Case Filed
-
కాంట్రాక్ట్ లెక్చరర్ కు రెడ్ బుక్ వేధింపులు
-
నకిరేకల్ పీఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదు
-
ఏసీబీ కేసు నమోదు చేయటంపై ఎక్స్ లో విడదల రజినీ పోస్ట్
-
కాసుల కోసం కక్కుర్తి పడ్డారు.. కేసులు ఎదుర్కొంటున్నారు
-
హరీష్రావుపై మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుకు బిగ్ షాక్ తగిలింది. హరీష్రావుపై మరో కేసు నమోదైంది. చక్రధర్గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నగరంలోని బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.ీబీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుపై మరో కేసు నమోదైంది. హరీష్రావుపై పాటు మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్రావు, సంతోష్ కుమార్, పరశురాములు, వంశీకృష్ణపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం.. హరీష్రావుపై 351(2), ఆర్డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా వంశీకృష్ణ, ఏ2గా హరీశ్రావు పేరును పోలీసులు చేర్చారు. -
మిర్చి రైతులకు అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ పై కేసు
-
‘రైతుల గోడు వింటే కేసు పెడతారా?’
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరదీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్పై కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అసలు ఆ పర్యటనకు రాకపోయినా కేసు నమోదు చేయడం. వైఎస్ జగన్, పేర్ని నానితో పాటు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, గుంటూరు మేయర్ కావట్టి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మిర్చి రైతుల(Mirchi Farmers) కష్టాలుపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే కక్ష కట్టి చంద్రబాబు ప్రభుత్వం తమ నేతలపై కేసు పెట్టిందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
ఢిల్లీ పోలింగ్.. కేజ్రీవాల్కు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయనపై మంగళవారం హర్యానాలో ఓ కేసు నమోదైంది.ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలిపిందని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్ కూడా విసిరారు. దీంతో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగి మరీ కేజ్రీవాల్ విమర్శలను తిప్పికొట్టారు. అదే సమయంలో.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ(PM Modi), కేజ్రీవాల్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం దాకా కూడా చేరింది. అయితే.. అయితే.. ఈ అంశంపై తాజాగా షాబాద్(Shahbad)కు చెందిన జగ్మోహన్ మంచందా అనే లాయర్, కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగ్మోహన్ పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు. -
ఢిల్లీ సీఎంపై కేసు నమోదు.. సీఈసీపై అతిషీ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ (Atishi Marlena)పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఆమెపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో ఆమె మద్ధతుదారులపైనా మరో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ పరిణామాలతో ఆమె ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు అరవై మంది మద్ధతుదారులతో.. పది వాహనాల్లో ఆమె పతేహ్ సింగ్ మార్గ్కు వచ్చారు. అయితే ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా.. ఆమె నిరాకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడమే అని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో ఆమె మద్ధతుదారులపైనా మరో కేసు నమోదైంది. అయితే ఈ పరిణామంపై అతిషి ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ పోలీసులు అక్రమంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, నిజంగా కోడ్ను ఉల్లంఘించిన వాళ్లను వదిలేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్పైనా ఆరోపణలు గుప్పించారు.ఎన్నికల సంఘం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. రమేష బిధూరి కుటుంబ సభ్యులు బహిరంగంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. అయినా వాళ్ల మీద ఎలాంటి చర్యలు లేవు. అందుకు సంబంధించిన ఘటనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశా. ప్రతిగా నా మీదే కేసు నమోదు చేశారు. రాజీవ్కుమార్గారూ.. ఎన్నికల ప్రక్రియను ఇంకెంత దిగజారుస్తారు? అంటూ సందేశం ఉంచారామె. ఇదిలా ఉంటే.. ఆప్ కన్వీనర్ సైతం సీఈసీ రాజీవ్కుమార్ మీద ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగాల్సి ఉంది.चुनाव आयोग भी ग़ज़ब है!रमेश बिधूड़ी जी के परिवार के सदस्य खुले-आम आचार संहिता का उल्लंघन कर रहे हैं। उन पर कोई एक्शन नहीं।मैंने शिकायत कर के पुलिस और @ECISVEEP को बुलाया, और इन्होंने मेरे ऊपर केस दर्ज कर दिया! राजीव कुमार जी: आप चुनावी प्रक्रिया कि कितनी धज्जियां उड़ायेंगे https://t.co/UlRiBzbELV— Atishi (@AtishiAAP) February 4, 2025 -
హీరో వెంకటేష్ పై కేసు నమోదు.. దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్ట్ షాక్
-
పెళ్లికి సహాయం చేస్తానని పిలిచి..
శివాజీనగర: అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై వ్యాపారి, మాజీ బీజేపీ నాయకుడు సోమశేఖర్ జయరాజ్ (జిమ్ సోమ)పై అశోక్ నగర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆర్థిక సహాయం చేస్తానని పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారని 26 సంవత్సరాల బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారురాలికి తన స్నేహితురాలి ద్వారా సోమశేఖర్ పరిచయం అయ్యాడు. గత సంవత్సరం వివాహం నిర్ణయం కావటంతో రూ. 6 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సోమశేఖర్ను బాధితురాలు కోరింది. గత అక్టోబర్లో డబ్బు ఇస్తానని చెప్పి లాంగ్ ఫోర్ట్ రోడ్డులో ఉన్న తన ప్లాట్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని సోమశేఖర్ బెదిరించినట్లు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా పరారీలో ఉన్న సోమశేఖర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సకలేశపుర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమశేఖర్... జేడీఎస్కు చెందిన హెచ్.కే.కుమారస్వామి చేతిలో ఓటమిపాలయ్యాడు. -
విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు
-
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు
-
మోహన్ బాబుపై కేసు నమోదు..
-
అడ్డగోలు కేసులతో అడ్డంగా దొరికిన పోలీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అడ్డగోలుగా కేసులు పెట్టిన మంగళగిరి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయారు. దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్నారంటూ గుంటూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డిపై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు ఇప్పుడు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ బాసులను సంతృప్తిపరిచేందుకు ముందువెనకా ఆలోచించకుండా కేసులు పెట్టిన పోలీసులు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సిన స్థితికి వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో తాను నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నానంటూ సుబ్బారెడ్డి తగిన ఆధారాలను హైకోర్టు ముందుంచడంతో పోలీసులు హైకోర్టుకు దొరికిపోయారు. ఆ ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ఘటన జరిగిన సమయంలో సుబ్బారెడ్డి తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే.. ఆయన టీడీపీ ఆఫీసు వద్ద ఉన్నారని, ఇదే విషయాన్ని సాక్షులు కూడా రూఢీ చేశారంటూ సీఐడీ దర్యాప్తు అధికారి కౌంటర్ దాఖలు చేయడంపై ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. సుబ్బారెడ్డి టీడీపీ ఆఫీసు వద్ద ఉన్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందని కూడా కౌంటర్లో చెప్పడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన జరిగిన రోజున సుబ్బారెడ్డి నర్సరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే, అదే రోజున ఆయన టీడీపీ కార్యాలయం వద్ద ఉండటం ఎలా సాధ్యమని పోలీసులను ప్రశ్నించింది. అలా ఉండే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారి అయిన సీఐడీ డీఎస్పీని ఆదేశించింది. ఈ నెల 12న మధ్యాహ్నం 2.15 గంటలకు స్వయంగా తమ ముందు హాజరు కావాలని డీఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో..2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అడ్డగోలుగా కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లేని వారిని కూడా నిందితులుగా చేర్చారు. అలా నిందితులుగా చేర్చిన వారిలో గుంటూరు 28వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును సీఐడీకి బదలాయించింది. సుబ్బారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లో దర్యాప్తు అధికారి అయిన సీఐడీ డీఎస్పీ కౌంటర్ దాఖలు చేశారు. ఘటన జరిగిన రోజున సుబ్బారెడ్డి టీడీపీ కార్యాలయం వద్దే ఉన్నారని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని తన కౌంటర్లో పేర్కొన్నారు. సుబ్బారెడ్డి అక్కడ ఉన్నట్టు సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉందని వివరించారు.పోలీసులు చిక్కుకున్నారిలా..సుబ్బారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రాగా.. జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అడ్డగోలుతనానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ అని న్యాయస్థానానికి తెలిపారు. మేనల్లుడి పెళ్లిలో ఉన్న వ్యక్తిని ఘటనా స్థలంలోనే ఉన్నారని పేర్కొంటూ ఏకంగా హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేసేంత సాహసం చేశారన్నారు. సుబ్బారెడ్డి ఘటన జరిగిన రోజున నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నారనేందుకు ఇప్పటికే ఆధారాలను కోర్టు ముందుంచామన్నారు. సీఐడీ డీఎస్పీ తన కౌంటర్లో సుబ్బారెడ్డి ఘటనా స్థలంలో ఉన్నట్టు పేర్కొన్న విషయాన్ని నాగిరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.పిటిషనర్ సీసీ టీవీలో ఎక్కడ ఉన్నారో చూపేలా డీఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పెళ్లిలో ఉన్న సుబ్బారెడ్డి, ఘటనా స్థలం (టీడీపీ పార్టీ కార్యాలయం) వద్ద ఉండటమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. -
ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు..హరీశ్రావుపై కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్గౌడ్ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్ఫోర్స్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్రావుపై ఫోన్ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్షీట్: హరీశ్రావు -
ఆరోపణలు ఖండించిన అదానీ గ్రూప్
-
అనకాపల్లిలో రాంగోపాల్ వర్మపై మరో కేసు
-
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు!
-
కొడాలి నానిపై కేసు
-
మహాసేన రాజేష్ పై పోలీస్ కేసు..
-
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మపైనా కేసు
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదలలేదు. వ్యూహం సినిమా నిర్మించే క్రమంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలను కించపరిచేలా పోస్టింగ్ పెట్టారన్న ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.వివేకానందరెడ్డి సినిమాను దారుణంగా తీసి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై డైరెక్టుగా ఎన్నో అభాండాలు వేస్తూ యూట్యూబ్లోనూ, ఇతర ప్రసార మాధ్యమాలలోనూ చేసిన ప్రచారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. సెన్సార్ బోర్డు పర్మిషన్ తీసుకుని సినిమా తీసిన ఆర్జీవీపై వ్యక్తిగతంగా కేసు పెట్టడంపై సినిమా వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరి సెన్సార్ బోర్డు ఉన్నది దేనికి అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యక్తిగతంగా కేసులు పెట్టడం దుర్మార్గమని సినిమా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద మద్దిపాడు పోలీసులు 336/4, 356/4, 196/356, ఐటీ/67 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
కదిరిలో సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు
-
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు
-
ఆయిల్ ట్యాంకర్లో బీర్ బాటిళ్లా?! ఎంతకు తెగించారు రా? వైరల్ వీడియో
బీహార్లో ఓ ఆయిల్ ట్యాంకర్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు వల పన్నడంతో డ్రైవర్ ,మద్యం వ్యాపారి ట్యాంకర్ను జాతీయ రహదారిపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్లో సుమారు 200 బీరు డబ్బాలను తరలించేందుకు ప్రయత్నించారు స్మగర్లు. అయితే దీనికు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందిండంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమించిన స్మగ్లర్లు ట్యాంకర్ను జాతీయ రహదారి వైపు మళ్లించడాన్ని గమనించిన అధికారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో డ్రైవర్, మద్యం వ్యాపారి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు. నాగాలాండ్లో రిజిస్టర్ అయిన ట్యాంకర్ను ముజఫర్పూర్లో స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. అలాగే పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్లో తయారైందని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా చేసిన స్థానిక వ్యాపారిని గుర్తించి, అతడిని అరెస్టు చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.కాగా బీహార్లో మద్యం అమ్మకం నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం, అక్రమ రవాణాకు, విక్రయాలకు వ్యాపారులు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు అంబులెన్స్లు, ట్రక్కులలో తరలించిన వైనాన్ని చూశాం. అంతేకాదే మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు పెట్రోల్ ట్యాంకుల లోపల కంపార్ట్మెంట్లు నిర్మించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యం బారిని పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ये बिहार है बाबू! मुजफ्फरपुर में तेल टैंकर से पेट्रोल की बजाय निकलने लगी अवैध शराब#Bihar pic.twitter.com/gE0GJP4afl— Mangal Yadav (@MangalyYadav) October 23, 2024 -
కూటమి కక్ష సాధింపు.. సాక్షి పై కేసు నమోదు
-
హైదరాబాద్: మేయర్పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బతుకమ్మ కార్యక్రమంలో శబ్ద కాలుష్యం నియమాలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కేసు నమోదైంది. శబ్ధ కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తూ బతుకమ్మ వేడుకలకు అనుమతించి, సమయానికి మించి అధిక డెసిబుల్ సంగీతాన్ని అనుమతించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్పై కేసు నమోదు
బెంగళూరు: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం రద్దైన ఎన్నికల బాండ్ల పేరిట మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు చట్టసభల ప్రతినిధుల న్యాయస్థానం తిలక్నగర్ పోలీసులను ఆదేశించింది.కాగా పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మతా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్షపరిషత్తుకు చెందిన ఆదర్శ్ గతంలో తిలక్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సంతోశ్ గజానన ధర్మాసనం..నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు.కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతోపాటు ఎఫ్ఐఆర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ నతేలు, నలీన్ కుమార్ కటీల్, బీఐ విజయేంద్ర పేర్లను కూడా చేర్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో ఒత్తిళ్లు పెంచి కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలతో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎలక్టోరల్ బాండ్లను జాతీయ, రాష్ట్ర స్థాయిలలోని బిజెపి నాయకులు నగదుగా మార్చుకున్నారని తెలిపారు.కాగా నగదు రూపంలో పార్టీలకు ఇచ్చే విరాళాలకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చే పథకాన్ని కేంద్రప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే,ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో ఈ బాండ్ల విధానాన్ని రద్దు చేసింది. ఇది ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది -
యూట్యూబర్ హర్షసాయి కేస్ లో బిగ్ ట్విస్ట్
-
దళిత వైద్యుడిపై దాడి కేసులో నిందితుల వైపు కూటమి సర్కార్
-
జానీ మాస్టర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
-
జానీ మాస్టర్ అరెస్ట్ కు రంగం సిద్ధం..!
-
ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ బాషాపై కేసు నమోదు
-
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై కేసు నమోదు
-
గంజాయి స్మగ్లింగ్ కేసులో జనసేన నేతపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు బహిరంగంగానే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా గంజాయి కేసులో జనసేన నేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.వివరాల ప్రకారం.. అనకాపల్లి చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తి గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. కేరళలో గంజాయితో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో, కేరళ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అనకాపల్లి వచ్చి కేరళ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో వరాహ మూర్తిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు.. వరాహా మూర్తి గంజాయి కేసులో పట్టుబడటంతో అతడిని మండల అధ్యక్ష పదవి నుంచి జనసేన పార్టీ తొలగించినట్టు సమాచారం. గంజాయి కేసులో దొరికిన జనసేన మండల అధ్యక్షుడు కేరళలో గంజాయితో అడ్డంగా బుక్ అయిన అనకాపల్లి జిల్లా చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తికేరళ నుంచి అనకాపల్లి జిల్లాకి వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులుకూటమి ప్రభుత్వంలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న @JaiTDP,… pic.twitter.com/QGrLCcuB8I— YSR Congress Party (@YSRCParty) September 7, 2024 -
పోలీసుల చేతిలో CCTV ఫుటేజ్..
-
ఎసెన్షియా ఫార్మాపై కేసు
-
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. షాద్ నగర్ పోలీసులపై కేసు నమోదు
-
Bangladesh: షేక్ హసీనాపై హత్య కేసు!
ఢాకా: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్లో తాజాగా ఆమెపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొటోంది. రిజర్వేషన్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో చెలరెగిన అల్లర్లలో ఓ కిరాణా షాప్ యజమాని హత్య చేయబడ్డారు. ఈ హత్య కేసులో షేక్ హసీనాతో సహా ఆరుగురిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసును.. అల్లర్లలో హత్య చేయబడ్డ కిరాణా ఓనర్ అబూ సయ్యద్ సన్నిహితుడు నమోదు చేశారు. జూలై 19న మొహమ్మద్పూర్లో విద్యార్థుల నిరసనలో పోలీసు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ కాల్పుల్లోనే అబూ సయ్యద్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్పై నిందితులుగా చేర్చారు. బంగ్లాలో చోటుచేసుకున్న నిరసనకారులు అల్లర్లలో ఇప్పటివరకు మొత్తం 560 మంది మృతి చెందారు. -
పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై కేసు నమోదు
ముంబై: భూమి విషయంలో ఓ రైతును గన్తో బెదిరించిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లింద్రులపై కేసు నమోదు చేసినట్లు పుణె పోలీసులు తెలిపారు. పూజా ఖేద్కర్ తల్లిదండ్రులతో సహా 7 మందిపై కేసు ఫైల్ చేశామని తెలిపారు. పూజా తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, వారి ఫోన్లు కూడా స్విచ్ఆఫ్ వస్తున్నాయని పేర్కొన్నారు.‘‘నిందితులు పరారీలో ఉన్నారు. వారి కాంటాక్ట్ కోసం ప్రయత్నించాం. కానీ, ఫోన్లను స్విచ్ఆఫ్ చేసుకున్నారు. వారి ఇంటి దగ్గరకి వెళ్లినా అక్కడ కూడా వారు లేరు. పోలీసుల బృందాలు పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాం. ట్రైనీ ఐఏఎస్ పూజా తల్లిదండ్రుల కోసం పలు పోలీసు టీంలు, లోకల్ క్రైం బ్రాంచ్ అధికారులు పుణెతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. వారిని పట్టుకున్న తర్వాత విచారించి, చర్యలు తీసుకుంటాం’ అని ’అని పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు.తనకు ప్రాణహానీ ఉందని స్థానిక రైతు ఫిర్యాదు చేయటంతో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు మనోరమ, దిలీప్ ఖేద్కర్తో సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముల్షి తాలుకాలోని ఓ గ్రామంలో ఒక రైతుపై గన్తో బెదిరింపులకు దిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ ఘటన జూన్, 2023న చోటు చేసుకోగా.. తాజాగా ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూజా తల్లి మనోహర కేవలం ప్రాణరక్షణ కోసమే గన్ పట్టుకున్నారని వారి తరఫున న్యాయవాది తెలిపారు. ఆమె వద్ద ఉన్న గన్కు లైసెన్స్ కూడా ఉందని చెప్పారు. -
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదు
-
పోక్సో కేసు.. చంచల్గూడ జైలుకు యూట్యూబర్ ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తండ్రి,కూతురు వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నిందితుడు యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోక్సో చట్టంతో పాటు 67B ఐటీ యాక్ట్, భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్లు 79, 294 ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రణీత్తోపాటు ఆ లైవ్ ఛాటింగ్ చేసిన మరో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2 డల్లాస్ నాగేశ్వర్ రావు, A3 బుర్రా యువరాజ్, A4 సాయి ఆదినారాయణగా ఉన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నాడు. నిన్న(బుధవారం) బెంగళూరు నుంచి పిటి వారెంట్పై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాకు తీసుకొచ్చారు. హనుమంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఈ మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. -
ప్రణీత్ హనుమంతు పై పోక్సో చట్టం
-
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు
-
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
కరీంనగర్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. నిన్న(మంగళవారం) జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు.. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం 221, 126 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై నమోదు అయంది. బీఎన్ఎస్ యాక్టు కింద కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం. కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ ఆగ్రహంహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసినట్లు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదన్న కేటీఆర్ తేల్చిచెప్పారు. -
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరో కేసు నమోదు
-
నీట్ అక్రమాలపై సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ: నీట్–యూజీ అక్రమాలపై దర్యాప్తు కోసం సీబీఐ రంగంలోకి దిగింది. కేసులో మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆదివారం వెల్లడించింది. గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నీట్ అవకతవకలపై పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేసేలా చర్యలు చేపట్టారు. యూజీసీ–నెట్ పరీక్ష అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల బృందంపై బిహార్లోని నవడా జిల్లా కాసియాదీ గ్రామంలో శనివారం సాయంత్రం దాడి జరిగింది. సీబీఐ అధికారుల వాహనాలపై స్థానికులు దాడికి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. మరోవైపు గ్రేస్ మార్కులు సంపాదించిన 1,563 మంది అభ్యర్థుల్లో 813 మంది మళ్లీ నీట్–యూజీ పరీక్ష రాశారు. నీట్ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు: ఖర్గేవిద్యా వ్యవస్థలోకి పేపర్ లీకేజీలు, అవినీతి, అక్రమాలు, విఆ్య మాఫియా చొరబడ్డాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. నీట్–యూజీ అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ ఎక్స్లో పోస్టు చేశారు. నీట్ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల హస్తముందని, వారిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుకు పెద్ద ముప్పుగా మారిందనేందుకు ఇదొక ఉదాహరణ అని రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ వధ్రా అన్నారు. విద్యావ్యవస్థను మోదీ ప్రభుత్వం మాఫియాకు, అవినీతిపరులకు అప్పగించిందని దుయ్యబట్టారు. -
మల్లా రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు
-
రేవ్ పార్టీలో టీడీపీ నేతలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
-
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు
-
చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని గూండాగిరిహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్ను పోలీస్స్టేషన్కు రమ్మని ఆదేశించారు.ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్స్టేషన్కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్కు వచ్చి సీఐ, ఎస్ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ
-
టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు
దర్శి: ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో జరిగిన పలు ఘటనల్లో 6 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..బొట్లపాలెంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ గ్రామంలో పోలింగ్ ఆపాలని నిబంధనలకు విరుద్ధంగా ధర్నాకు దిగిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు ధర్నా చేసిన వారి వివరాలు తెలుసుకుని కేసులు నమోదు చేయనున్నారు. దర్శిలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఎంఈవో కార్యాలయంలోని పోలింగ్ బూత్లో ఈవీఎం పగులకొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డి పై కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా కళ్లు తిరుగుతున్నాయని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పోలీసులు కళ్లుగప్పి వీసీ రెడ్డి పరారయ్యాడు. పోలీసుల వైఫల్యంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వీసీ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద పోలింగ్ బూత్ వద్ద అల్లర్లు సృష్టించి పోలీసులపై రాళ్లు రువ్విన కేసులో దారం సుబ్బారావు పై కేసు నమోదు చేశారు. రాళ్లు రువ్విన వారి వీడియోలు పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ చెప్పారు. బొట్లపాలెంలో జరిగిన గొడవల్లో క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదులపై 2 కేసులు నమోదు చేసి ఇరువర్గాలపై కలిపి 22 మంది పై కేసులు నమోదు చేశారు. దేవవరంలో వైఎస్సార్సీపీకి చెందిన కిష్టిపాటి నాగిరెడ్డిని శేషంవారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులు దేవవరం వచ్చి తల పగులగొట్టిన కేసులో సానె గురువయ్య, సానె వీరాంజనేయులు, ఎ.నరసింహారావు, ఎస్.శ్రీను, అచ్చయ్య, ముత్యాల నరశింహంపై కేసు నమోదు చేశారు. -
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C— ANI (@ANI) May 13, 2024 దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. -
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదు..
చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అయితే అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 341 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై తీవ్రవాదాన్ని, అల్లర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అహంకారం గురించి మాట్లాడే ప్రధాని అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలని సెటౌర్లు వేశారు. అయితే డీఎంకే ఆరోపణలపై స్పందించన అన్నామలై ధీటుగా బదులిచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉంది. ఏ ఎన్నికల సంఘం దీన్ని ఆపుతుందని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంటే దానిని తనకు చూపించాలని అన్నారు. కాగా కోయంబత్తూరులో బీజేపీ తరపున అన్నామలై ఎంపీగా పోటీచేస్తుండగా. అధికార డీఎంకే గణపతి రాజ్కుమార్ను, అన్నాడీఎంకే సింగై రామచంద్రన్ను బరిలోకి దింపింది. అయితే కోయంబత్తూరు అన్నాడీఎంకే కంచుకోట అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో సీపీఎం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 38 చోట్ల డీఎంకే కూటమి విజయ బావుటాను ఎగరవేసింది. చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ పై కేసు నమోదు
-
సీఎం రమేష్ పై కేసు
-
రాఫిసి: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
సాక్షి,హైదరాబాద్: రాఫిసి(రామోజీఫిల్మ్సిటీ)లో ఈనాడు ఉద్యోగిని సాయికుమారి అనుమానస్పదంగా మరణించారు. రాఫిసిలోని ఈనాడు కార్యాలయం నాలుగో అంతస్తు నుంచి కింద పడి సాయికుమారి చనిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన సాయికుమారి ఈనాడు కార్యాలయం కాల్సెంటర్లో ఉద్యోగిని. సాయికుమారి భర్త కూడా ఈనాడు సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సాయికుమారికి ఇద్దరు పిల్లలు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళది ఆత్మహత్యా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమారి కుటుంబం పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా వీపరీతమైన పని ఒత్తిడి కారణంగా మనోవేదనకు గురైనట్టు సమాచారం. కొందరు రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ) ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు మరణించిన మహిళా ఉద్యోగి పేరు సాయికుమారి అని తెలిసింది. ఈనాడు కార్యాలయంలోని కాల్ సెంటర్లో సాయికుమారి పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఉదయం ఆఫీసుకు వచ్చిన సాయికుమారి.. అదే బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పైనుంచి పడి చనిపోవటం సంచలనంగా మారింది. సాయికుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి మృతికి గల కారణాలపై ఇతర ఉద్యోగులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఏం జరిగిందో అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ)లో జరిగిన ఓ ఘటన కూడా చర్చనీయాంశమయింది. ఘనంగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పుకునే రామోజీ ఫిలిం సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో క్రేన్ వైర్ తెగిపోయింది. ఈ ఘటనలో వెస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్షా మరణించగా, సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. రాఫిసిలో ఏం జరిగినా.. మీడియాను గానీ ఇతరులను గానీ లోపలికి అనుమతించరని స్థానికులు చెబుతున్నారు. అక్కడ యాజమాన్యం వారిచ్చే సమాచారమే తప్ప .. ఏదీ బయటకు రానివ్వరన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి.. ఫొటోగ్రాఫర్ దారుణ హత్య -
HYD:10 మంది వీఐపీలపై డ్రగ్స్ కేసు
హైదరాబాద్, సాక్షి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. ‘‘రాడిసన్ బ్ల్యూ హోటల్ పై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులతో దాడి చేశాం. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడం తో సెర్చ్ చేశాం. అప్పటికే హోటల్ నుండి నిందితులు పరారయ్యారు . అప్పటికే అందించిన సమాచారంతో.. వివేకానంద ఇంటికి వెళ్ళాం. వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇంటికి వెళ్లిన సమయం లో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారు. వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశాం. వివేకా నంద తో పాటు నిర్భయ్ , కేదార్లకు పాజిటివ్ వచ్చింది. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించాము, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఈ పార్టీ లో 10 మంది ఉన్నట్లు గుర్తించాం. రాడిసన్ హోటల్ లో గతంలో పార్టీలు జరిగాయి. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించాం. వివేకా నంద, నిర్భయ్ , కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు ను కూడా మేము అటాచ్ చేస్తున్నాం అని సీపీ వెల్లడించారు. -
ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు నమోదు నమోదైంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. ఓ కౌన్సిలర్ను ఎమ్మెల్యే కనకయ్య కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎమెల్యే కోరం కనుకయ్య, మరో 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇల్లందు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్పై అవిశ్వాస ఓటింగ్కు ముందు హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం నేపథ్యంలో పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు ఆయనకు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
మంచిర్యాల, సాక్షి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు . సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్, సీఎం రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో సీఎం రేవంత్పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో.. సుమన్ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం. 👉: బాల్క్ సుమన్పై ఎఫ్ఐఆర్ -
జర్నలిజం ముసుగులో ఫోర్జరీ..టీవీ5 సాంబపై కేసు నమోదు
-
రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను నిందితులుగా చేర్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఫంక్షన్ల నిర్వహణ కోసం పలు గార్డెన్లను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి లైమ్లైట్ గార్డెన్. ఈ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో క్రేన్ ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా గెస్టులను కిందకు దించుతుండగా వైర్ తెగిపోయింది. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. తీవ్రగాయాలతో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా అక్కడికక్కడే చనిపోయాడు. మృతిని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన్ని మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరికొందరు కంపెనీ ప్రతినిధులకు సైతం గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం ఎలా జరిగిందంటే.? రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్లో విస్టెక్స్ కంపెనీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విస్టెక్స్ కంపెనీ సిబ్బంది పలువురు హాజరయ్యారు. ఏర్పాట్లు అన్నీ రామోజీ ఫిలింసిటీ చేసింది. ఇందులో భాగంగా సినిమా తరహాలో ఎత్తు నుంచి ఓ క్రేన్లో CEOను, ఛైర్మన్ను కిందికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సర్కస్ తరహా ఫీట్లకు నిర్వహాకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులైన సిబ్బందితో పాటు.. నాణ్యమైన క్రేన్లు ఉండాలి. దీంతో పాటు పబ్లిక్ ఈవెంట్లలో ఇష్టానుసారంగా సర్కస్ ఫీట్లు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. పైగా ఏ ప్రభుత్వాధికారి కూడా ఇలాంటి ఫీట్లకు అనుమతి కూడా ఇవ్వరు. అయినా రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహాకులు అన్ని నిబంధనలను పక్కనబెట్టి.. విస్టెక్స్ కంపెనీ ఉన్నతాధికారులను క్రేన్ ఎక్కించారు. తేడా కొట్టడంతో క్రేన్ కుప్పకూలి సీఈవో సంజయ్షా మరణించారు. (ప్రమాదం జరిగిన గార్డెన్ ప్రాంతం ఇదే) ఇక ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది. FIR ప్రకారం.. జానకీరాం రాజు అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులుగా రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను చేర్చి దర్యాప్తు చేపట్టారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. -
భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు
దిస్పూర్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు అసోం పోలీసులు. అసోం ముఖ్యమంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన కొద్దిగంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నిర్దేశించిన మార్గంలో కాకుండా.. మరో మార్గం గుండా గురువారం మధ్యాహ్నాం రాహుల్ యాత్ర సాగిందన్నది అసోం పోలీసుల అభియోగం. హఠాత్తుగా యాత్ర సాగే దారిని మార్చడం ద్వారా.. జనాలు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టారు. అలాగే.. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి దాడికి పాల్పడ్డారని అసోం పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు జోడో న్యాయ్ యాత్ర నిర్వాహకుడు కేబీ బైజూపైనా కేసు నమోదు అయ్యింది. అంతకు ముందు.. అసోం సీఎం హిమంత బిస్వా శర్మపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. శుక్రవారంతో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆరో రోజుకి చేరింది. ఇవాళ అతిపెద్ద మంచి నీటి ద్వీపం మజూలీలో రాహుల్ యాత్ర సాగనుంది. జనవరి 25వ తేదీ దాకా రాహుల్ అసోంలోనే యాత్రలో పాల్గొంటారు. -
సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్.. రూ. 4 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ జరిగింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్పై కేసు నమోదైంది. అయితే ఓ సాఫ్ట్వేర్ యువతి అకౌంట్లోనే సుమారు రూ. 48 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల నుంచి యువతి డబ్బులు అడుగుతున్నా మేనేజర్ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాతాదారుల నగదు మాయం పట్ల బ్యాంక్ మేనేజర్ హస్తంపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. చదవండి: TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్పై కీలక ఆదేశాలు -
అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలను అక్బరుద్దీన్పై బుధవారం కేసు నమోదు చేశారు సంతోష్ నగర్ పోలీసులు. ఈ మేరకు ఓ వీడియో వైరల్ కావడం కూడా తెలిసిందే. లలితాబాగ్లో మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. సమయం అయిపోతుందని, ప్రచారం ముగించాలని స్థానికంగా విధులు నిర్వస్తున్న ఎస్సై శివచంద్ర అక్బరుద్దీన్ను కోరారు. ఆ సమయంలో పోలీసు అధికారిపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరతానని, తనను ఆపేవాళ్లింకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని, తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలు అయినా ధైర్యం ఇంకా మిగిలే ఉందని, ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైను ఉద్దేశించి అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో పాటు రాజకీయంగానూ విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 353(విధుల్ని అడ్డుకోవడం)తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు. #WATCH | Telangana: AIMIM leader Akbaruddin Owaisi threatened a police inspector who was on duty and asked him to leave the spot while he was addressing a campaign in Lalitabagh, Hyderabad yesterday. The police inspector asked him to conclude the meeting on time as per the Model… pic.twitter.com/rf2tJAOk3b — ANI (@ANI) November 22, 2023 బీజేపీ స్పందన.. దశాబ్దాలుగా, కాంగ్రెస్ & బీఆర్ఎస్ మద్దతుతో, ఎంఐఎం ఒక నేర సంస్థగా మారిందని, ఇది పాత నగరాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపింది. అలాగే నేరాల బారిన పడకుండా చేసిందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన ఈ గజిబిజిని శుభ్రం చేయడానికి ఇది సమయం అని తెలిపింది. బిజెపి ప్రభుత్వంలో, అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ ప్రతిచర్య ఉంటుందని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది. -
ఫైర్ క్రాకర్స్తో బైక్పై డేంజరస్ స్టంట్స్: గుండెలదిరిపోయే వీడియో వైరల్
చెన్నై: దీపావళి వేడుకల్లో భాగంగా కొంతమంది యువకులు జాతీయ రహదారిపై బాణా సంచా పేల్చుతూ ప్రమాదకరమైన స్టంట్ చేసిన వైనం వైరల్గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో విచిత్ర విన్యాసాలతో రోడ్డుమీద బీభత్సం సృష్టించారు. బైక్కు పటాకులు తగిలించి మరీ వాటిని పేల్చుకుంటూ చేసిన స్టంట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వాళ్లు అనుకున్నట్టుగా వీడియో వైరల్ అయ్యింది గానీ చివరికి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అటు నెటిజన్లు కూడా ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది. 71 వేల మంది ఫాలోవర్లున్న ‘డెవిల్ రైడర్’ అనే ఇన్స్టా పేజీలో నవంబర్ 9న ఈ వీడియో అప్లోడ్ అయింది. సిరుమరుత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై, వాహనానికి బాణాసంచా తగిలించుకుని, దాన్ని గిరా గిరా తిప్పుతూ, బైక్పై వెళ్లే వ్యక్తి కొద్దిసేపు బైక్ ముందు భాగాన్ని రోడ్డుపై నుంచి పైకి లేపుతూ బైకును ఒక టైరుపై ఉంచి స్టంట్స్ చేశాడు. బైక్ వెళ్తుండగానే బాణా సంచా పేల్చడంతో అవిపెద్ద ఎత్తున పేలి, గుండెలదిరేలా భారీగా మెరుపులు రావడం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైడర్ తంజావూరుకు చెందిన ఎస్ అజయ్ అని గుర్తించారు. అజయ్తోపాటు, దాదాపు 10మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి జాబితాను సిద్ధం చేస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని జిల్లా ఎస్పీ వరుణ్కుమార్ ఎక్స్ (ట్విటర్)లో ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తమిళనాడులో కార్కు టపాసులు తగిలించి పేల్చిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. #WATCH | Tamil Nadu | In a viral video, a group of bikers were seen performing stunts and bursting firecrackers while riding motorcycles in Tiruchirappalli. Trichy SP Dr. Varun Kumar tells ANI, "Trichy District police arrested 10 persons under various IPC sections and under the… pic.twitter.com/fShjqlR6wV — ANI (@ANI) November 14, 2023 -
నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాదం కేసులో దర్యప్తు ముమ్మరం
-
బర్త్డే వేడుకల్లో బీభత్సం: కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరి, రచ్చ..రచ్చ!
పుట్టినరోజు సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసిన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పటాకులు పేల్చి, కరెన్సీ నోట్లకు గాల్లోకి విసరడమే కాకుండా, స్థానికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించి అసభ్యకరంగా దూషించి ఘటన కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఘజియాబాద్లోని రాజ్నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్గ్రామ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రవి కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం ముగ్గురు వ్యక్తులు పుట్టిన రోజు వేడుకల్లో బీభత్సం సృష్టించారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోపల కారు పైకప్పుపై నిలబడి విచ్చల విడిగా బాణా సంచా కాల్చడంతోపాటు కరెన్సీని గాల్లోకి విసిరి గలాటా సృష్టించారు. అంతేకాదు దీన్నిప్రశ్నించిన అపార్ట్మెంట్ వాసులను దుర్భాషలాడారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపార్ట్మెంట్ ఓనర్స్ సంఘం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. @ghaziabadpolice @DCPCityGZB #Ghaziabad pic.twitter.com/Q97dZabFch — Ajnara Integrity AOA (@integrityaoa) October 29, 2023 https://t.co/Nlf6IPi1Le — DCP CITY COMMISSIONERATE GHAZIABAD (@DCPCityGZB) October 29, 2023 -
26 మంది టిడిపి లీడర్లపై కేసు నమోదు
-
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై కేసు
-
ముగ్గురు యువ క్రికెటర్స్ పై కేసు నమోదు
-
పరిటాల సునీత, శ్రీరామ్లపై కేసు నమోదు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్పై పోలీస్ చేసు నమోదైంది. కాగా కనగానపల్లి మండలంలో బుధవారం అనుమతి లేకుండా నిర్వహించిన ర్యాలీలో రాప్తాడు టీడీపీ ఇంచార్జి పరిటాల సునీత, ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరాం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిటాల సునీత, శ్రీరామ్ సహా 119 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పరిటాల సునీత, ఆమె తనయుడిపై నిబంధనలకు విరుద్ధంగా వ్వహరించినందుకు కేసు ఫైల్ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. అంతకముందు కూడా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినందుకు వీరిపై కేసులు నమోదయ్యాయి. చదవండి: దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు -
Sikh for Justice: వరల్డ్ కప్ కాదు.. టెర్రర్ కప్
అహ్మదాబాద్: కరడుగట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపట్వంత్ సింగ్ పన్నూపై గుజరాత్ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ ప్రపంచ కప్ ‘ప్రపంచ టెర్రర్ కప్’గా మారతుందంటూ సోషల్ మీడియాలో పన్నూ చేసిన హెచ్చరికలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ముందే రికార్డు చేసిన ఓ వాయిస్ మెసేజ్ను విదేశీ ఫోన్ నంబర్తో సోషల్ మీడియాలో పన్నూ పోస్టు చేశాడని తెలిపారు. +447418343648 అనే నంబర్తో దేశవ్యాప్తంగా చాలామందికి ఈ మెసేజ్ అందిందని పేర్కొన్నారు. మెసేజ్ అందుకున్నవారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. సబ్ఇన్స్పెక్టర్ హెచ్.ఎన్.ప్రజాపతి ఫిర్యాదు మేరకు పన్నూపై కేసు పెట్టినట్లు వివరించారు. +44 అనేది యునైటెడ్ కింగ్డమ్(యూకే) కోడ్ కావడం గమనార్హం. అయితే, ఇంటర్నెట్ కాల్ టెక్నాలజీతో ఇలా విదేశీ ఫోన్ నంబర్ల నుంచి సందేశం వస్తున్నట్లు తప్పుదోవ పట్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పన్నూ హెచ్చరికల మెసేజ్ ఎక్కడి నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ...ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ విదేశీ ఫోన్ నంబర్తో వచి్చన కాల్ను రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రి–రికార్డెడ్ వాయిస్ మెసేజ్ వినిపిస్తోందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు జీతూ యాదవ్ తెలియజేశారు. ‘‘అమర వీరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కచి్చతంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లు ఉపయోగిస్తాం. మీరు సాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం. అక్టోబర్ 5వ తేదీని గుర్తు పెట్టుకోండి. ఆ రోజు క్రికెట్ ప్రపంచ కప్ కాదు, ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభమవుతుంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో ఖలిస్తాన్ జెండాలతో అహ్మదాబాద్ను ముట్టడిస్తాం.. ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ’’ అంటూ ఆ సందేశంలో హెచ్చరికలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్ నగర ప్రజలకు గత రెండు రోజులుగా ఈ మెసేజ్ వస్తోందన్నారు. ఎవరీ పన్నూ? సిక్కుల కోసం భారత్లో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురుపట్వంత్ సింగ్ పన్నూ పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ సమీపంలోని ఖంజోత్ అనే గ్రామంలో జని్మంచాడు. న్యాయ విద్య అభ్యసించాడు. అనంతరం కెనడాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. కెనడా పౌరసత్వం కూడా సంపాదించాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను స్థాపించాడు. భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు. ఖలిస్తాన్కు అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబీయింగ్ చేస్తున్నాడు. హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్యపై పన్నూ తీవ్రంగా రగిలిపోయాడు. కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశాడు. 2020 జూలైలో పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో అజ్ఞాతంలో ఉన్నాడు. -
బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిపై నార్సింగిలో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కోకాపేట ల్యాండ్స్.. వివరాల ప్రకారం.. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. అక్రమంగా తరలింపు.. అయితే, గోల్డ్ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు అని తెలిపారు. దీంతో, తాము పోలీసులను ఆశ్రయించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిలతో పాటుగా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం -
HYD: నిలోఫర్ ఆసుపత్రిలో దారుణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో నుంచి ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో, ఘటన ఆసుపత్రిలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. నిలోఫర్ ఆసుపత్రిలో ఆరు నెలల బిడ్డ అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఆసుపత్రి నుంచి ఎత్తుకెళ్లారు. అయితే, బిడ్డ తల్లి భోజనం కోసం వెళ్లగా చిన్నారిని దుండగులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో బాధితురాలు నాంపల్లి పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. నిలోఫర్ ఆసుపత్రి ట్రీట్మెంట్ వార్డులో సీసీ కెమెరా లేకపోవడంతో దర్యాప్తు చేయడం పోలీసులకు సమస్యగా మారింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం -
తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ(National Investigation Agency) ఇవాళ దాడులు చేసింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం.. ఈ దాడులు జరిగాయి. మావోయిస్టులకు అదునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా అవుతున్నాయనే అనుమానాలతోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. అలాగే ఈ దాడులకు సంబంధించి.. 12 మందిపై NIA కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
ఉదయనిధిపై ట్వీట్.. బీజేపీ నేతపై కేసు
డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అటు బీజేపీ నేతలు సైతం ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఘాటుగా స్పందించారు. డీఎంకే మంత్రి సనాతన ధర్మం వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందిస్తూ ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై చేసిన ట్వీట్ నేపథ్యంలో ఆయనపై తాజాగా కేసు నమోదు అయ్యింది. కాగా అమిత్ మాల్వియా ట్విటర్లో..‘తమిళనాడు సీఎం కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న భారతదేశంలోని 80% జనాభాను ఉచకోత కోయాలని ఆయన(ఉదయనిధి) అనుకుంటున్నారు. తన అభిప్రాయాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాల్సిందే. డీఎంకే ప్రతిపక్ష ఇండియా కూటమిలో ప్రముఖ పార్టీ. కాంగ్రెస్కు దీర్ఘకాల మిత్రపక్షం. ముంబై సమావేశంలో ఇదేనా మీరు అంగీకరించింది? అని ప్రశ్నించారు. చదండి: రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo — Amit Malviya (@amitmalviya) September 2, 2023 అమిత్ మాల్వియా ట్వీట్పై ఇక డీఎంకే కార్యకర్త కేఏవీ దినకరన్ ఫిర్యాదు చేయగా.. తమిళనాడులోని తిరుచ్చిలో మాల్వియాపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. సనాతన ధర్మంపై చేసిన తన వాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చినప్పటికీ రాజకీయ ఉద్దేశ్యంతో రెండు వర్గాల మధ్య హింస, ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మంత్రి (ఉదయనిధి) వ్యాఖ్యలను అమిత్ మాల్వియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారు’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు మాల్వియా ట్వీట్ తర్వాత, సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై హింసకు తాను పిలుపు ఇవ్వలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని, సనాతన ధర్మం వల్ల నష్టపోతున్న అట్టడుగు వర్గాల తరపున తాను మాట్లాడానని మంత్రి వివరణ ఇచ్చారు. కాగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని అన్నారు. దీంతో సనాతన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని కించపరిచేలా చేసిన తన వ్యాఖల్యను ఉదయనిధి వెనక్కి తీసుకొని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
క్యూ నెట్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
-
నాగర్ కర్నూల్ పీఎస్ లో రేవంత్ పై కేసు నమోదు
-
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ పీఎస్లో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, వంశీ చంద్ రెడ్డి, మరోనేత సంపత్ కుమార్ లపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు సెక్షన్ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు ఎస్పీ మనోహర్. మరోవైపు మహబూబ్ నగర్-- జడ్చర్ల, భూత్పూర్ పోలీసు స్టేషన్లలోనూ రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. -
50 శాతం కమిషన్ అంశంపై ప్రియాంక గాంధీపై కేసు..
భోపాల్: మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ఎంపీ కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్లపై కేసు నమోదైంది. అవినీతి అరోపణలపై నకిలీ లేఖను సోషల్ మీడియాలో జ్ఞానేంద్ర అవస్తీ పేరిట ప్రచారం చేస్తున్నారని బీజేపీ లీగల్ సెల్ కన్వినర్ నిమేశ్ పతాక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 50 శాతం కమిషన్ను ప్రభుత్వం రాబడుతుందని ట్వీట్టర్(ఎక్స్) వేదికగా వాద్రా ఆరోపణలు చేశారు. కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు వెళ్లడం లేదని కాంట్రాక్టర్లు హైకోర్టు సీజేకి లేఖ రాశారంటూ పోస్టు చేశారు. కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్లోనూ ఇలాగే కమిషన్ లేనిదే పనిజగట్లేదని ఆరోపణలు చేశారు. ఇదే విధంగా కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్లు, అరుణ్ యాదవ్లు పోస్టు చేశారు. मध्य प्रदेश में ठेकेदारों के संघ ने हाईकोर्ट के मुख्य न्यायाधीश को पत्र लिखकर शिकायत की है कि प्रदेश में 50% कमीशन देने पर ही भुगतान मिलता है। कर्नाटक में भ्रष्ट BJP सरकार 40% कमीशन की वसूली करती थी। मध्य प्रदेश में BJP भ्रष्टाचार का अपना ही रिकॉर्ड तोड़कर आगे निकल गई है।… pic.twitter.com/LVemnZQ9b6 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 11, 2023 వీరిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్ నాథ్, అరుణ్ యాదవ్లపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును దెబ్బతీయాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రియాంక గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. తప్పుడు ప్రచారాలతో ఎంతో కాలం లబ్ది పొందలేని చెప్పారు. సీఎం శివరాజ్ సింగ్ కూడా ఈ అంశంపై స్పందించారు. వారి మాటల్లో నిజం లేదని చెప్పారు. ప్రియాంక గాంధీ పోస్టుకు సంబంధించిన వ్యక్తులపై గ్వాలియర్లోనూ కేసులు నమోదయ్యాయని అన్నారు. मध्यप्रदेश में कांग्रेस मुद्दा विहीन होकर घृणित मानसिकता के साथ राजनीति कर रही है। प्रदेश कांग्रेस के नेताओं ने पहले राहुल गांधी जी से झूठ बुलवाया अब प्रियंका गांधी जी से झूठा ट्वीट करवाया। प्रियंका जी आपने जो ट्वीट किये हैं उसके प्रमाण दो अन्यथा हमारे पास कार्यवाही के सारे… pic.twitter.com/j9FfajhA9c — Dr Narottam Mishra (@drnarottammisra) August 12, 2023 ఇదీ చదవండి: ఎన్డీయేలోకి శరద్ పవార్..? తాజా భేటీ ఎందుకు..? -
మంత్రి శ్రీనివాస్గౌడ్పై కేసు.. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు
సాక్షి, మహబూబ్నగర్/హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు మరో పదిమందిపై కేసులు నమోదయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో పోలీసులు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నేడు రెండవ శనివారం, 13న ఆదివారం సెలవు ఉండటంతో 14న కోర్టుకు కేసుకు సంబంధించిన నివేదిక ఇవ్వడానికి పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. చదవండి: కారిడార్ వార్!... ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యం ఇదీ కేసు.. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్పై దాఖలైన కేసులో మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు రాష్ట్ర, కేంద్ర రిటర్నింగ్ అధికారులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 2018, డిసెంబర్లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ను శ్రీనివాస్గౌడ్ ట్యాంపరింగ్ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దావా వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి, మంత్రి సహా సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని తీర్పునిచ్చారు. కేసు నమోదైంది వీరిపైనే.. మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు అప్పటి అధికారులు, ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ సెక్రటేరియల్ రాజీవ్కుమార్, సంజయ్కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్, సెక్రెటరీ, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, కలెక్టర్ వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీఓ శ్రీనివాసులు, టెక్నికల్ అధికారి వెంకటే‹Ùగౌడ్, విశ్రాంత ఉద్యోగి సుధాకర్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్పై కేసు నమోదైనట్టు సమాచారం. -
చికోటి ప్రవీణ్కు షాక్.. సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిణి అమ్మవారి ఆలయం వద్దకు అనుమతి లేకుండా ఆయుధాలు కలిగిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని వెంట తీసుకెళ్లినందుకు చత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చీకోటి సహా ముగ్గురిపై పోలీసులు చీటింగ్తోపాటు ఫోర్జరీ, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. A1గా చికోటి, A2గా రాకేష్, A3గా సుందర్ నాయక్, A4గా రమేష్ గౌడ్లుగా చేర్చారు. ఈ కేసులో చీకోటి ప్రవీణ్కు చెందిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని (సుందర్ నాయక్, రాకేష్ కుమార్, రమేష్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక వారి వద్ద ఉన్న ఆయుధాల లైసెన్స్ ఫేక్ డాక్యుమెంట్స్గా పోలీసులు తేల్చారు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. కాగా బోనాల పండుగ సందర్భంగా చీకోటి ప్రవీణ్ ఆదివారం సింహావాహిని అమ్మవారి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్న ప్రవీణ్ వారితో కలిసి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుకున్నారు. వాళ్లను తనిఖీ చేయగా ఆయుధాలు బయటపడటంతో ఖంగుతున్నారు. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. అయితే వెపన్స్ లైసెన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏడాది క్రితమే ఛత్రినాక పోలీస్ స్టేషన్కు పంపామని చీకోటి ప్రవీణ్ చెబుతున్నారు. తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని లోకల్ పోలీస్ స్టేషన్లలో సమర్పించానని, వారు డాక్యుమెంట్స్ చూసి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పుడు డాక్యుమెట్స్ ఫోర్జరీ అని కేసు నమోదు చేశారని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని సైదాబాద్ పోలీసులు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇందుకు పోలీసుల తప్పిదమే కారణమని చెప్పారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో పార్టీ జాయిన్ గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మతం కోసం, హిందూత్వం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని, గజ్వేల్ ఘటన తర్వాత తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. -
విజయవాడ: పవన్ కల్యాణ్పై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: వారాహి యాత్రలో వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కృష్ణలంక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అయోధ్య నగర్కు చెందిన వలంటీర్ దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదుతో 153, 153A, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, వలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పవన్పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విజయవాడ లీగల్ సెల్ ప్రతినిధులు, పలువురు వలంటీర్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ–అడ్మిన్ ) మోకా సత్తిబాబుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: వలంటీర్లపై దౌర్జన్యకాండ కోవిడ్ బాధితులకు కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న తరుణంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవలందించారని వారు గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో సైతం సేవ చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ప్రజల ముంగిటకే చేరుతోందన్నారు. వలంటీర్లు తలచుకుంటే వారాహి యాత్ర ఒక్క అడుగు ముందుకు సాగదని హెచ్చరించారు. వలంటీర్లకు పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
బూడిదైన ఫలక్నుమా.. కేసు నమోదు
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ దగ్ధం ఘటనలో కేసు నమోదు చేశారు. ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఘటనపై.. రైల్వే యాక్ట్ సెక్షన్ 80/2023 కింద కేసు నమోదు చేశారు. హౌరా(కోల్కతా) నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (Falaknuma express)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు గమనించిన సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఆ రెండు బోగీల్లోని ప్రయాణికులను కిందికి దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య జరిగింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో ఫలక్నుమా.. ఫొటోలు ప్రయాణికుల మండిపాటు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశా బాలాసోర్లో దాదాపు 300 మందిని పొట్టనబెట్టుకున్న ఘోర ప్రమాదం తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగులు కాలిపోయాయని కొందరు.. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు నగదు, సామగ్రి కోల్పోయామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫలక్నుమా అంటే అర్థం తెలుసా? -
పొంగులేటి అనుచరులకు షాక్.. పాత కేసులపై పోలీసుల నోటీసులు!
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇక, ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే, పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులను అధికార బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా పొంగులేటి అనుచరులపై పాత కేసులు తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబుపై పోలీసులు నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఓ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక, డీసీసీబీ మాజీ ఛైర్మన్ విజయ్ బాబు బ్యాంకు కేసును సీఐడీకి అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటి మద్దతుదారులు స్పందించారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కక్షపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొంగులేటి నేడు(ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో చేరికపై రాహుల్ గాంధీతో వీరు చర్చించనున్నారు. ఈ క్రమంలో ఖమ్మంపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీంతో, అధికార బీఆర్ఎస్ పార్టీ అలర్డ్ అయ్యింది. సీఎం కేసీఆర్ కూడా ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్తో మాట్లాడుతూ అక్కడి పొలిటికల్ సమీకరణాలను తెలుసుకుంటున్నారు. అటు, బీజేపీ కూడా ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తోంది. దీంతో, ఖమ్మంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి? -
జోగిపేట ఆక్స్ఫర్డ్ స్కూల్పై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, సంగారెడ్డి: జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్పై కేసు నమోదు అయ్యింది. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజులు, బుక్స్ విక్రయిస్తున్నారని డీఈవోకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విద్యార్థి సంఘాలు డీఈవోకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీఈవో ఆదేశాలలో ఎంఈవో కృష్ణ ఆక్స్ఫర్డ్ స్కూల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, స్కూల్ను తనిఖీ చేయడానికి వచ్చిన ఎంఈవోతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో స్కూల్ నిర్వాహకుడు వేణుపై ఎంఈవో జోగిపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి? -
రోల్స్ రాయిస్ ఇండియాకు కేంద్రం షాక్: అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు
సాక్షి, ముంబై: బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు భారీ షాక్ తగిలింది. 24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసంచేశా రని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్సహా, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్మేకర్ స్పందన ఇది!) ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్లపై కేసు నమోదు చేసింది. రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్, ఆయుధాల డీలర్లు సుధీర్ చౌదరి , భాను చౌదరితోపాటు, ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.రోల్స్ రాయిస్ పిఎల్సి, యుకె , ఎం/ఎస్ రోల్స్ రాయిస్ టర్బోమెకా లిమిటెడ్తో సహా దాని అసోసియేట్ గ్రూప్ కంపెనీల నుండి హాక్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ కేసు సంబంధించినదని సీబీఐ ప్రకటించింది. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) CBI registers a case against British Aerospace company Rolls Royce India Pvt Ltd, Tim Jones, Director Rolls Royce India Pvt Ltd and private individuals Sudhir Chuadhrie and Bhanu Chaudharie and other unknown public servants and private persons with the objective to cheat the… pic.twitter.com/tREN8OUkyk — ANI (@ANI) May 29, 2023 -
అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పును కప్పిపుచ్చుకోలేరు: డింపుల్
-
సినీ నటి డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు
-
BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్
సాక్షి,ముంబై: పేమెంట్స్ యాప్ భారత్ పే ఫౌండర్, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ వివాదంలో అష్నీర్కు మరోసారి చుక్కెదురైంది. భారత్పే టాప్ లీడర్షిప్ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత, తాజాగా మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో గ్రోవర్తోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్టెక్ యునికార్న్ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గత ఏడాది ఫిన్టెక్ యునికార్న్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అష్నీర్ గ్రోవర్ , కుటుంబ సభ్యులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) ఫిర్యాదు దాఖలు చేసింది. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్, ఆమె సోదరులు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది. ఆర్థిక నేరాల విభాగం ఆరోపణలు 86 నకిలీ, తప్పుడు ఇన్వాయిస్లను ఉపయోగించి గ్రోవర్, ఇతర నిందితులు రూ.7.6 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానంగాఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించింది. అంతేకాదు సాక్ష్యాలను మాధురీ జైన్ నాశనం చేశారని ఆరోపించింది. త్వరలోనే నిందితులందరినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అంచనా. మరోవైపు నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా పదేళ్ల దాకా జైలు శిక్ష ఖరారు కానుందని తెలుస్తోంది. కాగా 2022, జనవరిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్ను మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రోవర్, అతని కుటుంబ సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివిధ సెక్షన్ల ద్వారా నిందితులందరి నుండి రూ. 88 కోట్ల నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని కంపెనీ కోరింది. భారత్పే ఫౌండర్ ట్యాగ్ని ఉపయోగించకుండా నిరోధించాలంటూ సింగపూర్లో కూడా దావా వేసింది. అయితే తాజా పరిణామంపై అష్నీర్ గ్రోవర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
టీడీపీ నేత సాయికల్యాణిపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: టీడీపీ మహిళా నాయకురాలు మూల్పూరి సాయికల్యాణిపై కేసు నమోదైంది. గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,కొడాలి నానిపై సోషల్ మీడియాలో సాయి కల్యాణి అసత్య ప్రచారం చేశారు. చీకోటి ప్రవీణ్తో కొడాలి నాని, వంశీకి సంబంధాలు ఉన్నాయంటూ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సాయి కల్యాణి పోస్టులు పెట్టారు. నిరాధార పోస్టింగ్లు పెట్టిన సాయి కల్యాణిపై చర్యలు తీసుకోవాలని హనుమాన్ జంక్షన్ పీఎస్లో వైఎస్సార్సీపీ నాయకుడు ప్రదీప్ ఫిర్యాదు చేశారు. -
B Tech Ravi: అజ్ఞాతంలోకి బీటెక్ రవి
సాక్షి, వైఎస్సార్: తెలుగు దేశం పార్టీ నేత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పులివెందుల పరిధిలోని చక్రాయపేటలో రవి తన అనుచరులతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. మారణాయుధాలతో ఓ వెంచర్పై దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఈ దాడిపై పోలీస్ కేసు కూడా నమోదు కావడంతో.. రవి ముందస్తుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం వంద మందికి పైగా అనుచరులతో, మారణాయుధాలతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన రవి.. ఆపై అక్కడి ఫెన్సింగ్ను అన్యాయంగా తొలగించాడు కూడా. ఈ ఘటనపై ఆ వెంచర్ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. తన దగ్గర వెంచర్కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, రవి దగ్గర అలాంటి ఆధారాలు ఎవైనా ఉంటే చూపించాలని రవికి సూచించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. చక్రాయపేట దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బీటెక్ రవి ఆచూకీ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. సంబంధిత వార్త: యెల్లో బ్యాచ్ దౌర్జన్యకాండ.. చక్రాయపేటలో ఏం జరిగిందంటే.. -
అమిత్ షాపై కేసు పెట్టిన కర్ణాటక కాంగ్రెస్
-
కొలిక్కి వచ్చిన ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఎపిసోడ్
-
Yogi Adityanath Death Threat: సీఎం యోగిని హత్య చేస్తానంటూ బెదిరింపులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ను హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. లక్నోకు చెందిన ఓ వ్యక్తి యూపీ ఎమర్జెన్సీ నెంబర్ 112కి మెసేజ్ చేశాడు. సీఎం యోగిని త్వరలో చంపుతానంటూ సందేశంలో పేర్కొన్నాడు. దీంతో 112 ఆపరేషన్ కమాండర్ విషయాన్ని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐపీసీ సెక్షన్లు 506, 507, ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ కేరళ పర్యటన వేళ ఆయన ఆత్మాహుతి బాంబు దాడిలో చంపుతామంటూ ఓ వ్యక్తి బెదిరించడం కలకలం రేపింది. కొచ్చికి చెందిన జేవియర్ అనే వ్యక్తి ఈ మేరకు కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్కు లేఖ పంపాగా.. ఆయన దానిని పోలీసులకు అందజేశారు. అయితే వారం తర్వాత ఆ లేఖ గురించి మీడియాకు సమాచారం పొక్కింది. దీంతో గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బయటపెట్టారంటూ బీజేపీ, కేరళ పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రధాని కేరళ రెండో రోజుల పర్యటన కోసం భారీగా పోలీసులను మోహరించారు. -
కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్పై కేసు నమోదు..
సాక్షి, హైదరాబాద్: కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బండి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేశాయి. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. మహిళలంటే గౌరవం లేకుండా మాట్లాడిన బండిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండిపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. దీన్ని సుమోటాగా తీసుకుని నోటీసులు పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ ఆమెపై విమర్శలు గుప్పిస్తూ నోరుజారారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. చదవండి: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్కు మహిళా కమిషన్ నోటీసులు -
Digvijaya Singh: ర్యాష్ డ్రైవింగ్తో బైకర్ను ఢీ కొట్టి..
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కారు.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. గురువారం రాజ్గఢ్లో ఓ బైకర్ను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్కు గాయాలు కాగా, దిగ్విజయ్ సింగ్ దగ్గరుండి మరీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తన కారు డ్రైవర్పై కేసు నమోదు చేయించి.. అరెస్ట్ చేయించి, దగ్గరుండి మరీ ఆ వాహనాన్ని పోలీసులతో సీజ్ చేయించారాయన. గురువారం రాజ్గఢ్లోని కొడయాకా గ్రామంలో జిల్లా స్థాయి అధ్యక్షుల సమావేశం జరిగింది. దానికి హాజరైన దిగ్విజయ్ సింగ్ మధ్యాహ్నం తిరుగుపయనం అయ్యారు. ఆ సమయంలో జీరాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద బైకర్ను వేగంగా ఢీ కొట్టింది డిగ్గీ రాజా ప్రయాణిస్తున్న కారు. ఆ కొట్టడంలో పది అడుగుల దూరం వెళ్లి పడ్డాడు బైకర్. వెంటనే కార్యకర్తలతో పాటు ముందు సీటులో కూర్చున్న ఆయన కారు దిగి.. బాధితుడ్ని కార్యకర్తల సాయంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని పరవాలియాకు చెందిన రాంబాబు బాగ్రి(20)గా గుర్తించారు. ప్రమాదం అనంతరం ఆస్పత్రికి వెళ్లి అతని పరిస్థితి గురించి ఆరా తీసి, అతన్ని పరామర్శించారు దిగ్విజయ్ సింగ్. దేవుడి దయ వల్ల యువకుడికి తీవ్ర గాయాలు కాలేదని, అతని చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని మీడియాకు చెప్పారాయన. స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అతన్ని భోపాల్కు రిఫర్ చేశారు వైద్యులు. ఇదిలా ఉంటే.. తన కారు డ్రైవర్పై దగ్గరుండి పోలీసులతో కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు దిగ్విజయ్ సింగ్. అనంతరం వాహనాన్ని సైతం సీజ్ చేయించారు. జీరాపూర్ పోలీస్ వద్ద ఆ వాహనాన్ని వదిలేసి.. స్థానిక ఎమ్మెల్యే కారులో ఆయన వెళ్లిపోయారు. आज राजगढ़, एमपी में एक बाइक सवार युवक पूर्व मुख्यमंत्री @digvijaya_28 जी की कार से टकरा गया। दिग्विजय सिंह ख़ुद सबसे पहले कार से उतरे और घायल शख़्स को अस्पताल लेकर पहुँचे। सीसीटीवी से पता चलता है कि ग़लती बाइक सवार युवक की है, युवक फ़िलहाल ठीक है।#DigvijayaSingh #MadhyaPradesh pic.twitter.com/tNalWUfWNu — विवेक सिंह नेताजी (@INCVivekSingh) March 9, 2023 Disclaimer: పై వీడియో కేవలం సమాచార సంబంధిత పోస్ట్ మాత్రమే. ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదు.. -
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. చెరుకు సుధాకర్, ఆయన తనయుడిని ఫోన్లో బెదిరించిన వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ వన్ టౌన్లో సుధాకర్ తనయుడు సుహాన్ నిన్న(సోమవారమే) ఫిర్యాదు చేశారు.దీంతో ఐపీసీ 506(నేరపూరిత బెదిరింపులు)తో పటు పలు సెక్షన్ల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడైన డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన తనయుడు డాక్టర్ సుహాస్ను.. తన(కోమటిరెడ్డి) వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తాను భావోద్వేగంతో చేసినవేనని, తనపై విమర్శలు చేయొద్దని మాత్రమే సుధాకర్ కొడుక్కి చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు.. సంభాషణల్లో కొన్ని మాటలనే కట్ చేసి.. ఆడియోను లీక్ చేశారని, కాల్ రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫోన్ సంభాషణను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి పంపించారు చెరుకు సుధాకర్. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారాయన. -
అంబర్పేట ఘటన.. పోలీస్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అంబర్పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే అంబర్పేట పోలీసులు శుక్రవారం కేసు వైపు అడుగేశారు. సీఆర్పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే.. కేసులో ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. మరోవైపు ఈ ఉదంతాన్ని మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకున్న కోర్టు.. గురువారం విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వెల్లగక్కింది. -
చంద్రబాబుపై బిక్కవోలు పీఎస్లో కేసు నమోదు
-
రూల్స్ బ్రేక్.. చంద్రబాబు, టీడీపీ నేతలకు షాక్
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రాజమండ్రి ఈస్ట్జోన్ డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, చంద్రబాబు నిబంధనలకు విరుద్దంగా రోడ్ షో నిర్వహించారు. పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించడంపై డీఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో, ఐపీసీ సెక్షన్లు 143, 359r/w, 149 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు సహా 8 మంది నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదైంది. అనపర్తిలో జరిగింది ఇదే.. ‘అనపర్తిలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. బహిరంగ సభ కోసం అనుమతి కావాలని ఆ పార్టీ నేతలు కోరారు. పోలీస్యాక్ట్ , జీవో నంబర్–1ను అనుసరించి రోడ్డుపై సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పాం. వారి సభ నిర్వహణకు అనుకూలంగా ఉండేలా కళాక్షేత్రంతో పాటు, ఒక లే అవుట్ను సూచించాం. అక్కడ పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పాం. అయినా వారు మా మాట వినిపించుకోకుండా రోడ్డుపై సభ పెట్టారు. ఇటు పోలీసులు, అటు ప్రజలకు ఇబ్బంది కలిగించారు’ అని తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డి తెలిపారు. దీన్నిబట్టి ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు అలజడి సృష్టించాలని, ఘర్షణ ధోరణి అవలంబించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నారని స్పష్టమవుతోంది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచి వేట్లపాలెం కెనాల్ రోడ్డు మీదుగా రోడ్షోతో చంద్రబాబు అనపర్తి వైపు బయలుదేరారు. పోలీసులు వాహనాలను నిలుపుదల చేసే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు, టీడీపీ నాయకులను ఉసిగొల్పారు. వారు పోలీసులతో వాగ్వావాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఒక్కసారిగా రెచ్చిపోయి దౌర్జన్యంగా పోలీసులను తోసేశారు. దీంతో పలువురు పోలీసులు కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. బారికేడ్లను ఎత్తి పడేశారు. దీంతో పోలీసులు నేలపై కూర్చుని బతిమిలాడారు. అయినా చంద్రబాబు వినిపించుకోకుండా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి వాహనాలతో ముందుకు కదిలారు. లక్ష్మీనరసాపురంలో పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టారు. కారులో ఉన్న చంద్రబాబు కిందకు దిగి.. అక్కడే ఉన్న మీడియా వాహనాన్ని ముందుకు పిలిపించి ఆ వాహనం పైకి ఎక్కి మాట్లాడారు. మాకు అనుమతి ఉంది, మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామని రెచ్చగొట్టడంతో పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అనపర్తి దేవీచౌక్ సెంటర్కు చేరుకుని సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. -
చంద్రబాబు పర్యటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు అవుతోంది. అయితే.. బుధవారం రాత్రి జగ్గంపేట బస్టాండ్ సెంటర్లో చంద్రబాబు రోడ్డు షో, బహిరంగ సభ నిర్వహించారు. ఒకవైపు చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. అక్కడే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహన్ని ఆవిష్కరించి దండ వేశారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్. దీంతో.. ఎన్నికల పరిశీలకుల ఫిర్యాదు మేరకు నవీన్ పై జగ్గంపేట పోలీస్స్టేషన్లో సెక్షన్ 188 IPC క్రింద కేసు నమోదు అయ్యింది. -
అమ్మా.. ఎక్కడున్నా వెంటనే రా..!
బంజారాహిల్స్: తమ తల్లి కనిపించడం లేదని, వెదికి పెట్టాలని కన్నీరుమున్నీరవుతూ ఇద్దరు చిన్నారులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్గూడ సమీపంలోని జవహర్నగర్లో నివసించే శ్రావణి(37) రెండు వారాల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. భర్త సురేష్ కారు డ్రైవర్ కాగా, శ్రావణి ఓ ప్రైవేట్ సంస్థలో క్లర్క్గా పని చేస్తోంది. తమ తల్లి కనిపించడం లేదని పదో తరగతి చదువుతున్న హర్ష(15), తొమ్మిదో తరగతి చదువుతున్న శరణ్య(13) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదిహేను రోజులైన తల్లి జాడ తెలియకపోవడం, తండ్రి పట్టించుకోకపోవడంతో పిల్లలిద్దరూ బుధవారం జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చారు. తల్లి లేకుండా ఉండలేకపోతున్నామని ఆ ఇద్దరు చిన్నారులు రోదిస్తుండటం చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. అమ్మా.. నువ్వుక్కెడున్నా వెంటనే ఇంటికి రావాలని వారు కోరారు. తరచూ తల్లిదండ్రుల మధ్య గొడవలు జరిగేవి చిన్నారులు ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు శ్రావణి కోసం గాలింపు చేపట్టారు. అయితే, ఆమె సెల్ఫోన్ను వెంట తీసుకెళ్లకపోవడంతో జాడ తెలియడం లేదు. భర్త సురేష్ను పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ ఆమె రెండు సార్లు ఇలానే అదృశ్యమైనట్టు పోలీసులు చెప్తున్నారు. -
ప్రయాణికుడి హల్చల్.. విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్..
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమాన ప్రయాణాల సమయంలో కొందరి అతి చేష్టాల గురించి వింటూనే ఉన్నాము. కొందరు ప్రయాణికులు ఓవర్ యాక్షన్తో ఇతర ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఎమర్జెన్సీ డోర్ను ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నాగపూర్ నుంచి ముంబై వెళ్తున్న 6E-5274 ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు(ప్రణవ్ రౌత్) హంగామా చేశాడు. ఇండిగో విమానం ప్రయాణంలో(గాలిలో) ఉన్న సమయంలో ప్లైట్లో ఉన్న ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని చూసిన విమాన సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ప్రయాణికుడిని అడ్డుకున్నారు. కాగా, సదరు ప్రయాణికుడి ఓవరాక్షన్ కారణంగా విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అనంతరం, సిబ్బంది ఈ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక, విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత.. ప్రణవ్ రౌత్ను సీఐఎస్ఎఫ్ బలగాలకు అప్పగించారు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో అతిగా ప్రవర్తించినందుకు ప్రణవ్ రౌత్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ హ్యాండిల్ తొలగించినట్లు విమాన సిబ్బంది గుర్తించారు. Mumbai Airport police filed a case against a passenger who tried to open the emergency exit door of IndiGo flight which landed from Nagpur to Mumbai. After landing, the senior cabin crew noticed that cover of the handle of emergency door has been removed. pic.twitter.com/gyvIlxRYoK — JetArena (@ArenaJet) January 29, 2023 -
వీడియో: జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు.. తప్పదు భారీ మూల్యం!
Viral Video.. ముగ్గురు యువకులు జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు చేశారు. జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తించారు. ఈ క్రమంలో తగిన మూల్యం చెల్లించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఖంగుతిన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెలిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు యువకులు జాతీయ గీతం పాడుతున్నారు. టేపులో జాతీయ గీతం వస్తుండగా.. మధ్యలో అద్నాన్ అనే యువకుడు.. ఓవరాక్షన్ చేశారు. జాతీయ గీతం ఆలపిస్తూ వెకిలి చేష్టలు చేశారు. నేషనల్ అంథమ్ పాడుతూ.. కుప్పి గంతులు వేశాడు. జాతీయ గీతాన్ని అవమానపరిచేలా వ్యవహరించాడు. ఈ క్రమంలో అతడితో పాటే రుహెల్, మరో యువకుడు కలిసి పెద్దగా నవ్వుతూ డ్యాన్స్ చేశారు. జాతీయ గీతం చివరలో కూడా అసభ్యకరంగా డ్యాన్స్ స్టెప్పులు వేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ వీడియోపై సచిన్ షిరోనీ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ శర్మ తెలిపారు. If you can't respect the national anthem, you don't deserve to be free. 'Adnan' and 'Ruhel' from UP should be behind bars for this act. pic.twitter.com/cLCxCYGUbq — Zaira Nizaam 🇮🇳 (@Zaira_Nizaam) January 27, 2023 -
డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. మొదటగా సెల్లార్లో ప్రమాదం జరిగింది. పొగలు వస్తున్న సమయంలో ఏడుగురు సెల్లార్లోనే ఉన్నారు. ఆ పొగను చూసి కార్మికులంతా బయటకు వచ్చారు. అయితే.. ఫస్ట్ ఫ్లోర్లో స్పోర్ట్స్ మెటీరియల్ గోదాం ఉంది. ఆ మెటీరియల్ దించేందుకు ముగ్గురు కార్మికుల్ని యజమాని పైకి పంపించారు. ఆ ప్రయత్నంలో వాళ్లు ఉండగానే.. పొగలు, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. అలా ఆ ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్లోనే చిక్కుకున్నారు. ఆ ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయి ఉన్నాయి. భవనంలోని మెట్ల మార్గం పూర్తిగా కూలిపోయింది. క్రేన్ల సాయంతో భవనం పరిస్థితిని సమీక్షిస్తున్నాం అని డీసీపీ రాజేష్ మీడియాకు తెలిపారు. ఇక.. డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చే వరకు చుట్టుపక్కల ఇళ్లలోకి ఎవరిని అనుమతించమన్న ఆయన.. లోపల డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించేందుకు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ వెనుక భాగం పూర్తిగా దెబ్బ తింది. బిల్డింగ్ లోపలకి వెళ్ళే పరిస్థితి లేదు. చుట్టూ పక్కల వారికి ఎలాంటి హాని కలగకుండా డిమాలిషన్ ఏర్పాట్లు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన బిల్డింగ్ యజమాని పై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన మీడియాకు తెలిపారు. -
డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంపై కేసు.. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై కేసు నమోదైంది. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి భవనం యజమాని మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంలు కారణమని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురిని రెస్క్యూ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వసీం, జునైద్, జహీర్ కోసం అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి వెళ్లారు. బిల్డింగ్ ఓనర్ను కూడా లోపలికి తీసుకెళ్లారు. నిన్న అగ్ని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన ఫైర్ సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారంతా నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా అదుపులోకి రాని మంటలు.. డెక్కన్ మాల్లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భవనం దగ్గరికి ఎవరినీ అనుమతించడం లేదు. సెల్లార్లో చిక్కుకున్న వారిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భవన యజమానిపై చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు. మంటల్లో కాలిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. చదవండి: సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
కాంగ్రెస్ వార్ రూం కేసు.. మల్లు రవిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. పార్టీ వ్యూహకర్తగా పేరు వినిపిస్తున్న సునీల్ కనుగోలు స్టేట్మెంట్ ఆధారంగానే మల్లు రవిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. మంగళవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మల్లు రవి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం హాజరు కావాల్సిందిగా ఇచ్చిన నోటీసులపై ఆయన వివరణ కోరగా.. గురువారం విచారణ కోసం వచ్చినప్పుడే చెప్తామని అధికారులు బదులు ఇచ్చారు. ఈ క్రమంలో.. బుధవారం ఈ సీనియర్ నేత పేరును నిందితుడిగా చేర్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. సాక్షి టివీ చేతిలో సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ‘‘కాంగ్రెస్ వార్ రూంతో నాకు సంబంధం లేదు. నేను కాంగ్రెస్కు వ్యూహాలు మాత్రమే చెప్తాను. వార్ రూం ఇంఛార్జి మల్లు రవి. మల్లు రవి చెప్పింది మాత్రమే మా టీం చేస్తుంది’’ :::పోలీసులకు సునీల్ కనుగోలు స్టేట్మెంట్ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో.. గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. అయితే.. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు కూడా. ఇక సునీల్ కనుగోలు కింద పనిచేస్తున్న మెండా శ్రీ ప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేశారు. ఈనెల 12వ తేదీన(గురువారం) విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్లో అసలేం జరుగుతుంది? అక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? పూర్తి వివరాలపై విచారణ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్ఛార్జి అయిన మల్లు రవికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నా.. కేసు నమోదు కావడంతో తర్వాతి పరిణామం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అరుదైన జాతికి చెందిన ఓ పెంపుడు పిల్లిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చింతలకుంట జహంగీర్కాలనీలో ఎస్.కె.గజాన మహ్మద్(22) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. థాయిలాండ్లోని కాహో మనీ బ్రీడ్కు చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్లో, మరొకటి బ్లూ కలర్లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత. అయితే ఆదివారం రాత్రి పిల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంతో స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దానిని ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
చిత్తూరు: పోలీసులపై దాడి వ్యవహారంలో 3 కేసులు నమోదు
-
చంద్రబాబు రోడ్ షోలో విషాద ఘటనపై కేసు నమోదు
-
కందుకూరు ఘటనపై కేసు నమోదు.. మంత్రి వనిత ఏమన్నారంటే?
సాక్షి, కొవ్వూరు: నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో విషాదం నెలకొన్ని విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సభలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ విషాద ఘటన జరిగింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబుకు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ నిర్వహించకూడదనే విషయం తెలియదా?. గోదావరి పుష్కరాల్లో కూడా ఇలాగే పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారు. చంద్రబాబుకు ఇదేమి పబ్లిసిటీ పిచ్చి అని ప్రజలందరూ ఇదేమి కర్మరా బాబు అని బాధపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే తమ్ముళ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏమిటి?. చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశాము అని తెలిపారు. -
ప్రేమ పేరుతో వెంటబడి.. యువతి ఫొటోలను రహస్యంగా తీసి మార్ఫింగ్..
