Commission
-
కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ.. వీటిపైనే ఫోకస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్.. తుది దశ విచారణ మొదలుపెట్టింది. మే రెండో వారం వరకు విచారణ కొనసాగించనుంది. మే రెండో వారంలో ప్రభుత్వానికి తుది రిపోర్ట్ను ఇవ్వనుంది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసిన కమిషన్.. దాదాపు 90 శాతం రిపోర్ట్ పూర్తి చేసింది. ఇంకా కమిషన్కు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ అందకపోవడంతో ఆ నివేదిక కోసం ఎన్డీఎస్ఏకి కమిషన్ లేఖ రాసింది. ఫైనల్ రిపోర్ట్ కోసం ఎన్డీఎస్ఏ మరో మూడు వారాల సమయం కోరింది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి ప్రశ్నించాల్సి ఉంది.ఈ దఫాలోనే వారికి సమన్లు పంపించి క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలని కమిషన్ కోరే అవకాశముంది. ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో బరాజ్ల నిర్మాణంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలు సేకరించిన విషయం తెలిసిందే. వీటిని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల ముందు ఉంచి ప్రశ్నించనున్నట్టు తెలిసింది. -
సత్తెన్నకు సెవెన్ పర్సంట్!
సాక్షి, అమరావతి: వివిధ పనులకు కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియలో కూటమి ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అస్మదీయుడు, లేదంటే ఎక్కువ మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకు అడ్డగోలుగా పనులు కట్టబెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విమర్శలను బలపరుస్తూ ఓ ప్రజా ప్రతినిధికి ఏడు శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ చేసుకున్న పలు సంస్థలు.. తప్పుల తడకగా బిడ్లు వేసినా ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య శాఖలోని డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. మూడేళ్ల కాలపరిమితికి దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కాంట్రాక్ట్లు ఇవి. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి టెండర్లు పిలిచారు. బిడ్ల పరిశీలన పూర్తవడంతో ఎల్1 కంపెనీలను ఎంపిక చేయడం కోసం గురువారం వైద్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తప్పు చేసినా అర్హత తప్పుల తడకగా బిడ్లు దాఖలు చేసిన సంస్థలకు అర్హత కల్పించి, కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నారని టెండర్లలో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకల ఆధారంగా సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు, ఇతర అవసరాల కింద ఎంత ఖర్చు చేయాలనే దానిపై టెండర్ నిబంధనల్లోనే పొందుపరిచారు. సర్వీస్ చార్జీ 3.85 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండాలని సూచించారు. ఇంత స్పష్టమైన నిబంధనలున్నా రెండు సంస్థలు సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల విషయంలో నిర్దేశించిన దాని కంటే తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థల్లో ఒకటి శానిటేషన్, మరొకటి సెక్యూరిటీ టెండర్లలో పాల్గొన్నాయి. శానిటేషన్కు సంబంధించిన సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రిది. మరోవైపు ప్రస్తుతం జోన్–2(కోస్తాంధ్ర)లో శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న సంస్థ తప్పుడు ధ్రువపత్రాలతో బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఈ సంస్థ గతంలో బోధనాస్పత్రుల్లో 300 మందికి గానూ 250 మంది సిబ్బందితో పనులు నిర్వహించేలా ఎంవోయూ కుదుర్చుకుని టెండర్ నిబంధనలను అతిక్రమించింది. తక్కువ మంది ఉద్యోగులతోనే అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం నిర్వహించి రూ.కోట్లలో ప్రభుత్వ నిధులను దండుకుంది. ఈ సంస్థ ఏపీఎంఎస్ఐడీసీలో పనిచేసే ఇంజినీర్ల సన్నిహితులది కావడం.. వారే టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించడంతో తిమ్మిని బమ్మిని చేసి బిడ్కు అర్హత కల్పించారని వెల్లడైంది. టెండర్ నిబంధనలతో పనిలేకుండా ప్రజాప్రతినిధితో సదరు సంస్థలు డీల్ కుదుర్చుకున్న క్రమంలో ఈ మూడు సంస్థలకు కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నారని విశ్వసనీయ సమాచారం. కూటమి పెద్దలు అస్మదీయులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే 108, 104 టెండర్లను ఓ సంస్థకు కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ టెండర్లలో సైతం ఓ సంస్థను ముందే అనేసుకుని.. దానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. కేవలం ఆ సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసినా ఆమోదించేందుకు వీలుగా నిబంధనల్లో వెసులుబాటు పెట్టుకున్నారు.బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారు? నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిన కంపెనీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి.. గత కొద్ది రోజులుగా ఏపీఎంఎస్ఐడీసీలో తిష్ట వేశారు. ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలూ ఉన్నాయి. అధికారుల వెంటపడి మరీ తన బిడ్కు అర్హత కల్పించుకున్నారని ఎంఎస్ఐడీసీలో చర్చించుకుంటున్నారు. టెండర్ల ప్రక్రియ ముగియకుండానే తనకు కాంట్రాక్ట్ వచ్చేసిందని డీఎంఈ అధికారులను కలిసి.. బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారని ఆరా తీసినట్టు సమాచారం. సిబ్బందికి వేతనాలు ఎగ్గొట్టి, అనుభవం లేకున్నా ఉన్నట్టు కొన్ని సంస్థలు ఆధారాలు చూపించాయని, ఈ నేపథ్యంలో ఆడిట్ చేసి సక్రమంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాశారు. -
కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరోసారి పొడిగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 23న హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి విచారణ కొనసాగించనున్నారు. ఈ దఫా మిగిలిన విచారణతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. కాగా తదుపరి జరగనున్న విచారణలోఅధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లలతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద నాయకులను కూడా పిలిచే అవకాశముందని తెలుస్తోంది. -
తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ కమిషన్ ఎక్కడ..?
-
కాళేశ్వరం కమిషన్ ముందుకు.. ఆ మూడు సంస్థల ప్రతినిధులు
-
అవి ఇంజనీర్లకు వదిలేయండి
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బరాజ్కు సంబంధించిన సాంకేతిక అంశాలతో మీకు సంబంధం లేదు. వాటిని ఇంజనీర్లకు వదిలేయండి..’అంటూ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ‘మేడిగడ్డ బరాజ్లో కుంగిపోయిన 7వ బ్లాక్కు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలి. అది సాధ్యం కూడా..’అని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఐడీసీ) మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్రావు చెబుతుండగా.. జస్టిస్ ఘోష్ ఆయ న్ను మధ్యలోనే అడ్డుకున్నారు. ‘అంతే చాలు..టెక్నికల్ అంశాలతో మీకు సంబంధం లేదు..’అని అన్నారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై కమిషన్ విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్కు గత ప్రభుత్వం తరఫున ప్రకాశ్రావు ‘సాక్షి’గా హాజరై సమాధానాలిచ్చారు. రాజకీయాలు చేయొద్దు తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు ఎందుకు తరలించారు? అని కమిషన్ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకాశ్రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా..‘రికార్డుల్లో ఏం ఉందో అదే అంతిమం. దానిని ఎవరూ మార్చలేరు..’అని కమిషన్ స్పష్టం చేసింది. ప్రజల సాగునీటి డిమాండ్లను నెరవేర్చడానికి 200 టీఎంసీలు అవసరం కాగా, తుమ్మిడిహెట్టి వద్ద తగిన నీటి లభ్యత లేకపోవడంతోనే బరాజ్ను తరలించాల్సి వచ్చిందని ఆ తర్వాత ప్రకాశ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 165 టీఎంసీల జలాల లభ్యతే ఉందని కేంద్ర జలసంఘం పేర్కొందని, అందులోనూ ఇతర రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు పోగా తెలంగాణకు 102 టీఎంసీలే మిగులుతాయని చెప్పారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలు పలు జలాశయాలను నిర్మించి నీటిని తరలించుకుంటుండడంతో గత 50 ఏళ్లుగా తెలంగాణకు వచ్చే ప్రవాహాలు తగ్గిపోయాయన్నారు. సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రకాశ్రావు చెప్పగా.. రాజకీయాలు చేయవద్దని, ఉద్యమంతో తమకు ఏం సంబంధం అంటూ కమిషన్ అభ్యంతరం తెలిపింది. రిటైర్డు ఇంజనీర్లు వద్దన్నా .. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్తో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించడమే ఉత్తమమని, దీనిని ఎలాగైనా సాధ్యం చేయాలని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015 ఏప్రిల్లో సిఫారసు చేసిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది.ప్రతిపాదిత మేడిగడ్డ బరాజ్ అనవసరమని, అధిక వ్యయంతో కూడినది కావడంతో పాటు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందని కమిటీ చెప్పిందని తెలిపింది. దీనిపై ప్రకాశ్రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా, టీఎస్ఐడీసీ చైర్మన్గా నాటికి మీరు నియామకం కానందున మీ సమాధా నం అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. నీటి లభ్యత లేకపోవడంతో పాటు ముంపును తగ్గించడం కోసం తుమ్మిడిహెట్టికి బదులుగా వెన్గంగా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో వార్ధా బరాజ్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. -
ఇవాల్టీ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం
-
అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా అంజూ
చండీగఢ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు మహిళా అథ్లెట్లు, ముగ్గురు పురుష అథ్లెట్లకు చోటు దక్కింది. తాజా ఎన్నికల్లో మరోసారి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ‘డబుల్ ఒలింపియన్’ మాజీ లాంగ్జంపర్ అంజూ బాబీ జార్జి... ఈ కమిషన్కు చైర్పర్సన్గా వ్యవహరించనుంది. ఈ కమిషన్లో అంజూతో పాటు జ్యోతిర్మయి సిక్దర్ (రన్నింగ్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), ఎండీ వల్సమ్మ (హర్డిల్స్), సుధా సింగ్ (స్టీపుల్ఛేజ్), సునీతా రాణి (రన్నింగ్) చోటు దక్కించుకున్నారు. పురుషుల విభాగం నుంచి ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగూతో పాటు ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, అవినాశ్ సాబ్లే (స్టీపుల్ ఛేజ్) ఉన్నారు. గత కమిషన్లో నలుగురు మహిళలు ఉండగా... ఇప్పుడు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతూ ఆ సంఖ్యను 6 చేశారు. బహదూర్ సింగ్ గతంలో సుదీర్ఘ కాలం ఈ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించారు. బిజీ షెడ్యూల్ కారణంగా కమిషన్కు ఎక్కువ సమయం కేటాయించలేనని చెప్పినప్పటికీ... ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ నీరజ్ చోప్రాతో చర్చించి అతడిని కమిషన్లో భాగం చేసింది. 2012 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన అదిలె సుమరివాలా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న సుమరివాలాకు.. ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ సమావేశాలకు హజరయ్యే అధికారాలు ఉన్నాయి. డోపింగ్ ఉదంతాల వల్ల దేశ అథ్లెటిక్స్ ప్రభ మసకబారకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. దీని కోసం అథ్లెట్ల శిక్షణకు సంబంధించిన వివరాలను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పర్యవేక్షించనుంది. -
కమీషన్ ఇవ్వకపోతే పింఛన్ తీసేస్తాం.. వృద్ధుల పింఛన్లపై కక్కుర్తి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వృద్దుల పెన్షన్లపై కూడా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ఒక్కో పెన్షన్ నుంచి రూ.300 వసూళ్లు చేస్తున్నారు. జమ్మలమడుగు 16వ వార్డులో సచివాలయం సిబ్బంది చేతివాటం బయటపడింది. కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ తీసేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. లంచం ఎందుకివ్వాలంటూ పింఛన్దారులు ప్రశ్నించినా కూడా సిబ్బంది బలవంతంగా వసూలు చేస్తున్నారు. వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసి లంచాలంటూ పెన్షన్ దారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హతున్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అయితే కూటమి అధికారం చేపట్టి ఆరునెలలైనా ఇప్పటివరకు ఒక్క పింఛన్ను కూడా చంద్రబాబు సర్కారు మంజూరు చేయలేదు. పైగా అనర్హత పేరుతో ఉన్న పింఛన్లకు కోత విధిస్తోంది. ఫలితంగా పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ పడి భంగపడ్డామని విలపిస్తున్నారు.ఇదీ చదవండి: రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లకు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి ఓటేయని వారందరినీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పెన్షన్లకూ నోటీసులు జారీ చేసి అర్హత నిరూపించుకోవాలని, లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీవెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులిప్పిస్తున్నారు. -
కాళేశ్వరం విచారణకు స్మితా సబర్వాల్.. హాజరుకానున్న మాజీ సీఎస్
-
అహోబిలేషుడి లడ్డూకు కమీషన్ పోటు
ఆళ్లగడ్డ: టీడీపీ నేత కమీషన్ బాగోతం వల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానంలో లక్ష్మీనరసింహ స్వామి లడ్డూ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ఎగువ, దిగువ క్షేత్రాల్లో లడ్డూ కౌంటర్లు వారం రోజులుగా మూత పడటంతో భక్తులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నాయకుడే కారణమని తెలుస్తోంది. ప్రసాదాల తయారీకి సరుకులు సరఫరా చేసే వ్యాపారిని కమీషన్ కోసం ఆ నాయకుడు ఒత్తిడి చేశాడు. ఇందులో తనకు పెద్దగా ఏమీ మిగలదని, కమిషన్ ఇవ్వబోనని ఆ వ్యాపారి చెప్పడంతో సరుకుల సరఫరాను ఆపేయించారు. దీంతో టీడీపీ నాయకుడు, కొందరు దేవస్థాన నిర్వాహకులకు కలిపి 20 శాతం కమీషన్ ఇచ్చేటట్లు బాపట్లకు చెందిన కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుని సరుకుల సరఫరా బాధ్యతను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా సరుకులు రాక పోవడంతో ప్రసాదాల తయారీ నిలిచిపోయింది. దీంతో విక్రయాలు లేక భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రసాదంలోనూ కమీషన్ల కక్కుర్తి ఏమిటని వాపోతున్నారు. -
కమీషన్ల కోసం కపట నాటకం!
సాక్షిప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వంలో కమీషన్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా సాగిపోతోందని కూటమి సారథులు చెబుతోన్న మాటలకు, వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇసుక, మద్యం దందా.. దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలు, దాడులతో రెచ్చిపోతుండటాన్ని సుపరిపాలనగా చెప్పుకుంటున్నారు. అన్నింట్లోనూ కమీషన్ల కక్కుర్తితో జేబులు నింపుకుంటోన్న పెద్దలు ఇప్పుడు రైస్ మిల్లర్ల పొట్ట కొట్టేందుకు తగ్గేదేలే అంటున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల విడుదల కోసం కమీషన్ ఇస్తేకానీ విడుదల చేయనని ఓ మంత్రి బీషి్మంచుకుని కూర్చున్నారు. దీంతో కొంత మంది వసూళ్ల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. డిసెంబర్ మొదటి వారం నాటికి సదరు మంత్రి అడిగిన మేరకు వసూళ్లు పూర్తి చేసి అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. గత నెలలో కాకినాడ కేంద్రంగా జరిగిన రైస్ మిల్లింగ్ రంగ ప్రముఖల భేటీలో ఈ మేరకు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం సాగింది. నాడు జరిగిన ఒప్పందం ప్రకారం నాలుగైదు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి సీఎంఆర్ బకాయిల కింద రూ.200 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడతగా విడుదలైన బకాయిలకు గత నెలలో కుదిరిన ఒప్పందం మేరకు 8 శాతం కమీషన్ వసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు కమీషన్గా రూ.16 కోట్లు వసూలు చేస్తున్నారు. బకాయిలు వచ్చాయని సంతోíÙంచాలో.. భారీగా కమీషన్ ఇవ్వాల్సి వచ్చినందుకు ఏడవాలో అర్థం కావడం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ అసలు సంగతి.. » ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి వ్యవసాయ సీజన్లో కోటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు అనుమతిస్తుంటుంది. ఇది ఏ ప్రభుత్వంలో అయినా సీజన్కు ముందు జరిగేదే. ప్రభుత్వం ఇచ్చే కోటా ప్రకారం మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యాన్ని తిరిగి అప్పగించడం పరిపాటి. అలా ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చిన రాష్ట్రంలోని మిల్లర్లకు ప్రభుత్వం సుమారు రూ.1,600 కోట్లు బకాయి పడింది. » సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయకత్వాన ప్రభుత్వం గద్దె నెక్కడంతో సీఎంఆర్ బకాయిల విడుదల కోసం మిల్లర్లు కూటమిలోని పెద్దల వద్ద లాబీయింగ్ చేశారు. బకాయిలు రూ.200 కోట్లు వంతున దశల వారీగా విడుదల చేయాలని పలువురు ప్రతిపాదించారు. » ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్ లక్ష్యం 37 లక్షల టన్నులుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 20 లక్షల టన్నులు స్థానిక అవసరాలకు వినియోగిస్తే మిగిలిన 60 లక్షల టన్నులు కస్టమ్‡ మిల్లింగ్కు ఇవ్వాలని మిల్లర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. » రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,300 మిల్లులపై ఆధార పడ్డ వేలాది మంది లారీ, జట్టు, ప్యాకింగ్ కారి్మకులకు ఉపాధి లభిస్తుందని మిల్లర్లు కోరుతున్నారు. ఈ అంశంతో పాటు రైస్ మిల్లుల రాష్ట్ర కార్యవర్గంలో మార్పులపై ఆ రంగ ప్రముఖులు ఇటీవల కాకినాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిలు మొత్తంగా సుమారు రూ.1600 కోట్ల విషయం చర్చకు వచ్చింది. ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్లో ధాన్యం సేకరణ జరగాలంటే బకాయిలు విడుదల చేయాల్సిందేనని మిల్లర్లు పట్టుబట్టారు. మొత్తం బకాయిలు ఇప్పటికిప్పుడు ఒకేసారి విడుదల చేసే పరిస్థితులు లేవని తేల్చారు. రూ.200 కోట్ల వంతున విడుదల చేయించేందుకు ఒక మంత్రి తరఫున కొందరు నాటి సమావేశంలో వకాల్తా పుచ్చుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. » మొదటి విడత విడుదల అనుకున్నట్టు జరగాలంటే విడుదల చేసే బకాయి మొత్తంలో 10 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబట్టారు. బకాయిలు పెరిగి పోయి మిల్లుల నిర్వహణ సవాల్గా మారిందని అభ్యంతరం వ్యక్తం కావడంతో చివరకు 8 శాతానికి ఒప్పందం కుదిరిందని సమాచారం. గత ప్రభుత్వంలో ఎవరికీ చిల్లి గవ్వ కమీషన్ ఇవ్వలేదని కొందరు విబేధించినా, చివరకు వారు కూడా మెజార్టీ నిర్ణయాన్ని కాదనలేకపోయారని తెలిసింది. పథకం ప్రకారం ఎగుమతులపై విష ప్రచారం » ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం విదేశాలకు తరలి పోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సభల్లో గగ్గోలు పెడుతూ కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బ తీశారని మిల్లింగ్ రంగంలో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడచిన ఐదేళ్లలో కోటి 47 లక్షల 55 వేల 837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు ప్రాధాన్యతను గుర్తించకుండా కమీషన్ కోసమే ఇంత చౌక బారుగా వ్యవహరిస్తారా? అని విస్తుపోతున్నారు. » రెండు తరాలుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మిల్లర్లే లక్ష్యంగా కూటమి నేతలు రైస్ మిల్లులు, గోడౌన్లపై వరుస దాడులు చేయించారు. తాము చెప్పినదంతా నిజమేనని ప్రజలను నమ్మించేందుకు పీడీఎస్ బియ్యంగా సుమారు 48 వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సీజ్ చేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజులు కాకినాడలో మకాం వేసి.. మిల్లులు, గోడౌన్లపై దాడులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇంతా చేసి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారనే విమర్శలొచ్చాయి. సీజ్ చేసిన బియ్యంలో పీడీఎస్ లేదనే నిర్ధారణతో 70 శాతం బియ్యాన్ని దశల వారీగా విడుదల చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీజ్ చేసిన మిగిలిన బియ్యంపై 6ఎ కేసులకే పరిమితమయ్యారు. కూటమి పెద్దల ఇంత హడావుడి వెనుక మిల్లర్లను దారికి తెచ్చుకోవడమేనని తేలిపోయిందని జనం విస్తుపోతున్నారు. -
మరోసారి కాళేశ్వరంపై విచారణ
-
ఎస్సీ, ఎస్టీ కమిషన్కు లగచర్ల బాధితుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ను లగచర్ల దాడి కేసు బాధితలు శనివారం కలిశారు. పోలీసుల దాడిపై కమిషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, ఫార్మా కంపెనీకి మేం వ్యతిరేకం కాదన్నారు. రైతుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్పై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.త్వరలో లగచర్ల గ్రామంలో పర్యటిస్తామని అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను విచారిస్తామమని కమిషన్ ఛైర్మన్ తెలిపారు. దోషులను కమిషన్ వదిలిపెట్టదని.. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.కాగా, కలెక్టర్పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. -
12 నుంచి ఐఏఎస్ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్లపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిర్వహించిన రెండు విడతల క్రాస్ ఎగ్జామినేషన్లో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వ ర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నంచింది. మూడో విడతలో ప్రధానంగా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్కుమార్, ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్కుమార్, వికాస్రాజ్, గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ తదితరులను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి కమిషన్ వీరికి సమన్లు జారీ చేసి విచారించింది. అఫిడవిట్ రూపంలో సమాధానాలను తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా అధికారులు, మాజీ అధికారుల విచారణను కమిషన్ ముగించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి నివేదిక! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వ పెద్దలను పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెలలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను విచారించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంజనీర్లు, అధికారుల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ లో సేకరించే అంశాల ఆధారంగా కేసీఆర్, హరీశ్రావులను విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెల లో వారికి కమిషన్ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంద ని సమాచారం. మొత్తంగా కమిషన్ డిసెంబర్ నెలాఖరులో గా ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనున్నట్టు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొను గోలు ఒప్పందం, యాదాద్రి, భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ గత నెలాఖరులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంకా గడువు పొడిగించని సర్కారు! వాస్తవానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు గత నెలాఖరుతోనే ముగిసింది. మరో రెండు నెలలు పొడిగించాలని ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయానికి ఫైల్ వెళ్లినా.. ఇంకా నిర్ణయం వెలువడలేదు. గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వస్తే ఈ నెల 11న హైదరాబాద్కు వస్తానని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. -
కులగణనకు డెడికేషన్ కమిషన్.. ఛైర్మన్గా మాజీ ఐఏఎస్
హైదరాబాద్, సాక్షి: కులగణన కోసం తెలంగాణ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం గడువు విధించింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఛైర్మన్గా మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించినట్టు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.చదవండి: క్యాట్లో ఐఏఎస్ల పిటిషన్: నాలుగు వారాలకు విచారణ వాయిదా -
దోపిడీకి పక్కాడీల్!
-
హా‘హాకా’రాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వ్యాపారికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కిరాణా సామాను సరఫరా పనులను ‘హాకా’ పేరుతో అధిక ధరలకు కొనుగోళ్ల కమిటీ కట్టబెట్టింది. ఆ తరువాత అవే రేట్లతో ‘హాకా’ పేరుతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిరాణా సామాను సరఫరా పనులను నామినేషన్పై జిల్లా యంత్రాంగం కట్టబెట్టింది. ఇలా మొత్తంలో 200 విద్యాసంస్థల్లో కిరాణా సామాను సరఫరాను అధిక ధరలకు ఇచ్చేసింది. ఈ తతంగంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించాడు. అధిక ధరలతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా ‘హాకా’ పేరుతో సదరు వ్యాపారే రూ.కోట్ల విలువైన పనులను దక్కించుకున్నట్లు, ‘హాకా’ కేవలం 2 శాతం కమీషన్పై ఈ పనులను సదరు వ్యాపారికి అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మైనారిటీ గురుకులాల్లో స్టేషనరీ, బూట్లు, ఫరి్నచర్, ఎస్సీ గురుకులాల్లో బ్లాంకెట్లు, వైద్య, ఆరోగ్య శాఖలో సామగ్రి సరఫరా పనులను కూడా ‘హాకా’ పేరుతో తీసుకొని, 2 శాతం కమీషన్పై ఇతరులకు అప్పగించారన్న ఆరోపణలున్నాయి.‘హాకా’కే ఇవ్వాలనుకుంటే టెండర్లు ఎందుకు?ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ ద్వారానే విద్యా సంస్థలకు కిరాణా సామాను, ఇతరత్రా పరికరాలు, వివిధ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వంటివి సరఫరా చేయాలని ప్రభుత్వం అనుకుంటే టెండర్లు పిలువడం ఎందుకు? ‘హాకా’కే నేరుగా ఇచ్చేస్తే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే చర్చ సాగుతోంది. పైగా టెండర్లు పిలిచినప్పుడు వాటిలో ప్రైవేట్ వ్యాపారులు పాల్గొనేలా చేసి, అధిక ధరకు ‘హాకా’ దక్కించుకుంటోందని, మళ్లీ కమీషన్లపై ప్రైవేట్ సంస్థలకు అప్పగించి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘హాకా’కు సరఫరా చేసే సామర్థ్యమే లేదన్న చర్చ సాగుతున్న తరుణంలో ఈ పనులను పొందిన కాంట్రాక్టర్లు, సంస్థలు నాసిరకం కిరాణా సామాను, వస్తువులను సరఫరా చేస్తే దానికి బాధ్యులెవరు? 2 శాతం కమీషన్తో ఆ పనులను పొందిన వ్యాపారులు, సంస్థలు బాధ్యత వహిస్తాయా? ‘హాకా’ బాధ్యత వహిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వ్యాపారుల దందాతో నాణ్యత గాలికి..ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పనులను ‘హాకా’నే కాంట్రాక్టుకు తీసుకొని వ్యాపారం చేయొచ్చు.. కానీ అలా చేయడం లేదు. ‘హాకా’ పేరుతో కాంట్రాక్టు తీసుకుంటూ ఇతర వ్యాపారులకు కమీషన్పై పనులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో ‘హాకా’ పేరుతో వ్యాపారులే అధిక ధరలకు టెండర్లు దాఖలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని సంస్థ కనీసం పరిశీలన చేయడం లేదు. పైగా ఈ తతంగంలో అందులోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ఆ పనులను పొందిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వస్తువుల నాణ్యతను పాటిస్తున్నారా? లేదా చూసే వారు లేకుండాపోయారు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ పేరుతో వ్యాపారులు దర్జాగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 200 విద్యాసంస్థల్లో దాదాపు రూ.కోట్ల విలువైన పనులను ‘హాకా’ పేరుతో టెండర్లలో అధిక ధరకు కోట్ చేసి వ్యాపారులు దక్కించుకొని ప్రభుత్వ ఖాజానాకు గండికొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నా స్పందించడం లేదు. మూలాలను మరిచిన ‘హాకా’.. రైతుల సంక్షేమానికి పనిచేస్తూ.. రైతులను లాభాల బాటలో నడిపించేందుకు ఏర్పడిందే హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ సొసైటీ (హాకా). గతంలో వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులు ఎరువులు, విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయే వారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసేందుకు, ఎరువులు, విత్తనాలను సరఫరా చేసేందుకు, తద్వారా రైతు సంక్షేమానికి పాటు పడేందుకు ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘హాకా’ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత జిల్లాల్లోనూ తన కార్యాలయాలను విస్తరించి రైతులు నష్టపోయకుండా చూసేది. అలాంటి సంస్థ ఇప్పుడు తన ముఖ్య లక్ష్యాన్ని వదిలేసి గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులతోపాటు ఆహారానికి సంబంధించిన ఇతర సంస్థల్లోనూ వ్యాపారం చేసే వెసులుబాటు ‘హాకా’కు ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రధానమైన రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్న చర్చ సాగుతోంది. వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టులు పొంది 2 శాతం కమీషన్తో ఇతర వ్యాపారులకు ఆయా కాంట్రాక్టులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. పూర్తిగా కమీషన్ వ్యాపార దృక్పథంతోనే ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి. -
kaleshwaram commission: ‘తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం.. కమిషన్ ముందుకు తెలంగాణ రీసెర్చ్ అధికారులు హాజరయ్యారు. అయితే, కాళేశ్వరం కమిషన్ ముందు రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి వింత సమాధానాలు చెప్పారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ ఆమె చెప్పిన సమాధానాలకు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ షాక్ అయ్యారు. శ్రీదేవి పని చేసిన పిరియడ్లో ఏమి గుర్తుకు ఉందో చెప్పాలని కమిషన్ ఛైర్మన్ అడ్డగా.. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ శ్రీదేవి సమాధానాలు చెప్పింది.2017 నుంచి 2020 వరకు కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం సమయంలో పనిచేసిన శ్రీదేవి.. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? ఫ్లడస్ ఎప్పుడు వచ్చాయి అనే ప్రశ్నలకు తనకు గుర్తుకు లేదంటూ దాటవేసేందుకు యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్గా ఆమె పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.కాగా, మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అంటూ రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు కమిషన్కు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణాలు మొదలైనట్లు కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారు. మేడిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లేనని కమిషన్కు ఇంజనీర్లు తెలిపారు.ఇదీ చదవండి: ‘ఓటుకు నోటు కేసుపై రేవంత్కు రిపోర్ట్ చేయొద్దు’వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కమిషన్ ముందు చెప్పిన రీసెర్చ్ ఇంజనీర్లు.. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీలు డామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్కి సంబంధం లేదని రీసెర్చ్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు బ్యారేజీలలో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్.. రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది.అన్నారం గ్యారేజీ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా?. మూడు బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయాలని ఎవరి ఆదేశాలు ఉంటాయని కమిషన్ ప్రశ్నించగానిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు. లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక వైపు నిర్మాణం జరుగుతుండగానే... మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. -
కాళేశ్వరం కమిషన్ విచారణ రేపటి నుంచి ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రేపటి(శుక్రవారం) నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. రేపు కమిషన్ ముందుకు ఎడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు రానున్నారు. కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. గత నెలలో కమిషన్.. 15 మందికిపైగా విచారణ చేసింది. రేపటి నుంచి 25 మందికి పైగా కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ, పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్, కమిషన్కు కావాల్సిన సమాచారం ఇస్తానని ఆయా టీమ్స్ చెప్పాయి. కమిషన్ అడిగిన లాయర్ను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతీ ఒక్కరినీ కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది.ఇక.. ఇప్పటికే కమిషన్ విచారణ కార్యాలయానికి కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ చేరుకున్నారు. ఘోష్తో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ భేటీ అయ్యారు.రేపటి నుంచి ఎవరిని విచారణ చేయాలి అనే అంశం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై చర్చించారు. ఇప్పటికే మొదలైన ఓపెన్ కోర్టు విచారణ. గత 20 నుంచి ఐదు రోజుల పాటు ఇరిగేషన్ అండ్ సీఈఓ అధికారులను జస్టిస్ గోష్ విచారించారు. -
తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: విద్యారంగంలో మార్పులు, బలోపేతంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది.చైర్మన్, సభ్యులు రెండేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపకల్పనకు ఈ కమిషన్ పనిచేయనుంది.కాగా, తెలంగాణలోని మల్టి జోన్-1,2 పరిధిలో నాయబ్ తహసీల్దార్లకు.. తహసీల్దార్గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టి జోన్ 1-2 కలిపి 76 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. -
TG: కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగింపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రెండు నెలలపాటు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్బొజ్జా శనివారం(ఆగస్టు31) జీవో జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో ముఖ్య అధికారులుగా పనిచేసిన వారిని విచారించింది. తాజాగా గడువు పొడిగించడంతో విచారణ పూర్తయిన తర్వాతే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది. -
బరాజ్లు ఎందుకు ఫెయిలయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల వైఫల్యానికి కారణాలేమిటి? డిజైన్లకు సాంకేతిక అనుమతులిచ్చాక మళ్లీ అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను ఎందుకు మార్చారు? మారిన ప్రదేశాలకు అనుగుణంగా డిజైన్లలో మార్పులు చేశారా?’అని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లో పనిచేసిన, రిటైరైన ఇంజనీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణలో భా గంగా కమిషన్ మంగళవారం పలువురు ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అన్నారం బరాజ్ డిజైన్లను ఎవరు సిద్ధం చేశారని మాజీ ఈఈ కె. నరేందర్ను ప్రశ్నించగా డిజైన్లను ఏఈఈలు తయారు చేస్తే.. వాటికి డీఈఈ, ఆపై ఈఈ అనుమతిస్తారని ఆయన తెలిపారు. భూభౌగోళిక, సైట్ సర్వే ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్లను సిద్ధం చేస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కమిషన్కు ఎదురు ప్రశ్నలు వేయగా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజైన్లలో లోపాల్లేవు: బస్వరాజ్, ఎస్ఈ, కాళేశ్వరం మేడిగడ్డ బరాజ్ డిజైన్లలో లోపాల్లేవని.. ఐఎస్ కోడ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) నిబంధనలకు లోబడి ఎల్ అండ్ టీ ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా తయా రు చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ హెచ్.బస్వరాజ్ తెలిపారు. డిజైన్లు ప్రమాణాలకు లోబడి ఉన్నాయని నిర్ధారించాకే ఆమోదించామన్నారు. బరాజ్ నిర్మిత స్థలాన్ని పరిశీలించలేదని.. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని ఓ ప్రశ్నకు బస్వరాజ్ బదులిచ్చారు. అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను మార్చినప్పటికీ ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశంలోనే మేడిగడ్డను కట్టారని తెలిపారు. మేడిగడ్డ బరాజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బరాజ్ కుంగిందని సీడీవో ఎస్ఈ ఎం. సత్యనారాయణరెడ్డి వివరించారు. బరాజ్లను నీటి మళ్లింపు కోసం కట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా నిల్వ చేయడంతోనే విఫలమైనట్లు సీడీఓ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ దయాకర్రెడ్డి ఇంతకుముందు కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్లో కమిషన్ దీనిపై ప్రశ్నించగా ఆయన దాటవేశారు. దీంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రామగుండం ఈఎన్సీ ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు చేశామని సీడీవో మాజీ ఎస్ఈ రాజశేఖర్ అన్నారు. అన్యాయాన్ని సరిచేయడానికే రీ ఇంజనీరింగ్పీసీ ఘోష్ కమిషన్కు తెలిపిన వి.ప్రకాశ్సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ ను పునర్నిర్మించేందుకు.. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ను నాటి సీఎం కేసీఆర్ చేపట్టారని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్ తెలిపా రు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు మంగళవారం అఫిడవిట్ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య పాలనలో గోదావరి పరీవాహక ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతుల ఆత్మహత్యలు సహా వివిధ ఘటనల్లో 50 వేల మంది చనిపోయా రని కమిషన్కు వివరించినట్లు ఆయన చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు లక్షిత ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలుకాగా రీ ఇంజనీరింగ్ ద్వారా 37 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత గురించి కేంద్ర జలసంఘం రాసిన లేఖల్లోని వాస్తవాలను కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, విద్యుత్రంగ నిపుణుడు కె.రఘు వక్రీకరించారని ఆధారాలతో సహా వివరించినట్లు ప్రకాశ్ చెప్పారు. మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ సాధ్యం కాదన్నారు. -
కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ
-
కాళేశ్వరం విచారణలో దూకుడు పెంచిన కమిషన్..
