కర్నూలు: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నా భోజన పథక నిర్వాహకులు సోమవారం ధర్నాకు దిగారు. జిల్లాలోని వంట ఏజెన్సీ నిర్వాహకులందరూ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇస్కాన్ సంస్థ ఎక్కడో వండిన ఆహారాన్ని తెచ్చి పిల్లలకు పెడుతుందని..దానివల్ల శరీరంలో వేడి తగ్గి ఆహార నాణ్యత లోపిస్తుందని వారు తెలిపారు. ఆ సంస్థ వారు పిల్లలకు గుడ్డు కూడా అందించటం లేదని అన్నారు. ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా ఇస్కాన్కు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. బిల్లులు రాలేదని చెప్పి ఆరు నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాసిరకం బియ్యం సరఫరా చేస్తోందని, దానివల్ల పిల్లలకు పౌష్టికాహార లోపం తలెత్తే ప్రమాదం ఉందని నిర్వాహకులు అన్నారు.