సాక్షి, హైదరాబాద్: యువతులను వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. ఎర్రగడ్డలోని ఓ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని (22) ప్రాక్టికల్స్కు వచ్చిన సమయంలో నార్సింగ్కి చెందిన మహబూబ్ అలియాస్ హేమంత్తో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకుంటానని వేధించసాగాడు. ఫోన్లో ఆమె ఫొటోలను రహస్యంగా తీసి నగ్నంగా మార్ఫింగ్ చేశాడు. తనకు రూ.3 లక్షలు ఇవ్వాలని, లేదంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పాటు కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బయపడిన యువతి మహబూబ్ అడిగిన డబ్బులు ఇచ్చింది. ఒంటిపై ఉన్న నగలు సైతం ఇవ్వమని డిమాండ్ చేయడంతో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చింది. ఇటీవల ఆమె కుటుంబసభ్యులు నగలు ఎక్కడున్నాయని అడగ్గా అసలు విషయం చెప్పడంతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బ్యూటీషియన్గా పనిచేస్తున్న ఓ యువతిని మోసం చేసి రూ.8 లక్షలు స్వాహా చేశాడు ఓ వ్యక్తి. ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్న ఓ యువతి బ్యూటీషియన్గా పని చేస్తుంది. నాలుగేళ్ల క్రితం కోదాడకు చెందిన కంభంపాటి రాజేంద్రబాబు పరిచయమై ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రూ.8 లక్షలు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడిలో మార్పు గమనించిన యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి తప్పించుకుని తిరుగుతున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన యువతి రాజేంద్రబాబుపై ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో.. బీకేగూడలోని హాస్టల్లో ఉంటున్న 23 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఎనిమిది నెలల క్రితంసూర్యాపేటకు చెందిన సుద్దాల సునీల్ అనే వ్యక్తి పరిచయమై వేధింపులకు పాల్పడుతున్నాడు. వేర్వేరు నంబర్లతో ఫోన్లు చేసి వేధిస్తుండటంతో అతడి నంబర్ను బ్లాక్ చేసింది. ఈ క్రమంలో ఆమెను వెంబడించి బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా?: వైఎస్ విజయమ్మ
సాకక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ విజయమ్మను ఇంటివద్దే అడ్డుకున్న పోలీసులు కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు బయల్దేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ విజయమ్మను ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు రానీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మరొకవైపు వైఎస్ షర్మిలను ఎస్ఆర్నగర్ పీఎస్లోనే ఉంచడంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో వైఎస్సార్టీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా? పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్షకు దిగారు. ‘ కుమార్తెను చూడటానికి వెళ్తుంటే అడ్డుకుంటారా?, షర్మిల చేసిన నేరమేంటి?, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా?, పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా?, ప్రజల కోసం నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు. ప్రజా సమస్యలపైనే షర్మిల మాట్లాడుతోంది. షర్మిల వచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తా’ అని విజయమ్మ మీడియాకు తెలిపారు. ఎస్ఆర్నగర్ పీఎస్కు బ్రదర్ అనిల్ షర్మిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు. కాగా, నిన్న(సోమవారం) టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్కు షర్మిల బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అతి కష్టం మీద కారు డోర్లు తెరిచి షర్మిలను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లారు. మరోవైపు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీఎస్కు షర్మిల అనుచరులు, వైఎస్సార్టీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు భవనం పైకి ఎక్కి వి వాంట్ జస్టిస్ అంటూ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్.. బందిపోట్ల రాష్ట్ర సమితిలా తయారైందన్నారు. ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. చదవండి: హైదరాబాద్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత -
ఎమ్మెల్యేల కేసు: రామచంద్ర భారతికి ఊహించని షాక్.. ఉచ్చు బిగుసుకుంటోందా!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో రామచంద్ర భారతికి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో మరో ఫిర్యాదు నమోదైంది. రామచంద్ర భారతిపై సిట్ అధికారి గంగాధర్ ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో ఐఫోన్, ల్యాప్ట్యాప్లో నకిలీ పాస్ట్పోర్ట్ లభ్యమైంది. కర్నాటక అడ్రస్తో T9633092 నెంబర్తో నకిలీ పాస్పోర్ట్ దొరికింది. దీంతో, ఆయనపై 467, 468, 471, ఐపీసీ12(3) పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులివ్వాలని సిట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. -
రూ. 10 వేలు కట్టండి.. ఖర్చులు భరించండి
నోయిడా: బహుళ అంతస్తుల భవంతి లిఫ్ట్లో ఆరేళ్ల విద్యార్థిపై పెంపుడు శునకం దాడి ఘటనలో కుక్క యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చిన్నారి చేతికి గాయం కావడంతో చికిత్సకయ్యే ఖర్చంతా భరించాలని, మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆయనను గ్రేటర్ నోయిడా అథారిటీ ఆదేశించింది. గ్రేటర్ నోయిడా(పశ్చిమం)లోని విలాసవంత లా రెసిడెన్షియా సొసైటీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సొసైటీలో ఉండే ఒకావిడ తన కొడుకుతో కలిసి లిఫ్ట్లో వెళ్తుండగా అప్పుడే ఒకతను తన కుక్కతో సహా లిఫ్ట్లోకి వచ్చాడు. వచ్చీరాగానే బాలుడిని కుక్క కరిచేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యంతో ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ‘కుక్కను అదుపుచేయడంలో మీరు విఫలమయ్యారు’ అని అతడికి పంపిన నోటీసులో గ్రేటర్ నోయిడా అథారిటీ ఆరోగ్యవిభాగాధిపతి డాక్టర్ ప్రేమ్చంద్ పేర్కొన్నారు. రూ.10వేలు, చికిత్స ఖర్చు ఏడు రోజుల్లో చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నందుకు బిగుస్తున్న ఉచ్చు.. తెరపైకి హీరో రానా ప్లాట్ వ్యవహారం
బంజారాహిల్స్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందుకుమార్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫిలింనగర్ రోడ్ నం.1 లోని ప్లాట్ నం. 2లో సినీ హీరో దగ్గుబాటి రానా ప్లాట్ను నందు లీజుకు తీసుకొని జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అద్దెకిచ్చాడు. అయితే, చట్టపరమైన హక్కులు లేకుండా ఈ ప్లాట్లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు గత ఆదివారం కూల్చివేశారు. ఇక్కడ ఐస్క్రీం పార్లర్ ఏర్పాటు కోసం రూ.8 లక్షలు అడ్వాన్స్గా చెల్లించానని, రూ.40 లక్షలతో మరమ్మతులు, ఇంటీరియర్ చేయించుకున్నానని, ఇప్పుడు ఈ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారని, డబ్బులు వసూలు చేసి మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలని సంజయ్రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశా రు. అలాగే బాంబే గార్మెంట్ స్టోర్ పేరుతో తనకు ఓ అక్రమ కట్టడాన్ని అంటగట్టి పెద్ద ఎత్తున అడ్వాన్స్ తీసుకున్నాడని ఇంటీ రియర్ కోసం తాను లక్షలాది రూపాయలు ఖర్చు చేశానని మియాపూర్కు చెందిన ఇందిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్లాట్లో అక్రమంగా నిర్మించిన ఓ షాపును బరిస్టా స్టోర్ పేరుతో తాను ఏర్పాటు చేశానని.. ఇది అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు యత్నించడమే కాకుండా నోటీసులు జారీ చేశారని తనను మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్కు చెందిన అశిజ్రెడ్డి ఫిర్యాదు చేశా రు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు నందుపై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద కేసులు నమో దుచేశారు. ఇదిలా ఉండగా ఆరు రోజుల క్రితం దక్కన్ కిచెన్ హోటల్స్ యజమాని సయ్యద్ అయాజ్, మొబైల్ యాక్ససెరీస్ గాడ్జెట్ స్టూడియో యజమాని సందీప్ కుమార్ కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా నందుపై పోలీసులు అయిదు చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా విడుదల పేరుతో మోసం చేశారు, కత్తితో బెదిరించారు: నిర్మాత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఏఎన్నార్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా ప్రతిబింబాలు పేరుతో తాను నిర్మించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ రూ.13 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ సినీ నిర్మాత జె.రాధాకృష్ణమూర్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయం చర్చించేందుకు తాను రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణలకు ఫోన్ చేయగా వారు అందుబాటులోకి రాలేదన్నారు. వారి డ్రైవర్ బాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తనను దుర్భాషలాడారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల విషయంలో, తన వద్ద తీసుకున్న డబ్బుల విషయంలో ప్రశ్నించినందుకు తనను బెదిరించారని, కత్తి తీసుకొని పొడిచేందుకు ప్రయత్నించారని వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కుర్చీలో నుంచి కిందపడేసి గాయపరిచారన్నారు. బలవంతంగా తన ఆఫీస్లోని పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు తీసుకొని వెళ్లారని వాటిని తిరిగి ఇవ్వలేదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సినీ నిర్మాత జె.రాధాకృష్ణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ, డ్రైవర్ బాలుపై ఐపీసీ సెక్షన్ 448, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్విత్ 177ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదయింది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్ ర్యాష్ డ్రైవింగ్పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. హైవేపై పవన్ కాన్వాయ్ని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు ఫైల్ చేశారు. తెనాలి మారిస్పేటకు చెందని శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పవన్ కల్యాణ్, కారు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (జనసేన నాయకుల ఓవరాక్షన్.. దెబ్బకు జారుకున్నారు) -
ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు.. నటి జయలక్ష్మిపై కేసు నమోదు
సాక్షి, చెన్నై: బీజేపీ రాష్ట్ర నిర్వాహకురాలు, నటి జయలక్ష్మిపై తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఇరుగంబాక్కం వెంకటేష్ నగర్లో నివసిస్తున్న ప్రముఖ గీత రచయిత స్నేహన్, 2015లో స్నేహం ఫౌండేషన పేరుతో స్వచ్ఛంద సేవ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టు తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా బీజేపీ నిర్వాహకురాలు నటి జయలక్ష్మి బయట స్నేహం ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు చేస్తూ రూ.కోట్ల మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసిందని ప్రముఖ గీత రచయిత స్నేహన్, నటి జై లక్ష్మీభాయి గత ఆగస్టు 5వ తేదీన చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్నేహన్ ఆరోపణలను ఖండిస్తూ నటి జయలక్ష్మి ఆగస్టు 8వ తేదీన చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆయనపై ఫిర్యాదు చేశా రు. ఈ విషయం తెలుసుకున్న గీత రచయిత స్నేహన్ చెన్నై హైకోర్టులో జయలక్ష్మిపై పిటీషన్ దాఖలు చేశారు. ఆయన పిటీషన్ను విచారించిన న్యాయస్థానం నటి జయలక్ష్మి మోసానికి పాల్పడినట్టు ఆధారాలుంటే ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన తిరుమంగళం పోలీసులు నటి జయలక్ష్మిపై 420, 465 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని బుధవారం ఆమెకు సమన్లు జారీ చేశారు. -
నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడంతో..
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రాపై కేసు నమోదైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న తన భార్యను కారుతో తొక్కించాడనే ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 10న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగావెలుగులోకి వచ్చింది. భర్త తనని చంపాలని చూశాడని కిశోర్ మిశ్రా భార్య అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. చదవండి: Samantha Shocking Look: సామ్ సర్జరీ చేసుకుందా? ఇలా మారిపోయిందేంటి! వివరాలు.. బాలీవుడ్ నిర్మాత అయిన కిశోర్ మిశ్రా మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అంధేరిలోని ఓ ఇంటి పార్కింగ్ స్థలంలో సదరు మహిళతో సన్నిహితంగా ఉండటం ఆయన భార్య కంటపడింది. ఇక ఈ విషయమై ఆయనను నిలదీసేందుకు ఆమె కారు దగ్గరికి వెళ్లింది. కారు దిగమని చెబుతున్న ఆయన డోరు తీయకపోవడంతో ఆమె గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో కంగారు పడ్డ కిశోర్ మిశ్రా వెంటనే కారు స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో కారు ఆమెను ఢీకోట్టడంతో ఆమె కిందపడిపోయింది. చదవండి: పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చిన బంగారం ఎంతో తెలుసా? అయినా కిశోర్ మిశ్రా కారు ఆపకుండ భార్య కాళ్లపై నుంచి ముందుకు పోనిచ్చాడు. అయితే ఆమె అరవడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుకు వచ్చి ఆమె కాపాడాడు. అయితే ఈ ఘటనలో ఆమె తలకు, కాళ్లకు, చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భర్త తనను చంపాలని ప్రయత్నించాడని కిశోర్ మిశ్రా భార్య అంబోలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కిశోర్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. Mumbai: FIR registered against filmmaker Kamal Kishor Mishra for allegedly ramming his car into his wife after she spotted him with another woman in the vehicle, say police pic.twitter.com/DeUa1YP1Xu — AH Siddiqui (@anwar0262) October 26, 2022 -
ఆల్భమ్ సాంగ్లో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. తీవ్ర వ్యతిరేకత.. కేసు నమోదు
సోషల్ మీడియా సెన్సేషన్, హిందీ బిగ్బాస్ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావేద్ తన తీరుతో మరోసారి వివాదంలో నిలిచింది. తాజాగా ఆమె నటించిన ఓ అల్బమ్ సాంగ్పై పలు సామాజిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలో ఉర్ఫీ చీరకట్టు, డాన్స్పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 23న ఆమెపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ వీడియోలో ఉర్ఫీ తీరు లైంగిక చర్యలను ప్రోత్సహించేలా ఉందంటూ సదరు ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు. చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? కాగా ఉర్పీ జావేద్ నటించిన ‘హాయే హాయే యే మజ్బూరీ’ అనే అల్భమ్ సాంగ్ అక్టోబర్ 11న రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె రెడ్ కలర్ చీర కట్టులో కనిపించింది. ఉర్ఫీ విభిన్న వస్త్రాధారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్తో ఆమె తరచూ ట్రోల్స్ బారిన పడుతుంది. తాజాగా ఈ పాటలో సైతం ఆమె చీరకట్టులో ఫుల్ గ్లామర్ షో చేసింది. దీంతో ఉర్పీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియోలో ఆమె డ్రెస్సింగ్, డాన్స్ తీరు లైంగిక పరంగా రెచ్చగొట్టెలా ఉందంటూ పలువురి నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి: ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటిపై గతంలో ఉర్ఫీ జావేద్ స్పందిస్తూ ఇవేవి తనని బాధించలేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సైతం స్పందిస్తూ తన డ్రెస్సెంగ్, ఫ్యాషన్ పట్ల చాలా గర్వంగా ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ట్రోల్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. నా ఫ్యాషన్ తీరు పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. విమర్శలు, వివాదాలు నన్ను ఆపలేవు. ఎందుకంటే నేను ఏం చేసినా, ఏం పోస్ట్ చేసిన దాన్ని అందరు పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూనే ఉంటారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
రెచ్చిపోయిన మృగాలు.. స్కూటీపై వెళ్తున్న మహిళను అడ్డుకుని పొల్లాల్లోకి లాక్కెళ్లి..
ఒంగోలు సబర్బన్: రాత్రివేళ స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిమ్మచీకట్లో పొలాల్లోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశారు. ఒంగోలులోని కొప్పోలు–ఆలూరు రోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. కొత్తపట్నం మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన వివాహిత(30) ఒంగోలు నగరంలో కూరగాయల వ్యాపారం చేస్తుంటుంది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని 10.30 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొలుత ద్విచక్ర వాహనంపై ఆమెను వెంబడించారు. కొప్పోలు–గుత్తికొండవారిపాలెం రోడ్డులో గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో అడ్డుకున్నారు. చీకట్లో పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. అనంతరం ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. గురువారం ఒంగోలు వచ్చి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను వేడుకుంది. ఎస్పీ మలికాగర్గ్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని అఘాయిత్యానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు ఆలూరు రోడ్డులోని రొయ్యల చెరువుల వద్ద పనిచేసే వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్ నుంచి ఒంగోలు దిశ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
కేసు నుంచి తప్పిస్తా.. కానీ ఖర్చవుతుంది: ఎస్ఐ మరో అవతారం!
యశవంతపుర(బెంగళూరు): కేసు నుంచి తప్పిస్తామంటూ భారీ మొత్తాల్లో లంచం తీసుకుంటూ బెంగళూరు ఉత్తర తాలూకాలోని చిక్కజాల ఎస్ఐ ప్రవీణ్తో పాటు కానిస్టేబుల్ రవిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. రవిని లోకాయుక్త అరెస్ట్ చేయగా ఎస్ఐ ప్రవీణ్ తప్పించుకున్నారు. వివరాలు... ప్రకాశ్ అనే ఒక కాంట్రాక్టర్పై చిక్కజాల పోలీసుస్టేషన్లో కేసు ఉంది. కేసుపై కోర్టులో చార్జిషీట్ వేయడంపై మాట్లాడడానికి ప్రకాశ్ మామ దేవరాజును కానిస్టేబుల్ రవి కలిశాడు. ప్రకాశ్ను కేసు నుంచి తప్పించాలంటే రూ. 3.70 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎస్ఐ ప్రవీణ్కు 3.50 లక్షలు, ఇద్దరు స్టేషన్ రైటర్లకు తలా రూ. 10 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉందన్నాడు. సరేనని దేవరాజు సదరు మొత్తాన్ని రవికి ఇచ్చాడు. కానీ కేసులో ఎలాంటి పురోగతి కనపడలేదు. దేవరాజు వెళ్లి రవిని కలిసి ఇదే అడిగాడు. మరో రూ. 5 లక్షలకు డిమాండ్ ఇది చాలా పెద్ద కేసు, మరో రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రకాశ్కు మరో షాక్ తగిలింది. డబ్బులు ఇవ్వని కారణంగా ఎస్ఐ ప్రవీణ్ కాంట్రాక్టరు కుటుంబానికి తక్షణం విచారణకు రావాలని నోటీసులు పంపాడు. తీవ్ర ఆక్రోశానికి గురైన దేవరాజు లోకాయుక్తను ఆశ్రయించాడు. రవి, ప్రవీణ్లు కలిసి దేవరాజును లంచం డబ్బుతో చిక్కజాల పోలీసుస్టేషన్ వద్దకు పిలిపించుకున్నారు. రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు తక్షణం రవిని అరెస్ట్ చేయగా ఎస్ఐ ప్రవీణ్ పరారయ్యాడు. ఫోన్లో ఏసీబీ అని వినబడడంతో రవి తప్పించుకోగలిగాడు. అతని కోసం గాలింపు చేపట్టారు. చదవండి: అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని.. -
మరో నటితో భర్త వివాహేతర సంబంధం, పోలీసులను ఆశ్రయించిన నటి దివ్య
భర్త తనని మోసం చేశాడంటూ ప్రోలీసులను ఆశ్రయించింది బుల్లితెర నటి దివ్వ శ్రీధర్. మరో నటితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని కూడా తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సన్టీవీలో ప్రసారమయ్యే తమిళ సీరియల్ సెవ్వంధీతో దివ్వ శ్రీధర్ నటిగా గుర్తింపు పొందింది. చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు ఆ తర్వాత కేలడి కన్మణి సీరియల్లో తన సహానటుడైన ఆర్నవ్తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొద్ది రోజులు రిలేషన్షిప్ ఉన్న అనంతరం సీక్రెట్గా వివాహం చేసుకున్నారు. అయితే తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించవద్దని ఆర్నావ్ దివ్యను కోరిటన్లు ఆమె పోలీసులకు పేర్కొంది. అదే సమయంలో అతడు మరో నటితో ప్రేమలో ఉన్నాడని, దీంతో తాను భర్తను నిలదీసి అందరి సమక్షంలో తనని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో కాంచీపురంలోని ఓ ఆలయంలో మళ్లీ పెళ్లి చేసుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్ ప్రస్తుతం తాను గర్భవతి అని, అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. తనతోపాటు పుట్టబోయే బిడ్డకు ఆర్నావ్ వల్ల ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అంతేకాదు ఆర్నవ్ బలవంతంగా తనకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. తనకి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. అంతేకాదు ఈ విషయమై ఆమె కమిషనర్ను కూడా ఆశ్రయించినట్లు చెప్పింది. -
మాదాపూర్లో హైటెక్ దందా.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి.. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న వారికి ఊహంచని షాక్ తగిలింది. ఐటీ కొలువు వచ్చిందని.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని భావించిన ఉద్యోగులకు కంపెనీ భారీ షాకిచ్చింది. డబ్బులు వసూలు బోర్డు తిప్పేసింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ధన్యోన్ ఐటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయితే, అంతకుముందు.. సదరు ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది. దీంతో పలువురు నిరుద్యోగులు, ఆశావహులు కంపెనీని సంప్రదించారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం వారికి భారీ ప్యాకేజీలు ఆఫర్ చేసింది. ఉద్యోగం ఫైనల్ చేసుకున్న వారితో కంపెనీ డీల్ కుదుర్చుకుంది. సదరు కంపెనీ యాజమాన్యం ఉద్యోగం పేరుతో దాదాపు 200 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చిన వారికి ఆఫర్ లెటర్స్ సైతం పంపించినట్టు తెలుస్తోంది. రోజులు గుడుస్తున్నా.. ఆఫీస్ నుంచి పిలుపురాకపోవడంతో బాధితులు.. తాము మోసపోయినట్లు గుర్తింపు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. -
సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్.. అర్ధరాత్రి 15 మంది ఇంట్లో దూరి..