-
‘విద్యుత్’ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి.లోకూర్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలపై ఏర్పాటైన విచారణ కమిషన్కు కొత్త చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో విచారణ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్థానంలో ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నిర్వహించి నివేదిక సమరి్పంచడానికి ప్రభుత్వం జస్టిస్ లోకూర్కు 3 నెలల గడువును విధించింది.జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గౌహతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. కాగా, నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించడంతోపాటు ఛత్తీస్గఢ్తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకోవడంపై పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ మూడు నిర్ణయాల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై విచారణ జరిపి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నిర్ధారించాలని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పుడు ఇదే మార్గదర్శకాలు జస్టిస్ లోకూర్ కమిషన్కు కూడా వరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాల్లో పాత్ర ఉన్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఇంధన శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులకు జస్టిస్ నరసింహా రెడ్డి గతంలో నోటీసులు జారీ చేసి వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని స్వీకరించారు.విచారణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసి నివేదికను సైతం రూపొందించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ సందర్భంలో జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేసిన వాŠయ్ఖ్యలను కారణంగా చూపుతూ విచారణ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, జూలై 1న కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచి్చంది.హైకోర్టు తీర్పును కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, జస్టిస్ నరసింహారెడ్డిని మార్చి విచారణను యథావిధిగా కొనసాగించవచ్చని ఈ నెల 16న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి.లోకూర్ను నియమించడంతో విద్యుత్ నిర్ణయాలపై విచారణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. -
పవర్ కమిషన్ కొత్త చైర్మన్ పై కొనసాగుతున్న సస్పెన్స్
-
‘పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘పవర్ కమిషన్ చైర్మన్ మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వెంటనే జడ్జిని ఎవరిని నియమిస్తారో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియజేయాలి. విచారణ న్యాయబద్ధంగా జరగడం లేదు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరగాలి. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. ఇప్పటికైనా కమిషన్ల పేరుతో కాలయాపన మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. చదవండి: TG: పవర్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్ -
TG: పవర్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. పిటిషన్ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
కాళేశ్వరం విచారణలో స్పీడ్ పెంచిన కమిషన్
-
తుది దశకు చేరిన పవర్ కమిషన్ విచారణ
-
కాళేశ్వరం స్కాం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకు కాళేశ్వరం పంపహౌస్ ఇంజినీర్లు
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రఘోష్ కమిషన్ కోరింది. రెండు వారాల్లోగా అన్ని డాక్యుమెంట్ల ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పంపహౌస్ ఇంజినీర్లను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్హౌస్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్హౌస్లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా అన్నిడాక్యుమెంట్లు అప్పగించాలని స్పష్టం చేసింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నుంచి రిపోర్టులను కోరింది. మరోవైపు, పుణెలోని సీడబ్ల్యూపీఆర్కు తమ ప్రతినిధిని పంపించి అధ్యయనం చేయించింది. నిపుణుల కమిటీ నుంచి కూడా కమిషన్ నివేదిక కోరింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నోటీసులు కమిషన్ ఇవ్వనుంది. -
‘పవర్ కమిషన్’ లీకులు ఇవ్వడమేంటి: జగదీష్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్పై నింద వేద్దామనే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కేసీఆర్ ఒక్కరే విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాసుకోలేదని, అప్పటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ కూడా సంతకం చేశారన్నారు.తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని చెప్పారు. జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్కు తన వాదనను మెయిల్ రూపంలో పంపించిన అనంతరం శనివారం(జూన్29) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాల మధ్య లంచాలకు ఎక్కడైనా ఆస్కారం ఉంటుందా అని ప్రశ్నించారు. విచారణ కమిషన్ మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపాను. ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 2017 నాటికి 17 పవర్ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింది. అన్నీ అనుకూలంగా వున్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాం. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సింగరేణి బొగ్గు ఉండటం వల్ల విదేశీ బొగ్గుకు మేం ఒప్పుకోలేదు’అని చెప్పారు. -
పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా ఉంది: జగదీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’’ అని చెప్పారు.‘‘జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను వేసింది. నిన్న కేసిఆర్ వివరణ కోరారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. కమిషన్ పాత్ర పైన కూడా మాట్లాడారు. వాదన వినకుండా విచారణ కాకముందే తీర్పు ఇచ్చేలా ఉన్నాయని, మీకు ఆ అర్హత లేదని మీరు కమిషన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని కేసిఆర్ సూచించారు. అన్ని ఆధారాలు చూపించారు.’’ అని జగదీష్రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసిఆర్కు ఆ హక్కు ఉంది. 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే లేదు 15నే కావాలని అడిగితే ఇచ్చారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మారిపోయారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసిఆర్ పట్ల నర్సింహారెడ్డికి సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. తన అభిప్రాయం ముందే మీడియా ముందు చెప్తున్నాడు. ఇది తప్పు’’ అని జగదీష్రెడ్డి అన్నారు. -
పవర్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై చర్చ
-
కాళేశ్వరం కమిషన్ను కలిసిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ అధికారులన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం శనివారం కలిసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అక్కడే ఉండాలని కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని కమిషన్కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ సమర్పించింది. మూడు బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ పడింది.సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించి పనిలోపడ్డ కాళేశ్వరం కమిషన్.. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యచరణను ప్రారంభించనుంది. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవడానికి కమిషన్ కసరత్తు చేస్తోంది. అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే కమిషన్ మరోసారి అందరిని క్రాస్ ఎగ్జామినింగ్ చేయనుంది. -
పరువు నష్టం కేసులో సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్లకు బెయిల్
బెంగళూరు: ప్రజా ప్రతినిధుల కోర్టులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివుకుమార్లకు ఊరట లభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి వీళ్లిద్దరికి ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గత బీజేపీ ప్రభుత్వం అన్నీ పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’ పేర్కొంటూ పూర్తి పేజీ ప్రకటన ప్రచురించింది. వివిధ పనుల కోసం గత సర్కార్ అవినీతి రేటు కార్డులు నిర్ణయించిందంటూ ఆరోపిస్తూ పోస్టర్లను కూడా ముద్రించింది.అయితే అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సిద్దరామయ్య, శివకుమార్తోపాటు రాహుల్ గాంధీలపై బీజేపీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నేడు విచారణ సందర్భంగాసిద్ధరామయ్య, శివకుమార్ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అనంతరం సిద్దరామయ్య,, శివకుమార్లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
కారణాలు చూపకుండా పరిధి విభజన సరికాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని మూడు జిల్లా వినియోగదారుల కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని నిర్ణయిస్తూ 2022 నాటి సర్క్యులర్ను పక్కన పెడుతూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చన్న న్యాయస్థానం.. ఆ నిర్ణయం మాత్రం పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరిధి మార్పు ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన వివరణ ఉండాలని పేర్కొంది. జిల్లా కమిషన్ల న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతి పత్రానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్లోని మూడు జిల్లా కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిపై 2022లో జారీ చేసిన సర్క్యులర్ను నిలిపివేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గతేడాది ఏప్రిల్లో రాసిన లేఖను సవాల్చేస్తూ న్యాయవాది రాఘవేంద్రసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పి. శ్యామ్ కోసీ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్చు చెప్పింది. హైదరాబాద్లోని మూడు జిల్లా కమిషన్లు నాంపల్లిలోని చంద్రవిహార్ నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. కమిషన్–1లో కేసులు ఎక్కువగా ఉండగా మిగిలిన రెండు కమిషన్లలో కేసులు లేక మధ్యాహ్నంలోగానే విచారణ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయవాదుల సంఘం వినతి మేరకు కేసుల విభజన బాధ్యతను కమిషన్–1కి అప్పగిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. కేసుల విభజనలో వివక్ష చూపుతున్నారని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని వివరిస్తూ విభజన చేయవచ్చని, న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతిపై నిర్ణయం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. తగిన కారణాలు చూపకుండా... దానిపై వివరణ లేకుండా విభజన చేయడం సరికాదని స్పష్టం చేసింది. -
ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్.. ఇకపై క్యాబ్ల మాదిరిగానే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ర్యాపిడో సరికొత్త పోటీకి తెరలేపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది. గత ఏడాది డిసెంబర్లో రాపిడో క్యాబ్లను ప్రారంభించి క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లకు దాని జీరో-కమీషన్ మోడల్ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ మోడల్ను ఆటో డ్రైవర్లకూ అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం రోజూ 5 లక్షలకు పైగా ఆటో రైడ్లను సులభతరం చేస్తున్న ర్యాపిడో ఆఫ్లైన్ ఆటో డ్రైవర్లనూ తన ప్లాట్ఫారమ్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో కోఫౌండర్ పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ సాస్ ప్లాట్ఫారమ్ ఆటోడ్రైవర్ల సంప్రదాయ కమీషన్ విధానాన్ని మారుస్తోందన్నారు. ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు సాస్ మోడల్ ఆధారిత డిస్కవరీ ప్లాట్ఫారమ్ను ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆటో డ్రైవర్లు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. -
కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్!
దేశంలో 75 ఏళ్ల నుంచి భారత ఫార్మసీ కౌన్సిల్ (PCI) కనుమరుగు కాబోతోంది. దీని స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫార్మసీ చట్టం-1948 చట్టాన్ని భర్తీ చేసే నేషనల్ ఫార్మసీ కమిషన్ ముసాయిదా బిల్లు-2023 ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. నాణ్యమైన ఫార్మసీ విద్యను ఎక్కువ మందికి అందించడం, దేశవ్యాప్తంగా ఫార్మసీ నిపుణుల లభ్యతను పెంచడం ఈ బిల్లు లక్ష్యం. తాజా పరిశోధనలను ఏకీకృతం చేస్తూ ఫార్మసీ నిపుణులు తమ పరిశోధనలను మరింత మెరుగుపరుచుకునేలా, ఉన్నత నైతిక ప్రమాణాలను నిలబెట్టేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఫార్మసీ సంస్థల క్రమబద్ధమైన, పారదర్శక తనిఖీలు, జాతీయ ఫార్మసీ రిజిస్టర్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. నేషనల్ ఫార్మసీ కమిషన్లో చైర్పర్సన్తోపాటు 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కింద పనిచేసేలా ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు, ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిష్ట్రేషన్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
కాంగ్రెస్ అంటే కోత, అవినీతి, కమీషన్: మంత్రి అమిత్ షా
కర్నాల్(హరియాణా): కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్పై తీవ్రంగా మండిపడ్డారు. ఆ పార్టీని ఆయన కోత, కమీషన్, అవినీతి(కట్, కమీషన్, కరప్షన్) పార్టీగా పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని 27 పార్టీల నేతలు స్వలాభం కోసమే చేతులు కలిపారని ఆరోపించారు. తమ బీజేపీ మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని చెప్పారు. గురువారం హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అంత్యోదయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దేశంలో శాంతి భద్రతలను మెరుగుపర్చిందని, అవినీతిని, బంధుప్రీతిని నిర్మూలించిందని చెప్పారు. -
రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల కమీషన్ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం అందించే కమీషన్కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్ను అదనంగా అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్ఎఫ్ఎస్సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. కమీషన్ టన్నుకు 700 నుండి 1400 రూపాయలకు పెంపుదల చేసింది. కమీషన్ పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.245 కోట్ల భారం పడనుంది. డీలర్ల కమీషన్ పెంపు జీవోను జేఏసీ ప్రతినిధులకు మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. 17 వేలకు పైగా రేషన్ డీలర్ల కుటుంబాకు లబ్ధి కలుగనుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్వర్క్ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్లు తదితరాలకు సంబంధించిన గ్రూప్లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్తో.. తొలుత భరత్ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్లో ఉండే స్నేహితుడు ప్రశాంత్ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్కు పంపేవా డు. భరత్ తైవాన్లో ఉండే స్వాంగ్ లిన్కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
50 శాతం కమిషన్ అంశంపై ప్రియాంక గాంధీపై కేసు..
భోపాల్: మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ఎంపీ కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్లపై కేసు నమోదైంది. అవినీతి అరోపణలపై నకిలీ లేఖను సోషల్ మీడియాలో జ్ఞానేంద్ర అవస్తీ పేరిట ప్రచారం చేస్తున్నారని బీజేపీ లీగల్ సెల్ కన్వినర్ నిమేశ్ పతాక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 50 శాతం కమిషన్ను ప్రభుత్వం రాబడుతుందని ట్వీట్టర్(ఎక్స్) వేదికగా వాద్రా ఆరోపణలు చేశారు. కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు వెళ్లడం లేదని కాంట్రాక్టర్లు హైకోర్టు సీజేకి లేఖ రాశారంటూ పోస్టు చేశారు. కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్లోనూ ఇలాగే కమిషన్ లేనిదే పనిజగట్లేదని ఆరోపణలు చేశారు. ఇదే విధంగా కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్లు, అరుణ్ యాదవ్లు పోస్టు చేశారు. मध्य प्रदेश में ठेकेदारों के संघ ने हाईकोर्ट के मुख्य न्यायाधीश को पत्र लिखकर शिकायत की है कि प्रदेश में 50% कमीशन देने पर ही भुगतान मिलता है। कर्नाटक में भ्रष्ट BJP सरकार 40% कमीशन की वसूली करती थी। मध्य प्रदेश में BJP भ्रष्टाचार का अपना ही रिकॉर्ड तोड़कर आगे निकल गई है।… pic.twitter.com/LVemnZQ9b6 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 11, 2023 వీరిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్ నాథ్, అరుణ్ యాదవ్లపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును దెబ్బతీయాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రియాంక గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. తప్పుడు ప్రచారాలతో ఎంతో కాలం లబ్ది పొందలేని చెప్పారు. సీఎం శివరాజ్ సింగ్ కూడా ఈ అంశంపై స్పందించారు. వారి మాటల్లో నిజం లేదని చెప్పారు. ప్రియాంక గాంధీ పోస్టుకు సంబంధించిన వ్యక్తులపై గ్వాలియర్లోనూ కేసులు నమోదయ్యాయని అన్నారు. मध्यप्रदेश में कांग्रेस मुद्दा विहीन होकर घृणित मानसिकता के साथ राजनीति कर रही है। प्रदेश कांग्रेस के नेताओं ने पहले राहुल गांधी जी से झूठ बुलवाया अब प्रियंका गांधी जी से झूठा ट्वीट करवाया। प्रियंका जी आपने जो ट्वीट किये हैं उसके प्रमाण दो अन्यथा हमारे पास कार्यवाही के सारे… pic.twitter.com/j9FfajhA9c — Dr Narottam Mishra (@drnarottammisra) August 12, 2023 ఇదీ చదవండి: ఎన్డీయేలోకి శరద్ పవార్..? తాజా భేటీ ఎందుకు..? -
రేషన్ డీలర్లపై కేసీఆర్ సర్కార్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రేషన్ డీలర్లపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బియ్యం పంపిణీకి గాను వారికిచ్చే కమీషన్ను మెట్రిక్ టన్నుకు రూ.900 నుంచి రూ.1,400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే డీలర్లు డిమాండ్ చేస్తున్న మరో 13 అంశాలపై కూడా సానుకూలంగా స్పందించింది. రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సచివాలయంలో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రభుత్వానికి, రేషన్ డీలర్లకు ఆమోదయోగ్యమైన విధంగా కమీషన్ను పెంచడంతో పాటు మరో 13 డిమాండ్లను పరిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ను మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడన్నల బీమా తరహాలో రేషన్ డీలర్లకు రూ.5 లక్షల బీమా వర్తింప చేయడం, ప్రతి డీలర్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంపు తదితర 13 అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.200 గా ఉన్న డీలర్ల కమీషన్ను దశలవారీగా పెంచుతూ రూ.1400కు చేర్చినట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీర్ఘకాల డిమాండ్లకు పరిష్కారం రాష్ట్రంలోని పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యానికి సంబంధించి ప్రస్తుతం డీలర్లకు మెట్రిక్ టన్నుకు రూ.900 చొప్పున కమీషన్ అందుతోంది. దీనిని పెంచాలని గత కొంతకాలంగా డీలర్లు ఆందోళన చేస్తున్నారు. గత నెలలో సమ్మెలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయితే మంత్రి గంగుల ఇచ్చిన హామీ మేరకు గత నెలలో బియ్యం పంపిణీ చేసిన డీలర్లు, ఈ నెలలో తమ సమస్యలు పరిష్కారమైతేనే బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఈనెల 5 నుంచి ప్రారంభం కావలసిన బియ్యం పంపిణీని 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మంత్రులు హరీశ్, గంగులతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 17,227 మంది డీలర్లకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో మొత్తం 90.05 లక్షల ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వాటిలో 35.56 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులు కాగా మిగతా 54.5 లక్షల కార్డులు కేంద్రం మంజూరు చేసినవి. ఈ కార్డులకు గాను 2.82 కోట్ల మంది లబ్ది దారులకు ప్రతినెలా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వంపై రూ.138.73 కోట్ల భారం డీలర్ల కమీషన్ను రూ.1,400కు పెంచడం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.138.73 కోట్ల భారం పడనుంది. కమీషన్ మొన్నటివరకు రూ.700 ఉండగా రెండు నెలల క్రితం కేంద్రంతో జరిగిన సర్దుబాటు వల్ల రూ.200 పెంచి రూ.900 కమీషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.700 ఉన్నప్పుడు రూ.45.36 కోట్ల కేంద్రం వాటా పోగా, రాష్ట్రం వాటా రూ.106.33 కోట్లతో డీలర్లకు మొత్తం రూ.151.69 కోట్లు ఏటా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం కమీషన్ను రూ.1,400కు పెంచడంతో ఏటా మొత్తం రూ.303.38 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో కేంద్రం వాటా రూ.58.32 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.245.06 కోట్లకు పెరిగింది. అంటే రూ.138.73 కోట్ల అదనపు భారం పడుతోందన్నమాట. డీలర్లకు మరికొన్ని ప్రభుత్వ వరాలు ♦ ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వే బ్రిడ్జిల ఏర్పాటు ♦ డీలర్షిప్ రెన్యువల్ను ఐదేళ్ల కాలపరిమితికి పెంచడం ♦ డీలర్ మరణిస్తే అంత్యక్రియల నిర్వహణకు రూ.10 వేల తక్షణ సాయం ♦ 1.5 క్వింటాళ్ల వేరియేషన్ (తేడా)ను కేసుల పరిధి నుంచి తీసివేయడం ♦ హైదరాబాద్లో రేషన్ భవన్ నిర్మాణానికి భూ కేటాయింపు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన డీలర్లు కమీషన్ పెంపు సహా తమ ఇతర సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు రేషన్ డీలర్లు కృతజ్ఞతలు తెలిపారు. తమ వినతులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్రావు, గంగుల, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ వి.అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
భూమికి డేంజర్ బెల్స్.. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే
భూమి ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు, వాటికి కారణాలు తదితరాలపై 40 మంది ప్రముఖ అంతర్జాతీయ ప్రకృతి, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఎర్త్ కమిషన్ బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో తేలిన ఆందోళనకర అంశాలతో కూడిన నివేదిక జర్నల్ నేచర్లో పబ్లిషైంది. మానవ ఆధిపత్య యుగం (ఆంత్రోపొసీన్) క్రమంగా భూమి తాలూకు కీలక వ్యవస్థల స్థిరత్వాన్ని సమూలంగా కదిలించి వేస్తోందని హెచ్చరించింది. నివేదికలో వెల్లడించిన అంశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి... మితిమీరిన వనరుల దోపిడీ. లెక్కలేని నిర్లక్ష్యం. ఇంకా అనేకానేక స్వయంకృతాపరాధాలతో భూమిని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. పుట్టింది మొదలు గిట్టి మట్టిలో కలిసేదాకా నిత్యం సకలం సమకూర్చే ఆధారాన్నే మొదలంటా నరికేసుకుంటున్నాం. భావి తరాలనే గాక భూమిపై ఉన్న సకల జీవరాశులనూ పెను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాం. గ్లోబల్ వార్మింగ్, కరువు, పెను వరదల వంటి ఉత్పాతాల రూపంలో భూమి చేస్తున్న ఆక్రందనను ఇకనైనా చెవిన పెట్టకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేందుకు ఇంకెంతో కాలం పట్టదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. ఫలితంగా భూమికి డేంజర్ బెల్స్ చెవులు బద్దలయ్యే స్థాయిలో మోగుతున్నాయని సైంటిస్టులు తాజాగా తేల్చారు. భూమి తాలూకు ఎనిమిది రకాల భద్రతా పరిమితుల్లో ఏకంగా ఏడింటిని ఎప్పుడో దాటేశామని వారు వెల్లడించారు... ప్రతి ఖండంలోనూ.. సమతుల్యత పూర్తిగా దెబ్బ తిని అతి సమస్యాత్మకంగా మారిన పలు ప్రాంతాలను అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ ఎక్కడపడితే అక్కడ ఇలాంటి హాట్స్పాట్లు ఉండటం కలవరపరిచే అంశమేనని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో చాలా ప్రాంతాల్లో వాతావరణ మార్పులే సమస్యకు ప్రధాన కారణమని తేలింది. ‘‘ముఖ్యంగా ఆసియాలో పర్వత ప్రాంతాలతో సమాహారమైన హై మౌంటేన్ క్రయోస్పియర్ శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతోంది. హిమానీ నదాల కరుగుదల మొదలుకుని జరగకూడని ప్రతికూల పరిణామాలన్నీ భయపెట్టే వేగంతో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అతి త్వరగా ఆ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా పెను కుదుపులకు లోనవడం ఖాయం’’ అని సహ అధ్యయనకర్త ప్రొఫెసర్ క్రిస్టీ ఎబి హెచ్చరించారు. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే... భూమి భద్రతకు సంబంధించి స్థూలంగా 8 రకాల సూచీలను కీలకంగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. వీటిలో మూడు కంటే ఎక్కువ సూచీలు ఆమోదిత పరిమితి దాటితే భూమికి ముప్పు తప్పదని భావిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా 7 సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేసి ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్టు ఎర్త్ కమిషన్ అధ్యయనం తేల్చడం అందరినీ భయపెడుతోంది... ఏం చేయాలి ► పర్యావరణపరంగా సురక్షిత స్థాయిని భూమి ఎప్పుడో దాటేసింది. రోజురోజుకూ మరింత ప్రమాదం దిశగా వెళ్తోంది. ► భూమిపై వాసయోగ్యతను నిర్ధారించే జీవ భౌతిక వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దే పని తక్షణం మొదలు పెట్టాలి. ► అప్పుడు బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి కీలక వనరుల లోటును భూమి తనంత తానుగా భర్తీ చేసుకోగలదు. ‘‘భూమికి గనక మనిషికి చేసినట్టే ఇప్పటికిప్పుడు వార్షిక హెల్త్ చెకప్ చేయిస్తే ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందంటూ రిపోర్టు వస్తుంది. కీలక అవయవాలన్నీ దాదాపుగా మూలకు పడుతున్నాయని తేలుతుంది’’ – క్రిస్టీ ఎబి, సహ అధ్యయనకర్త, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ‘‘భూ స్థిరత్వాన్ని ఆమోదనీయ స్థాయికి తీసుకొచ్చేందుకు దేశాలన్నీ కలసికట్టుగా తక్షణం ఓ భారీ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భూమి ఏమాత్రమూ ఆవాసయోగ్యం కాకుండా పోయేందుకు ఇంకెంతో కాలం పట్టదు!’’ – ప్రొఫెసర్ జొయీతా గుప్తా, అధ్యయనంలో కీలక భాగస్వామి డేంజర్ హాట్ స్పాట్స్కు నిలయాలు ► తూర్పు యూరప్ ► దక్షిణాసియా మధ్యప్రాచ్యం ► ఆగ్నేయాసియా ► ఆఫ్రికాలో పలు ప్రాంతాలు ► బ్రెజిల్లో చాలా ప్రాంతాలు ► అమెరికాలో పలు ప్రాంతాలు ► మెక్సికో చైనా కొసమెరుపు: సూచనల మాటెలా ఉన్నా కీలకమైన అన్ని మౌలిక సూచికలూ పూర్తిగా నేల చూపులు చూస్తున్నాయి. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వనరుల భర్తీ దేవుడెరుగు, భూమి తాలూకు వాసయోగ్యతకే, మరోలా చెప్పాలంటే జీవరాశుల ఉనికికే ఎసరొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నది సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్న మాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐరాస స్టాటిస్టికల్ కమిషన్కు భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంకాల విభాగం యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్కు రెండు దశాబ్దాల తర్వాత భారత్ ఎన్నికైంది. రహస్య బ్యాలెట్ ఓటింగ్లో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గింది. యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ భారత్ యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్ మెంబర్గా, నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్గా, ప్రోగ్రామ్ కో ఆర్డినేటింగ్ బోర్డ్ ఆఫ్ జాయింట్ యూఎన్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్గా ఎన్నికైంది. -
వివక్ష లేదు.. ‘నవరత్నాల పథకాలు’ యాడ్స్పై మంత్రి వేణు క్లారిటీ
సాక్షి, అమరావతి: నవరత్నాల పథకాల యాడ్స్పై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు. పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికి యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడా వివక్ష లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.128 కోట్ల ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. ‘‘గత తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేసింది. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్దపీట వేశారు. ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారు. సర్కులేషన్ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారు’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘రెండో స్థానంలో ఉన్న సాక్షి పేపర్కు కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారు. గత ప్రభుత్వం యాడ్స్ ఇవ్వటంలో పూర్తిగా పక్షపాత ధోరణి అవలంబించింది. గత ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారు. ఆ ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశాం’’ అని మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ సీరియస్ -
జాతీయ మహిళా కమిషన్ ముందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
-
జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్
చెన్నై: తమిళనాడు దివగంత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5, 2016న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆర్మగస్వామి కమిషన్ని ఏర్పాటు చేయడం, ఐదేళ్ల తదనంతరం కమిషన్ 600 పేజీల నివేదికను స్టాలిన్కి సమర్పిచడం జరిగింది. ఐతే ఆ నివేదిక తోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆ కమిషన్ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చలి, స్నేహితురాలు శశికళను దోషిగా పేర్కొంటూ విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్ శివకుమార్(జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు), మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధకృష్ణన్ , మాజీ ఆరోగ్య మంత్రి సి విజయ భాస్కర్లను కూడా దోషులుగా చేరుస్తూ దర్యాప్తుకు అభ్యర్థించింది. అంతేగాదు కమిషన్ వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగాని ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా తప్పుపట్టింది కమిషన్. అలాగే జయలలిత డిసెంబర్ 4, 2016న మధ్యాహ్నాం 3.50 నిమిషాలకు గుండెపోటుకు గురైన తర్వాత సీపీఆర్, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్నీ సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్లు చెబుతున్నారని కమిషన్ ఆరోపిస్తోంది. ఆమె చనిపోయింది డిసెంబర్ 4, 2016 అయితే ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5, 2016గా ప్రకటించడాన్ని తప్పుపట్టింది. అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ 2018లో రాష్రంలోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుని తప్పుపట్టింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018 తూత్తుకుడి ఘటన సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది. (చదవండి: : ఐదేళ్లకు.. ‘అమ్మ’ మరణంపై కమిషన్ విచారణ పూర్తి -
తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (ఫొటోలు)
-
జయలలిత మృతి: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్ చేతికి రిపోర్టు
సాక్షి, చైన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత మృతిపై ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక కీలకంగా మారింది. కాగా, జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి తన నివేదికను సీఎం స్టాలిన్కు అందజేశారు. 600 పేజీలతో కమిషన్ రిపోర్టును తయారు చేసింది. ఇక, కమిషన్ ఏర్పాటైన ఐదేళ్ల తర్వాత నివేదిక అందించడం విశేషం. అయితే, 2016 సెప్టెంబర్ 22వ తేదీన జయలతిత ఆసుపత్రిలో చేరారు. 2016, డిసెంబర్ 5వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబర్లో మాజీ జడ్జీ జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కమిషన్.. ఐదేళ్ల కాలంలో జయలలిత సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. కమిషన్ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు, విధుల్లో ఉన్న చెన్నై పోలీసులు ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. అయితే, విచారణలో భాగంగా ఆర్ముగ స్వామి కమిషన్ సుమారు రెండు వందల మందిని ప్రశ్నించింది. ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్.. పన్నీర్సెల్వానికి బిగ్ షాక్ -
నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్పీఎస్) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పింఛను జమలకు డైరెక్ట్ రెమిట్ (నేరుగా జమ) మార్గాన్ని ఎంపిక చేసుకుంటే, పీవోపీలకు వచ్చే నెల నుంచి రూ.15-10,000 వరకు కమీషన్ లభిస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. పీఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధన కింద ఎన్పీఎస్ చందాదారులు నేరుగా జమ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఫీజుల రూపంలో నష్టపోయే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీలు) సంస్థలకు పరిహారాన్ని ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన పౌరులు ఎన్పీఎస్ చందాదారులుగా ఉంటారు. అయితే ఎన్పీఎస్కు, చందాదారులకు మధ్య అనుసంధానకర్తలను పీవోపీలుగా పేర్కొంటారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్టెక్ కంపెనీలు పీవోపీల కిందకు వస్తాయి. ఎన్పీఎస్ ఖాతాలను తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్న పీవోపీలకు తమ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. -
శాంతి కమిషన్లో మోదీ పేరు... ప్రతిపాదించిన మెక్సికో
ప్రపంచ శాంతి కోసం ఐదేళ్ల కాలానికి ఆయా దేశాల మధ్య సంధిని ప్రోత్సహించేలా ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన అత్యున్నత కమిషన్ని రూపొందించనున్నారు. ఐతే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆ కమిషన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్లో భారత ప్రధాని పేరుని ప్రతిపాదించినట్లు తెలిపారు. తాను రాత పూర్వకంగా ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితికి అందజేస్తానని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేలా ఐదేళ్ల సంధి కాలానికి ఒక ఒప్పందం కుదుర్చునేలా ప్రతిపాదన సమర్పించడం ఈ కమిషన్ లక్ష్యం. ఈ అత్యున్నత కమిషన్లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తోపాటు భారత ప్రధాని మోదీ ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఆ ముగ్గురు నాయకులు ప్రతి చోట యుద్ధాన్ని ఆపేసేలా ఒక ప్రతిపాదనను అందజేయడమే కాకుండా ఐదేళ్ల యుద్ధాన్ని నిలిపేసేలా ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. తద్వారా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఉద్రిక్తతలు తలెత్తకుండా శాంతిగా ఉంటాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదిక చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ మెక్సికో అధ్యక్షుడు.. రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలను శాంతిని కోరేందుకు ఆహ్వానించారు. ఈ మూడు దేశాలు తాము ప్రతిపాదిస్తున్న మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ప్రతిపాదిత సంధి తైవాన్, ఇజ్రాయోల్, పాలస్తీనా వంటి దేశాలతో కూడా ఒప్పందం చేసుకునేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. అదీగాక ఈ ఒక్క ఏడాదిలోనే ఎన్నో ఘర్ణణలతో కూడిన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, ఎంతోమంది ప్రజలు చనిపోవడం, నిరాశ్రయులవ్వడం జరిగిందని చెప్పారు. (చదవండి: 'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!) -
జూలై 4 నుంచి రేషన్ డీలర్ల నిరసనబాట
సాక్షి, న్యూఢిల్లీ : రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు జాతీయ రేషన్ డీలర్ల ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్–వన్ కమీషన్’ విధానంలో ప్రతి క్వింటాల్కు కమీషన్ను రూ.250 నుంచి రూ.300కు పెంచాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం జూలై 4న మండల కేంద్రాల్లో, జూలై 11న జిల్లా కేంద్రాల్లో, జూలై 18న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానుల్లో ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించారు. ఆగస్ట్ 2న దేశవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది డీలర్లతో ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు రాజు పేర్కొన్నారు. (క్లిక్: జూన్ 26న జాతీయ లోక్ అదాలత్) -
పెట్రో డీలర్ల ఆందోళన
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్పై కమీషన్ పెంచాలని కోరుతూ ‘పెట్రో’డీలర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘నో పర్చేజ్ డే’పాటించి నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇంధన కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా రాష్ట్రంలోని డీలర్లంతా సంఘీభావాన్ని ప్రకటించారు. 2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయినప్పటికీ, డీలర్ల కమీషన్ మాత్రం పెంచలేదని, ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో తాము చెల్లించిన మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పెట్రోల్, డీజీల్ డీలర్ల సంఘం పిలుపు మేరకు హైదరాబాద్, సూర్యాపేట, రామగుండం, వరంగల్లలో ఉన్న మూడు చమురు కంపెనీలకు చెందిన 7 పెట్రోల్, డీజిల్ డిపోల నుంచి వాహనాలు బయటకు వెళ్లకుండా ఆందోళన దిగారు. ఈ సందర్భంగా కుషాయిగూడలో ఎనిమిది మంది డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వదిలి వేశారు. ఈ ఆందోళనల కారణంగా రాష్ట్రంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కాగా, ఆర్నెల్లకోసారి డీలర్ల కమీషన్ను సవరించాల్సి ఉండగా, 2017 నుంచి దాని గురించి పట్టించుకోలేదని రాష్ట్ర పెట్రో డీలర్ల సంఘం అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని తప్పుపట్టడం లేదని, తాము చెల్లించిన మొత్తాన్ని రీయంబర్స్మెంట్ చేయాలని చమురు కంపెనీలను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
చటాన్ పల్లి మిస్టరీ..!
-
పోలీసులది కట్టుకథ ప్లాన్ ప్రకారమే అంతా చేశారు..!!
-
దిశ ఎన్ కౌంటర్ తర్వాత హత్యచారాలు ఆగాయా ?? పోలీసులకు గుణపాఠం
-
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం
-
చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జయలలిత మరణం కేసులో చిన్నమ్మ శశికళకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం తన వాదన చెప్పారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటు చేసుకు న్న పరిణామాల గురించి తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది పన్నీరు సెల్వమే. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని నినాదించారు. నిగ్గుతేల్చాలని పట్టుబట్టారు. చివరకు చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో సీఎంగా గద్దెనెక్కిన ఆమె ప్రతినిధి పళనిస్వామికి దగ్గరయ్యారు. అధికారాన్ని పంచుకు న్న ఈ ఇద్దరు అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను బహిష్కరించారు. అలాగే, అమ్మ మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ను రంగంలోకి దించారు. ఈ కమిషన్ గతంలో 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు, తాజాగా పరుగులు తీయక తప్పలేదు. గంటలపాటూ విచారణ సోమవారం 3 గంటల పాటుగా ఆర్ముగ స్వామి కమిషన్ పన్నీరును విచారించింది. 78 ప్రశ్నలు సంధించగా, కొన్నింటికి సమాధానాలు ఇచ్చి, మిగిలిన వాటికి దాట వేశారు. ప్రధానంగా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, సీఎస్ రామ్మోహన్రావు కనుసన్నల్లోనే చికిత్స వ్యవహారాలు సాగినట్లుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చడం చర్చకు దారి తీశాయి. మంగళవారం 6 గంటలు పా టు విచారణ జరిగింది. 120 ప్రశ్నల్ని పన్నీరు ముందు కమిషన్ వర్గాలు ఉంచగా, మరో 34 ప్రశ్నల్ని క్రాస్ ఎగ్జామిన్లో శశికళ తరపున న్యాయవాది రాజ చెందూ ర్ పాండియన్ సంధించారు. అలాగే, అపోలో ఆస్పత్రి తరపున 11 ప్రశ్నలు పన్నీరు ముందుంచారు. చిన్నమ్మకు అనుకూలంగా.. గతంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించిన పన్నీరు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. జయలలిత మరణం విషయంలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుమానం లేదు అని పేర్కొనడం గమనార్హం. అయితే, ప్రజలు, కేడర్ అనుమానాలు వ్యక్తం చేశాయని, వారి ప్రతినిధిగా తాను కమిషన్ ఏర్పాటుకు పట్టుబట్టినట్టు పేర్కొనడం ఆలోచించాల్సిందే. ఇక, జయలలితకు వ్యతిరేకంగా శశికళ, ఆమె కుటుంబీకులు ఎలాంటి కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు. అలాగే, చిన్నమ్మ అంటే వ్యక్తిగతంగా తనకు మర్యాద, అభిమానం ఉందని క్రాస్ ఎగ్జామిన్ సమయంలో పన్నీరు ఇచ్చిన సమాధానాలు అన్నాడీఎంకేలో హాట్ టాపిక్ అయ్యాయి. కాగా జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, సీసీ కెమెరాల తొలగింపు తదితర అంశాల గురించి తనకు తెలియదని పన్నీరు పేర్కొన్న దృష్ట్యా, ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్, అపోలో యాజమాన్యాన్ని మరో మారు విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. సంతృప్తికరంగా విచారణ విచారణ అనంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, విచారణ సంతృప్తికరంగా జరిగిందన్నారు. ‘వాస్తవాలు’ తెలియజేశానన్నారు. చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ మాట్లాడుతూ, కుట్రలు జరగలేదని, అనుమానం లేదన్న సమాధానాలను పన్నీరు వెల్లడించినట్లు చెప్పారు. -
‘అమ్మకు ఆ సలహా ఇచ్చింది నేనే.. కానీ’
సాక్షి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలితను విదేశాలకు తీసుకెళ్లి వైద్యం అందించాలన్న సలహాను తొలుత ఇచ్చింది తానేనని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. దివంగత సీఎం జయలలిత మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఆర్ముగ స్వామి కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరయ్యారు. విచారణ వేగవంతం జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. నాలుగున్నరేళ్లుగా ఈ విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన పన్నీరు సెల్వం ఎట్టకేలకు సోమవారం జరిగిన విచారణకు వచ్చారు. కాగా మంగళవారం కూడా రావాలని కమిషన్ వర్గాలు ఆయన్ని ఆదేశించాయి. అలాగే, జయలలిత నెచ్చెలి శశికళతో పాటుగా సుదీర్ఘ కాలం పోయేస్ గార్డెన్లో ఉన్న ఆమె వదినమ్మ ఇలవరసి సైతం విచారణకు వచ్చారు. (చదవండి: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోండి.. నగదు రివార్డు పొందండి: స్టాలిన్ ) సీసీ కెమెరాల్ని తొలగించమని ఆదేశించ లేదు పన్నీరు సెల్వం కమిషన్ ముందు ఉంచిన వాదనలు, వాంగ్ములం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అపోలో ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు తొలగించాలని తాను ఆదేశించ లేదని ఆయన స్పష్టం చేశారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునని, అయితే, ఆమెకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి తనకు తెలియదని వెల్లడించారు. దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్ను ఏవిధంగా విదేశాలకు తీసుకెళ్లి వైద్య చికిత్స అందించడం జరిగిందో, అదే తరహాలో అమ్మను కూడా విదేశాలకు తీసుకెళ్దామని అప్పటి ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, మరో మంత్రి తంగమణితో పాటుగా పలువురి దృష్టికి తీసుకెళ్లానని, అయితే, ఎవరూ స్పందించ లేదని పేర్కొన్నారు. అయితే, అపోలో వర్గాలు మాత్రం అమ్మ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంటూ వచ్చారని వివరించారు. అలాగే, విదేశాలకు తరలింపు విషయంలో తాను నిర్లక్ష్యం వహించినట్టుగా మాజీ సీఎస్ రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక, పలు ప్రశ్నలకు తెలియదు అని, తన దృష్టికి రాలేదని, తనతో ఎవరూ చర్చించలేదని, సలహా కూడా తీసుకోలేదని పన్నీరు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఇలవరసి ఒకటి రెండు సార్లు తాను.. అపోలో ఆస్పత్రిలో అద్దాల నుంచి జయలలితను చూశానని వాంగ్ములం ఇచ్చినట్లు సమాచారం. -
East Godavari: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగవకాశాలు
కాకినాడ సిటీ(తూర్పుగోదావరి): జిల్లా వినియోగదారుల కమిషన్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్ పోస్టులకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,500 రెమ్యూనరేషన్ ఉంటుందన్నారు. చదవండి: పార్క్ చేసి ఉన్న బైక్పై డబ్బుల బ్యాగ్.. తర్వాత ఏం జరిగిందంటే.. జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి ఇంటర్మీడియెట్, స్టెనోగ్రాఫీ లోయర్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. టైపిస్ట్ పోస్టుకి ఇంటర్మీడియట్, టైపు హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి ఇంటర్మీడియెట్, టైపు, హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 42 ఏళ్ల వయసు మించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధ్యక్షుడు, జిల్లా వినియోగదారుల కమిషన్, కోర్టు కాంపౌండ్, కాకినాడలో అందజేయాలన్నారు. -
దిశ ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్
సాక్షి, హైదరాబాద్/ షాద్నగర్/ శంషాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచా రం కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ హైదరాబాద్కు వచ్చింది. కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, సభ్యులు బాంబే హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా బాల్దోటా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ చీఫ్ బి.కార్తికేయన్లు ఆదివారం చటాన్పల్లిలోని దిశ ఎన్కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. త్రిసభ్య కమిటీతో పాటు ‘దిశ’హత్యాచారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) చైర్మన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, విచారణాధికారి (ఐఓ) జె.సురేందర్రెడ్డి, శంషాబా ద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, కమిషన్ తరుఫు న్యాయవాదు లు, కమిషన్ సెక్రటరీ కూడా ‘దిశ’సంఘటనా స్థలికి సంబంధించిన ప్రైవేట్ గెస్ట్హౌస్, తొండుపల్లి గేటు, చటాన్పల్లి ప్రాంతాలను సుమారు 6 గంటలపాటు సందర్శించారు. తొలుత నలుగురు నిందితులను దర్యాప్తు నిమిత్తం ఉంచిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ను బృందం సందర్శించింది. ఆ తర్వాత ‘దిశ’ఘటనకు కారణమైన తొండుపల్లి గేటును పరిశీలించింది. దిశ స్కూటర్ను ఎక్కడ పార్క్ చేసింది? నిందితులు లారీని ఎక్కడ నిలిపి ఉంచారు? వంటి వివరాలపై డీసీపీ ప్రకాశ్రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రహరీలోకి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు 20 నిమిషాల పాటు బృందం అక్కడే గడిపింది. కాగా, తొండుపల్లి గేటు సమీపంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి త్రిసభ్య కమిటీని కలిశారు. తమకు కూడా ఒకరోజు సమయమివ్వాలని శ్రీధర్రెడ్డి కోరగా.. ‘మీ సమస్యలన్నీ మాకు తెలుసని.. మీకు న్యాయం జరుగుతుంది’అని కమిషన్ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుల తరఫున విచారణ వద్దు... సిర్పుర్కర్ కమిషన్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ సంద ర్శించి, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించింది. ‘దిశ’కేసు సమయం లో స్టేషన్లో రికార్డ్ల నిర్వహణ, విలేకరుల సమావేశం నిర్వహించిన సమావేశం గది, స్టేషన్లోని ఇతరత్రా ప్రాంతాలను పర్యవేక్షించింది. ఇదిలా ఉండగా.. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పుర్కర్ కమిటీ ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుందని, నిందితుల తరుఫున విచారణ చేయడమేంటని ప్రశ్నిస్తూ షాద్నగర్ పీఎస్ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ‘కమిషన్ గో బ్యాక్’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నేతలు స్టేషన్ ముందు బైఠాయించారు. చటాన్పల్లిలో ప్రతీ అంశం పరిశీలన.. షాద్నగర్ పీఎస్ నుంచి కమిటీ నేరుగా చటాన్పల్లికి చేరుకుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సుమారు గంటసేపు క్షుణ్నంగా పరిశీలించింది. సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం నిందితులను తీసుకొచ్చిన బస్ ఎక్కడ నిలిపారు? దిశ వస్తువులను ఎక్కడ పాతి పె ట్టారు? నిందితులు ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఆ సమయంలో పోలీసులు నిల్చున్న చోటు, ఎదురు కాల్పుల్లో నిందితుల మృతదేహాలు పడి ఉన్న దూరం.. వంటి ప్రతీ అంశంలోనూ కమిషన్ క్షుణ్నంగా వివరాలు సేకరించింది. ‘దిశ’ను దహనం చేసిన ప్రాంతాన్ని సాధ్యమైనంత దగ్గరికి వెళ్లి పరిశీలించింది. కాగా, ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ జరిగి డిసెంబర్ 6తో రెండేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2లోపు సుప్రీంకోర్ట్కు కమిషన్ నివేదికను సమర్పించే అవకాశముంది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే అర్థం తెలియదు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్ రెండో రోజు మంగళవారం జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ‘దిశ’నిందితులు మహ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులో ఆరీఫ్ మినహా మిగిలిన ముగ్గురు జువెనైల్స్ అనే విషయం తనకి తెలియదని కమిషన్ ముందు సజ్జనార్ వాంగ్మూలం ఇచ్చారు. అలాగే 2019, డిసెంబర్ 5 రాత్రి సమయంలో నిందితులను రవి గెస్ట్ హౌస్లో విచారించమని తాను చెప్పలేదని.. సురక్షిత ప్రదేశంలో మాత్రమే నిందితులను ఉంచాలని సూచించానని వివరించారు. కేసు దర్యాప్తులో ఉండటం, దిశ వస్తువుల రికవరీ ఉన్నందునే చర్లపల్లి జైలు నుంచి నిందితులను తీసుకెళ్లామని చెప్పారు. ఆ సమయంలో ముద్దాయిలకు సీన్ రీ–కన్స్ట్రక్షన్ సమాచారం ఇవ్వలేదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును సాధారణ నేరంగా ఎలా పరిగణించారని, పైగా కేసు విచారణలో ‘మార్నింగ్ బ్రీఫింగ్’కే పరిమితం అయ్యానని అనడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరం జరిగిన ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉంటూ ఎస్ఓటీ బృందాల ఏర్పాటు, విచారణ, ఎస్కార్ట్ పోలీసులకు ఆయుధాలు, సమాచార సేకరణ, అరెస్ట్.. ఇలా ప్రతీదీ మీ కంటే కిందిస్థాయి అధికారి(డీసీపీ ఎన్. ప్రకాశ్రెడ్డి)కే తెలుసని చెప్పడం సరైందికాదని అసహనం వ్యక్తం చేసింది. (చదవండి: పొగాకు వినియోగంలో వారే అధికం.. షాకింగ్ విషయాలు వెల్లడి) కమిషన్ ప్రశ్నలలో ప్రధానమైనవి.. కమిషన్: నిందితులను అరెస్ట్ చేసిన విధానం గురించి శంషాబాద్ డీసీపీ మీకు చెప్పారా? సజ్జనార్: లేదు, చెప్పలేదు. కమిషన్: స్టేషన్ల స్థాయి ఆయుధాల జారీ, తనిఖీలో అంతిమ బాధ్యత పోలీస్ కమిషనర్కి ఉండదా? సజ్జనార్: సైబరాబాద్లో ఆయుధాలు, మందుగుం డు సామగ్రి విభాగంతో పాటు ఇతర విభాగాలు కూడా ఉంటాయి. ప్రతి దానికి డీసీపీ ర్యాంక్ అధి కారి ఉంటాడు. కమిషనర్ లా అండ్ ఆర్డర్, పరిపాలన, విధానపరమైన నిర్ణయాలకే పరిమితం అవుతాడు. ఆయుధాల జారీ, తనిఖీలలో ఏమైనా సమ స్యలు తలెత్తితే అది సీపీ దృష్టికి వస్తుంది అంతే. కమిషన్: నిందితుల నేరాంగీకారం (కన్ఫెషన్ స్టేట్మెంట్) ఎప్పుడు రికార్డ్ చేశారు? సజ్జనార్: మహ్మద్ ఆరీఫ్ నేరాంగీకార రికార్డ్ను సాయంత్రం 5:20గం. నుంచి 6:30గం.ల మధ్య, శివ నేరాంగీకార రికార్డ్ 6:45 గం.కు జరిగింది. కమిషన్: ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహించే ముందు ఆరీఫ్ నేరాంగీకార రికార్డ్ను చదివారా? సజ్జనార్: లేదు, శంషాబాద్ డీసీపీ బ్రీఫింగ్ చేశారు. కమిషన్: నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు త రలించకుండా ప్రెస్మీట్లో వివరాలెలా చెప్పారు? సజ్జనార్: ప్రాథమిక సమాచారాన్ని ప్రజలకు తెలి పేందుకే డీసీపీ ఆఫీస్లో ప్రెస్మీట్ నిర్వహించాం. కమిషన్: ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యమెందుకు? సజ్జనార్: 2019, సెప్టెంబర్ 6న ఉదయం 6:20 గం.కు ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించా రని శంషాబాద్ డీసీపీ తెలిపారు. కానీ, 2గం. ఆలస్యంగా 8:30గం.కు శంషాబాద్లో ఎఫ్ఐఆర్ నమో దుచేశారు. ఇలా ఎందుకయ్యిందో తెలియదు. కమిషన్: నిందితుల మరణ సమాచారాన్ని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయంత్రం 5:30 గంటలకు చెప్పారు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? సజ్జనార్: నాకు తెలియదు. కమిషన్: చటాన్పల్లిలోని సంఘటనా స్థలానికి మీరు ఎప్పుడు వెళ్లారు? ఎంత సేపు ఉన్నారు? సజ్జనార్: 2019, డిసెంబర్ 6న వెళ్లా. గంటన్నరసేపు ఉన్నా. ఆసమయంలో షాద్నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) శ్రీధర్ ఇన్చార్జిగా ఉన్నాడు. కమిషన్: మృతదేహాలపోస్ట్మార్టంపై సూచించారా? సజ్జనార్: లేదు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు లేఖ రాశాను అంతే. కమిషన్: ‘దిశ’కనబడటంలేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సజ్జనార్: నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాం. విచారణ పూర్తయిందో.. లేదో.. తెలియదు. కమిషన్: ఏసీపీ.. నిందితుల మృతదేహాల నుంచి డీఎన్ఏ సేకరించిన విషయం మీకు తెలుసా? సజ్జనార్: నాకు తెలియదు. కమిషన్: సంఘటన స్థలంలో ప్రెస్మీట్ కోసం టేబుల్, కుర్చీలు, మైక్ ఎవరు ఏర్పాటు చేశారు? సజ్జనార్: రెండేళ్ల క్రితం జరిగిన సంఘటన కదా గుర్తులేదు. కమిషన్: మీరు సంఘటన స్థలానికి వెళ్లకముందే అక్కడ టెంట్ వేసి ఉందా? సజ్జనార్: లేదు, మధ్యాహ్నం సమయంలో చూశా. సంఘటన స్థలం నుంచి 100–200 అడుగుల దూరంలో ఏర్పాటు చేశారు. 2 రోజుల్లో కలిపి సజ్జనార్ను 5 గంటల 16 నిమిషాల పాటు కమిషన్ విచారణ చేసింది. మొత్తం 160 ప్రశ్నలను త్రిసభ్య కమిటీ అడిగింది. ఎన్కౌంటర్ అంటే ఏంటో నాకు తెలియదు! ‘మిమ్మల్ని ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’అని 2019, డిసెంబర్ 6న పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటిని ఖండించారా?’అని త్రిసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. లేదు అని సజ్జనార్ సమాధానం ఇచ్చారు. అంటే మీరు ఇలా సంబోధించడాన్ని ఒప్పుకుంటున్నారా? అని అడగగా.. లేదు అన్నారు. ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’అంటే ఏంటని మళ్లీ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ఏమో దానర్థం ఏంటో నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. కాల్డేటా రికార్డ్స్ నోడల్ ఆఫీసర్ల విచారణ.. సజ్జనార్ విచారణ అనంతరం.. దిశ కేసులో పాల్గొన్న పోలీసులు, నిందితుల కాల్ డేటా, టవర్స్ వివరాలు, లొకేషన్స్ గురించి సంబంధిత నెట్వర్క్ అధికారులను కమిషన్ విచారించింది. బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ ఇంజనీర్ ఎన్. శ్రీనివాసులు, రిలయెన్స్ జియో నోడల్ ఆఫీసర్ జితేందర్, వొడా ఫోన్–ఐడియా ప్రత్యామ్నాయ నోడల్ ఆఫీసర్ పీ. జయలక్ష్మి, భారతీ ఎయిర్టెల్ చీఫ్ నోడల్ ఆఫీసర్ వీ.వెంకటనారాయనన్ను కమిషన్ తరుఫు న్యాయ వాది విరూపాక్ష దత్తాత్రేయ గౌడ విచారించారు. ప్రెస్మీట్లో తప్పులు చెప్పా.. చటాన్పల్లిలోని సంఘటన స్థలంలో 2019, డిసెంబర్ 6న మధ్యాహ్నం 3 గంటలకు వీసీ సజ్జనార్ ప్రెస్మీట్ నిర్వహించారు. కేసు వివరాలను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ నాలుగు భాషల్లో వివరించారు. దిశ వస్తువులు ఫోన్, పవర్ బ్యాంక్లు పొదల వెనకాల దొరికాయని తెలిపారు. అలాగే అదే ప్రెస్మీట్లో సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు వినియోగించిన తుపాకుల సేఫ్టీ లాక్స్ ఓపెన్ చేసి ఉన్నాయా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఎస్ ఉన్నాయని చెప్పారు. అలాగే బాధితురాలు, నిందితుల డీఎన్ఏ రిపోర్టులు వచ్చాయని చెప్పారు. వీటిపై కమిషన్ ఇవన్నీ ప్రెస్మీట్లో ఎలా తప్పుగా చెప్పారని ప్రశ్నించింది. ఆ సమయంలో చాలా మంది జనాలు గుమిగూడి ఉన్నారని, పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుంటే సడెన్గా తప్పుగా చెప్పేశానని కమిషన్కు సమాధానం ఇచ్చారు. సంఘటనా స్థలంలో మృతదేహాల పంచనామాలు జరుగుతున్నాయి? వస్తువుల రికవరీ జరుగుతోంది? ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో ప్రెస్మీట్ నిర్వహించడం అత్యవసరమని ఎలా అనుకున్నారని త్రిసభ్య కమిటీ అసహనం వ్యక్తం చేసింది. (చదవండి: Nalgonda: 4వ శతాబ్దంనాటి మహిషాసురమర్ధిని విగ్రహం గుర్తింపు) -
సీజ్ చేసిన.. తుపాకులెలా వాడారు?
