case filed on ex-mp harsha kumar | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ హర్షకుమార్‌పై దౌర్జన్యం కేసు

Published Sat, May 30 2015 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

case filed on ex-mp harsha kumar

రాజమండ్రి రూరల్: మాజీ ఎంపీ హర్షకుమార్, ఆయన అనుచరులపై తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. హర్షకుమార్ ఆయన అనుచరులు తమ పొలంలోకి చొరబడి నిర్మాణంలో ఉన్న షెడ్డును ఆపేయాలంటూ దౌర్జన్యం చేశారని కనమూరి రామలింగరాజు అనే వ్యక్తి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆడిటర్ భాస్కర్‌రామ్ కూడా తన పొలంలోని పాకను హర్షకుమార్, ఆయన అనుచరులు తొలగించారంటూ బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement