
భోపాల్: మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ఎంపీ కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్లపై కేసు నమోదైంది. అవినీతి అరోపణలపై నకిలీ లేఖను సోషల్ మీడియాలో జ్ఞానేంద్ర అవస్తీ పేరిట ప్రచారం చేస్తున్నారని బీజేపీ లీగల్ సెల్ కన్వినర్ నిమేశ్ పతాక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 50 శాతం కమిషన్ను ప్రభుత్వం రాబడుతుందని ట్వీట్టర్(ఎక్స్) వేదికగా వాద్రా ఆరోపణలు చేశారు. కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు వెళ్లడం లేదని కాంట్రాక్టర్లు హైకోర్టు సీజేకి లేఖ రాశారంటూ పోస్టు చేశారు. కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్లోనూ ఇలాగే కమిషన్ లేనిదే పనిజగట్లేదని ఆరోపణలు చేశారు. ఇదే విధంగా కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్లు, అరుణ్ యాదవ్లు పోస్టు చేశారు.
मध्य प्रदेश में ठेकेदारों के संघ ने हाईकोर्ट के मुख्य न्यायाधीश को पत्र लिखकर शिकायत की है कि प्रदेश में 50% कमीशन देने पर ही भुगतान मिलता है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 11, 2023
कर्नाटक में भ्रष्ट BJP सरकार 40% कमीशन की वसूली करती थी। मध्य प्रदेश में BJP भ्रष्टाचार का अपना ही रिकॉर्ड तोड़कर आगे निकल गई है।… pic.twitter.com/LVemnZQ9b6
వీరిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్ నాథ్, అరుణ్ యాదవ్లపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును దెబ్బతీయాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
ప్రియాంక గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. తప్పుడు ప్రచారాలతో ఎంతో కాలం లబ్ది పొందలేని చెప్పారు. సీఎం శివరాజ్ సింగ్ కూడా ఈ అంశంపై స్పందించారు. వారి మాటల్లో నిజం లేదని చెప్పారు. ప్రియాంక గాంధీ పోస్టుకు సంబంధించిన వ్యక్తులపై గ్వాలియర్లోనూ కేసులు నమోదయ్యాయని అన్నారు.
मध्यप्रदेश में कांग्रेस मुद्दा विहीन होकर घृणित मानसिकता के साथ राजनीति कर रही है।
— Dr Narottam Mishra (@drnarottammisra) August 12, 2023
प्रदेश कांग्रेस के नेताओं ने पहले राहुल गांधी जी से झूठ बुलवाया अब प्रियंका गांधी जी से झूठा ट्वीट करवाया।
प्रियंका जी आपने जो ट्वीट किये हैं उसके प्रमाण दो अन्यथा हमारे पास कार्यवाही के सारे… pic.twitter.com/j9FfajhA9c
ఇదీ చదవండి: ఎన్డీయేలోకి శరద్ పవార్..? తాజా భేటీ ఎందుకు..?
Comments
Please login to add a commentAdd a comment