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్ జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ముందు సోమవారం హాజరయ్యారు. త్రిసభ్య కమిటీ తరఫున న్యాయవాది కే. పరమేశ్వర్ విచారించారు. త్రిసభ్య కమిటీ సజ్జనార్ను అడిగిన ప్రశ్నలలో ప్రధానమైనవి.. కమిషన్: నందిగామ, ఆమన్గల్ పోలీస్స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ)లు వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ 2019, డిసెంబర్ 3న సీజ్ చేశారని రిమార్క్స్ కాలమ్లో నమోదు చేశారు. కానీ, డిసెంబర్ 6న ఎన్కౌంటర్లో ఇదే పిస్టల్ను వినియోగించారని తేలింది. ఇదెలా సాధ్యమైంది.? సజ్జనార్: తనిఖీ చేశాక సమాధానం ఇస్తా. కమిషన్: నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది 2019, నవంబర్ 29 రాత్రి 10 గం.కు అయితే.. మీరెలా 3 గంటల ముందే (7 గం.) మీడియాకు నేరం జరిగిన తీరును వివరించారు? సజ్జనార్: 2019, నవంబర్ 29న శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ సమస్యలపై స్టడీ ఉంటే వెళ్లా. అక్కడ్నుంచి క్యాంప్ ఆఫీస్కు వస్తుంటే శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాశ్రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. డీసీపీ కార్యాలయానికి రావాలన్నది ఫోన్ సారాంశం. అక్కడికి వెళ్లిన నాకు నిందితుల అరెస్ట్ గురించి డీసీపీ బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు చెప్పమన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు మీడియాకు వివరాలను తెలియజేశా. నేను ప్రత్యేకంగా ఈ కేసును పర్యవేక్షించలేదు. మార్నింగ్ బ్రీఫింగ్లో పాల్గొనేవాడిని. ‘దిశ’కేసుపై ఏర్పాటు చేసిన 9 బృందాలకు శంషాబాద్ డీసీపీ నేతృత్వం వహించారు. కమిషన్: నిందితుల కస్టడీ విచారణకు ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించారా? సజ్జనార్: నిందితుల కస్టడీ విచారణ సమయంలో అదనపు బలగాలు కావాలని 2019, డిసెంబర్ 2న డీసీపీ అభ్యర్థిస్తే.. అదనపు డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులను అపాయింట్ చేశా. నిందితుల తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఆ విభాగాన్ని ఆదేశించా. డీసీపీ అభ్యర్థన మేరకే ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఆయుధాలు కేటాయించాం. కమిషన్: ఆ 9 ఎంఎం పిస్టల్ ఎవరిది? సజ్జనార్: ఎన్కౌంటర్లో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ నందిగామ సబ్ఇన్స్పెక్టర్ నర్సింహకు జారీచేశారు. కానీ, ఆ సమయంలో నందిగామ పీఎస్కు వెంకటేశ్వర్లు ఎస్ఐగా పోస్టింగయ్యారు. దీంతో ఆ పిస్టల్ వెంకటేశ్వర్లు చేతికి వెళ్లింది. కమిషన్: స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ)ను ఎలా ఎంపిక చేస్తారు? వీళ్లు సీపీకి రిపోర్ట్ చేస్తారా? సజ్జనార్: సివిల్ ఫోర్స్కు చెందిన అనుభవజ్ఞులైన పోలీసులను ఎస్ఓటీలో నియమిస్తారు. సందర్భాన్ని బట్టి సీపీకి, స్థానిక స్టేషన్లలో రిపోర్ట్ చేస్తుంటారు. కమిషన్: సైబరాబాద్ సీపీ పరిధిలోనూ ప్రత్యేక ఆయుధాల నమోదు రిజిస్టర్ ఉంటుందా? సజ్జనార్: ఉంటుంది. ట్రాఫిక్, క్రైమ్ విభాగాల్లానే సైబరాబాద్ సీపీలో ఆర్మ్స్ రిజర్వ్ వింగ్ కూడా ఉంటుంది. కమిషన్: నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఇచ్చిన 9 ఎంఎం పిస్టల్ గురించి సైబరాబాద్ సీపీ రిజిస్టర్లో నమోదు చేశారా? సజ్జనార్: ఆయుధాల నమోదు ప్రక్రియకు ప్రత్యేకంగా సీఏఆర్ వింగ్ ఉంది. కొన్ని సందర్భాల్లో సీఏఆర్ నేరుగా స్టేషన్లకు ఆయుధాలను జారీ చేస్తుంది. కమిషన్: నందిగామ, ఆమన్గల్ స్టేషన్లకు కేటాయించిన ఆయుధాలను చివరిసారిగా ఎప్పుడు తనిఖీ చేశారు? ఎలాంటి నిర్ధిష్టమైన విధుల కోసం ఆయుధాలను కేటాయించారు? ఆయా వివరాలను రిజిస్టర్లో నమోదు చేశారా? సజ్జనార్: ఆయుధాల జారీ, తనిఖీ అంశాలను పర్యవేక్షించడానికి అదనపు డీసీపీ, సీఏఆర్ నేతృత్యంలో ప్రత్యేక వింగ్ ఉంది. కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో షాద్నగర్ ఏసీపీ వీ. సురేందర్తో సమావేశమయ్యారా? సజ్జనార్: కాలేదు. కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో శంషాబాద్ డీసీపీ కాన్ఫరెన్స్ హాల్లో మీరు సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా 9 బృందాలను ఏర్పాటు చేశారు. దీనిపై మీరేమంటారు? సజ్జనార్: లేదు, ఇది జరిగింది 2019, నవంబర్ 30న. కమిషన్: అంటే.. ఈ ఎంట్రీ తప్పంటారా? సజ్జనార్: దీనికి సురేందరే సమాధానం చెప్పాలి. కమిషన్: ఎస్కార్ట్ పోలీసులకు 6 పొడవైన ఆయుధాలను కేటాయించే ముందు వాటి అవసరం ఏముందని ప్రశ్నించారా? సజ్జనార్: లేదు, శంషాబాద్ డీసీపీ కోరితేనే జారీచేశా. కమిషన్: గతంలో మీరెప్పుడైనా అత్యాచారం, హత్య కేసుల్లో ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఇలాంటి ఆయుధాలను జారీ చేశారా? సజ్జనార్: ఒకసారి తనిఖీ చేసుకొని సమాధానమిస్తా. కోర్టుకు హాజరుకాకుండానే కస్టడీకి అనుమతి.. ‘దిశ’నిందితులు మహ్మద్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు కోర్టులో హాజరుపరచలేదని అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ షాద్నగర్ పీ.శ్యాంప్రసాద్.. కమిషన్కు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల భౌతిక హాజరు అత్యవసరమని తనకు అనిపించలేదని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 2న మధ్యాహ్నం సమయంలో పోలీసులు నిందితుల కస్టడీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని, అదే రోజు సాయంత్రం అనుమతి ఇచ్చామని తెలిపారు. అలాగే నిందితుల పంచనామాలు, సాకుల స్టేట్మెంట్లు కూడా తనకు సమర్పించలేదని, తహసీల్దార్కు సమర్పించారని స్పష్టం చేశారు. తహసీల్దార్ రిమాండ్ రిపోర్ట్ను అనుసరించే పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చానని వివరించారు. కాగా.. ఈ కేసులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిందితులను 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. పోలీసులు 15 రోజులు కస్టడీలో ఉంచుకున్నారన్నారు. చర్లపల్లి జైలర్ నిందితుల సంతకాలను అటాచ్ చేశాడు కాబట్టి.. తాను ఆ సంతకాలను నిర్ధారించుకోలేదని కమిషన్కు తెలిపారు. నిందితుల తరఫు నుంచి తనకి ఎలాంటి న్యాయపరమైన సలహా లేదా కస్టడీని వ్యతిరేకిస్తూ దరఖాస్తు అందలేదని వెల్లడించారు. -
‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో సాక్షుల నుంచి విచిత్ర సమాధానాలు వినిపిస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్స్ట్రక్షన్కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ ఓ పంచ్ సాక్షిని శుకవ్రారం విచారించింది. నేరానికి ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు, కేసు పూర్తిగా సందర్భానుసారాలపై ఆధారపడి ఉన్నప్పుడు.. అలాంటి పంచనామాకు ఎలాంటి అపఖ్యాతి లేని వ్యక్తులను పంచ్ విట్నెస్గా తీసుకెళతారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: కేటీఆర్ అలాగే ‘దిశ’ కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్కు.. షాద్నగర్ ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్, ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ పంచ్ సాక్షులుగా ఉన్నారు. గతంలో రాజశేఖర్ను విచారించిన కమిషన్ శుక్రవారం అబ్దుల్ రహుఫ్ను విచారించింది. సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం పోలీసులతో పాటు తాము కూడా వెళ్లామని, ఆ సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని తెలిపాడు. రాళ్లతో కొట్టారని త్రిసభ్య కమిటీ ముందు ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబ్దుల్ రహుఫ్ కొన్ని ప్రశ్నలకు మాత్రం అస్పష్టమైన సమాధానాలు చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఎవరి చేతుల్లో నుంచి ఎవరు తుపాకులు లాక్కున్నారు? మిగిలిన వాళ్లు ఎవరి మీద రాళ్లు విసిరారు? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తన కళ్లలో మట్టి పడిందని, అందుకే సరిగా చూడలేకపోయానని రహుఫ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నేడు, రేపు సెలవు కావడంతో సోమవారం ఉదయం అబ్దుల్ రహుఫ్ను విచారించి.. మధ్యాహ్నం సజ్జనార్ను విచారించే అవకాశం ఉందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వొకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. ‘దిశ’ ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల తరఫున కృష్ణమాచారి హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
దిశ కమిషన్ విచారణకు హాజరుకానున్న ఐపీఎస్ సజ్జనార్
-
వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల బాగోతం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖ కమిషన్ చేపట్టిన పాఠశాలల తనిఖీల్లో జూనియర్ కాలేజీలు నారాయణ, శ్రీ చైతన్యల అధిక ఫీజుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. రాష్ట్రంలోని పలు పాఠశాలపై విద్యాశాఖ కమిషన్ నాలుగు బృందాలు బుధవారం తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రొఫెసర్ నారాయణరెడ్డి, డాక్టర్ ఈశ్వరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పాఠశాలల యాజమాన్యాలపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ సంక్రాంతికి 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఫీజులు కట్టించుకున్నారంటూ విద్యార్థులు అధికారులతో ఎదుట వాపోయారు. టాయిలెట్లలో కనీస సౌకర్యాలు లేవని, ప్రతి ఏడుగురికి ఒక బాత్రూమ్ కేటాయించారని తెలిపారు. ఇంటర్ మొదటి ఏడాదికి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక గూడవల్లి శ్రీ చైతన్య కళాశాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీస వసతులు కూడా లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. తాగునీరు, బాత్రూమ్ కుళాయిలు లేకపోవటంతో కమిషన్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నారాయణ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని, జీవో 51ని కూడా యాజమాన్యం అమలు చేయడం లేదని వెల్లడించారు. నారాయణ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని కమిషన్ సభ్యులు సీఏవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంతేగాక కాలేజీల్లో సామాజిక దూరం అమలు చేయడం లేదని, కనీసం శానిటైజర్లు కూడా అందుబాటు ఉంచలేదన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారని మండిపడ్డారు. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మౌలిక వసతులు కూడా సరిగా లేని కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కళాశాలలు ఉల్లంఘించాయన్న ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. -
ఇక ఊరుకోరు.. రూ.కోటి జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరుకుంది. రానున్నది శీతకాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేస్తూ కొత్త ఆర్డినెన్స్ని తీసుకువచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఫర్ ఢిల్లీ-ఎన్సీఆర్ పేరిట దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నూతన నిబంధనల ప్రకారం కాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించనున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారితో పాటు పర్యావరణ కాలుష్యానికి పాల్పడేవారిపై కేసు నమోదు చేసే అధికారం కమిషన్కి ఉంది. అంతేకాక హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కూడా ఈ కమిషన్ పరిధిలోకి చేర్చుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: రాష్ట్రపతి భవన్ వద్ద తొమ్మిదేళ్ల బాలిక నిరసన) 18 మంది సభ్యులు.. మూడేళ్ల పదవి కాలం 18 మంది సభ్యులతో ఏర్పడనున్న ఈ కమిషన్కి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక 18 మంది సభ్యుల్లో పది మంది అధికారులు, బ్యూరోక్రాట్లు ఉండగా, మరికొందరు నిపుణులు, కార్యకర్తలు ఉండనున్నారు. వీరిని పర్యావరణ మంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పాటు మరో ముగ్గురు మంత్రులు, క్యాబినేట్ కార్యదర్శి మూడేళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. ఈ కమిషన్ వాయు నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు దానికి సంబంధించిన చట్టాలను అమలు చేస్తుంది. అలానే కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి పరిశోధన, ఆవిష్కరణల కోసం ఉప సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ఆర్డినెన్స్లో పేర్నొన్నది. పంట వ్యర్థాల దహనం, కాలుష్యానికి సంబసంధించిన అన్ని ఇతర అంశాలను కమిషన్ పరిశీలిస్తుంది. ఇక తన వార్షిక నివేదికలను కమిషన్ పార్లమెంటుకు సమర్పించనుంది. (చదవండి: ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం) కమిషన్కు విస్తృత అధికారాలు.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, దాని ఏజెన్సీలు, కమిషన్ ఆదేశాల మధ్య సంఘర్షణ విషయాలలో దీనికే ఎక్కువ అధికారాలుండటం విశేషం. ఈ కమిషన్కు విస్తృత అధికారాలు ఇవ్వబడ్డాయి. ఏదైనా ప్రాంగణాన్ని పరిశీలించడానికి, కాలుష్య యూనిట్లను మూసివేయడానికి.. విద్యుత్తు, నీటి సరఫరాను డిస్కనెక్ట్ చేయడానికి ఆర్డర్లు జారీ చేసే అధికారం కమిషన్కు ఉంటుంది. కమిషన్ ఏదైనా ఉత్తర్వు, ఆదేశాన్ని ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1 కోట్ల రూపాయల జరిమానా విధించవచ్చు. కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా వచ్చే అన్ని విజ్ఞప్తులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మాత్రమే ఉంటాయి. సంబంధిత ఆదేశాలపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయడానికి లేదా ఫిర్యాదు చేయడానికి ఇతర సంస్థలకు అధికారం ఉండదు. -
మహిళా సైనికాధికారుల కమిషన్ గడువు మరో నెల పెంపు
న్యూఢిల్లీ: మహిళా సైనికాధికారులకు ప్రత్యేకంగా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు తీర్పు మరో నెల రోజుల గడువునిచ్చింది. గత తీర్పులో ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో నిర్ణయం తుది దశలో ఉందనీ, కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే మిగిలి ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాల్లోని ప్రతి విషయాన్నీ తు.చ.తప్పకుండా పాటిస్తామని కేంద్రం పేర్కొంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. లింగ వివక్షను నిర్మూలించేందుకు మహిళాసైనికాధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల లోపు పర్మనెంట్ కమిషన్ ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. -
క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్
బెంగళూర్ : ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కమీషన్ రూపంలో ఓలా, ఊబర్లు అధికంగా గుంజేస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు వాపోతున్న క్రమంలో వారికి ఊరట ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో రైడ్కు క్యాబ్ ఆపరేటర్లు ప్రస్తుతం 20 శాతం కమీషన్ వసూలు చేస్తుండగా దాన్ని 10 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఆయా సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించడం ఇదే తొలిసారి. మరోవైపు క్యాబ్ ఆపరేటర్ల రాబడిపై రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లెవీని విధించవచ్చని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. నూతన మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు రానున్న వారంలో ముసాయిదాను విడుదల చేస్తామని రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. -
ఈ ఏడాది 13.5 శాతం వాటా లక్ష్యం
హైదరాబాద్: భారత ఎయిర్ కండీషనర్ల మార్కెట్లో బ్లూ స్టార్కు ప్రస్తుతం 12.8 శాతం వాటా ఉంది. 2019–20లో 13.5 శాతం వాటాను లక్ష్యంగా చేసుకున్నామని కంపెనీ జేఎండీ బి.త్యాగరాజన్ మంగళవారం వెల్లడించారు. నూతన శ్రేణి ఏసీలను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘రూమ్ ఏసీల విక్రయాలు అన్ని బ్రాండ్లు కలిపి 2018–19లో 55 లక్షల యూనిట్లు నమోదు కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే బ్లూ స్టార్ వృద్ధి రేటు 15 శాతం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో బ్లూ స్టార్ ప్లాంటు 2021–22లో సిద్ధం కానుంది. ఎక్స్క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 200 నుంచి 250కి చేర్చనున్నాం’ అని వివరించారు. -
గోవుల కమిషన్కు ఆమోదం
న్యూఢిల్లీ: ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధి కోసం కొత్తగా ఓ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పేరుతో ఏర్పాటయ్యే ఈ కొత్త కమిషన్ ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధికి సబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుందనీ, దీని ద్వారా దేశీయ జాతులకు చెందిన పశుసంపద పెరుగుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు. రైతులు, మహిళల ఆదాయం పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయ మార్కెట్ మౌలిక నిధి (ఏఎంఐఎఫ్)ను రూ. 2 వేల కోట్లతో సృష్టించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. నాబార్డ్ ద్వారా సృష్టించే ఈ నిధి గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, క్రమబద్ధీకరించిన హోల్సేల్ మార్కెట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడనుంది. సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణకు ఆమోదం సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 10 లక్షల వరకు జరిమానా లేదా ఈ రెండూ కలిపి విధించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా హరియాణాలో ఉన్న ఎన్ఐఎఫ్టీఈఎం, తమిళనాడు తంజావూరులోని ఐఐఎఫ్పీటీలకు జాతీయ విద్యా సంస్థల హోదా లభిస్తుంది. ప్రసార భారతికి వచ్చే మూడేళ్లలో వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల కోసం రూ. 1,054 కోట్లను కేటాయించనున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో సవరించిన ఆఫీస్ మెమొరాండం (ఓఎం)కు ఆమోదం తెలిపింది. -
పింఛనులో కాకినాడ జమ్మభూమి కమిటీ కనిషన్
-
ఓబీసీ ఉప వర్గీకరణకు దేశవ్యాప్త సర్వే
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీలు) జనాభా అంచనా వేసేందుకు దేశవ్యాప్త సర్వే చేపట్టాలని జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి కమిషన్ నిర్ణయించింది. నమ్మకమైన ఏజెన్సీ ద్వారా నిర్వహించే ఈ సర్వేకు రూ.200 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ఓబీసీల కేంద్ర జాబితాలో 2,600కు పైగా కులాలున్నాయి. వీరి జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓబీసీ జన గణన చేపట్టలేదు. ఓబీసీ కులాల జనాభాపై కచ్చితమైన లెక్క తేలాలంటే జాతీయ స్థాయి సర్వే తప్పనిసరి. పది లక్షలకు పైగా కుటుంబాల్లో జరిపే ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నాం. 2011 సామాజిక–ఆర్థిక జనగణనకు కేటాయించిన బడ్జెట్ను బట్టి ఓబీసీ సర్వేకు రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని కమిషన్ తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు అన్ని కులాల వారికి సమానంగా దక్కేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించే ఉద్దేశంతో కేంద్రం 2017లో జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర బీసీ కమిషన్ల, వివిధ కుల సంఘాలు, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపింది. -
‘భగీరథ’లో సీఎంకు 6% వాటా
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కమిషన్ భగీరథలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వాటా ఆరు శాతం. ప్రాజెక్టు మొత్తం ఖర్చులో ఆరు శాతం కమిషన్ తీసుకుని ఆయన కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. రాష్ట్రంలో సగటున కోటి ఇళ్లు ఉంటే నాలుగున్నరేళ్లలో కనీసం లక్ష ఇళ్లకు కూడా భగీరథ నీళ్లు ఇవ్వలేదు. కమిషన్ డబ్బుతోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ చలవే. ఆమె లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని కేసీఆర్ బహిరంగం గానే చెప్పారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిం ది 33 శాతం ఓట్లే. కేసీఆర్ను 65 శాతం మంది ఓటర్లు తిరస్కరించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. దళితుడిని సీఎం చేస్తామన్న మొదటి హామీతోనే ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టారు. ప్రజా స్వామ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించే జర్నలిస్టులు సహా అన్ని వర్గాలను మోసగించి రాజకీయ విలువలకు పాతరేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను కాపీ కొట్టి చవకబారుతనాన్ని చాటుకున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడిగా కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారు’ అని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేసీఆర్కు ఓటేస్తే ప్రజల ఉనికికే ప్రమాదమని, ఆ పార్టీకి మళ్లీ ఓటేస్తే రాష్ట్రంలో బతకడమే కష్టమవుతుందన్నారు. మళ్లీ అధికారం తమదేనని చెప్పుకున్న కేసీఆర్కు మహాకూటమి అంటే వణుకు పుడుతోందన్నారు. కేసీఆర్ తాగి సోయి లేకుండా సోని యాపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ దొంగ పాస్పోర్టులు అమ్ముకునే సమయంలో తాను సైన్యం లో దేశ సరిహద్దులో భద్రతా దళంలో ఉన్నానని, ఆయన బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్హౌస్కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకున్నాఎంఐఎం మద్దతివ్వడమా? తమిళనాడు తరహాలో రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తాన ని చెప్పిన కేసీఆర్... వాటిని అమలు చేయకుండా ఆయా వర్గాలను మోసం చేశారని ఉత్తమ్ ఆరోపిం చారు. ఎంఐఎం అహంకారంతో మాట్లాడుతోందని, టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిస్తోందో ఆ పార్టీ స్పష్టం చేయాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వనందుకు టీఆర్ఎస్కు ఆ పార్టీ మద్దతు పలుకుతోందా? అని ప్రశ్నించారు. సూట్కేసులు తప్ప ఏమీ గుర్తుకు రావు తెలంగాణ రాష్ట్రం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడుతాయని సోనియా భావించారని, కానీ వారిని కేసీఆర్ పాతాళంలోకి నెట్టేసినందుకే ఆమె కడుపు తరుక్కుపోయిందని, ఆమెను విమర్శించే స్థాయి కేసీఆర్కు లేదన్నారు. ప్రతి దాంట్లో కమిషన్ తీసుకునే కేసీఆర్కు సూట్కేసులు తప్ప మరే విషయాలు గుర్తుకు రావన్నారు. ఓటమి భయంతో సోయి తప్పి ఆయన మాట్లాడుతున్నారన్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్లాగా తాను బ్రోకర్లా బతకలేదని, దేశ భద్రతా దళంలో ప్రాణాలకు తెగించి యుద్ధ విమానాలు నడిపానన్నారు. విభజన హామీలపై గళమెత్తరేం? టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తి చేయలేదని, గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితంగానే రాష్ట్రంలో కరెంటు వస్తోందన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే చోట ముందుగా పనులు చేపట్టి భారీగా నిధులు ధుర్వినియోగం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్లా మార్చారని, సాగునీళ్లు ఇవ్వకుండా వచ్చిన వాళ్లందరినీ అక్కడికి తీసుకెళ్లి ఆహా, ఓహో అనిపిస్తున్నారన్నారు. విభజన హామీలపై గళమెత్తే సాహసం కేసీఆర్ చేయరని, మోదీ పేరు చెబితేనే కేసీఆర్ లాగు తడుస్తుందన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ అమలును కేసీఆర్ అటకెక్కించారన్నారు. గెలిచినా ఓడినా నాదే బాధ్యత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం గాంధీభవన్లో ఉత్తమ్కుమార్రెడ్డిని కలిశారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్ను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించారు. డిసెంబర్ 11 తర్వాత అన్ని వ్యవహారాలు సచివాలయం నుంచే నిర్వహిస్తారా అని అడిగారు. ఉత్తమ్ స్పందిస్తూ... ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా నాదే బాధ్యత. డిసెంబర్ 11 తర్వాత గాంధీభవన్కు రాను’అని అన్నారు. ఉత్తమ్కుమార్ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉత్తమ్ సచివాలయానికే వెళ్తారు కదా! అని వారు అనుకున్నారు. జర్నలిస్టుల ఇళ్లపై కోర్టు కేసుల్లేవు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని, డబుల్, ట్రిబుల్ బెడ్రూంల ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి కేసుల్లేవని, ఒక సొసైటీకి సంబంధించిన కేసు మాత్రమే సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. అందులో అన్ని వర్గాలు ఉన్నాయని, అది జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించిన కేసు కాదన్నారు. డిసెంబర్ 12న ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జర్నలిస్టులకు 18 వేల ఇళ్లు, స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కుటుంబాలకు విద్య, వైద్య పథకా లు అమలు చేస్తామన్నారు. తన భార్య పద్మావతి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతోనే అధిష్టానం టికెట్ ఇచ్చిందన్నారు. తమకు పిల్లలు లేరని, రాష్ట్ర ప్రజలే తన కుటుంబమన్నారు. తమ జీవితం ప్రజాసేవకే అంకితం చేశామన్నారు. -
.. ఇది క్షమార్హం కాదు!!