అర్ధరాత్రి ఓ మహిళను 15 మంది కలిసి కిడ్నాప్ చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు గేటు బద్దలుకొట్టి మరీ మహిళను ఎత్తుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే నిందుతులను పట్టుకుని మహిళను కాపాడారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మైలాడుతురైలో చెందిన ఓ యువతి(24)తో నిందితుల్లో ఒకరైన విఘ్నేశ్వరన్కు కొద్ది రోజుల కిత్రం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో విఘ్నేశ్వరన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో, బాధితురాలు.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనంతరం.. వ్రాతపూర్వకంగా లేఖ రాయించుకుని విఘ్నేశ్వరన్కు విడుదల చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన విఘ్నేశ్వరన్.. యువతిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో, నిందితుడు మరో 14 మందితో కలిసి మహిళను కిడ్నాప్ చేశారు. 15 మంది కలిసి ఆమె ఇంటి గేటును బద్దలుకొట్టి మరీ.. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను సిటీ దాటిస్తుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు వెంబడించి హైవేపై వారిని పట్టుకున్నారు. ఆమెను విడిపించి.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. Fifteen men kidnap woman from her residence in Mayiladuthurai, Tamilnadu! pic.twitter.com/WCK1AFdW7l — karthik gopinath (@karthikgnath) August 3, 2022 -
‘మీ ఫ్యామిలీని కాల్చిపడేస్తా.. బీజేపీ మంత్రి బెదిరింపులు’
ఆయనో మంత్రి.. పేదలకు సాయం చేయాల్సిందిపోయి వారినే బెదిరించాడు. తాను చెప్పింది వినకుండా ఎక్కువగా మాట్లాడితే మీ కుటుంబాన్ని మొత్తం కాల్చిపడేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హోస్పెట్లో భూవివాదానికి సంబంధించి ఎస్సీ వర్గానికి చెందిన ఓ కుటుంబాన్ని కర్నాటక పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్ బెదిరించారు. కాగా, మంత్రి మంగళవారం హోస్పెట్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఎస్సీ వర్గానికి చెందిన పోలప్ప అనే వ్యక్తి.. భూవివాదంలో మరో వర్గానికి చెందిన వారు తమను ఇబ్బంది పెడుతున్నారని మంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంద్ సింగ్.. తాము చెప్పింది చేయాలని పోలప్పను బెదిరించారు. లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాల్చిపడేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆవేదనకు గురైన పోలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మంత్రి ఆనంద్ సింగ్తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసినందుకు గానూ పోలప్ప ఫ్యామిలీపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. The members of the family threatened by #Karnataka Tourism, Ecology and Environment Minister Anand Singh, later attempted to immolate themselves.https://t.co/kGLeJmzu06 — News9 (@News9Tweets) August 31, 2022 -
షాకింగ్ ఘటన: మగ సంతానం కోసమని.. భార్యకు అందరి ముందు..
పుణే: మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఆ భర్త చేసిన పని దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. ఇంట్లో శాంతి నెలకొనాలన్నా.. అన్నింటికి మించి మగ సంతానం కలగాలన్నా తాను చెప్పినట్లు చేయాలని ఓ ఫేక్ బాబా సలహా ఇవ్వడంతో.. భార్యను అందరి ముందు దుస్తులు లేకుండా స్నానం చేయించాడు సదరు భర్త. మహారాష్ట్ర పుణేలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్ఘడ్కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా ఫేక్ బాబా చెప్పినట్టు స్నానం చేయించింది. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న ఫేక్ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రూపాయి తెచ్చిన పంచాయితీ ! -
కోడి కూస్తోందని కేసు పెట్టారు
ఊళ్లల్లో ఇరుగుపొరుగు మధ్య కోళ్ల పంచాయితీ కొత్తేం కాదు. కానీ ‘పక్కింటివాళ్ల కోడి వేధిస్తోంది, భరించలేకుండా ఉన్నాం బాబోయ్’ అంటూ కోర్టుకెక్కారు జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా. కోడిపుంజు తెగ కూస్తూ తమను ఇబ్బందిపెడుతోందని కోర్టుకు విన్నవించుకున్నారు. కోడన్నాక కూయకుండా ఉంటుందా? ఆ మాత్రానికే కేసు పెట్టాలా అతిగాకపోతేను. అంటే.. అది కూస్తుంది పది ఇరవైసార్లు కాదు.. రోజుకు 200 సార్లట. అదికూడా 80 డెసిబెల్స్ రేంజులో. అంటే రద్దీగా ఉన్న ఓ వీధిలో వచ్చే శబ్దం అంత అన్నమాట. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ కూతల మోత... సాయంత్రం ఇతర కోళ్లతోపాటు గూట్లోకి చేరేంతవరకూ ఉంటోంది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ గోలను భరించలేక వారు కోడిపై కేసు పెట్టారు. ‘వాళ్లు కోడిని వదులుకోలేరు. అది ఉంటే మేం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాం. తలుపులు, కిటికీలు తీస్తే నాన్స్టాప్ చప్పుడు. చివరకు గార్డెన్కూ వెళ్లలేకపోతున్నాం. అదో, మేమో తేల్చుకోవాల్సిందే’ అని అంటున్నారు. పొద్దున లేస్తే కోడిచేసే చప్పుడును రికార్డు చేసి కోర్టు ముందుంచారు. అంతేకాదు.. దాని దెబ్బకు చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన వాళ్ల గురించి కూడా కేసులో ప్రస్తావించారు. కేసు లెమ్గో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది. ఆయన తీర్పుమీదే ఈ కోడి భవిష్యత్ ఆధారపడి ఉందన్నమాట. -
మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతకు బిగ్ షాక్ తగిలింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ 2018లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఢిల్లీకి చెందిన ఓ మహిళ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ నేత తనపై అత్యాచారం చేశాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ కేసులో విచారణలో భాగంగా గురువారం ఢిల్లీ హైకోర్టు.. షానవాజ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, 3 నెలల్లో పోలీసులు విచారణ పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని వాస్తవాలను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. Delhi HC orders FIR against BJP leader Shahnawaz Hussain in rape case, chides police for ‘complete reluctance’https://t.co/kmI5D1X4TO pic.twitter.com/lRH46nmDqQ — Shining India News (@shiningindnews) August 18, 2022 ఇది కూడా చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు -
ఒకే ఇంట్లో ఆరుగురు మృతి.. ఏం జరిగింది?
ఒకే ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరు ఎలా చనిపోయారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉగ్రవాదులు సోఫియాన్ జిల్లాలో కశ్మీర్ పండిట్లపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఓ కశ్మీర్ పండిట్ చనిపోగా, అతని సోదరుడు గాయపడ్డాడు. మృతున్ని సునీల్ కుమార్ భట్గా గుర్తించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 6 members of family found dead at home in Jammu https://t.co/QIgJKdeD3A — Hindustan Times (@HindustanTimes) August 17, 2022 ఇది కూడా చదవండి: రోడ్డు లేక డోలీలో ఆస్పత్రికి బాలింత.. కవలలు కన్నుమూత! -
హీరో దర్శన్ వల్ల ప్రాణహాని ఉంది: పోలీసులను ఆశ్రయించిన నిర్మాత
కన్నడ స్టార్ హీరో దర్శన్పై పోలీసు కేసు నమోదైంది. దర్శన్ బెదిరిస్తున్నాడని, అతడి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్శన్పై కెంగేరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంద. వివరాల్లోకి వెళితే.. భరత్ విష్ణుకాంత్ అనే నిర్మాత భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నటుడు ధృవన్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. అయితే కరోనా, లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం తన వద్ద డబ్బు లేకపోవడంతో నిర్మాత సినిమాను పూర్తి చేయలేకపోయాడు. చదవండి: లలిత్ మోదీతో డేటింగ్.. మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా, వీడియో వైరల్ ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్ ధృవన్కు వివరించాడు. ఒకవేళ డబ్బు సర్ధుబాటు అయితే గనుక తాను సినిమాను తిరిగి ప్రారంభిస్తానని మాట కూడా ఇచ్చాడట. కానీ ఆ విషయాన్ని పట్టించుకొని ధృవన్ స్టార్ హీరో అయిన దర్శన్కు చెప్పుకుని వాపోయాడు. అనంతరం దర్శన్.. నిర్మాత భరత్కు ఫోన్ చేసి సినిమాను ఎలాగైన పూర్తి చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన భరత్ పోలీసులను ఆశ్రయించి హీరో దర్శన్, నటుడు ధృవన్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. వారిపై పటిషన్ దాఖలు చేసి దానితో పాటు దర్శన్ మాట్లాడిన ఆడియో క్లిప్ను కూడా పోలీసులకు అందజేశాడు. చదవండి: నటుడికి గుండెపోటు, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న వైద్యులు కాగా ఆడియోలో దర్శన్, నిర్మాతతో.. ‘వెంటనే సినిమాను పూర్తి చేయాలని, లేదంటే ఏదైనా జరగొచ్చు. నేను తలుచుకుంటే కనబడకుండా పోతావ్. నేను ఏదైనా చెప్పే చేస్తాను. నిన్ను ఎక్కడా కనిపించకుండా చేయగలను’ అంటూ నిర్మాతను భయపెట్టడం.. దీంతో నిర్మాత లాక్డౌన్ తర్వాత సినిమాను ప్రారంభిస్తానని చెప్పుకురాడం ఆడియోలో క్లియర్ ఉంది. ఇక ఈ ఆడియో ఆధారంగా పోలీసులు దర్శన్, నటుడు ధృవన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శాండల్వుడ్ స్టార్ హీరో అయిన దర్శన్కు కన్నడలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఇక ఆయనను ఫ్యాన్స్ డిబి బాస్ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. -
మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడి నిర్వాకం.. యువతిపట్ల అసభ్యకర ప్రవర్తన
మధురపూడి (తూర్పుగోదావరి): మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని తీరు భరించలేక ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కోరుకొండ ఎస్ఐ తెలిపిన వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి (27) తన స్నేహితురాలితో కలిసి సోమవారం రాత్రి మంజీరా ఫంక్షన్ హాల్లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు వెళ్లింది. అక్కడ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ ఆతిథ్యం ఇస్తానంటూ తన కారులో ఇద్దరినీ కోరుకొండ మండలం గాడాలలోని తమ గెస్ట్హౌస్కి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ, భోజనాలు చేస్తున్న సమయంలో ఆ యువతిపట్ల శ్రీరాజ్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ అతను తన తీరు మార్చుకోకపోవడంతో ఆమె ఎదురుతిరిగింది. దీంతో అతను దౌర్జన్యానికి పాల్పడే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే బాధితురాలు అక్కడనుంచి బయటపడేందుకు యత్నిస్తుండగా శ్రీరాజ్ ఆమెను అనుసరించి తన కారులో దింపుతానని నమ్మించాడు. అలా వారు కారులో కొంతదూరం ప్రయాణించాక హర్షకుమార్ తనయుడు మరోసారి వెకిలిచేష్టలకు బరితెగించాడు. ఒకచేత్తో కారును డ్రైవ్ చేస్తూ, మరో చేత్తో ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు కూడా ఆమె ప్రతిఘటిస్తూనే ఉంది. చివరకు భరించలేక, మధురపూడి ఎయిర్పోర్టు రోడ్డులో కారు దిగిపోయింది. అక్కడ నుండే 100 ఫోన్ నెంబర్కు కాల్చేసి, జరిగిన విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో కోరుకొండ, రాజానగరం పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని కోరుకొండ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి, జరిగిన ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. యువతిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం.. వేధింపులకు గురిచేయడం వంటి నేరాలపై 354, 354డీ, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని కోరుకొండ ఎస్పై శారదా సతీష్ తెలిపారు. గతంలోనూ శ్రీరాజ్పై కేసులు ఇక శ్రీరాజ్పై ఇప్పటికే పలు కేసులున్నాయి. 2019 ఎన్నికల సమయంలో అనుమతిలేకుండా ఎయిర్పోర్టులోకి ప్రవేశించే సమయంలో జరిగిన అల్లర్లలో శ్రీరాజ్పై కోరుకొండ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా.. యువతిపై అసభ్యకర ప్రవర్తన కేసు రెండోది. అలాగే రాజమహేంద్రవరంలో కూడా పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: సూసైడ్ లెటర్ రాసి నారాయణ కళాశాల లెక్చరర్ ఆత్మహత్య -
రసమయి బాలకిషన్పై కేసు నమోదు.. ఫిర్యాదు చేసిన రెండేళ్లకు
సాక్షి, సిద్ధిపేట: మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ కేసుపై స్పందించిన పోలీసులు .. తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 209, 506 సెక్షన్ల కింద రసమయిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం కేసుకు సంబంధించిన సాక్ష్యాలను వారం రోజుల్లో అందించాలని పోలీసులు కోరారు. అయితే ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన రెండేళ్ల తర్వాత పోలీసులు రసమయి బాలకిషన్పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా కళాకారుడిగా గుర్తింపు సాధించిన రసమయి 2014లో మానుకొండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికలలోనూ ఆయన విజయం సాధించారు. ఏడాది క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్గా నియమించింది. చదవండి: ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ? -
అప్పు కావాలి.. జూనియర్ ఆర్టిస్ట్ను నమ్మించి రూమ్లో ఫ్రెండ్స్తో కలిసి..
బంజారాహిల్స్: అప్పు కోసం వెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో నివసించే యువతి(22) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం మధ్యాహ్నం తనకు డబ్బులు అవసరమై బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది. డబ్బులు ఇస్తానని లోపలికి పిలిచిన బాలు నాయక్ ఆమెను గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న తన స్నేహితుడితో కూడా గడిపితే రూ. 5 వేలు ఇస్తానంటూ షరతు విధించాడు. బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి తన బంధువుకు ఫోన్ చేసింది. ఇద్దరూ వెళ్లి అడిగేందుకు ప్రయత్నించగా అప్పటికే నిందితుడు గదికి తాళం వేసి ఉడాయించాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం -
కట్నం కోసం భర్త వికృత రూపం.. డ్రగ్స్ మత్తులో ఫ్రెండ్స్తో కలిసి....
సాక్షి, కర్ణాటక: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి అంగరంగ వైభవంగా పెళ్లి, అంతకు మించి కట్న కానుకలు. కానీ వరుని కట్నదాహానికి అంతు లేకుండా పోయింది. ఇంకా తేవాలని సతాయిస్తూ, డ్రగ్స్ మత్తులో నరకం చూపించాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్పై బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ యువతికి– సుదీప్కు 2021 లో పెద్దలు పెళ్లి చేశారు. వరుని కుటుంబం డిమాండ్ మేరకు వధువు కుటుంబీకులు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్సిటీలో వైభవోపేతంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ.55 లక్షల విలువచేసే మినీ కూపర్ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను సుదీప్కు ముట్టజెప్పారు. కట్నం, పెళ్లి ఖర్చులు కలిపి రూ.6 కోట్లు అయినట్లు తెలిపింది. డ్రగ్స్ మత్తులో అరాచకం ఇంతటితో సంతృప్తి చెందని భర్త సుదీప్, పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భార్యను వేధించాడు. దీంతో యువతి తండ్రి తమ రెండు కంపెనీలను అల్లుని పేరిట రాశారు. ఆ కంపెనీల్లో వచ్చే లాభం సుదీప్ తీసుకునేవాడు. సుదీప్ డ్రగ్స్కు బానిస కాగా స్నేహితులను ఇంటికి పిలిపించుకుని డ్రగ్స్ సేవించి మత్తులో భార్య తలపై మూత్రవిసర్జన చేసి వికృతంగా ప్రవర్తించాడు. దీనిని ప్రశ్నిస్తే అసభ్యంగా దూషించేవాడు. ఆమె అత్తమామలకు చెప్పుకోగా వారు కొడుకునే వెనకేసుకొచ్చారు, పైగా నిన్నే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు -
ఎయిర్ రివాల్వర్తో ఆటలు.. బల్లిని కాల్చబోతే బాలుడికి గాయం..