ఆగ్రహోదగ్రులైన జనాన్ని చల్లార్చడానికి విచారణ కమిషన్లు మత్తు మందుగా పనికొస్తాయని విఖ్యాత న్యాయ కోవిదుడు స్వర్గీయ జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ కమిషన్లకు నేతృత్వం వహించేవారిని ఎంపిక చేయటం మొదలుకొని జరిగే మొత్తం ప్రక్రియంతా సంశయాత్మక క్రీడ అని కూడా ఆయన చెప్పారు. ఏం చేయడానికైనా సిద్ధపడే రిటైర్డ్ న్యాయమూర్తుల దురాశను ఆయన చెరిగిపారేశారు. మూడేళ్లక్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్ర వరంలో తొక్కిసలాట జరిగి 29 నిండు ప్రాణాలు బలైన ఉదంతంపై నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ సమర్పించిన నివేదిక చూస్తే జస్టిస్ కృష్ణయ్యర్ అభిప్రాయాలు అక్షర సత్యాలని అర్ధమవుతుంది. సాధారణంగా కమిషన్లు ఏర్పాటు చేసేటపుడు ప్రభుత్వాలు చాలా విష యాలు చెబుతాయి. జరిగిన ఉదంతానికి దారితీసిన పరిస్థితులేమిటో, వాటికి బాధ్యులెవరో, భవి ష్యత్తులో ఈ మాదిరి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి తీసుకోదగిన చర్యలేమిటో సూచించటం తదితరాలు అందులో ఉంటాయి. మూడేళ్లపాటు సాగిన విచారణలోఎందరో పాల్గొని అనేక అంశాలను జస్టిస్ సోమయాజులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాటి ప్రమాదంలో గాయాలపాలైనవారితో, మరణించినవారి కుటుంబసభ్యులతో అఫిడవిట్లు దాఖలు చేయించారు. ఏం జరిగుంటే ఈ విషాదాన్ని నివారించటం సాధ్యమయ్యేదో సవివరంగా చెప్పారు. పుష్కరాలకు భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నామంటూ వందల కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం తగిన సంఖ్యలో అంబులెన్స్ల మాట అటుంచి, కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోవడాన్ని ఎత్తిచూ పారు. పైగా నిబంధనలు అతిక్రమించి ఘటనాస్థలికి సమీపంలో పలు వీఐపీ వాహనాలు, ఇతర వాహనాలు పార్క్ చేసిన తీరును వెల్లడించారు. ఊరునిండా పద్మవ్యూహాన్ని తలపించేలా బారికేడ్లు పెట్టి ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిని కల్పించిన వైనాన్ని వెల్లడించారు. వీటన్నిటికీ ఆధారాలుగా వీడియోలు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్లు కమిషన్కు సమర్పించారు. వాదనలన్నీ విని, వీరందరూ సమర్పించిన నివేదికలను పరిశీలించి చివరాఖరికి జస్టిస్ సోమయాజులు కమిషన్ తేల్చిందేమిటన్నది చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి... పుష్కర ఏర్పాట్లతో, నిర్వహణతో, ఆనాటి ఘటనతో ఏమాత్రం సంబంధంలేని వారిపై బురదజల్లడానికి కమిషన్ చూపించిన ఉత్సాహం దిగ్భ్రమగొలుపుతుంది. పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసలాటకు కారణాలేమిటో అక్కడ విధులు నిర్వహించిన హోంగార్డు స్థాయి ఉద్యోగి సైతం చెప్పగలడు. రాజమహేంద్రవరం పరిసరాల్లో దాదాపు 30 ఘాట్లు ఏర్పాటు చేశామని, ఎన్ని లక్షలమందైనా సునాయాసంగా స్నానాలు చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఒక్క పుష్కరఘాట్ మినహా ఇతర ఘాట్లలో వాస్తవానికి అలాంటి పరిస్థితే ఉంది. ఉన్నవాటిలో పుష్కరఘాట్ చిన్నది. అయినా అక్కడ మాత్రమే ఇంత భారీయెత్తున జనం ఎందుకు గుమిగూడారన్న అంశంపై కమిషన్ దృష్టి సారించి ఉంటే ఎన్నో అంశాలు వెలుగు లోకొచ్చేవి. వేకువజామున 6.26 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉన్నదని, ఆ సమయంలో స్నానం చేస్తే ఏడేడు జన్మాల్లో చేసిన పాపాలన్నీ పోతాయని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం భారీయెత్తున ప్రచారం చేసింది. ఆ ముహూర్తానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు తమ తమ కుటుంబాలతో స్నానానికి తయారయ్యారు. చేస్తే చేశారు... వీరంతా వీఐపీల కోసం కేటాయించిన విశాలమైన సరస్వతి ఘాట్ను కాదని, వైశాల్యంలో చిన్నదిగా ఉండే ఈ పుష్కరఘాట్కు పొలోమంటూ ఎందుకు పోవాల్సివచ్చిందో కమిషన్ అడగలేదు. ప్రభు త్వంవైపు నుంచి ఎవరూ చెప్పలేదు. సందేహాలే విజ్ఞానానికి బాటలు పరుస్తాయంటారు. కమిషన్కు ఈ విషయంలో సందేహం రాకపోవడం వల్ల అనేక అంశాలు మరుగునపడ్డాయి. పుష్కర సంరం భాన్ని, ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా స్నానం చేస్తున్న దృశ్యాలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రీకరించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఆ దృశ్యాల్లో జనసందోహం భారీయెత్తున కనబడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు కుటుంబాన్ని పుష్కరఘాట్కు తీసుకొచ్చారు. గోదావరి స్టేషన్లో దిగేవారు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే భక్తులు వేర్వేరు‡ఘాట్లకు పోతే ఇక్కడ జనం తక్కువవుతారన్న ఆలోచనతో పోలీసులు, ఇతర సిబ్బంది సాయంతో అందరినీ పుష్కర ఘాట్కు మళ్లించారు. ఆ విధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తెల్లారుజామున 4.30 మొదలుకొని 8 గంటల సమయం వరకూ ఆ ఘాట్ వెలుపల పడిగాపులు పడ్డారు. ఇంతమంది భక్త జనం కెమెరా ఫ్రేంలో అద్భుతంగా కనబడి ఉండొచ్చుగానీ, అది వారందరికీ శాపంగా మారింది. బాబు అక్కడినుంచి నిష్క్రమించగానే, అంతవరకూ అక్కడున్న బందోబస్తు మాయమైంది. ఆ ఘాట్కున్న ఒకే ఒక ప్రవేశద్వారాన్ని తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో గాయ పడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా సమీపంలో ఎక్కడా మంచినీరు లేని తీరును చాలామంది మీడియాకు ఆ వెంటనే వివరించారు. అలా నీళ్లు అందించి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యేదని చెప్పారు. ఆ దరిదాపుల్లో అంబులెన్స్ల జాడలేదని, చేతులపై మోసుకెళ్లామని వివరించారు. పైగా సీసీ టీవీ ఫుటేజ్గానీ, నేషనల్ జియోగ్రఫిక్ చానెల్ కోసం తీసిన వీడియోగానీ కమిషన్ ముందుకు రానేలేదు. మూడేళ్ల తర్వాత సమర్పించిన నివేదికలో ఇలాంటి కీలకమైన అంశాలు లేవు సరిగదా పంచాంగకర్తలు మొదలుకొని ప్రతిపక్షాల వరకూ టోకున అందరినీ ‘దోషుల్ని’ చేసిన వైనం, ప్రజలనూ, మీడియాను బాధ్యులను చేసిన తీరు విస్మయపరుస్తుంది. తనకనుకూలంగా అన్ని వ్యవస్థలనూ దిగజార్చటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఆఖరికి విచారణ కమిషన్లపై జనంలో కొద్దో గొప్పో ఉండే విశ్వసనీయతను కూడా దారుణంగా దెబ్బతీశారని నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఇది క్షమార్హం కాదు. -
వీఐపీ ఘాట్లో ఉండాల్సిన సీఎం.. : శివస్వామి
సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు కారణాలు వివరిస్తూ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తప్పుపట్టారు. భక్తుల మూఢనమ్మకాలు, పంచాంగ కర్తలు, స్వామిజీలు, మీడియా వల్లే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగిందంటూ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ వ్యవహారాన్ని దాచేందుకే.. పుష్కరాల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారన్న శివస్వామి.. పుష్కరాల్లో బోయపాటి శ్రీను డాక్యుమెంటరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయినా పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్లో ఉండాల్సిన ముఖ్యమంత్రి సామాన్యులు స్నానం చేసే ఘాట్లో ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఘటనను స్వామిజీలు, మీడియాపైకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలదే తప్పు అన్నట్లుగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని స్వామిజీల తరపున ఖండిస్తున్నామన్నారు. కాగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు అతి ప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. -
రేషన్ డీలర్ల కమీషన్ పెంపు
సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్కు రూ.20గా ఉన్న కమీషన్ రూ.70కి పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం వెల్లడించారు. వచ్చే నెల 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో 2015 అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.91 కోట్ల రేషన్ కార్డులకు ఐదు కేజీల బియ్యం చొప్పున ఇస్తున్నారు. అయితే అప్పట్నుంచి డీలర్లకు కమీషన్ కింద క్వింటాల్కు రూ.70 ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సుమారు రూ.500 కోట్లవరకూ ఉన్న బకాయిలను డీలర్లకు చెల్లించనున్నట్లు చెప్పారు. రేషన్ డీలర్ల సమస్యల అధ్యయనంపై మంత్రులు హరీశ్రావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలతో సీఎం కేసీఆర్ ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం ఈటల మాట్లాడుతూ..డీలర్ల కమీషన్ పెంపుపై ఇప్పటికీ నాలుగు సమావేశాలు నిర్వహించామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతుందన్నారు. డీలర్లు లేని రేషన్ షాపులకు డీలర్లను భర్తీ చేస్తామని, కొత్త గ్రామపంచాయతీలన్నింటికీ రేషన్ షాపులు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జీపీఎస్ సిస్టమ్ ద్వారా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసి లీకేజీలు అరికట్టగలిగామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా అక్రమాలకు ముకుతాడు వేశామన్నారు. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత కొంతమందికి రేషన్ అందడంలేదని విజ్ఞప్తులు రావడంతో వేలిముద్రలతో పాటు, కంటి ఐరిష్ ద్వారా లేదంటే మాన్యువల్గా బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డీలర్ల సంఘం హర్షం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పనిచేసిన మంత్రి ఈటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీలర్లు ఎర్రమంజిల్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. -
హంగూ..ఆర్భాటాలకే టీడీపీ సర్కార్ పెద్దపీట
-
జయ మరణం; ‘అమ్మ’ డ్రైవర్ కీలక సమాచారం
చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా కమిషన్ జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్తో పాటు జయలలిత దగ్గర చాలాకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్న కన్నన్ని వేర్వేరుగా విచారించింది. శశికళ, వైద్యుడు, కన్నన్ చెప్పిన అంశాలకు పొంతన లేదని తెలిపింది. శశికళ, శివకుమార్ల వర్షన్... ‘ఆ రోజు అనగా 2016, సెప్టెంబర్ 22న అమ్మ(జయలలిత) బెడ్పై కూర్చుని ఉంది. అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో డ్రైవర్ కన్నన్, జయ వ్యక్తిగత భద్రతా అధికారి ‘అమ్మ’ను బెడ్ మీద నుంచి వీల్ చైర్లోకి మార్చడానికి ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. దాంతో రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్కు ఫోన్ చేసామని’ చెప్పారు. కన్నన్ చెప్పిన వివరాలు... ‘అమ్మ’ డ్రైవర్ కన్నన్ మాత్రం శశికళ, శివకుమార్లు చెప్పిన దానికి విరుద్ధమైన విషయాలు చెప్పాడని కమిషన్ వెల్లడించింది. కన్నన్ 1991 నుంచి జయలలిత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కన్నన్ జయలలితను ఆస్పత్రిలో చేర్చిన రోజు జరిగిన సంఘటన గురించి కమిషన్తో చెప్పిన వివరాలు... ‘నేను ‘అమ్మ’ గదిలోకి వెళ్లేసరికి ఆమె చైర్లో కూర్చుని ఉన్నారు. అప్పటికే ‘అమ్మ’ స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. పెన్ను కాప్ కూడా తీసి ఉంది. ‘చిన్నమ్మ’ నాతో వెంటనే వెళ్లి ఒక వీల్ చైర్ తీసుకు రా, అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. కొంతసేపటి తరువాత నేను, పీఎస్ఓ వీరపెరుమాల్ చైర్ తీసుకువచ్చి, అమ్మను ఆ చైర్లో కూర్చొపెట్టాము. రెండడుగులు వేసామో, లేదో అమ్మ చైర్ నుంచి కింద పడింది. వెంటనే నేను, వీరపెరుమాల్ ‘అమ్మ’ను లేపడానికి ప్రయత్నించాము. కానీ మా వల్ల కాలేదు. దాంతో స్ట్రెచర్ తీసుకువస్తే బాగుంటుందని భావించామ’ని తెలిపాడు. గంట సేపు డాక్టర్ అదృశ్యం... అంతేకాక కన్నన్ చెప్పిన మరో ఆసక్తికర అంశమేంటంటే.. ‘నేను రాత్రి 8.30 గంటల సమయంలో డాక్టర్ శివకుమార్ను పోయెస్ గార్డెన్లో చూశాను. కానీ కొంతసేపటి తరువాత ఆయన బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన తిరిగి ఎప్పుడు పోయెస్ గార్డెన్కి వచ్చాడో నాకు తెలియదు. కానీ నేను అమ్మ గదిలోకి వెళ్లినప్పుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. అంటే దాదాపు గంట తర్వాత అంటే 9.30 గంటలకు అతను తిరిగి వచ్చుంటాడని తెలిపాడు. అంతేకాక ‘ఆ రోజు(సెప్టెంబర్ 22) రాత్రి 10 గంటల ప్రాంతంలో కారును సిద్ధంగా ఉంచమని పీఎస్వో పెరుమాళ్కు చెప్పాను. అయితే లక్ష్మి (జయ ఇంట్లో పనిమనిషి) పెద్ద కారు అయితే బాగుంటుందని తనతో చెప్పింద’ని తెలిపాడు. అయితే కన్నన్ చెప్పిన ఈ రెండు విషయాలను శశికళ, శివకుమార్లు చెప్పలేదని కమిషన్ పేర్కొంది. అంతేకాక పోయెస్ గార్డెన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అయితే సెప్టెంబర్ 22 నాటి దృశ్యాలు అందులో రికార్డయ్యాయో, లేదో తనకు తెలియదని కన్నన్ కమిషన్తో చెప్పాడు. -
నన్నపనేని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల రక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. రాజకుమారి బుధవారం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి సంఘటనలు విస్తుగొలిపాయని అన్నారు. మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. టీవీ సీరియల్స్ల ప్రభావం వల్లనే మహిళల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని పేర్కొన్నారు. సీరియల్స్ మీద సెన్సార్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల నుంచి పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని నన్నపనేని డిమాండ్ చేశారు. -
నకిలీ కమిషన్ వ్యాపారి అరెస్ట్
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో లైసెన్సులు లేకుండా రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న నకిలీ కమీషన్ వ్యాపారిని మార్కెట్ అధికారులు శనివారం వల పన్ని పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బంజర గ్రామానికి చెందిన చెవిటి రాము, కొంతకాలంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కమీషన్ వ్యాపారిగా చెలామణవుతున్నాడు. రైతు పంటను దడవాయిలు కాంటా పెట్టి కాంటా చిట్టాల్లో నమోదు చేస్తారు. ఆ చిట్టా పుస్తకాలను మార్కెట్ కమిటీ లైసెన్స్డ్ దడవాయిలకు ఇచ్చి కాంటాలు పెట్టిస్తారు. ఆ కాంటా పుస్తకాలకు ఇతడు నకిలీవి సృష్టించి మోసగిస్తున్నాడు. ఇతడిని జనవరి 3న పత్తి కొనుగోళ్లలో మార్కెట్ అధికారులు గుర్తించారు. అతడిని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీకు పర్సన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్(జేసీ) టి.వినయ్కృష్ణారెడ్డి వద్ద హాజరుపరిచారు. జేసీ హెచ్చరించి వదిలేశారు. అయినప్పటికీ ఆ నకిలీ వ్యాపారి మళ్లీ వచ్చాడు. కామేపల్లి మండలం నెమిలిపురి గ్రామానికి చెందిన బన్సీలాల్ అనే రైతు నుంచి మిర్చి కొనుగోలు చేస్తూ ఫిబ్రవరి 28న మరోసారి పట్టుబడ్డాడు. ఆ రైతును కాంటాల్లో మోసగించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. జేసీ ఆదేశాలతో ఆ నకిలీ వ్యాపారిని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నకిలీ కాంటా చిట్టా పుస్తకాలను, ఖమ్మంలోగల దుకాణం నుంచి డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నారు. ఇతడికి సహకరిస్తున్న నకిలీ గుమస్తా సుజిత్ను కూడా మార్కెట్ అధికారులు విచారిస్తున్నారు. మరో నకిలీ వ్యాపారి గుర్తింపు రాము మాదిరిగానే, మరో నకిలీ కమీషన్ వ్యాపారిని కూడా మార్కెట్ అధికారులు గుర్తించారు. ఇతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సమాచారం. మార్కెట్ సమీపంలోగల ఇతడి దుకాణాన్ని సీజ్ చేసేందుకు మార్కెట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ఈ నకిలీ కమీషన్ వ్యాపారులపై మార్కెట్ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా మార్కెటింగ్ అధికారి రత్నం సంతోష్కుమార్ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇద్దరిని, వీరికి సహకరిస్తున్న వారిని గుర్తించామన్నారు. నకిలీ కాంటా చిట్టాలను ప్రింట్ చేస్తున్న వారిని కూడా గుర్తించినట్టు చెప్పారు. వీరిపై ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
చౌకగా పనిచేయలేం
ఈ–పాస్ వచ్చాక రేషన్ షాపుల నిర్వహణ వ్యయ ప్రయాసగా మారింది. అదనపు పనివారు, అన్లోడింగ్చార్జీలు, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. డీడీలు కట్ట డం నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు డీలర్లు చెబుతున్నారు. కమీషన్ చాలా తక్కువగా ఉందని, క్వింటాల్ బియ్యానికి రూ.150కి పెంచాలని, నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరించాలని కోరుతున్నారు. కురబలకోట : చౌక దుకాణాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని డీలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీడీలు కట్టడం నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నియోజక వర్గంలో 150 మంది డీలర్లు ఉన్నారు. నెలలో 15 రోజుల సరుకులు ఇవ్వడానికే సమయం సరిపోతోందని చెబుతున్నారు. ప్రభు త్వ పథకాల అమలులో భాగస్వామం కావాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కమీషన్ పెంచాలని, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్కు సరఫరా చేస్తున్న సరుకుల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ–పాస్ వచ్చాక పని భారం పెరిగి వ్యయప్రయాసలు ఎక్కువయ్యాయని వాపోతున్నారు. కనీస ఆదాయం లేక కాలం గడుపుతున్న తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యయప్రయాసలు రేషన్ షాపుల నిర్వహణ వ్యయ ప్రయాసగా మారింది. షాపు బాడుగ, కూలీల ఖర్చు, కరెంట్ చార్జీలు, అదనపు పనివారు, అన్లోడింగ్చార్జీలు, బ్యాంకు చలానాతో పాటు ఇతర ఖర్చులుతడిసి మోపెడవుతున్నాయి. డీలర్కు ఇచ్చే కమీషన్ కూడా తక్కువే. విధిలేక వదలలేక చేస్తున్నాం. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతాం –గోపాల్ రెడ్డి, డీలర్ల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు కమీషన్ పెంచాలి క్వింటాల్ బియ్యానికి రూ.70 కమీషన్ ఇస్తున్నారు. దీన్ని రూ.150కి పెం చాలి. కూలీలతో పాటు షాపు నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. కార్డుకు సర్చార్జీ కింద రూ.10 ఇవ్వాలి. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ప్రభుత్వ పథకాల్లో సహకరిస్తున్నా కష్టానికి తగ్గ ఫలితం లేదు –ఎస్ఎం.బాషా, డీలర్ల సంఘం నాయకుడు, కురబలకోట -
జడ్జీల వేతనాల పెంపుపై కమిషన్
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. వారి వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని అధ్యక్షతన శుక్రవారం జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.బసంత్ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు. ఢిల్లీకి భారీ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఎగ్జిబిషన్ మార్కెట్లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్–పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు. ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే జాతీయ గ్రామీణ తాగు నీటి పథకం(ఎన్ఆర్డీడబ్యూపీ) పునర్వ్యవస్థీకరణకు 2017–18 నుంచి 2019–20 వరకూ రూ. 23,050 కోట్లు ఖర్చు చేసేందుకు ఓకే చెప్పింది. -
పెద్దాపురంలో అతిపెద్ద టైల్స్ ఫ్యాక్టరీ
హైదరాబాధ్: నిర్మాణరంగ దిగ్గజంఅపర్ణ గ్రూప్లో భాగమైన అపర్ణఎంటర్ప్రైజెస్ తాజాగా ప్రీమియం టైల్స్ తయారీ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తూ. గోదావరి జిల్లా కాకినాడ దగ్గర్లోని పెద్దాపురం వద్ద రూ.320 కోట్లతో టైల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. అత్యాధునికంగా నెల కొల్పిన ఈ ప్లాంట్లో డబుల్ చార్జ్ విట్రిఫైడ్ ఫ్లోర్ టైల్స్ ఉత్పత్తి చేయనున్నట్లు గ్రూప్ మంగళవారం వెల్లడించింది. ప్రత్యేక బ్రాండ్ కింద వీటిని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా అపర్ణ గ్రూప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ కంపెనీ తదుపరి దశ అభివృద్ధి కోసం, అలాగే వెనుకబడిన ప్రాజెక్టుల అనుసంధానంపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని చెప్పారు. ఈ టైల్ యూనిట్లో రోజుకు 1.75 లక్షల ఒక చదరపు అడుగు పలకలను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో రూ 200 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇది రెట్టింపు అవుతుందని, సుమారు రూ. 600 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామని రెడ్డి చెప్పారు. మరోవైపు రిటైల్, ఎంటర్టైన్మెంట్ మరియు వాణిజ్య స్థలంలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నామని చెప్పారు. కొత్తగా అపర్ణ సరోవర్ జెనిత్ పేరుతో మరో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును నల్లగండ్లలో ప్రారంభిస్తున్నట్లు రెడ్డి తెలిపారు. సుమారు పాతిక ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రాజెక్టులో 2,475 యూనిట్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. సరసమైన హౌసింగ్ ప్రాజెక్ట్ లో రూ. 20 లక్షల నుంచి రూ. 45 లక్షల రేంజ్లో 800 నుంచి 1,500 చదరపు అడుగుల లో అపార్టుమెంట్లను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ఐటీ హబ్కు దగ్గర్లోని అపర్ణ సరోవర్ జెనిత్ వీటిల్లో ఒకటి అని చెప్పారు. కాగా రెండు దశాబ్దాల హైదరాబాద్ ఆధారిత రియల్ ఎస్టేట్ కంపెనీ సీపీవీస్ విండోస్, సానిటరీవేర్, 12 రెడీ మిక్స్ కాంక్రీట్ యూనిట్లు, ఇటుక తయారీ, తలుపులు మరియు కిటికీల తయారీ సహా పలు వెనుకబడిన అనుసంధానం ప్రాజెక్టులను చేపట్టింది. గ్రీన్ ఫీల్డ్ తయారీ యూనిట్లో విభిన్నంగా వీటిని తయారు చేయనుంది. దీంతోపాటు గుజరాత్లో తన ఉత్పత్తుల శాఖను విస్తరించేందుకు టైల్ యూనిట్ కొనుగోలు చేయడానికి లేదా వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తోంది. టైల్స్ పంపిణీ సంస్థగా 1990లో కార్యకలాపాలు ప్రారంభించిన తమ సంస్థ ప్రస్తుత టర్నోవరు రూ. 1,300 కోట్ల స్థాయిలో ఉందని ఎస్ఎస్ రెడ్డి చెప్పారు. -
విచారణ ’పుష్కర’కాలం కొనసాగుతోంది
-
శంకర్దాదాలు!
కాసులకోసం కడుపుకోత అవసరం లేకపోయినా 22మందికి సిజేరియన్ కాన్పులు ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు ఒక్కో ఆపరేషన్కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు వసూలు కోయిలకొండలో ఓ ఆర్ఎంపీ ఆగడాలు గ్రామాల్లో ప్రభుత్వవైద్యంపై కొరవడిన అవగాహన కోయిల్కొండ మండలం చన్మన్పల్లితండాకు చెందిన రాధిక ధర్మాపూర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. పాపకు కడుపునొప్పిరావడంతో పాఠశాలనుంచి తండాకు వచ్చింది. రాధికను ఆమె తాత అభంగపట్నం గ్రామంలోని ఖలీం అనే ఆర్ఎంపీ నడుపుతున్న దవాఖానాకు తీసుకెళ్లాడు. అక్కడ చూపిస్తే ఆపరేషన్ చేయించాలని, మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశాడు. మరుసటి రోజు రాధికకు ఆపరేషన్ చేశారు. ఇంతకు రాధికకు కడుపునొప్పి ఎందుకు వచ్చిందో చెప్పింది లేదు. కేవలం డబ్బుల కోసం చిన్నారి కడుపును కోశారు. కోయిల్కొండ మండల పరిధిలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు చేశారని తేలింది. అవి కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. అంటే వీరు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారన్నది సుస్పష్టమవుతోంది. సాక్షి, మహబూబ్నగర్ పేదల ప్రజల అమాయకత్వం వారికి ఆసరా.. శస్త్రచికిత్సలు అవసరం లేకపోయినా కాసుల కోసం ఆపరేషన్లు చేసేస్తున్నారు. కమీషన్ వస్తుందంటే చాలు ఎంతకైనా సిద్ధపడుతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనవసరపు ఆపరేషన్లు చేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్కొండ మండలంలో కన్నతల్లులకు కడుపుకోతలు మిగుల్చుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కలెక్టర్ రొనాల్డ్రోస్ తనిఖీలతో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. మండలంలోని అభంగపట్నం గ్రామంలో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నా ఖలీం అనే వ్యక్తి చిన్నచిన్న జబ్బులకు వైద్యంచేస్తూ నిర్లక్షరాస్యులు, పేదలను నమ్మించాడు. కొన్నిరోజుల తరువాత కడుపునొప్పితోపాటు ఇతర వ్యాధులు వచ్చినవారు ఖలీం వద్దకు వైద్యం కోసం వస్తే ‘మీకు ఆపరేషన్ చేయాలని లేకుంటే రోగం నయం కాదని’ చెప్పి జిల్లా కేంద్రంలోని కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించి పరీక్షలు చేయిస్తున్నాడు. గ్రామంలో ఎవరిని తట్టినా తమకు గర్భసంచి ఆపరేషన్ జరిగిందని, అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయని చెబుతుండడం ఖలీం వైద్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్కో ఆపరేషన్కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు దండుకుని తనకిచ్చే కమీషన్ను తీసుకుంటున్నాడని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 20ఆర్ఎంపీల క్లీనిక్లు ఉండగా, అనధికారికంగా 150కిపైగా ఉంటాయి. కలెక్టర్ పర్యటనతో వెలుగులోకి.. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన ది నోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు వేయిం చేందుకు కలెక్టర్ రొనాల్డ్రోస్ కోయిలకొండ మండలంలోని చన్మయిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న కలెక్టర్కు ఇద్దరు బాలికలు కనిపించారు. బడికి వెళ్లకుండా బయటకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ బాలికలు తమకు ఆపరేషన్ అయిందని చెప్పడంతో ఎవరు చేశారని.. ఏం ఆపరేషన్ అని కలెక్టర్ వారిని అడిగారు. దీంతో ఆర్ఎంపీ ఖలీల్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. వెంటనే కలెక్టర్ రొనాల్డ్రోస్ అతడిపై విచారణ చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశాలు జారీచేశారు. ఆర్ఎంపీ వైద్యంపై కొరవడిన నిఘా గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన ఆర్ఎంపీ క్లీనిక్లపై జిల్లా వైద్యాధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. క్లీనిక్లకు వచ్చిన నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఆర్ఎంపీలు ప్రసవాలు, ఆపరేషన్లు, ఆబార్షన్లు చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్కొండమండలంలోని అభంగపట్నంలో క్లీనిక్ సెంటర్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆపరేషన్లు చేయించిన ఆర్ఎంపీ ఖలీంపై కేసునమోదు చేసినట్లు కోయిల్కొండ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. పరారీలో అతడిని వెంటనే పట్టుకుని రిమాండ్కు తరలిస్తామన్నారు. విచ్చలవిడిగా ఆర్ఎంపీ కేంద్రాలు మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ, నారాయణపేట, కోస్గి, జడ్చర్ల, నవాబ్పేట, ధన్వాడ మండలాల్లో ఆర్ఎంపీల వైద్యం బాగా విస్తరించింది. ఇంజక్షన్లతో పాటు నెబ్యులైజర్, సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తున్నారు. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినవారికి అత్యవసర సేవలు అందించేందుకు కూడా వెనుకాడడం లేదు. కొంతమంది ఫిజియోథెరపీలు ఎక్స్రే, ప్రిస్కిప్షన్లు రాస్తూ చికిత్స చేస్తున్నారు. ఇటీవల నారాయణపేటలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన చికిత్సకారణంగా రోగి కాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. రోగి ప్రమాదకరస్థితిలో ఉండగానే సంబంధిత నకిలీ వైద్యులు ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఆయా శాఖలో ఉండే ఉన్నతాధికారులకు భారీస్థాయిలో ముడుపులు ముట్టచెప్పుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 112 ఆపరేషన్ల గుర్తింపు కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి విచారణ చేయగా 112మందికి వివిధ రకాల ఆపరేషన్లు జరిగినట్లు తేలింది. వీటిలో గర్భసంచి తొలగించినవి 41, అపెండిసైటిస్ 22, సిజేరియన్లు 49 ఉన్నాయి. దీంట్లో ఖలీల్ అనే ఆర్ఎంపీ 22ఆపరేషన్లు చేయించినట్లు విచారణలో తెలింది. ఇదిలా ఉండగా, పేదల వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వం గ్రామీణులకు ప్రభుత్వం వైద్యంపై నమ్మకం కలిగించలేకపోతుంది. ఏ చిన్నజబ్బు వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారే తప్ప ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. కలెక్టర్ పర్యటనలో వెలుగులోకి వచ్చిన ఆపరేషన్లను పరిశీలిస్తే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగినవే కావడం గమనార్హం. -
దోపిడీ రాజ్యం
భైంసా :ఎలాంటి పరిస్థితులైనా వ్యాపారులకే కలిసి వస్తున్నాయి. అవకాశాలను తమవైపు తిప్పుకుని డబ్బులను సంపాదించడంలో ఆరితేరిన వారు భైంసా మార్కెట్లో తమదైన శైలిలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ రోజు బ్యాంకు గడప తొక్కని వారికి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చిన సమయంలోనే ఈ పరిస్థితి వచ్చింది. దీంతో అమాయక రైతులు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించి పలువురు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు అవసరం ఉన్న నగదును ఇవ్వాలంటే దానికి వ్యాపారులు అడత్(కమీషన్ ) ధరను మరింతగా పెంచేశారు. కూలీలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రైతులు చేసేది లేక వ్యాపారులు ఎలాచెబితే అలా ఒప్పుకుంటున్నారు. పలువురు వ్యాపారులు ఎంచక్కా చేతి నిండా నగదు ఉంచుకుని ప్రతీ రోజు మార్కెట్కు వెళ్లి డబ్బు అవసరం ఉన్న రైతులతో బేరం కుదుర్చుకుని తమ వ్యాపారం కానిచ్చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచే... రైతులకు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా ఇప్పటి వరకు అందులో లావాదేవీలు జరుపలేదు. ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డులు లేవు. నిరక్ష్యరాస్యులైన రైతులకు బ్యాంకు అధికారులు చెక్కులు కూడా ఇవ్వలేదు. సగానికి పైగా రైతులకు బ్యాంకు ఖాతాలే లేవు. నగదు లావాదేవీలకు అలవాటు పడ్డ రైతులకు ఇప్పటి వరకు ఏ పంట అమ్మినా చెక్కు తీసుకున్న పరిస్థితులు కూడా తలెత్తలేదు. అలాంటి ఈ ఏడాది సీజన్ ప్రారంభంతోనే నగదు కష్టాలు ఆరంభమయ్యాయి. భైంసా మార్కెట్లో సోయా, కందులు, మినుము, పెసర, పత్తి పంటలు విక్రయానికి తీసుకువెళ్తున్నారు. సీజను ప్రారంభం నుంచే నగదు ఇవ్వమని వ్యాపారులు చెప్పేస్తున్నారు. అమ్మిన పంటకు చెక్కులు ఇచ్చేస్తామని చెప్పడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాలు లేక... పంట పొలంలో కూలీలతో పని చేయించి వారికి ఇచ్చేందుకు కూడా రైతుల చేతిలో చిల్లిగవ్వ ఉండడంలేదు. ఏడాదిలో ఒక్కసారే పంట అమ్మకంతో డబ్బులురైతుల చేతుల్లోకి వస్తాయి. ఇలాంటి తరుణంలో వచ్చే డబ్బులు కూడా చెక్కుల రూపంలో అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఖాతాలు ఉన్న అధికారులు చెక్కు ట్రాన్స్ ఫర్ చేసేందుకు పక్షం రోజులు చేస్తున్నారు. రైతులు చెక్కులను పట్టుకుని బ్యాంకుల్లో నిరీక్షిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులైతే ప్రతీ రోజు దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నారు. కొత్తగా ఖాతాలు ఇవ్వక చెక్కులు వేసుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సొమ్ము చేసుకుంటూ... బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు నగదు కావాలని వ్యాపారుల వద్ద ప్రాధేయ పడుతున్నారు. ఈ పరిస్థితిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాగైనా రైతులకు డబ్బు అవసరం రావడంతో పంట అమ్మితే వచ్చే డబ్బులపై ఒక్కసారిగా అడత్(కమీషన్ ) పెంచేశారు. కొంతమంది ఇదే వ్యాపారాన్ని చేస్తున్నారు. నూటికి ఆరు నుంచి ఏడు రూపాయల వరకు అడత్ రూపంలో కట్ చేసుకుని రైతులకు డబ్బులు ఇస్తున్నారు. క్వింటాలు పత్తి అమ్మితే రైతు చేతికి రూ.5 వేలు అందుతాయి. నగదు కావాలంటే రైతు వ్యాపారుల వద్ద రూ.300 నుంచి రూ.350 వరకు అడత్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఇలా అడత్ రూపంలో డబ్బులు ఇచ్చిన వ్యాపారులు రైతులు తీసుకువచ్చిన పంటను తమ పేరిట విక్రయించి చెక్కులు తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో తిరగలేక చెక్కులు ఇచ్చిన డబ్బులు సమయానికి అందక రైతులు వచ్చినకాడికి సరేనని వ్యాపారులకే ఎక్కువ మొత్తం అడత్కు పంటను విక్రయించి నగదు పట్టుకువెళ్తున్నారు. ఈ వ్యాపారం అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఏ ఒక్కరూ చర్యలు తీసుకోవడంలేదు. రైతులు వెళ్తే కసురుకునే బ్యాంకు సిబ్బంది వ్యాపారులకైతే అడిగినంత డబ్బులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దృష్టి సారిస్తే... ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి రైతులు పడుతున్న నగదు ఇక్కట్లను తీర్చాలి. ఆరుగాలం శ్రమించి వచ్చిన పంటను అమ్ముకునే సమయంలో తలెత్తుతున్న పరిణామాలతో రైతన్నకు అండగా నిలబడాలి. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది రైతులకు పంట అమ్మే సమయంలో తలెత్తుతున్న పరిస్థితులను చక్కదిద్దాలి. బ్యాంకుల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. పట్టాపాసు పుస్తకాలతో వెళ్తున్న బ్యాంకు ఖాతాలు లేని రైతులకు తక్షణమే ఖాతాలు ఇచ్చేయాలి. పంట అమ్మిన రోజునే చెక్కు ఇస్తే అలాంటి రైతులకు కొంతమేర నగదు అదే రోజున ఇప్పించాలి. ఇలా చేస్తే రైతులు ఇంటికి వెళ్లి పంట కోసం కూలీలకు కొంత మేర నగదును ఇవ్వగలుగుతారు. అధికారులు రైతుల పక్షాన నిలబడి వారి ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల్లో రైతుల పేరిట అధిక మొత్తంలో జరిగిన పంట లావాదేవీలపైన దృష్టి సారించాలి. అలాంటి ఖాతాలపైన దృష్టిపెట్టి పెద్ద మొత్తంలోనే నగదు కోసం అడత్ రూపంలో రైతులు నష్టపోయిన డబ్బులను ఇప్పించాలి. లేనిపక్షంలో ఈ ఏడాది కూడా రైతులు నగదు లావాదేవీలు లేక పంట అమ్మిన పూర్తిస్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. -
స్వైపింగ్.. కమీషన్
* మినీ ఏటీఎంలుగా ‘స్వైపింగ్’ * నరసరావుపేటలో దందా నరసరావుపేట ఈస్ట్ : పెద్దనోట్ల రద్దు కష్టాలు రోజురోజుకో మలుపులు తిరుగుతున్నాయి. పట్టణంలో పెట్రోల్ బంక్లు, షాపింగ్ మాల్స్ మినీ ఏటీఎంలుగా మారాయి. రూ. 2 వేల నోట్లకు చిల్లర లేక అల్లాడుతున్న ప్రజలకు స్వైపింగ్ మిషన్లే దిక్కయ్యాయి. రూ. 2 వేలకు స్వైప్ చేయించుకొని కొద్దిపాటి కమిషన్ తీసుకొని మిగతా నగదు ఇస్తున్నారని సమాచారం. ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో గంటల కొద్దీ నిలుచునే బదులు కమిషన్ పోయినా అవస్థలు తప్పుతాయని ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార సంస్థల అధినేతలు, గుమాస్తాలు ఏదో ఒకటి కొన్నట్లు బిల్లు సృష్టించి, ఆ మొత్తాన్ని అవసరమైన వారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపార సంస్థల స్థాయిని బట్టి రూ.100 నుంచి రూ.10 వేల వరకు నోట్లు మార్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యక్తుల అవసరాలను బట్టి 2 నుంచి 10 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. -
నోట్ల మార్పిడి పేరుతో మోసం.. ముఠా అరెస్ట్
హైదరాబాద్: నోట్ల మార్పిడి పేరుతో రూ.61 లక్షలతో ఉడాయించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆజాంబాద్ క్రాస్ రోడ్డు వద్ద వారం క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.61 లక్షల విలువైన పాత రద్దయిన నోట్లకు పది శాతం కమీషన్పై కొత్త నోట్లను ఇస్తామంటూ ఓ వ్యాపారిని రప్పించారు. అనంతరం అతనిని బెదిరించి ఆ సొమ్ముతో పరారయ్యారు. ఈ విషయంపై మాదాపూర్కు చెందిన ఆ వ్యక్తి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముషీరాబాద్కు చెందిన ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. దోచుకున్న రూ.61 లక్షల నగదులో రూ.19 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొత్త నోట్లు.. కొత్త నేరాలు!
► నోట్ల రద్దుతో కొత్త తరహా నేరాలు ► మార్పిడి, బంగారం పేరుతో బురిడీ ► దోపిడీలకూ తెగబడుతున్న దుండగులు ► తప్పుదారి పడుతున్న పోలీసులు, ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు ప్రభావం నేరాలపైనా పడింది. నోట్ల మార్పిడి, పాత నోట్లకు బంగారం వంటి సరికొత్త నేరాలకు పాల్పడుతూ ఎంతోమంది పోలీసులకు చిక్కు తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ నిందితులుగా ఉంటుండడం గమనార్హం. నోట్ల రద్దును ప్రకటించినప్పటి నుంచి కొత్త తరహా నేరాలు మొదలయ్యాయి. నోట్ల మార్పిడి దందాలు గత నెల 8న ఒక్కసారిగా నోట్ల రద్దును ప్రకటించడంతో అనేక మంది ‘నల్లబాబుల’ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. వెంట నే అలాంటి వారంతా తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే భారీగా కమీషన్ల దందా మొదలైంది. 20 నుంచి 50 శాతం వరకు కమీషన్లు తీసుకుంటూ అనేక మంది పాత నోట్లను మార్పిడి చేశారు. మరోవైపు బంగారాన్ని సైతం అధిక ధరకు బ్లాక్ మార్కెట్లో విక్రయించారు. పోలీసులు సైతం నోట్ల మార్పిడి కోసం తీసుకువెళ్తున్న నగదును దోచుకునే ముఠాలు మొదలయ్యారుు. కొంద రు తాము పోలీసులమని చెప్పుకొంటూ బాధి తుల వద్ద ఉన్న మొత్తాన్ని కాజేస్తున్నారు. ఇక లక్షల మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతుండటం అసలు పోలీసుల్నీ ‘ఆకర్షిం చింది’. అలాంటివారు తనిఖీల పేరుతో వచ్చి నగదుకు లెక్కలు చెప్పాలంటూ బాధితులను బెదిరించి అందినకాడికి దండుకుపోతున్నారు. నార్త్జోన్ పరిధిలో నమోదైన ఓ ‘తనిఖీల’ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు, బంజారాహిల్స్ ఠాణా పరిధిలో నమోదైన ‘దోపిడీ కేసు’లో ఏకంగా ఓ ఇన్స్పెక్టర్ స్థారుు అధికారి నిందితులుగా ఉండటం గమనార్హం. బ్యాంకు, పోస్టల్ ఉద్యోగులూ.. నగదు మార్పిడి దందాలో కొందరు బ్యాంకు, పోస్టల్ ఉద్యోగులూ కీలకపాత్ర పోషిస్తు న్నారు. సరైన ధ్రువీకరణలు లేకుండా భారీ మొత్తంలో నగదు మార్పిడి చేసిన చైతన్యపురి సిండికేట్ బ్యాంకు ఉద్యోగులపై సరూర్నగర్ ఠాణాలో కేసు నమోదైంది. అలాగే ‘నల్ల బాబులకు’ సహకరిస్తూ రూ.36 లక్షలు మార్పిడి చేసిన ఆరోపణలపై పోస్టల్శాఖలో ఉన్నతాధికారి సహా ముగ్గురిపై సీబీఐ కేసు నమోదైంది. ఘర్షణలూ మొదలు తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్దా బందో బస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. పాత నోట్లను తీసుకోకపోవడం, పెద్ద నోటుకు చిల్లర లభించకపోవడం వంటి కారణాలతో అనేక చోట్ల ఘర్షణలు, చోరీలు సైతం జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఘటనలు ► పెద్దనోట్ల మార్పిడి కోసం వచ్చిన వ్యక్తిని బెదిరించి రూ.7 లక్షలు దోచుకున్న ముఠాను రాజేంద్రగనర్ పోలీసులు అరెస్టు చేశారు. ►బంజారాహిల్స్ పరిధిలో పాత నోట్లకు కొత్త కరెన్సీ ఇస్తామంటూ రూ.1.2 కోట్లు స్వాహా చేసిన కేసులో ఓ కాంగ్రెస్ నేత, పోలీసు ఇన్స్పెక్టర్ నిందితులుగా ఉన్నారు. ►పాతనోట్లు మార్చి ఇస్తానని సహచరుడి నుంచి డబ్బు తీసుకున్న సెక్యూరిటీ గార్డు శ్రీనివాసరావు ఆ పని చేయలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ► బంజారాహిల్స్, మాదాపూర్, నారాయణ గూడ పోలీసులు లెక్కలు చూపని రూ.1.25 కోట్ల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ►రూ.100 నుంచి రూ.10 వరకు విలువగల నకిలీ కరెన్సీ చలామణీకి యత్నించిన ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకు న్నారు. ►రూ.500 పాత నోటుకు చిల్లర ఇవ్వలేదనే కారణంగా పెట్రోల్ బంక్ క్యాషియర్పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఈ కేసు నమోదైంది. ►హస్తినాపురం పరిధిలోని ఓ మద్యం దుకాణంలో చోరీకి వచ్చిన దుండగులు రూ.10 నోట్లు, చిల్లరతో కూడిన రూ.50 వేల నగదు ఎత్తుకుపోయారు. కట్టలు కట్టలుగా దొరుకుతున్న కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో లెక్కలు లేని నగదు భారీ మొత్తంలో దొరుకుతోంది. కొన్ని కేసుల్లో ఆ సొమ్ము ‘మార్పిడి’కి సంబంధించిందని నిర్ధారణ అవుతోంది. ఇలా చిక్కుతున్నదానిలో కొత్త కరెన్సీ సైతం భారీగా ఉంటుండటం గమనార్హం. ‘మార్పిడి’ మోసాలు నోట్ల మార్పిడి పేరిట కొందరు మోసగాళ్లు దోపిడీకి తెరతీశారు. తక్కువ కమీషన్కే నోట్లను మార్పిడి చేస్తామంటూ హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల వారికి ఎర వేయడం ప్రారంభించారు. పాత నోట్లు తీసుకుని ఫలానా చోటుకు రమ్మని చెప్పి.. వచ్చిన వారి నుంచి ఆ నోట్లు తీసుకుని పరారవుతున్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల వరకు వస్తున్నవి తక్కువేనని చెబుతున్నారు. తాము కోల్పోరుున డబ్బుకు లెక్క చెప్పగలిగిన వారు మాత్రమే పోలీసులను ఆశ్రరుుస్తున్నారని అంటున్నారు. -
కాకి లెక్కలు తేలేదెన్నడు...
► గతేడాది ధాన్యం కొనుగోళ్లలో చురుకై న ప్రాతపోషించిన మహిళలు ►డ్వాక్రా మహిళలకు నేటికీ అందని కమీషన్ విజయనగరం కంటోన్మెంట్ : డ్వాక్రా మహిళలకు మంచి అవకాశమిది.. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయం పొందొచ్చని ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం అందుకు తగ్గ కమీషన్లను ఇవ్వడంలో కాకిలెక్కలు వేస్తోంది. సీజన్లో ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించినందుకు ఇవ్వాల్సిన కమీషన్పై తాత్సారం చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లు చేసి సంవత్సరం గడచిపోరుునా ఇంకా కమీషన్లు ఎందుకివ్వరని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 18,81,082 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన మహిళలకు రూ.5,87,83,000 కమీషన్ రావాల్సి ఉంది. అరుుతే ఒక సారి రూ.2.94 కోట్లు, మరో సారి రూ.2.21 కోట్ల కమీషన్ వచ్చింది. మొత్తంగా రూ.5.15 కోట్ల కమీషన్ రావడంతో డ్వాక్రా మహిళలు మాకిచ్చేందుకు డబ్బులు వచ్చేశాయోచ్ అని అనుకున్నారు. కానీ వీరికి మాత్రం ఇంకా కమీషన్లు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గోనెలు తిరిగి ఎందుకు ఇవ్వలేదని జిల్లా అధికారులు అడిగే సరికి డ్వాక్రా మహిళలకు ఏం చెప్పాలో తోచలేదు. కమీషన్ డబ్బుల్లో గోనెలకు సంబంధించిన సొమ్మును కట్ చేశారు. అదీ వేలల్లో కాదు. రూ. లక్షల్లో. జిల్లా వ్యాప్తగా పీపీసీల వద్ద ఉండిపోయాయని చెప్పి రూ.72,83,000ల కమీషన్ డబ్బులను కట్ చేశారు. అసలేమైందంటే.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన మహిళలకు అధికారులు గోనెలు అందించారు. ఈ గోనెలను పీపీసీల వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇస్తే వారు హమాలీల సాయంతో ధాన్యం వేసి తూకం వేస్తారు. అలా తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించాలి. వాస్తవంగా ఇలా జరగాల్సి ఉంది. కానీ ఏం జరిగిందంటే నేరుగా మిల్లర్లు ఇచ్చిన తెల్లని గోనెల ద్వారానే కొనుగోళ్లు జరిగారుు. దీంతో కోల్కతా నుంచి పెద్ద ఎత్తున ధరలు వెచ్చించి కొనుగోలు చేసిన గన్నీ బ్యాగులు పీపీసీల వద్ద, వివిధ ప్రజాప్రతినిధుల వద్ద ఉండిపోయారుు. వీటిని వారు వేరే అవసరాలకు వాడుకున్నారు. కేంద్రాల వద్ద మిగిలిపోయన గోనెల్లో చాలామటుకు పాడయ్యారుు. దాదాపు కోటి రూపాయల పైగానే వెచ్చించి కొన్న ఈ గోనెలను ఇప్పుడు అడగడంతో ఆయా గ్రామైక్య సంఘాలు వాటిని పట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చారు. కానీ లెక్కలు మాత్రం తేలలేదు. ఈ లెక్కలు ఇలా ఉంటుండగానే మళ్లీ కొత్తగా ధాన్యం కొనేందుకు కోటి రూపాయల విలువలైన కొత్త గోనెలు కొనుగోలు చేశారు. అరుుతే వీటి కొనుగోళ్లు వెనుక లొసుగులున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే పాడైన గోనె సంచుల నష్టాన్ని భరించే పరిస్థితి తలెత్తిందని పలువురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి గతేడాది కమీషన్ను వెంటనే అందజేయాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రానికి చిరిగిన గోనెలు ఉత్తరావల్లి (మెరకముడిదాం): మండలంలోని ఉత్తరావల్లిలో వెలుగు కార్యాలయం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆదివారం మధ్యాహ్నం 20 వేల గోనెలు వచ్చారుు. అరుుతే ఈ గోనెలను దించుతున్నప్పుడు వాటిని పరిశీలించిన డ్వాక్రా సంఘం సభ్యులు వాటిలో చిరిగిపోరుున వాటిని గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి లారీలోనుంచి దించుతుండగానే ప్రతి కట్టను విడదీసి క్షుణ్ణంగా పరిశీలించగా వచ్చిన 20 వేల గోనెలలో సుమారు 3 వేల వరకూ పూర్తిగా చిరిగిపోరుునవే ఉండడంతో డ్వాక్రా సంఘం సభ్యులు అవాక్కయ్యారు. అంతేకాదు మరో విషయమేమిటంటే ఈగోనెలను 50 ఒక కట్టగా చేసి పంపించారు. అరుుతే కట్టలో ఉండాల్సిన 50 గోనెలకు కొన్ని కట్టల్లో 10 నుంచి 20 గోనెల వరకూ తక్కువగా ఉన్నారుు. ఈ 20 వేల గోనెలలలో సుమారు 10వేల నుంచి 12వేల వరకు గోనెలు మాత్రమే ఉంటాయని డ్వాక్రా గ్రూపు సభ్యులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర ధర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘం సభ్యులతో పాటు స్థానిక రైతులు కోరుతున్నారు. -
పెద్దనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
– నకిలీ కరెన్సీ, సెల్ఫోన్లు స్వాధీనం ఆదోని టౌన్: 25 శాతం కమీషన్తో పెద్ద నోట్లను మార్చుతామని నమ్మించి మోసం చేస్తున్న ముఠా పోలీసులకు దొరికింది. ఎమ్మిగనూరు పట్టణంలో కొందరు వ్యక్తులు పెద్ద నోట్ల మార్పిడితో మోసం చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి జిరాక్స్ నోట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. డోన్ కొండపేటకు చెందిన వడ్డే నాగరాజు, నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన నాయక్ మహ్మద్ షరీఫ్, ఎమ్మిగనూరు పట్టణంలోని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తనయుడు షేక్ అబ్దుల్లా, షరాఫ్ బజార్ వీధికి చెందిన చిలుకూరు నయనకాంత్, ఆదోనికి చెందిన ఖాదర్ ముఠాగా ఏర్పాడ్డారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి అనే రైతు నుంచి పెద్దనోట్లను 25శాతం కమీషన్తో మార్పిడి చేసి ఇస్తామని నమ్మించారు. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్కు రమ్మని సమాచారం ఇచ్చారు. వీరి వ్యహరాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మినూరు టౌన్ ఎస్ఐ, సిబ్బంది బస్టాండ్కు చేరుకుని నిఘా వేశారు. ఆ ముఠా సభ్యుల తంతును ఎప్పటికప్పుడు గమనించారు. రైతు శివరామిరెడ్డిని మోసం చేసేందుకు రూ. వంద నోట్ల కట్టలో పైనా కింద ఒరిజినల్ నోట్లు పెట్టి మధ్యంలో జీరాక్స్ నోట్లు పెట్టారు. రైతు నుంచి ఒరిజనల్ పెద్దనోట్లు రూ.500, వెయ్యి నోట్లను తీసుకొని నకిలీ, జిరాక్స్ నోట్లను అందజేసే సమయంలో రెడ్ హ్యాండెడ్గా నలురుగురిని పట్టుకున్నారు. ఆదోనికి చెందిన ఖాదర్ తప్పించుకొని పారిపోయాడు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.. పెద్ద నోట్ల మార్పిడి అంటూ జిల్లాలో మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. సమావేశంలో ఎమ్మిగనూరు సీఐ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
కరెన్సీకి కమీషన్
► రూ.4వేలకు రూ.500' ► పేదలే పెద్దలకు బినామీలు ► వేలిపై గుర్తుతో చెక్ ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చోరీకి వల్ల కాక మరొకడు ఏడ్చాడు’ అనేది ప్రజల నోళ్లలో తరచూ నానుతుండే సామెత. ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు ఆ సామెతను తలపిస్తున్నారుు. చెల్లని నోట్లను మార్చుకోలేక పేదలు అల్లాడుతుంటే బినామీలుగా మారిన వారికి కమీషన్లు అంటూ పెద్దలు ప్రలోభపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఈనెల 8వ తేదీన కేం ద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్యాంకుల ద్వారా 10వ తేదీ నుంచి పాత నోట్ల స్థానంలో కొత్త నోట్ల ను మార్చుకోవచ్చంటూ చేసిన ప్రకటనతో ప్రజలు ఉరకలెత్తారు. పరిమితమైన నోట్లను కలిగి ఉన్న ప్ర జలు బ్యాంకుల వద్ద బారులు తీరగా భారీ మొత్తం లో నగదును దాచిపెట్టిన ధనికులు బావురుమన్నా రు. రూ.2.5లక్షలకు పైగా బ్యాంకుల్లో జమ చేస్తే లెక్కలు చూపాల్సి ఉంటుంది. అంతేగాక 200 శాతం ఆదాయపు పన్ను కట్టక తప్పదు. బ్యాంకుల్లో జమ చేస్తే ఆదాయపు పన్నుశాఖ తంటా కావడంతో అక్రమార్కులంతా వక్రమార్గం వైపు కదులుతున్నారు. తమకు నమ్మకమై పేదలను, సన్నిహితులను బినామీలుగా మార్చుకుని వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమచేరుుస్తున్నారు. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ధనికులు తాము ఎంచుకున్న పేదలను ఉదయాన్నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. వారి చేతిలో రూ. 4,500 పెట్టి మార్చుకుని రమ్మని చెబుతున్నారు. ఈ పని పూర్తి చేసిన వారికి రూ.300 నుంచి రూ. 500 వరకు కమిషన్ ఇస్తున్నారు. సాయంత్రానికి నాలుగుసార్లు వెళితే రూ.2వేలు కమీషన్గా గిట్టుతోంది. ఇలా ఎన్నిసార్లరుునా బ్యాంకులకు వెళ్లేందుకు పేదలు సిద్ధం కావడంతో గట్టిపోటీ ఏర్పడింది. కరెన్సీ మార్పిడి చేసే పేదలు, కూలీలకు గిరాకీ ఏర్పడడంతో వారిని సరఫరా చేసేందుకు సహజంగానే బ్రోకర్లు తయారయ్యారు. ’ఎదావదు ఇరుందాల్ సొల్లుంగ...సత్తమిల్లామల్ ముడిచ్చిడలాం’ (ఏదైనా ఉంటే చెప్పండి గుట్టుగా పూర్తిచేసుకువస్తా) అనే కోడ్ భాష చెలామణిలోకి వచ్చింది. నేటి నుంచి వేలిపై గుర్తు: నల్లధనాన్ని వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బినామీలతో గండికొట్టకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తపడింది. ఒకే వ్యక్తి పదేపదే బ్యాంకులకు వస్తూ కరెన్సీని మార్చడాన్ని నిరోధించనుంది. ఓటు హక్కును వినియోగించుకునే తరహాలో బ్యాంకులో నగదును జమ చేసిన వ్యక్తి వేలిపై ముద్ర వేసే విధానాన్ని బుధవారం నుంచి ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మంగళవారమే కొన్ని బాంకుల్లో వేలిముద్ర విధానం అమలులోకి వచ్చినట్లు సమాచారం. అలాగే ఇతరుల ఖాతాలో డబ్బును జమ చేయాలంటే ఖాతాదారుడు నేరుగా రావడమో లేదా అతని స్వదస్తూరితో ఉత్తరం జమ చేయడమో తప్పనిసరి చేశారు. తప్పని తిప్పలు: కరెన్సీ నోట్లు రద్దరుు ఆరు రోజులు దాటుతున్నా బ్యాంకుల వద్ద ప్రజల తిప్పలు తప్పడం లేదు. చాంతాడంత క్యూలో నిల్చుని కౌంటర్ వద్దకు చేరుకునేసరికి క్యాష్ అరుుపోందని కొన్ని బ్యాంకుల్లో వెనక్కుపంపుతున్నారు. ఇక ఏటీఎంలో పెట్టిన లక్షలాది రూపాయలు నిమిషాల వ్యవధిలో ఖాళీ అరుుపోతున్నారుు. ప్రస్తుతం ఏటీఎంలలో రూ.2 వేలనోట్లు మాత్రమే లభ్యమవుతుండగా, రూ.500ల కొత్త నోట్లు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నారుు. చిల్లర కోరేవారికి కొన్ని చోట్ల రూ.5, రూ.10ల నాణేలను అందజేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్లో ఆస్తిపన్ను చెల్లింపునకు పాత నోట్లు స్వీకరించడంతో సోమవారం ఒకే రోజు రూ.8 కోట్లు వసూలైంది. -
కూలీలకు నల్లకుబేరుల ఎర
ఆత్మకూరు రూరల్: పనులు లేక ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ కూలీలకు నల్లకుబేరులు పని కల్పిస్తున్నారు. నోట్ల మార్పిడికి ఎర వేస్తూ కమీషన్ ఇస్తున్నారు. ఆత్మకూరు మండలంలో ఓ గ్రామానికి చెందిని కొందరి కూలీలను ఎంపిక చేసుకుని ఒక్కొక్కరికి భోజన సౌకర్యం, చార్జీలు ఇస్తూ కూలి కింద రూ. 500 ఇస్తున్నారు. వీరంతా ఉదయాన్నే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతపట్టుకుని నల్లకుబేరులు ఇచ్చే పెద్ద నోట్లు తీసుకుని కర్నూలుకు వెళ్తారు. అక్కడ నోట్లు మార్చుకుని తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నా, వేర్వేరు బ్యాంకుల వద్ద క్యూలో నిలిచి నోట్లు మారుస్తున్నారు. ఇలా నల్ల కుబేరులు దర్జాగా కూలీలను ఉపయోగించి బ్లాక్ సొమ్మును వైట్గా మార్చుతున్నారు. బ్యాంకులో బ్లాక్ అండ్ వైట్ దందా పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య జనాలను ధైర్యం కలిగించాల్సిన బ్యాంకు అధికారుల్లో కొందరు కమీషన్ల కక్కుర్తికి పాల్పడి నల్లకుబేరులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రముఖ బ్యాంకు మేనేజరు 10 శాతం కమీషన్తో నోట్లను మార్చుతున్నట్లు తెలుస్తోంది. రోజు క్యూలో నిలబడి తమ ఆధార్ను, డిక్లరేషన్ను సమర్పించి బ్యాంకులో నోట్లు మార్చుకుంటున్న సామాన్యుల ఆధార్ కార్డులను తిరిగి జిరాక్స్ చేయించి వాటిని ఆధారంగా బ్యాంకు అధికారి నోట్ల మార్పిడికి తెగిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన ఓ బడా బాబుకు ఒకే రోజు రూ. 2లక్షల పెద్ద నోట్లకు మార్పిడి నోట్లు ఇచ్చినట్లు సమాచారం. -
వృద్ధుల కడుపు కొడుతున్న తెలుగు తమ్ముళ్లు
-
సహకారం..చెరి సగం
- డీసీసీబీలో కమీషన్ల పర్వం - ముఖ్యనేత పేరు మీద వసూళ్లు - కొత్త పథకాలతో సరికొత్త వ్యూహం - అవసరార్థం వచ్చిన రైతులను పీల్చిపిప్పి చేస్తున్న వైనం కర్నూలు(అగ్రికల్చర్)/ కోవెలకుంట్ల: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)..రైతుల అభ్యున్నతి దీని లక్ష్యం. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రుణాలు ఇవ్వాలి. అయితే జిల్లాలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కమీషన్ల పేరుతో రైతులను అధికారులు పీల్చి పిప్పిచేస్తున్నారు. టీడీపీకి చెందిన డీసీసీబీ పాలకమండలిలోని ముఖ్యనేత పేరు మీదనే ఈ వ్యవహారం నడుస్తోంది. కమీషన్లను అధికారులు, ముఖ్యనేత చెరి సగం పంచుకుంటున్నట్లు విమర్శలున్నాయి. నిబంధనలు ఇలా.. జిల్లా సహకార కేంద్రబ్యాంకు ద్వారా 2015–16 నుంచి కాంపోజిట్ రుణ పథకం, రైతు నేస్తం, కర్షకజ్యోతి, డెయిరీ కింద రుణాలు ఇస్తున్నారు. కాంపోజిట్ పథకం కింద గరిష్టంగా రూ.25 లక్షలు రుణంగా ఇస్తారు. మిగిలిన పథకాల కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. రైతుల భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే డాక్యుమెంట్లను తీసుకొని మాల్టిగేజ్ చేసుకున్న తర్వాత రుణాలు ఇస్తారు. రైతులు ఏ కారణంతోనైనా రుణాలు చెల్లించకపోతే భూములను స్వాధీనం చేసుకొని వేలం వేసే అవకాశం ఉంది. వసూళ్లు ఇలా.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మొదలు కొని కేడీసీసీబీ బ్రాంచిల వరకు ముఖ్యనేత పేరుమీదనే వసూళ్ల పర్యం సాగుతోంది. సదరు ముఖ్యనేతకు 2 శాతం, స్థానిక సిబ్బంది మరో 2 శాతం వరకు కమీషన్లు ఉన్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. మామూళ్ల వ్యవహారాన్ని ప్రశ్నించిన వారిపై సదరు నేత ఎదురుదాడి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. భూములను పరిశీలించేందుకు వెళ్లిన అధికారులు సైతం మామూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎటువంటి దీర్ఘకాలిక రుణమైనా కేడీసీసీబి ప్రధాన కార్యాలయానికి వస్తుంది. అక్కడ అడ్వైజ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిఉంది. ఇది ఇవ్వాలంటే కమీషన్లు ముట్టాల్సిందే. లక్షకు రూ.వెయ్యి ఇస్తే అడ్వైజ్ సర్టిఫికెట్ వస్తుంది. రుణపంపిణీ ఇలా.. కాంపోజిట్, రైతు నేస్తం, కర్షకజ్యోతి, డెయిరి పథకాల కింద 2015–16లో దాదాపు రూ.500 కోట్లు రుణాలు ఇచ్చారు. ఈ ఏడాది దాదాపు రూ.1000 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా తీసుకున్నారు. ఇప్పటికి రూ.175 కోట్ల వరకు రుణాలు పంపిణీ చేశారు. రుణపంపిణీ బట్టి కమీషన్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఇదీ ఉదాహరణ.. - గోనెగండ్ల మండలానికి చెందిన ఓ రైతు కాంపోజిట్ పథకం కింద రూ.25 లక్షల రుణం కోసం ముఖ్యనేతకు ముందుగానే రూ.75వేలు ఇచ్చుకున్నట్లు సమాచారం. ఆయనకున్న భూములకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ విలువల ప్రకారం రూ. 15 లక్షలకే రుణానికి అర్హత లభించింది. రూ.25 లక్షల కోసమని రూ.75వేలు ఇస్తే రూ. 15 లక్షలే ఇచ్చారని అ రైతు అందోళన అంతాఇంతా కాదు. రుణంలో 2 శాతం పట్టుకున్నారు: యల్లావత్తుల శివశంకర్, సంజామల (27కేఎన్ఎల్16ఏ) వరి, జొన్న సాగుకు పెట్టుబడుల కోసం సంజామల సహకార సంఘంలో మూడు నెలల క్రితం 5.40 ఎకరాల పొలం తనఖా పెట్టాను. కర్షక జ్యోతి పథకం కింద ఎకరాకు రూ. లక్ష చొప్పున రూ. 5.40 లక్షల రుణం అందాల్సి ఉంది. అయితే రెండుశాతం కమిషన్ పట్టుకొని రూ. 4.85 లక్షలు చేతికిచ్చారు. ఇదేమని అడిగితే పెద్దోళ్లకు ఇవ్వాలని అధికారులు చెప్పారు. రూ.15 వేలు పట్టుకున్నారు: మహమ్మద్ రఫీ, కానాల, సంజామల మండలం (27కేఎన్ఎల్16బీ) నేను రెండున్నర ఎకరా పొలం తనఖా పెట్టి రెండు నెలల క్రితం బర్రెల కొనుగోలుకు రూ. 2.50 లక్షలు రుణం కావాలని అడిగాను. మొదటి విడత రూ. 1.25 లక్షలు అందజేయాల్సి ఉంది. అయితే రూ. 15వేలు పట్టుకొని రూ. 1.10 లక్షలు చేతికిచ్చారు. మిగిలిన మొత్తం ఆరు నెలల తర్వాత ఇస్తామన్నారు. సహకార సంఘాల్లో క్రాప్ లోన్లు ఎత్తివేసి ఎల్టీ, కర్షక జ్యోతి పథకాల కింద మాత్రమే రుణాలు ఇస్తున్నారు. -
బీసీ కమిషన్ గో బ్యాక్
-
విచారణ కొలిక్కి రాకుండానే ముగిసిన గడువు
-
కమీషన్ పేరుతో దోపిడీ