సాక్షి, హైదరాబాద్: క్రీడల కోసమంటూ ఖరీదు చేసిన ఎయిర్ రివాల్వర్తో ఓ పాతబస్తీ వాసి ఆటలాడాడు. అప్పటి వరకు వీధికుక్కలపై కాల్పులు జరిపిన అతగాడు గోడపై ఉన్న బల్లిని కాల్చాలని ప్రయత్నించాడు. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కావడంతో సమీపంలో ఉన్న బాలుడి వీపులోకి దూసుకుపోయింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మొఘల్పుర పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఎ.శివ కుమార్ వివరాలు వెల్లడించారు. సుల్తాన్షాహీ కైసర్ హోటల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీం కుమారుడు మహ్మద్ అఫ్జల్ అఫ్సర్ వాటర్ ప్లాంట్, పాన్ షాపు నిర్వహిస్తుంటాడు. ఇతడు 2021 అక్టోబర్ 21న అబిడ్స్లోని ఏషియన్ ఆరమ్స్ దుకాణం నుంచి 0.117 క్యాలిబర్ ఎయిర్ రివాల్వర్ ఖరీదు చేశాడు. ఆ సందర్భంలో క్రీడల కోసమంటూ (స్పోర్ట్స్) రూ.17,700 వెచ్చించి దీనిని కొన్నాడు. ఈ రివాల్వర్లో చెర్రాలను తూటాల మాదిరిగా వినియోగించే అఫ్సర్ ఇంట్లో గోడలపై ఉన్న బల్లులు, వీధికుక్కలను కాలుస్తుంటాడు. సోమవారం (ఈ నెల 1వ తేదీ) ఉదయం 10.30–11 గంటల మధ్య ఇలానే చేస్తున్న అఫ్సర్ను ఓ బాలుడు కలిశాడు. గోడపై ఉన్న బల్లిని కాల్చాల్సిందిగా కోరాడు. ఇతడు అదే పని చేయగా.. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కారణంగా దిశ మార్చుకుని దూసుకుపోయింది. ఇంటి పక్కన ఉండే సయ్యద్ మోహసీన్ అలీ కుమారుడు ఆజాన్ (9) బయటకు ఆడుకుంటున్నాడు. ఈ చెర్రా వేగంగా వెళ్లి ఆజాన్ వీపులోకి దూసుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న క్లీనిక్కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపై మెరుగైన వైద్య సేవల చికిత్స నిమిత్తం బుధవారం బహదూర్పురాలోని మరో ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బాలుడిని వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు. చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి ఆజాన్ తండ్రి సయ్యద్ మెహసీన్ అలీ ఫిర్యాదు మేరకు మొఘల్పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అఫ్సర్ కోసం గాలిస్తున్నారు. ఎయిర్ రివాల్వర్, పిస్టల్, గన్స్కు లైసెన్స్ అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇలా జంతువులను కాల్చడం, ఎదుటి వారిని గాయపరచడం మాత్రం నేరమేనని స్పష్టం చేస్తున్నారు. నిందితుడు చిక్కిన తర్వాత విచారణలో, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడికి బాలుడి కుటుంబానికి మధ్య ఆరి్థక లావాదేవీలు ఉన్నాయని, వీటి నేపథ్యంలోనే కొన్ని స్పర్థలు కూడా వచ్చాయని తెలుస్తోంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాలపై ఫిర్యాదుదారుడి నుంచి వాంగ్మూలం సేకరించాలని నిర్ణయించారు. -
మిస్ యూనివర్స్ హర్నాజ్పై చీటింగ్ కేసు..
హర్నాజ్ కౌర్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలిచి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ హీరోయిన్లు సుస్మితా సేన్, లారా దత్తాల తర్వాత ఈ కిరీటాన్ని సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ దేశం గర్వించేలా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఆమెపై చండీఘడ్ కోర్టులో కేసు నమోదైంది. హర్నాజ్ చీటింగ్ చేసిందంటూ పంజాబీ సినీ నిర్మాత ఉపాసన సింగ్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హర్నాజ్ వల్ల తాను ఆర్థికంగా నష్ణపోయానని, తనని నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఆమె కోర్టును కోరింది. చదవండి: మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా? కాగా మిస్ యూనివర్స్ టైటిల్కు ముందు హర్నాజ్ మోడల్గా రాణిస్తూనే పలు పంజాబీ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ఆమె 2020లో ‘భాయ్ జీ కుట్టంగే’ అనే మూవీకి సంతకం చేసింది. ఈ సినిమాకి కమిట్ అయ్యే ముందు ఆమె సంతోష్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్తో ఒప్పందం కుదిర్చుంచుకుంది. దీని ప్రకారం మూవీ షూటింగ్స్ ప్రారంభం నుంచి విడుదలయ్యేంతవరకు టీం ఎప్పుడు పిలిచిన రావాలని, అన్ని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా హర్నాజ్తో నిర్మాతల అగ్రీమెంట్ రాసుకున్నారు. చదవండి: అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్ అయితే ఆమె మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచాక పూర్తిగా వారిని అవైయిడ్ చేసిందని, తమ కాల్స్కు స్పందించడం లేదని నిర్మాత ఉపాసన సింగ్లో పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు మిగతా మూవీ సిబ్బంది, సహా నటీనటుల ఫోన్స్ కూడా ఆన్సర్ చేయకుండ బాధ్యత రహితంగా వ్యవహరించిందని ఆమె తెలిపింది. హర్నాజ్ తీరుతో తాము ఆర్థికంగా నష్టపోయామని, తను నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆమె డిమాండ్ చేసింది. దీంతో కోర్టు ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే హర్నాజ్ ఇప్పటికి ఈ కేసుపై స్పందించకపోవడం గమనార్హం. -
లవ్ యూ అంటూ దగ్గరై.. వీడియో కాల్లో నగ్న వీడియో సేవ్ చేసుకొని..
తిరువొత్తియూరు: దేశంలో ప్రతీరోజు ఏదో ఒకచోట యువతులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నగ్నంగా నిలబడి వీడియో కాల్లో మాట్లాడమని చెప్పి రికార్డు చేసుకుని ఓ విద్యార్థినిని బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోవై సమీపంలో ఉన్న కోవిల్ పాళయంకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని ప్లస్ వన్ చదువుతోంది. 10వ తరగతి చదువుతున్న సమయంలో అదే తరగతిలో చదువుతున్న విద్యార్థితో పరిచయం ఏర్పడింది. అతను పదో తరగతి ఫెయిల్ కావడంతో చదువు ఆపేశాడు. ఆ తరువాత వారిద్దరూ సెల్ఫోన్లో మాట్లాడుకునేవారు. విద్యార్థినిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో వీడియో కాల్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓసారి నగ్నంగా నిలబడి వీడియో కాల్ చేయమని అతడు కోరడంతో వీడియో కాల్లో మాట్లాడినప్పుడు అతడు రికార్డు చేసుకున్నాడు. తరువాత కాలంలో పదేపదే వీడియో కాల్ చేయమని కోరడంతో ఆమె భయపడి తల్లిదండ్రులకు తెలిపింది. వారు కోవై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థినితో మాట్లాడుతున్న యువకుడు వివరాలు తెలియకపోవడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: రికవరీ ఏజెంట్ల దూషణలతో.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం -
కాకినాడ: బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు.. కేసు నమోదు
సాక్షి, కాకినాడ: జిల్లాలోని తునిలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. దీంతో కాషాయ పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తునిలోని బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఫిర్యాదు అందడంతో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. వివరాల ప్రకారం.. తుని పట్టణ శివారులోని మాన్విత అపార్ట్మెంట్లో బీజేపీ కార్యాలయం ఉంది. కాగా, బుధవారం రాత్రి బీజేపీ నేతలు మద్యం మత్తుల్లో అపార్ట్మెంట్వాసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో, గురువారం అపార్ట్మెంట్లోని నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు.. బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఆరోపణలు చేశారు. దీంతో, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ప్యాకేజీకి అంగీకరించిన మీరే ఇప్పుడు హోదా అడుగుతారా -
టీకా కలకలం: ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్.. ఆ తర్వాత..
Vaccinated 30 Students With One Syringe.. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు స్థాయిలో 200కోట్ల డోసులకుపైగా టీకాలను అందించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ కేంద్రంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా ఇవ్వడం కలకలం సృష్టించింది. అయితే, దీనికి ఆయన చెప్పిన సమాధానం విన్న స్థానికులు అవాక్కయ్యారు. తన పై అధికారులు ఆదేశాల మేరకే తాను ఇలా చేసినట్టు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం..సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. అది గమనించిన విద్యార్థులు పేరెంట్స్ ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ పై అధికారులు ఒకే సిరంజీ పంపించారని, ఆ ఒక్క సిరంజీతోనే విద్యార్థులందరికీ టీకా వేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఈ క్రమంలో ఇలా టీకా వేయడంలో తప్పు ఏముంది అంటూ వ్యాఖ్యలు చేయడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో, పిల్లల పేరెంట్స్ అతడిపై దాడి చేసినంత పనిచేశారు. Shocking violation of “One needle, one syringe, only one time” protocol in #COVID19 #vaccination, in Sagar a vaccinator vaccinated 30 school children with a single syringe at Jain Public Higher Secondary School @ndtv @ndtvindia pic.twitter.com/d6xekYQSfX — Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022 ఈ విషయం.. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్ దృష్టికి చేరడంతో ఆయన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జితేంద్ర.. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఉల్లఘించారని తెలిపారు. అందుకే జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ స్పందిస్తూ.. జితేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘నేను ఏం చేస్తానో తెలుసా?’ ఎంపీ కూతురి సమాధానంతో.. -
రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్.. నటుడిపై కేసు నమోదు
ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేరు మార్మోగుతోంది. ఏ సోషల్ మీడియా సైట్లో చూసిన ఆయన లెటేస్ట్ ఫోటోషూట్కు సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైతే న్యూడ్ ఫోటోషూట్ ఫోటోస్ ఆన్లైన్లో షేర్ చేశారో అప్పటి నుంచి రణ్వీర్సింగ్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా పేపర్ మ్యగజైన్ కోసం ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్కు నివాళిగా నటుడు ఈ ఫొటోషూట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది. ‘సూపర్ హాట్’ అంటూ రణ్వీర్ కోస్టార్స్, అభిమానులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక నటుడి బోల్డ్ ఫోజులపై అనేక సోషల్ మీడియాలో పుట్టేడు మీమ్స్ సైతం పుట్టుకొచ్చాయి. మరోవైపు ఈ ఫోటోషూట్పై వివాదాలు, విమర్శలు కూడా చుట్టుముట్టాయి. తాజాగా నగ్న షోటోషూట్ నటుడిని చట్టపరమైన చిక్కుల్లో పడేసింది. చదవండి: Katrina Kaif-Vicky Kaushal: ‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్ ఓ ఎన్జీఓ ఫిర్యాదు మేరకు రణ్వీర్ సింగ్పై ముంబైలో చెంబూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు.. రణ్వీర్కు చాలా మంది సెలబ్రిటీలు మద్దుతు ఇస్తుండటంతో.. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్సీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు. ఒకవేళ మహిళ ఫోటోషూట్ చేస్తే ఇప్పటికే ఆమె ఇంటిని తగలబెట్టే వారని, లేదా తనను చంపేస్తామని బెదిరించేవారని పేర్కొన్నారు. కాగా రణ్వీర్ కంటే ముందు విజయ్ దేవరకొండ, తరువాత విష్ణు విశాల్ సైతం న్యూడ్ ఫోటోలకు పోజులిచ్చి హాట్ టాపిక్గా మారారు. -
హైదరాబాద్ మెట్రోలో డ్యాన్స్.. యువతికి షాకిచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరికి ఫేమస్ అయిపోవాలన్న పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలు రికార్డ్ చేసి నెట్టింట్లో అప్లోడ్ చేయడం తెగ కామన్ అయిపోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బస్స్టాప్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లోనూ వీడియోలు చీత్రికరిస్తున్నారు. నలుగురిలో పాపులారిటీ తెచ్చుకోవాలన్న భ్రమలో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. అయితే సదరు యువతి స్టేషన్లోనే కాకుండా మెట్రో రైల్లో కూడా వీడియో చేసినట్లు బయటపడింది. ట్రైన్లో ప్రయాణికులు ఉండగానే అందరిముందు టాలీవుడ్లోని ఓ పాటకు స్టెప్పులేస్తూ రీల్ చేసింది. దీనిని ఇన్స్టాలో షేర్ చేయింది. అయితే యువతి మెట్రలో డ్యాన్స్ చేయడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను ఏ స్టేషన్లో చిత్రీకరించారో గుర్తించి యువతిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇన్స్టా రీల్ చేసిన యువతిపై కేసు నమోదైంది. సదరు యువతిని గుర్తించి, ఆమెపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు వెల్లడించారు. మరోవైపు సోషల్ మీడియాలో యువతి చర్యపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇలాంటి పిచ్చి ప్రవర్తనను ప్రొత్సహించొద్దు. మెట్రో మీ ప్రైవేటు ఆస్తి కాదు. ప్రజా రవాణాలో ఇలాంటి ప్రవర్తనను అస్సలు సహించకూడదు.’ అంటూ మండిపడుతున్నారు 💃 Dance On Hyderabad Metro 🚄 When did this happen??? pic.twitter.com/ZilPdia9fx — Hi Hyderabad (@HiHyderabad) July 20, 2022 కాగా గతంలో రైలు బోగీల్లోనూ పలువురు డ్యాన్స్ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. నగర మెట్రో రైళ్లలో అధికారుల అనుమతితో కొన్ని టాలీవుడ్, బాలీవుడ్ సినిమా సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల బిగ్బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఓ సినిమాను మాదాపూర్ మెట్రో స్టేషన్ ఆవరణలో చిత్రీకరించడం విశేషం. After many people criticised her on social media, Hyderabad Metro Rail🚇 Limited Authorities said that stringent action will be taken against the woman.👮@MostlyTelugu #Hyderabad #HyderabadMetro #VikrantRоna #RaRaRakkamma pic.twitter.com/CUUJ6S8e6w — Mostly Telugu (@MostlyTelugu) July 21, 2022 -
నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని శారీరకంగా వాడుకొని..
-
సహోద్యోగినిపై కన్నేశాడు.. లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుని..
దేశంలో ప్రతీరోజు ఏదో ఒకచోట మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పనిచేస్తున్న చోట చూడా మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఓ యువతిపై కదలుతున్న కారులో లైంగికయత్నం జరిగింది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు బాధితురాలు కారులోని బయటకు దూకింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని ఓ హెటల్లో యువతి(21) పనిచేస్తోంది. ఈ క్రమంలో హోటల్లో పని చేసే ఓ వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన బంధువు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేస్తోందని.. తనకు సాయం చేయమని కోరాడు. ఇందుకు బాధితురాలు సరేనని చెప్పింది. అయితే, మంగళవారం హోటల్లో పనులు ముగించుకుని బాధితురాలు ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమెను కారులో డ్రాప్ చేస్తానని కారు ఎక్కమని కోరాడు. అతడి మాటలు నమ్మిన ఆమె కారు ఎక్కింది. అనంతరం కొద్ది దూరం వెళ్లిన తర్వాత యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఖంగుతింది. బాధితురాలు కారు ఆపాలని కోరినా ఆపకపోవడంతో జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద ఎస్యూవీ కారు నుంచి ఆమె కిందకు దూకింది. దీంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను వెంటనే మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు.. బాధితురాల వద్దకి వెళ్లి స్టేట్మెంట్ తీసుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నామని, కారును సీజ్ చేసినట్టు ఏఎస్సీ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే.. -
మెట్రో స్టేషన్లో వికృత చేష్టలు.. మహిళ దగ్గరకు వచ్చి..
ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. యువతులు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. మెట్రో రైల్వే స్టేషన్లో మహిళ పట్ల ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా.. 100 గంటలపాటు సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఎల్లో లైన్లో జూన్ 2న ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణించింది. ఆమె స్టేషన్లో కూర్చుని ఉండగా.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక అడ్రస్ గురించి అడిగాడు. ఆ అడ్రస్ గురించి చెప్పిన ఆమె జోర్ భాగ్ మెట్రో స్టేషన్లో దిగింది. ఫ్లాట్ఫామ్పై ఒక చోట కూర్చొని క్యాబ్ బుక్ చేస్తున్నది. నిందితుడు కూడా.. అదే స్టేషన్లో దిగాడు. అనంతరం.. అతడు మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. అడ్రస్ అడిగాడు. దీంతో, ఆమె.. అతడికి అడ్రస్ చెబుతుండగా.. నిందితుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో షాకైన బాధితురాలు.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం, ఈ ఘటన గురించి సిబ్బందికి చెప్పింది. కానీ, వారు పట్టించుకోకపోవడంతో ట్విట్టర్ వేదికగా.. వరుస ట్వీట్స్ చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాదాపు 100 గంటలు సీసీ ఫుటేజీని చెక్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కోట్లా ముబారక్పూర్లో నివాసం ఉంటున్న మానవ్ అగర్వాల్(40)గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు.. నేపాల్కు పారిపోయాడని తెలిపారు. Woman Molested Inside Delhi Metro Station, Horrific Act Caught on CCTV#DelhiMetro #JorBagh pic.twitter.com/iHKP2nMWwl — TIMES NOW (@TimesNow) July 6, 2022 ఇది కూడా చదవండి: మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..?