ప్రైవేటు కరెంటు బిల్లు వసూలు కేంద్రాలకు అయాచిత లబ్ధి విజయవాడ : ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ విద్యుత్ బిల్లులు వసూలు చేసే కేంద్రాలను ప్రవేటు వ్యక్తులకు దశలవారీగా అప్పగిస్తోంది. విద్యుత్శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఏటీపీ (ఎనీటైం మనీ పేమెంట్) కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఏటీపీ కేంద్రాలల నిర్వహకులకు అధిక కమీషన్ చెల్లించటం వల్ల ఏపీఎస్పీyీ సీఎల్కు తీవ్ర నష్టం వస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న మీసేవా కేంద్రాలకు చెల్లించే రేటు కంటే ఇది అధికం. మీసేవా కేంద్రాలకు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రస్తుతం ఒక్కో బిల్లుకు రూ. 2.50 ఇస్తుండగా ఏటీపీ కేంద్రాలకు ఒకో బిల్లుకు రూ. 8.50 వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో మూడు ఏటీపీ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా నెలకు 32వేల బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో సెంటర్కు నెలకు రూ. 90 వేలు చొప్పున మూడింటికి కలిపి నెలకు రూ. 2.70లక్షలు చెల్లిస్తోంది. అదే మాన్యువల్ విధానంలో బిల్లు కలెక్టర్లకు ఒకో బిల్లుకు రూ. 2.50 చొప్పున చెల్లిస్తోంది. ఈ క్రమంలో మూడు ఏటీపీ కేంద్రాలకు 32వేల బిల్లులకు రూ. 2.70లక్షలు చెల్లిస్తుండగా, బిల్లు కలెక్టర్లు, మీసేవా కేంద్రాల ద్వారా వసూలు చేస్తే కేవలం రూ. 80వేలు మాత్రమే సంస్థకు ఖర్చవుతుంది. మరో 16 కేంద్రాలకు రంగం సిద్ధం రానున్న కొద్ది రోజుల్లో నగరంలో మరో 16 కేంద్రాలను ఏర్పాటు చేయటనాకి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ 16 కేంద్రాల ద్వారా ఒక నెలకు రూ. 14.40లక్షలు ఖర్చువుతుండగా, ఏడాదికి 1.73 కోట్లు ఖర్చు చేస్తారని అంచనా. ఒకో కేంద్రానికి నెలకు రూ. 90వేలు చెల్లించేలా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్ది మాసాల క్రితం దక్షణ మండల విద్యుత్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు వసూలు కు ఏటిపీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో బాగంగా సంస్థలో ఉన్నతాధికారులు ఓ ప్రవేటు సంస్థకు ఏటీపీ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా కట్టబెట్టారు. వినియోగదారులకు సేవలు ఎలా ఉన్నా విద్యుత్ సంస్థకు నష్టం వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. తద్వారా భవిష్యత్తులో ఈ భారం వినియెగదారులపై పడుతుందని ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది చెపుతున్నారు. పెద్దల ప్రమేయం? ఈ వ్యవహారం వెనుక కొందరు పెద్దతలకాలయ పాత్ర ఉందని, వాటాలు, మామూళ్ల కోసమే ఈ దందాకు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
చిల్లర కష్టాలు
తణుకు(పశ్చిమ గోదావరి జిల్లా): ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుంచి మార్కెట్లో కూరగాయల కొనుగోలు, బస్సు ప్రయాణం ఇలా ప్రతిచోట చిల్లర అవసరం. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో చిల్లర కష్టాలు వెంటాడుతున్నాయి. రూపాయి, రెండు, అయిదు రూపాయల నాణేలు దొరకడం కష్టంగా మారింది. దీంతో వ్యాపారులతో పాటు ప్రజలకూ ఇబ్బందులు తప్పడంలేదు. చిల్లర లేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నూటికి రూ.10 కమీషన్ చెల్లించి చిల్లర నాణేలు కొనుగోలు చేసి వ్యాపారాలు సాగించాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గినా మార్కెట్లో మాత్రం నిత్యం రూపాయి చిల్లర నాణెం లేనిదే వ్యాపార లావాదేవీలు ముందుకు సాగడంలేదు. వ్యాపారం కుదేలు మార్కెట్లో చిల్లర కొరత కారణంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి. నిత్యం చిల్లర లేకపోతే రూపాయి, రెండు వంటి చిల్లరను కొన్ని సందర్భాల్లో వ్యాపారులు వదులుకోవాల్సిన పరిస్థితి. రూపాయి తక్కువైనా పర్లేదు కానీ చిల్లర చెల్లించి సహకరించాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రజలు వస్తువుల కొనుగోలుకు 10, 20, 50, 1,00, 5,00, 1,000 నోట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో హోటళ్లు, మెడికల్, కిరాణా, కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు చిల్లర కోసం ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్టీసీ బస్సుల్లో అయితే కండక్టర్ల కష్టాలు అన్నీఇన్నీ కావు. కొందరు షాపుల్లో చిల్లర బదులు చాక్లెట్లు ఇచ్చి సరి చేసుకుంటున్నారు. బ్యాంకులు కొంత మేర చిల్లరను ప్రత్యేక కౌంటర్ల ద్వారా మేళాలు ఏర్పాటు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నప్పటికీ వ్యాపారుల పూర్తి అవసరాలను మాత్రం తీర్చలేకపోతున్నారు. దీంతో 90 శాతం వ్యాపారులు మాత్రం చిల్లర నాణేలు కమీషన్ పద్ధతిలో సమకూర్చుకోవడం చిరు వ్యాపారులకు భారంగా మారుతోంది. రోజువారి సంపాదనలో కొంత మొత్తం చిల్లర కొనుగోలుకే వెచ్చించాల్సివస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. చిల్లరవ్యాపారం నిత్యం రూ.అర కోటి చిల్లర కొరతను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. రూ.100 విలువ చేసే చిల్లర కావాలంటే అదనంగా రూ.పది తీసుకుంటున్నారు. సర్వసాధారణంగా కనిపించే చిల్లర వ్యాపారం ద్వారా నిత్యం రూ.50 లక్షల మేర కమీషన్ చేతులు మారుతోందంటే ఆశ్చర్యం కలగక మానదు. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర నాణేలు విక్రయించేందుకు ప్రత్యేక వ్యాపారులు ఉండగా కొందరు కిరాణా షాపులు, కిళ్లీ బడ్డీల దుకాణాల్లో చిల్లర వ్యాపారం జరుగుతోంది. దేవాలయాల్లో హుండీలను తెరిచే సమయంలో అక్కడి అధికారులకు సైతం ‘కమీషన్’ చెల్లించి మరీ చిల్లర కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు వ్యాపారులు బిక్షాటన చేసే వారి వద్ద నుంచి చిల్లర తీసుకుని వారికి నోట్లు ఇస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు చిల్లర నాణేలు అందించే మేళాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అది పాటించడంలేదు. కష్టాలు తప్పడం లేదు ప్రస్తుతం ఏ వస్తువు కొనుగోలు చేసినా ఎమ్మార్పీలు చిల్లర మొత్తంలోనే ఉంటున్నాయి. వాటి కొనుగోలు అనంతరం ప్రజలకు చిల్లర ఇవ్వాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక కమీషన్ రూపంలో చిల్లర కొనుగోలు చేసి కొనుగోలుదారులకు ఇస్తున్నాం. – వి.సూర్యనారాయణ, కిరాణా వ్యాపారి, వేల్పూరు 10 శాతం కమీషన్ ఇచ్చి కొంటున్నాం నా దుకాణంలో ప్రతి రోజు రూ.వెయ్యి వరకు చిల్లర అవసరమవుతుంది. అయితే చిల్లర కొరత కారణంగా కొన్ని సందర్భాల్లో బేరాలు వదులుకుంటున్నాం. దీంతో భారమైనా రూ.10 శాతం కమీషన్ ఇచ్చి చిల్లర కొనుగోలు చేస్తున్నాం. – వైసీహెచ్ కృష్ణమూర్తి, వ్యాపారి -
కమీషన్ల కట్టలు
– కార్పొరేషన్లో అవినీతి పాములు – ప్రతీ పనికి పర్సంటేజీలు – ఇంజనీరింగ్ సిబ్బంది మధ్య పోటీ – ఖజానాపై అనవసరపు భారం సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఖజానాపై కమీషన్ల భారం పడుతోంది. అందిన కాడికి కార్పొరేషన్ సొమ్మును కమీషన్లు, పర్సంటేజీల పేర దండుకునేందుకు కొందరు సిబ్బంది పోటీ పడుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం, ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఇందులో ముందు వరుసలో నిలుస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వేగం తగ్గిన కారణంగా మళ్లీ కమిషన్ల దందా జోరందుకుంది. జోరుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో రెండో పెద్దనగరంగా పేరొందిన గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నారు. ఇలా ఖర్చు పెడుతున్న సొమ్ములో పర్సంటేజీలు, కమీషన్లు పిండుకునేందుకు కొందరు సిబ్బంది అక్రమ పద్ధతులకు తెర లేపారు. అంచనాలు, అద్దెలు పెంచుకుంటూ పోవడం వారికి పరిపాటిగా మారింది. కింది స్థాయి నుంచి పైవరకు ఈ వ్యవహారంలో ఎవరి వాటా వారికి ముడుతుండడంతో చాప కిందనీరులా వ్యవహారం చక్కబెడుతున్నారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ పేరుతో చేపట్టిన నాలాలు, డ్రెయినేజీల పూడిక తీత వ్యవహరంలో చోటు చేసుకున్న కమీషన్ల వ్యవహరం అందర్ని విస్మయానికి గురి చేసిన విషయం విదితమే. మార్కెట్ ధరకు మించి వాహనాలకు అద్దె చెల్లించడం, ఇలా అధికంగా చెల్లించిన మొత్తాలను పంచుకోవడం కార్పొరేషన్లో దుమారం లేపింది. ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ వ్యవహరం బయటకు పొక్కింది. కానీ బయటకు రాకుండా చాప కింద నీరులా చక్కదిద్దిన కమీషన్ల వ్యవహరాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో కొన్నింటి వివరాలు... – హరితహారం కార్యక్రమంలో మొక్కలు తరలించేందుకు ప్రభుత్వ వాహనాలను కాదని అద్దె ప్రతిపాదికన 10 ట్రాక్టర్లు తీసుకున్నారు. మార్కెట్ రేటు ప్రకారం ట్రాక్టరు ఒకరోజు కిరాయి సగటున రూ.1000 ఉండగా కార్పొరేషన్లో రూ.1200 చెల్లించారు. ఇదీ చాలదన్నట్లు ప్రతీ ట్రాక్టరుకు 10 లీటర్ల డీజిల్ ఉచితంగా అందించారు. ఈ వ్యవహరంలో ప్రతీరోజు ఒక్కో ట్రాక్టరుపై రూ.300 కమీషన్ చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. – బీరన్నకుంట – రాజీవ్ గృహకల్ప సముదాయం పైపులైను నిర్మాణ పనుల్లో పర్సంటేజీల పంచాయతీ నెలల పాటు నడిచింది. తమకు అనుకూలమైన ‘ఫిగర్’ తేలే వరకు ఇంజనీరింగ్ సిబ్బంది ఈ పనులను ముందుకు సాగనివ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. – కమీషన్లు, పర్సంటేజీల విషయంలో ఇంజనీరింగ్ విభాగంలో సిబ్బంది మధ్య అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. తమ పరిధిలోకి రాని పనుల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. బొందివాగు నాలా అంశంలో ఓ డీఈ సస్పెండ్ అయ్యాడు. ఈ విభాగంలో కమీషన్లు ఇచ్చుకుంటే క్షణాల్లో బిల్లులు మంజూరవుతాయి. లేదంటే లేనిపోని కొర్రీలు పెడుతూ బిల్లుల మంజూరుకు నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. అలాగే, పర్సంటేజీల కోసం నెలల తరబడి పనులు కూడా ముందుకు సాగవు. – ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు పెట్టే ఇబ్బందులు తాళలేక వంతుల వారీగా కాంట్రాక్టర్లు వారికి దావత్లు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా జరిగే పార్టీల్లో ఎవరికి ఏ పని అప్పగించాలనేది నామినేషన్లపై కేటాయింపు జరుగుతుంది. -
కమీషన్ల కోసమే కౌన్సిల్ సమావేశం వాయిదా..?
కోదాడ : ‘మున్సిపల్ కమిషనర్ ఎజెండా తయారు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు...ఆయన వల్లే మున్సిపల్ సమావేశం నిర్వహించలేక పోతున్నాం..’ ఇది గతంలో కోదాడ పురపాలక పెద్దలు నిత్యం వల్లే వేసిన మాటలు. మూడు నెలలపాటు సమావేశం నిర్వహిచంకపోతే పాలకవర్గం రద్దు అవుతుందని ఎజెండా లేకుండానే ఆదరబాదరగా సమావేశం నిర్వహించారు. దీనకంతటికి కారణం పాత కమిషనరే సహకరించకపోవడమేనని చైర్పర్సన్ పదే పదే చెప్పేవారు. కాని పాత కమిషనర్ వెళ్లిపోయాడు. కొత్త కమిషనర్ వచ్చి నెలరోజులు దాటింది కాని.. నేటికీ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు. అసలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలే ని పరిస్థితి. దీంతో 14వ ఆర్థిక సంఘానికి చెందిన దాదాపు రూ.4 కోట్ల పనులు కౌన్సిల్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. దీనికితోడు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఆమోదం పొందక పోవడంతో ఐదు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేక అల్లాడుతున్నారు. ఐదుశాతం కమీషన ముందే ఇవ్వాలి..? కోదాడ మున్సిపాలిటీలో 14వ ఆర్థిక సంఘానికి చెందిన దాదాపు రూ.4కోట్ల విలువైన పనులకు గతంలో టెండర్లు పిలిచారు. వాటిని తెరిచారు. ఇక సమావేశంలో వాటిని పెట్టి ఆమోదించి కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్ ఇవ్వడమే తరువాయి. కాని పాత కమిషనర్కు, చైర్పర్సన్కు మధ్య ఉన్న విభేదాలతో సంవత్సర కాలంగా అవి వాయిదా పడ్డాయి. త్వరలో నిర్వహించే సమావేశ ఎజెండాలో సదరు పనులను పెట్టాలంటే ముందుగానే తమకు 5 శాతం వాట ఇవ్వాలని కొందరు పెద్దలు భేరం పెట్టినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కోదాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు 15 మంది కాంట్రాక్టర్లు గత బుధవారం సమావేశమై దీనిపై తీవ్రంగా చర్చించినట్లు తెలిసింది. కొందరు ఇవ్వడానికి అంగీకరించగా మరికొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇది ఎటూ తెమలకపోవడంతో సమావేశం నిర్వహించంకుండానే జూలై నెల గడిచిపోయింది. పాపం..పారిశుద్ధ్య కార్మికులు..! మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీరి కాల పరిమితి మార్చి నెలతో ముగిసిపోయింది. ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టర్ లేక పోవడంతో కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. పాత కాంట్రాక్టర్ మార్చి నెల జీతం ఇవ్వలేదు. తరువాత నాలుగు నెలలు ఏజెన్సీ లేక పోవడంతో మొత్తం ఐదు నెలలుగా వారికి వేతనాలు లేవు. కొత్త ఏజెన్సీ టెండర్లు ఆమోదించడానికి కూడా భారీ మొత్తంలో కొందరు పాలకులు డిమాండ్ చేస్తుండడంతో ఇది కార్మికుల వేతనాలపై ప్రభావ చూపుతుందని కొందరు కౌన్సిలర్లే అంటున్నారు. మొత్తం మీద కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో, మరి ఈ ఆరోపణలకు ఎప్పుడు తెరదించుతారో వేచి చూడాలి. ఆరోపణలు చేసేవారి గురించి ప్రజలకు తెలుసు –వంటిపులి అనిత, చైర్పర్సన్ కోదాడ మున్సిపాలిటీలో అవినీతి పరుడైన పాత కమిషనర్ను అడ్డుపెట్టుకొని పనులు జరగకుండా చేసినవారే ఇప్పుడు పసలేని ఈ ఆరోపణలు చేస్తున్నారు. వారి గురించి పట్టణ ప్రజలకు అంతా తెలుసు. మున్సిపాలిటీలో హరితహారం జరుగుతుంది. ఆగస్టు 3న మెగా ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. అందువల్లే సమావేశం పెట్టడం ఆలస్యం అవుతుంది. ఎజెండా తయారవుతుంది. మరో వారం పది రోజుల్లో సమావేశం పెడతాము. పట్టణ ప్రజల సమస్యలు తీర్చడానికి కషి చేస్తున్నాం. ఈ లాంటి ఆరోపణలు పట్టించుకోం. -
లా కమిషన్ ఛైర్మన్ గా బల్బీర్ సింగ్
21వ లా కమిషన్ చైర్మన్ గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బల్బీర్ సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. గత సెప్టెంబర్ నుంచి ఖాళీగా ఉన్న చైర్మన్ పోస్టులో ప్రభుత్వం చౌహాన్ ను భర్తీ చేసినట్లు న్యాయశాఖామంత్రి డి వి సదానందగౌడ ఓ ట్వీట్ లో తెలిపారు. 66ఏళ్ళ జస్టిస్ చౌహాన్ ప్రస్తుతం కావేరీనది నీటి వివాదల ట్రిబ్యునల్ లో ఉన్నారు. జస్టిస్ చౌహాన్ 2009 నుంచి 2014 జూలై వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన జూలై 2008 నుంచి 2009 మే వరకూ ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి చైర్మన్ పోస్ట్ ఖాళీగానే ఉండగా... లా ప్యానెల్ సభ్యులుగా గతేడాది మేలో పదవీ విరమణ చేసిన 62 ఏళ్ళ గుజరాత్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి రవి ఆర్ త్రిపాఠీని నియమించారు. అయితే అప్పట్నుంచీ పెండింగ్ లోనే ఉన్న లా కమిషన్ ఛైర్మన్ ఎంపిక మాత్రం అనేక కారణాలతో ఆలస్యం అవుతూనే వచ్చింది. లా కమిషన్ ఛైర్మన్ ఎంపిక కోసం గతేడాది ప్రధానమంత్రి కార్యాలయానికి... న్యాయ మంత్రిత్వ శాఖ 48 మంది హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల జాబితాను పంపింది. 20వ లా కమిషన్ ఛైర్మన్ పదవీకాలం గత ఆగస్టు 30 తో పూర్తవ్వడంతో సెప్టెంబర్ 9 నాటికి 21వ లా కమిషన్ ఛైర్మన్ ను ఎంపిక చేసేందుకు అప్పట్లో న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 నాటికే 21వ లా ప్యానెల్ సృష్టించాలని ప్రకటన కూడ ఇచ్చింది. అయితే అప్పటినుంచీ పెండింగ్ లో ఉన్న లా కమిషన్ చైర్మన్ పదవిలో చివరికి బల్బీర్ సింగ్ చౌహాన్ ను నియమించినట్లు వెల్లడించింది. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
సరైన ఫైనాన్షియల్ ప్లానర్ ఎంపిక ఎలా? ప్రస్తుతం మంచి ఫైనాన్షియల్ ప్లానర్ను ఎంచుకోవడమనేది చాలా కష్టమైన విషయమే. అనువైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడానికి ముందు చాలా విషయాలు చూడాలి. ఇందులో భాగంగానే మన అవసరాలను, ఆర్థిక లక్ష్యాలను గుర్తించాలి. ఉదాహరణకు మీకు ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని భావిస్తున్నప్పుడు.. ముందుగా ఇన్సూరెన్స్ లెసైన్స్ కలిగిన, వాటి గురించి సలహాలను అందించే ప్లానర్ను సంప్రదించాలి. వివరాల సేకరణ ప్రధానం. ఫైనాన్షియల్ ప్లానర్ అర్హతలు, ఇతర విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ ఫైనాన్షియల్ ప్లానర్ మనకు అవసరమైన సేవలను అందించగలరా? లేదా? అనేది అర్థమౌతుంది. అలాగే తన అనుభవాన్ని కూడా పరిగనలోకి తీసుకోండి. కొందరు ఫైనాన్షియల్ ప్లానర్స్ వారి క్లయింట్స్కు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. మరి కొందరైతే తమ టీమ్ ద్వారా సేవలందిస్తుంటారు. అందుకే మీరు ఫైనాన్షియల్ ప్లానర్ను కలిసి ఈ వివరాలన్నీ అడగండి. ఫైనాన్షియల్ ప్లానర్ తన టీమ్తో కలిసి పనిచేస్తారా? మీ ఖాతాను ఎవరు నిర్వహిస్తారు? వంటి అంశాలను తెలుసుకోండి. కొందరు ప్లానర్స్ కొన్ని అంశాలకు సంబంధించి రిజిస్టర్ చేసుకుంటారు. అంటే వారు కొన్ని విషయాల్లోనే నిష్ణాతులై ఉంటారు. ఉదాహరణకు కొందరు మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి మాత్రమే సలహాలిస్తుంటారు. కాబట్టి మీ ప్లానర్ దేన్లో నిష్ణాతులన్నది తెలుసుకున్నాకే ఒక నిర్ణయానికి రండి. ఫైనాన్షియల్ ప్లానర్కు ఎక్కువ ఖర్చవుతుందని భావిస్తే.. మీకు కావలసిన సేవలకు వారు ఎంత చార్జ్ చేస్తున్నారో ముందు తెలుసుకోండి. ప్లానర్స్ కమీషన్తో పాటు పలు ఫీజుల్ని కూడా వసూలు చేస్తారు. వీటిని ముందే తెలుసుకోండి. అలాగే ప్లానర్ ఎక్కడి నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారో గమనించండి. ప్లానర్ ఎంపికలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ది కూడా కీలకపాత్రే. -
ఏపీలో నో వేకెన్సీ!
-
ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తున్నా..!
విద్యార్థుల సమక్షంలోనే ఒప్పుకున్న కాంట్రాక్టర్ జేఎన్టీయూ మెస్ నిర్వహణపై విద్యార్థుల ఆందోళన మెదక్(పుల్కల్): సుల్తాన్పూర్ జేఎన్టీయూలో మెస్ నిర్వహణకుగాను కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి తాను ఎమ్మెల్యేకు నెలకు రూ.50 వేల కమీషన్ ఇస్తున్నానంటూ విద్యార్థుల సమక్షంలోనే పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తమ వద్ద మెస్ బిల్లులు వసూలు చేస్తూ నాణ్యమైన భోజనం పెట్టకుండా ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తే తమ కేం సంబంధంమంటూ కాంట్రాక్టర్ను నిలదీసి, మంగళవారం రాత్రి మరోమారు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదు రోజులుగా జేఎన్టీయులో మెస్ నిర్వహణ సక్రమంగా లేదంటూ మంగళవారం నుంచి విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో క్యాంపస్ ప్రిన్సిపాల్ కాంట్రాక్టర్ను మార్చి కొత్త వారిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు ఆందోళన విరమించలేదు. దీంతో బుధవారం సాయంత్రం కాంట్రాక్టర్ వచ్చి అన్నం బాగానే ఉందని విద్యార్థులే ఉద్దేశ పూర్వకంగా గొడవలు చేస్తున్నారన్నారు. దీంతో విద్యార్థులు తాము మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తుంటే ఉద్దేశపూర్వకంగా గొడవలు చేస్తున్నామంటారా.. ఓ సారి మీరే అన్నం తిని చూడండంటూ కాంట్రాక్టర్ను నిలదీశారు. సెలవులో వెళ్లినా మొత్తం మెస్ చార్జీలు చెల్లించాల్సిందే.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల నుంచి నెలకు రూ.2,400 లను మెస్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ టెండర్ సమయంలో పేర్కొన్న మాదిరిగా మెనూ ఇవ్వడం లేదు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, సాయంత్ర భోజనం పెట్టాలి. సెలవుపై మూడు రోజులకు మించి వెళ్తే అట్టి డబ్బులను నెలవారీగా డబ్బులు చెల్లించే సమయంలో మినహాయించి ఇవ్వాలి. అయితే ఇక్కడి ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్ కుమ్మక్కై సెలవుపై వెళ్లినా.. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయి మెస్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులు పీడీని, కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే వారివద్ద సమాధానం లేదు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మంచి భోజనం పెట్టకుంటే కాంట్రాక్టు రద్దు చేయండి: ఎమ్మెల్యే మెస్ నిర్వహణ సక్రమంగా లేకపోతే కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి కాంట్రాక్టును రద్దుచేయాలని ఎమ్మెల్యే బాబూమోహన్ జేఎన్టీయూ ప్రిన్సిపాల్ను ఆదేశించారు. మెస్ కాంట్రాక్టర్ నెలకు రూ.50వేల మామూళ్లు ఇస్తున్నట్లు వచ్చిన ఆరోపణపై ఎమ్మెల్యేను వివరణ కోరగా తాను ఎవరివద్దా డబ్బులు తీసుకోలేదని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే నోటీసులు జారీ చేసి టెండర్ను రద్దుచేయాలని సూచించారు. -
పైసల యావ.. కమీషన్ల హవా..!
విద్యుత్ కేబుళ్ల యూజీ, ఏబీ పనుల్లో కమీషన్ల దందా కొనసాగుతోంది. నాసిరకం కేబుళ్లతో పాటు వాటిని తక్కువ లోతులో అమర్చుతూ కాంట్రాక్టర్లు అందినకాడికి పైసలు దండుకుంటున్నారు. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. వెరసీ నాసిరకం కేబుళ్లతో విద్యుత్ సరఫరాలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 కేవీ సబ్స్టేషన్లు పది ఉండగా, 33/11కేవీ సబ్స్టేషన్లు 300పైగా ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు రెండు వేల ఫీడర్లు, 90 వేల కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఉన్నాయి. సబ్స్టేషన్ల నుంచి గృహాలకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ లైన్లన్నీ నేటికీ ఓవర్హెడ్ లైన్లే. నిజాం కాలం నాటి వైర్లు కావడంతో ఎండ తీవ్రతకు సాగుతూ, గాలివానకు తెగి పడుతున్నాయి. కోర్ సిటీలో చాలా వరకు చెట్ల కొమ్మల మధ్యలో ఉండిపోయాయి. దీంతో తరచు షార్ట్సర్క్యూట్స్ ఏర్పడి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిస్కం భావించింది. చెట్ల కొమ్మలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎయిర్బంచ్డ్ (ఏబీ) కేబుళ్లు, హైటెన్షన్ ఓవర్హెడ్ లైన్స్ స్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 306 కిలో మీటర్ల యూజీ కేబుల్ అమర్చగా, మరో 300 కిలో మీటర్లు ఏవీ కేబుల్స్ వేశారు. కేబుల్తో పాటు నాసిరకం పనుల వల్ల వేసిన కొద్ది రోజులకే ఒత్తిడిని తట్టుకోలేక కాలిపోతున్నాయి. ట్రాన్స్కో, మాస్టర్ ప్లాన్ మధ్య సమన్వయలోపం.. అండర్ గ్రౌండ్ కేబుల్స్ తవ్వకాల విషయంలో ట్రాన్స్కో, మాస్టర్ప్లాన్ విభాగాల మధ్య సమన్వయం లేదు. 11 కేవీ, 33 కేవీ పనులు మాస్టర్ ప్లాన్ పర్యవేక్షిస్తుంది. 130 కేవీ, 220 కేవీ, 400 కేవీ సబ్స్టేషన్ల పనులను ట్రాన్స్కో చూస్తుంది. కొత్తగా నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్లకు 130 కేవీ సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందు కోసం వీటి మధ్య యూజీ కేబుల్ అమర్చుతున్నారు. ఒకే శాఖలోని ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒకరు తవ్విన కొద్ది రోజులకే మరొకరు తవ్వి ఒకరు వేసిన లైన్పైనే మరో లైన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక కాంట్రాక్టర్ వాడిన ఇసుక, బండలనే మరో గుత్తేదారు వాడుతూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్నాడు. ఇలా ఒకే చోట రెండు మూడు సార్లు తవ్వకాలు జరపడం, నాసిరకం పనుల వల్ల కేబుళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇటీవలే పూర్తై పాటిగడ్డ సబ్స్టేషన్కు హుస్సేన్సాగర్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. ఇందు కోసం రెండు త్రీ కోర్ 33 కేవీ కేబుళ్లు వేస్తున్నారు. దీనికి 1.2 మీటర్లు లోతు తవ్వాల్సి ఉండగా, ఆ కాంట్రాక్టర్ ఐమాక్స్ నుంచి మింట్కంపౌండ్ వెళ్లే దారిలో అర మీటరు కూడా తవ్వలేదు. నిత్యం డిస్కం ఉన్నతాధికారులు సంచరించే ఈ ప్రాంతంలోనే పనులు ఇలా ఉంటే శివారు ప్రాంతాల్లో ఎంత నాసిరకంగా ఉంటున్నాయో ఇట్టే ఊహించవచ్చు. నాణ్యతను పరీక్షించకుండానే బిల్లులు.. రోడ్డు కటింగ్కు కోర్సిటీ పరిధిలో మీటరుకు గరిష్టంగా రూ.6 వేలు జీహెచ్ఎంసీకి చెల్లిస్తుంది. గుత్తేదారు తవ్వకం పనికి రూ.6 వేలపైగా అందిస్తారు. కాంట్రాక్టర్ చేసిన పనుల్లో నాణ్యతను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోల్ సెల్ అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి పనులను పర్యవేక్షించకుండానే గుడ్డిగా బిల్లు చెల్లిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ ల హబ్సీగూడ ఎన్జీఆర్ఐ వద్ద కేబుల్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఎనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కిమ్స్, హుస్సేన్సాగర్ మక్తా, బోయిన్పల్లి, జేబీఎస్, హస్మత్పేట్, పాపిరెడ్డి కాలనీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, కాచిగూడ, తాళ్లగడ్డ, ఉస్మానియా, జూబ్లిహిల్స్లోసమస్యలు తలెత్తాయి. తాజాగా చిలకలగూడ నుంచి బన్సీలాల్పేట సబ్స్టేషన్ వరకు వేసిన యూజీ కేబుల్ భోలక్పూర్ ప్రధాన రహదారిలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. -
పెంచిన కమీషన్ వెంటనే చెల్లించాలి
విజయనగరం కంటోన్మెంట్: రేషన్ డీలర్లకు పెంచిన కమీషన్ను వెంటనే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వరరావు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కె.నిర్మలాబాయిని కోరారు. బుధవారం ఆయన జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో కలిసి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంచిన కమీషన్ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న కమీషన్ సరిపోక డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో డిపోల నిర్వహణ కష్టసాధ్యంగా ఉందని వాపోయారు. పెంచిన కమీషన్ను వెంటనే చెల్లించకపోతే సరుకులు పంపిణీ చేయలేమన్నారు. జిల్లాలోని 305 రేషన్ దుకాణాల్లో ఈ-పోస్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నెట్వర్క్ సరిగా లేకపోవడం, 3జీ సిమ్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. డీఎస్వో నిర్మలాబాయి మాట్లాడుతూ డీలర్లకు ప్రకటించిన కమీషన్ త్వరలోనే ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారన్నారు. త్వరలోనే పెంచిన కమీషన్ను చెల్లిస్తామని, ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం సరుకులను ఈ-పోస్ విధానంలోనే పంపిణీ చేయాలని డీలర్లను కోరారు. జిల్లా డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు సముద్రపు రామారావు మాట్లాడుతూ ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ-వెయింగ్ అమలు చేయడం లేదన్నారు. దీనివల్ల తూకంలో తక్కువ సరుకులు వస్తున్నాయన్నారు. మరోవైపు హమాలీలకు ఎక్కువ కూలీ ఇవ్వాల్సి వస్తున్నదన్నారు. ఈ-పోస్ ద్వారా సరుకులు పంపిణీ చే స్తున్న డీలర్లకు పెంచిన కమీషన్ను వెంటనే ఇవ్వాలన్నారు. లేకుంటే వచ్చే నెల నుంచి ఈ-పోస్ మెషీన్లు అధికారులకు అప్పగించి సాధారణ తూకం ద్వారా సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎస్వో ఐబీ.సుబ్రహ్మణ్యం, శంకర్ పట్నాయక్, కేఏజే గుప్త, అప్పారావు, జగ్గయ్యశెట్టి, కె.భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
ఏడోసారీ రూ.15 కోట్లే
రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ వార్షిక జీతభత్యాలు న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వరుసగా ఏడో ఏడాది తన జీతభత్యాలను రూ. 15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ 2008-09 నుంచి ఈ విధానం పాటిస్తున్నారు. అప్పట్లో సీఈవోల భారీ వేతనాలపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల అంబానీ ఏటా రూ. 24 కోట్లు వదులుకుంటున్నట్లవుతోంది. రూ. 38.86 కోట్ల మేర జీతభత్యాలు, కమీషన్ కింద అందుకునేందుకు అనుమతులు ఉన్నప్పటికీ .. ఒక మోస్తరు స్థాయికే కట్టుబడి ఉండటానికి ఆయన మొగ్గు చూపుతున్నారని 2014-15 ఆర్థిక సంవత్సర ఫలితాల వెల్లడిలో కంపెనీ పేర్కొంది. జీతం కింద రూ. 4.16 కోట్లు, ఇతర భత్యాల కింద రూ. 60 లక్షలు, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ. 82 లక్షలు, లాభాలపై కమీషన్లు రూ. 9.42 కోట్లు అంబానీ అందుకున్నారు. మరోవైపు, ముఖ్య అధికార్లలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వేతనం ఎలాంటి మార్పులు లేకుండా రూ. 6.03 కోట్లుగా ఉంది. ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ.. నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హోదాలో రూ. 5 లక్షలు సిట్టింగ్ ఫీజు కింద, రూ. 78.64 లక్షలు కమీషన్ కింద అందుకున్నారు. -
గిరిజనుల స్థితిగతుల అధ్యయనానికి కమిషన్
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసింది. విశ్రాంత అధికారి ఎస్.చెల్లప్ప అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ ఆరు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనులు, ముస్లిం మైనారిటీలకు విద్య, ఉద్యోగావకాశాల్లో 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ సాధారణ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ఈ హామీని పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఒకవైపు గళమెత్తుతుండడం, మరోవైపు త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులకు ప్రాధాన్యం ఏర్పడింది. విచారణ కమిషన్లో సభ్యులుగా విశ్రాం త ఐపీఎస్ అధికారి కె.జగన్నాథరావు, హెచ్.కె.నాగు ఉన్నారు. ఈ కమిషన్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి జనాభా, సాంఘిక అంశాలపై అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారి విద్య, ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తుంది. షెడ్యూల్డ్ తెగల కేటగిరిలో ఎన్ని జాతుల వారున్నారనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ కమిషన్ ఆరు మాసాల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. రాష్ర్టంలో పెరిగిన గిరిజన జనాభా, వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, తమను ఎస్టీలుగా పరిగణించాలంటూ వాల్మీకి బోయ, ఖైతి లంబాడాలు ఇచ్చిన వినతిపత్రం పరిశీలన, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు/సంస్థల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ముస్లింల స్థితిగతులపై కమిషన్ తెలంగాణలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.సుధీర్, సభ్యులుగా రిటైర్డ్ సీనియర్ అధ్యాపకుడు ఎంఏ బారీతో పాటు మరొకరిని నియమించారు. ముస్లింల ఉపాధి, సంక్షేమం, పథకాల అమలు, తదితర అంశాలపై సమగ్ర సర్వే, విచారణ జరిపి ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
'మధ్యాహ్న భోజన పథకం ఇస్కాన్ కు వద్దు'
కర్నూలు: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నా భోజన పథక నిర్వాహకులు సోమవారం ధర్నాకు దిగారు. జిల్లాలోని వంట ఏజెన్సీ నిర్వాహకులందరూ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇస్కాన్ సంస్థ ఎక్కడో వండిన ఆహారాన్ని తెచ్చి పిల్లలకు పెడుతుందని..దానివల్ల శరీరంలో వేడి తగ్గి ఆహార నాణ్యత లోపిస్తుందని వారు తెలిపారు. ఆ సంస్థ వారు పిల్లలకు గుడ్డు కూడా అందించటం లేదని అన్నారు. ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా ఇస్కాన్కు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. బిల్లులు రాలేదని చెప్పి ఆరు నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాసిరకం బియ్యం సరఫరా చేస్తోందని, దానివల్ల పిల్లలకు పౌష్టికాహార లోపం తలెత్తే ప్రమాదం ఉందని నిర్వాహకులు అన్నారు. -
కమీషన్ల కక్కుర్తి
డ్వాక్రా సంఘాల నుంచి ఐకేపీ సిబ్బంది అక్రమ వసూళ్లు లక్ష రూపాయల రుణం ఇస్తే రూ.2 వేలు పైనే ముడుపులు పీఆర్పీలు, సీవోలు, సీసీ, సమాఖ్య ప్రతినిధులకు వాటాలు జనశ్రీ బీమా సొమ్ము అందజేతలోనూ చేతివాటం చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు మచిలీపట్నం : డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు సహకరించాల్సిన సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. ఏదైనా డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల రుణం వస్తే రెండు నుంచి మూడు శాతం కమీషన్ రూపంలో కాజేస్తున్నారు. ఇందిరా క్రాంతి పథం, మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాల పనితీరును పర్యవేక్షంచి వారికి వివిధ బ్యాంకుల్లో రుణాలు మంజూరయ్యేందుకు సిఫార్సు చేయాల్సిన సిబ్బంది ఇందుకు గాను కమీషన్లు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 58,250 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 27,321 సంఘాలకు రూ.893.66 కోట్లు, ఈ ఏడాది 6,912 గ్రూపులకు రూ.236.57 కోట్లు రుణాలుగా అందజేశారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణం మంజూరైన వెంటనే సంఘానికి సంబంధించిన లీడర్, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్, రిసోర్స్ పర్సన్, గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు, బుక్కీపర్లు, బ్యాంకు మిత్ర తదితరులకు నగదు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా ఒక డ్వాక్రా సంఘం బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకుంటే వెయ్యి రూపాయలు కమ్యూనిటీ కో-ఆర్డినేటరుకు, రూ.200 నుంచి రూ.300 గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు, రూ.200 బుక్ కీపరుకు, రూ.100 బ్యాంకు మిత్రకు, మరో రూ.200 ఇతరత్రా ఖర్చుల కోసం కమీషన్ రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. లక్ష రూపాయలకు రూ.2 వేలు చొప్పున కమీషన్లకే సరిపోవటంతో బ్యాంకులో రుణం తీసుకున్న డ్వాక్రా సంఘ సభ్యులకు అప్పులు మిగులుతుండగా ఐకేపీ, మెప్మాలలో పనిచేస్తున్న సిబ్బంది లక్షలు కళ్లజూస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.100 కోట్లు రుణాలుగా అందజేస్తే దీనిలో రూ.2 కోట్లు కమీషన్ల రూపంలోనే సమర్పించాల్సిన దుస్థితి నెలకొంది. ఇంతా జరుగుతున్నా ఈ కమీషన్ల వ్యవహారాన్ని కట్టడి చేసే వారే కరువయ్యారు. రుణాలు మంజూరు చేసేదిలా... డ్వాక్రా సంఘానికి రుణం మంజూరు చేయాలంటే ఈ సంఘం సక్రమంగా పనిచేస్తున్నట్లు ముందుగా గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ధ్రువీకరించాలి. అక్కడి నుంచి ఈ సంఘం ఏ ఇతర బ్యాంకులోనూ రుణం తీసుకోలేదని కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ధ్రువీకరిస్తూ సంతకాలు చేయాలి. గ్రామైక్య సంఘాల వద్ద ఉండే బుక్కీపర్లు దీనికి సంబంధించిన రికార్డులు రాయాలి. దీంతో పాటు రిసోర్స్పర్సన్లు డ్వాక్రా సంఘం సక్రమంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ చేయాలి. వీరంతా సంతకాలు చేసి సంబంధిత పత్రాలను బ్యాంకులో సమర్పించిన తర్వాత.. అన్నీ సక్రమంగా ఉంటే బ్యాంకు మేనేజరు రుణం మంజూరు చేస్తారు. రుణం మంజూరైన వెంటనే గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, బుక్కీపర్లు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లకు మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది రూ.236.57 కోట్లు మాత్రమే రుణాలుగా అందజేసినా, కమీషన్ల రూపంలో రూ.4.7 కోట్లు చేతులు మారటం గమనార్హం. జనశ్రీ బీమా మంజూరులోనూ చేతివాటం డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు ఎవరైనా మరణిస్తే వారికి జనశ్రీ బీమా యోజన పథకం ద్వారా బీమా సొమ్ము చెల్లిస్తారు. ఎవరైనా సభ్యురాలు సహజ మరణం పొందితే ఆమె కుటుంబానికి రూ.30 వేలు అందజేస్తారు. గత ఏడాది జనశ్రీ బీమా యోజన పథకాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న బందరు మండలంలో ఐకేపీలో పనిచేసిన ఓ ఎకౌంటెంట్ దాదాపు రూ.50 లక్షల వరకు సొమ్ము కాజేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ను, ఎకౌంటెంట్ను సస్పెండ్ చేసిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ సొమ్ము ఇప్పటి వరకు రికవరీ కాకపోవటం గమనార్హం. తాజాగా మచిలీపట్నం పురపాలక సంఘంలోని 34వ వార్డులో ఓ డ్వాక్రా మహిళ చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యురాలు వరలక్ష్మి నామినీగా ఉన్నారు. ఈ వార్డులో వరలక్ష్మి అనే మహిళ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన బీమా మిత్ర నామినీ ఖాతాలో కాకుండా రిసోర్స్ పర్సన్ ఖాతాలో ఈ నగదును జమ చేయించి గుట్టుచప్పుడు కాకుండా డ్రా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేకం జరుగుతూనే ఉన్నాయని, అధికారులు వీటిపై దృష్టిపెట్టాలని పలువురు డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. -
తెలిసే ఓకే అంటున్నారా!
బీమా రంగం గత దశాబ్ద కాలంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో మార్పులు, సంస్కరణలు సైతం అంతే వేగంగా ఉన్నాయి. ఇదే సమయంలో బీమా కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. ‘పాలసీ విషయంలో ఏజెంట్ మోసం చేశాడని కొందరు... తప్పుడు సమాచారం ఇచ్చాడని మరికొందరు... తనకొచ్చే కమిషన్పైనే దృష్టి పెట్టాడని ఇంకొందరు..’ ఇలా ఫిర్యాదులు రకరకాలుగా ఉంటున్నాయి. తప్పెవరిది? తీసుకున్న పాలసీ అవసరాలకు తగిన విధంగా లేదంటే తప్పెవరిది? తప్పంతా ఏజెంట్దేనా? అవగాహన లేకుండా, నియమ నిబంధనలు చూడకుండా పాలసీ కొనేసిన కస్టమర్కు ఇందులో పాత్రేమీ లేదా? వంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. రెండు దశాబ్దాల నుంచీ జీవిత బీమా రంగంలో ఉంటున్న నేను ఈ సందర్భంగా చెప్పేది ఒక్కటే. సంబంధీకులో లేక స్నేహితులో చెప్పారని వారిని సంతృప్తిపరచడం కోసం పాలసీ తీసుకోవడం లేదా పన్ను భారం తగ్గించుకోవడం కోసం అవగాహన లేకుండా ఏజెంట్ చెప్పిన పాలసీ తీసుకోవడం మంచిది కాదు. పాలసీ తీసుకునే ముందు వీటిని తప్పక పరిశీలించాలి. 1. విశ్వసనీయత: పాలసీ కొనుగోలుకు ముందు ఈ విషయంలో మీకు సలహాలు ఇస్తున్న ఏజెంట్ విశ్వసనీయతపై దృష్టి పెట్టాలి. ఏ బీమా సంస్థలో పనిచేస్తున్నాడు. వృత్తిపరంగా పూర్తి అవగాహన, సామర్థ్యం ఉన్న వ్యక్తేనా? అతని గుర్తింపు ఏమిటి? లెసైన్స్ ఉందా? ఇత్యాది అంశాలను పరిశీలించడం ముఖ్యం. 2. ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? ఒక పాలసీ తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యం, వ్యయాలు, అలవాట్లు, ఆదాయాల గురించి బాగా ఆలోచించాలి. ఆయా అంశాల ప్రాతిపదికన ఈ రంగంలో అపార అనుభవం కలిగిన ఏజెంట్ సలహా తీసుకోవాలి. 3. అవసరాలు ముఖ్యం: అవసరాలకు, ఇబ్బందులను అధిగమించడానికి అనుగుణంగా ఏ పాలసీ బెటరన్న అంశంపై చర్చించాలి. సాంప్రదాయ బీమా ప్రణాళిక మంచిదా? లేక యులిప్ బాగుంటుందా? యులిప్ అయితే మీకు పెట్టుబడికి తగిన ఫండ్ ఏది? ఇవన్నీ అవగాహనలో భాగం కావాలి. 4. తుది నిర్ణయం మీదే కావాలి: పాలసీ తీసుకోవడంలో తుది నిర్ణయం మీదే కావాలి. మీ అవసరాలు, బడ్జెట్కు తగిన బీమా ప్రణాళికపై ఒక ఏజెంట్ సలహా తరువాత ఆ తరహా ప్రొడక్ట్పై వివిధ బీమా సంస్థలు అందిస్తున్న ప్రయోజనాలు, ఆయా వివరాలను వెబ్సైట్లు లేదా ఇతర సాధనాలతో ధ్రువీకరించుకోవాలి. 5. ముఖ్య ప్రశ్నలు ఇవి..: బీమాకు ఎంత చెల్లించాలి? ఎంతకాలం చెల్లించాలి? సానుకూలతలు, ప్రతికూలతలు ఏమిటి? ఏ రైడర్లను జతకలుపుకోవచ్చు? ప్రీమియం చెల్లింపులు? అవకాశాలు ఏమిటి? వంటి ప్రశ్నలపై మీకుగా మీరు అవగాహనకు రావాలి. ఏజెంట్ నుంచే కాకుండా సంస్థ నుంచి సమాచారం పొందవచ్చు. 6. ప్రపోజల్ పత్రాన్ని మీరే నింపాలి: ఈ అంశాన్ని ఏజెంట్కు వదిలివేయడం మంచిదికాదు. వివరాలు ఇచ్చే విషయంలో మీ ఆరోగ్యం, ఆర్థిక, జీవన విధానం... ఇలా ఏ విషయంలోనూ తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. 7. బాండ్ ఒరిజినల్స్ను పొందాలి: పాలసీ ఒరిజినల్ పత్రాలన్నింటినీ తెప్పించుకునే బాధ్యత మీదే. నిర్దిష్ట సమయంలో మీ ఏజెంట్ లేదా బీమా కంపెనీ నుంచి ఈ పత్రాలన్నింటి ‘హార్డ్ కాపీ’లను మీరు పొందగలగాలి. 8. సరిచూసుకోవాలి: బాండ్ను పూర్తిగా అధ్యయనం చేసి, అర్థం చేసుకోవాలి. మీ అవసరాలకు తగిన విధంగా పాలసీ ఉందా... లేదా అన్నది దీనితో స్పష్టమైపోతుంది. ఏవన్నా సందేహాలు ఉన్నా... ఇంకా చెప్పాలంటే పాలసీని విత్డ్రా చేసుకోవాలన్నా ‘ఫ్రీ లుక్ పీరియడ్’లో ఏజెంట్ను లేదా బీమా కంపెనీని వెంటనే సంప్రదించాలి. 9. నామినీకీ తెలియాలి: మీరు తీసుకునే పాలసీపై మీకు మాత్రమే చైతన్యం ఉంటే సరిపోదు. ఆయా అంశాలన్నింటిపై మీ నామినీకి కూడా మంచి అవగాహన కల్పించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు తీసుకునే పాలసీకి సంబంధించి మీకు పూర్తి న్యాయం జరుగుతుంది. ప్రయోజనాలూ ఉంటాయి. 10. సకాలంలో ప్రీమియంలు: మీరు ఒకసారి పాలసీ తీసుకున్నారంటే... దానిని ఎట్టి పరిస్థితులలోనూ కొనసాగించేలా ఉండాలి. ప్రీమియంలు కట్టడం మానివేసి, దానిని మురిగిపోనీయవద్దు. ప్రీమియంలు సకాలంలో చెల్లించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
చాపకింద నీరులా.. ‘హవాలా’!
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హవాలా మార్గంలో పెద్ద ఎత్తున సొమ్ము రాష్ట్రంలోకి చాప కింద నీరులా చేరుతోంది. కమీషన్ కోసం ఆశపడి పలువురు యువకులు ఈ మార్గంలో సొమ్ము తరలించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో పోలీసులకు కూడా ఈ హవాలా రాకెట్ను అరికట్టడం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో ఖర్చుల నిమిత్తం పలువురు రాజకీయ నాయకులు లెక్కకు మించి సొమ్ము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనికోసం వివిధ మార్గాల్లో సొమ్మును సేకరించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ‘హవాలా’ సొమ్ము వరదలా రాష్ర్టంలోకి చేరుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై డేగ కళ్లతో సోదాలు చేస్తున్నారు. ఇటీవల భాండూప్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ నితిన్ గిజే నేతృత్వంలోని బృందం దాడుల్లో రూ.25 లక్షల నగదు పట్టుబడింది. ఈ మొత్తాన్ని కువైట్ నుంచి హవాలా మార్గం ద్వారా భారత్కు తరలించినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం భాండూప్లోని సోనాపూర్ ప్రాంతంలో కూరగాయల సంచిలో రూ.25 లక్షలు తీసుకుని ఆటో వెళుతున్నట్లు సమాచారం అందింది. దీంతో నితిన్ నేతృత్వంలోని బృందం డబ్బును తీసుకెళుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహబూబ్ అలీఖాన్ (60), ఇనాముల్ ఖాన్ (32), రాంప్రసాద్ యాదవ్ (36)గా గుర్తించారు. ఈ మొత్తాన్ని తన కుటుంబ సభ్యుడొకరు కువైట్ నుంచి తీసుకుని వచ్చినట్లు మహబూబ్ వెల్లడించాడు. ప్రతీ జిల్లాలో ఇలా హవాలా మార్గంలో డబ్బు తీసుకొచ్చేవారు దాదాపు వందకుపైనే ఉన్నట్లు వీరు వెల్లడించారు. కమీషన్ డబ్బులకు ఆశపడి పలువురు యువకులు ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.2.72 కోట్ల సొమ్ము హవాలా మార్గంలో వచ్చినట్లు పట్టుబడిన ఓ ఏజంట్ తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డబ్బు.. మంచినీళ్ల ప్రాయం ఎలాంటి ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం పరిపాటిగా మారింది. ఇందులో కొంత డబ్బు అధికారికంగా ఖర్చు చేయగా ఎక్కువ శాతం డబ్బు గుట్టుచప్పడు కాకుండా చేస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డబ్బులు ఖర్చు చేయడం మరింత ఎక్కువవుతుంది. ఈ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సొంతంగా బరిలో దిగడంవల్ల అభ్యర్థులకు విజయం కత్తిమీద సామే. ముఖ్యంగా ఈ ఎన్నికలను వారు సవాలుగా తీసుకుని శక్తినంతా కూడగట్టుకుని ప్రచారాలు చేస్తున్నారు. సభలు, ర్యాలీలు, ఇంటింటికి తమ గురించి ప్రచారం చేయడం తదితరాలకు ప్రతీ అభ్యర్థికి సుమారు రూ.8-10 కోట్లు వృథా కానున్నాయి. నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఖర్చు ఇలా ... 1. ప్రతి సంఘానికి, హౌసింగ్ సొసైటీ సంస్థలకు రూ.50- 60 వేలు రహస్యంగా చెల్లిస్తారు. 2. ప్రతి ప్రచార కార్యక్రమానికి వచ్చే ఒక్కో అద్దె కార్యకర్తకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. 3. మహిళా సంఘాలకు రహస్యంగా రూ.10-15 వేలు చెల్లిస్తారు. 4. రోజూ భోజనం, అల్పాహారానికి రూ.15-20 వేలు ఖర్చు. 5. ఆఖరు రోజు ఒక్కో ఓటరుకు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు గుట్టుచప్పుడు కాకుండా ఇస్తారు. 6. ఎన్నికల రోజు పార్టీ బూత్లో కూర్చుండే ఒక్కో కార్యకర్తకు రూ.1,500, పదాధికారికి రూ.4-5 వేలు చెల్లిస్తారు. 7. తాత్కాలిక పార్టీ బూత్ నిర్మాణానికి దాదాపు రూ. మూడు వేలు ఖర్చు. -
కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్
హైదరాబాద్ : కాపులను బీసీల్లోకి చేర్చే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రస్తావించారు. కాగా పార్టీ అధికారంలోకి వస్తే కాపులకు ప్రాధాన్యతతో పాటు కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాపుల్లో పేదవర్గాల అభివృద్ధికి వెయ్యు కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానని అప్పట్లో బాబు హామీ ఇచ్చారు. -
సన్ ఫార్మా, ర్యాన్బాక్సీ విలీనంపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్ఫార్మా, రాన్బాక్సీల విలీన ప్రక్రియపై హైకోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెలువరించనున్నది. తమ విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో శనివారం ఇచ్చే ఉత్తర్వులపై సర్వత్రా ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. రాన్బాక్సీలో సన్ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాన్బాక్సీ, సన్ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య విచారణ జరిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తాము ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని, తాము ఏమీ చేయడం లేదన్న పిటిషనర్ల ఆరోపణల్లో అర్ధం లేదని సెబీ తరఫు న్యాయవాది వై.సూర్యనారాయణ కోర్టుకు నివేదించారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై సెబీ దర్యాప్తు సాగుతోందని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని సన్ఫార్మా, రాన్బాక్సీ, దైచీ కంపెనీల తరఫు సీనియర్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు, విలీన ప్రక్రియకు సంబంధం లేదని, అందువల్ల విలీన ప్రక్రియను ఆమోదించాలని వారు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై శనివారం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
కమీషన్ల కక్కుర్తి
తెనాలికి చెందిన వికలాంగ విద్యార్థి కార్తీక్ ఎంటెక్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్మెంటు, ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఇంతవరకు ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. వికలాంగ సంక్షేమ శాఖకు వెళితే తమకు సంబంధం లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంటుకు నోడల్ ఏజెన్సీ ఎస్సీ సంక్షేమ శాఖ అని తిప్పి పంపారు. రోజూ ఎస్సీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదని కార్తీక్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. కార్తీక్ లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న విద్యార్థులు ఇంకా జిల్లాలో ఎందరో ఉన్నారు. సాక్షి, గుంటూరు: విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంటు నిధులు సంక్షేమ శాఖల అధికారులకు, కళాశాలల యాజమాన్యాలకు కల్పతరువుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 639 కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంటు పథకం కింద 76,498 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ ఏడాది లబ్ధి పొందాల్సి ఉంది. వీరిలో 52,013 మంది రెన్యువల్, 24,485 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారున్నారు. ఎస్సీ విద్యార్థుల్లో రెన్యువల్ సంఖ్య 18,054 కాగా, ఇప్పటివరకు రిజిష్టర్ అయిన వారి సంఖ్య 16 వేల వరకు ఉంది. బార్ కోడ్, ఆధార్ అంటూ నిబంధనలతో విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసే దశకు చేరుకుంటున్నా, ఎస్సీ విద్యార్థులు 6,804 మందికి మాత్రమే రూ.2.64 కోట్లు మంజూరయ్యాయంటే సంక్షేమశాఖ అధికారుల తీరు ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది. ఫీజు రీయింబర్స్మెంటు కింద రూ.8.56 కోట్లు మంజూరయ్యాయి. ఓ ఉన్నతాధికారి పేరు చెప్పి.. సంక్షేమ శాఖల్లోని ఓ ఉన్నతాధికారి పేరు చెప్పి ఫీజు రీయింబర్స్మెంటు నిధుల్లో కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలల బాధ్యులే ఏజెంట్లుగా వ్యవహరిస్తూ విడుదలైన బోధనా రుసుంలో పర్సంటేజీలు వసూలు చేసి సంక్షేమ శాఖల అధికారులకు సమర్పించాలంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ భాగోతంపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. సంక్షేమశాఖ వసతి గృహాలపై ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో విచారించేందుకు ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. సంక్షేమ అధికారులు, కళాశాలల యాజమాన్యం మిలాఖతై విద్యార్థులకు అందాల్సిన బోధనా రుసుం ఫీజుల్ని కళాశాలలకు విద్యార్థుల పేరుతో విడుదలవుతున్న ఫీజు రీయింబర్స్మెంటు నిధుల్ని పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి పేరుతో ప్రభుత్వం విడుదల చేసే ఫీజులు అందినట్లు విద్యార్థి సంతకంతో కూడిన అక్విటెన్సులు పలు కళాశాలలు సంక్షేమ శాఖలకు ఇవ్వడం లేదు. పారదర్శకంగా ఉపకార వేతనాలు అందించేందుకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టామని ఉన్నతాధికారులు చెబుతున్నా, అమలు తీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది. విద్యార్థి దరఖాస్తు రిజిస్టర్ అయినా ముడుపులు ముట్టజెప్పనిదే ఆన్లైన్ వ్యవస్థ ముందుకు కదలడం లేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అకౌంట్ నంబరు సరిగా నమోదు చేయడం లేదని, ఏదో ఒక కొర్రీతో ఇబ్బందుల పాల్జేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.