comment
-
భారత్-పాక్ మ్యాచ్పై సీమా హైదర్ ఏమన్నదంటే..
నోయిడా: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(ఆదివారం ఫిబ్రవరి 23) భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్కు ముందు సీమా హైదర్(Seema Haider) భారత జట్టకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఈ మ్యాచ్లో గెలవాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఆమె చెప్పారు. భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే దేశమంతటా సంబరాలు జరుగుతాయని సీమా హైదర్ పేర్కొన్నారు.పాకిస్తాన్ నుంచి తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు భారత్ వచ్చిన సీమా హైదర్ ఎప్పుడూ భారత్కు మద్దతుపలుకుతూనే వస్తున్నారు. తాజాగా ఆమె ఇండియన్ క్రికెట్ టీమ్కు ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెప్పారు. టీమిండియా ఎప్పటిలానే అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని అన్నారు.భారత్- పాక్ మ్యాచ్(India-Pakistan match) చూసేందుకు తాను ఎంతో ఆతృతతో ఉన్నానని, భారత్ మ్యాచ్ గెలవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవడం దేశవాసులకు గర్వకారణంగా నిలుస్తుందని, అందరూ కలసి పండుగ చేసుకుంటారని సీమా పేర్కొన్నారు. ఈరోజు తన కుమార్తె పరీ పుట్టినరోజు కావడం విశేషమని, భారత్ గెలిస్తే కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా రెండు వేడుకలు చేసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన -
ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్ సందేహం
వాషింగ్టన్: వాషింగ్టన్ విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇలా జరగడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ ఈ ప్రమాదం ఎలా జరిగింది? అని ట్రంప్ ప్రశ్నించారు.హెలికాప్టర్ విమానం వైపు ముందుకు ఎలా వెళ్లిగలిగింది? అది పైకి, కిందకు లేదా మరొక వైపుకు ఎందుకు తిరగలేదు? అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) పలు సందేహాలను వ్యక్తం చేశారు. వాషింగ్టన్లోని వైట్ హౌస్ సమీపంలో కెనడియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. ఆ విమానం అమెరికాలోని కాన్సాస్ సిటీ నుంచి వాషింగ్టన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం దరిమిలా విమానం పోటోమాక్ నదిలో పడిపోయింది.ఆ విమానంలో 60 మంది ఉన్నారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను నది నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్లో ఉన్నారు. వైట్ హౌస్(White House)కు విమానాశ్రయం మధ్య దూరం మూడు కిలోమీటర్ల కంటే తక్కువే. ఆ విమానం ఢీకొన్న హెలికాప్టర్ అమెరికా ఆర్మీకి చెందిన బ్లాక్హాక్ హెలికాప్టర్ (H-60). రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందుగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన నేపధ్యంలో రీగన్ జాతీయ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ వైమానిక సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ), జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్టీఎస్బీ) దర్యాప్తు చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికాలో విమాన ప్రమాదం.. -
H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
యనమలపై దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు
-
20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ బాబు..?
-
దేవునితో నీ నీచ రాజకీయం మానుకో.. బాబుపై ఫైర్
-
పవన్ ఎక్కడ దాక్కున్నావ్.. బాబు వ్యాఖ్యలపై మండిపడ్డ కార్మిక నాయకులు
-
అచ్యుతాపురం ఘటనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
ఫ్రెండ్ వద్ద ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నా: కేటీఆర్
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై అనుమానాలు
-
రికార్డు బ్రేక్ అయ్యేలా ఈసారి ఎన్నికల ఫలితాలు
-
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
-
చంద్రబాబు స్క్రిప్టునే షర్మిల చదువుతున్నారు
-
ప్రశ్నించేవారికి షరతు విధించిన సీమాహైదర్!
పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్, యూపీ నివాసి సచిన్ మీనాల ప్రేమకథ దేశంలో సంచలనంగా నిలిచింది. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో సీమాహైదర్ ప్రతిరోజూ హెడ్లైన్స్లో కనిపిస్తుంటుంది. ఈ వీడియోలు చూసిన చాలామంది ఆమె గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తుంటారు. ఆమె వీడియోల కింద తమ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు జోడిస్తుంటాడు. తాజాగా సీమా హైదర్కు చెందిన ఒక వీడియో వైరల్గా మారింది. ఇందులో సీమ.. తనును ఎవరైనా ఎటువంటి ప్రశ్ననైనా అడగవచ్చని, అయితే దానికి ఒక షరతు ఉందని పేర్కొంది. సచిన్, సీమ హైదర్ ప్రేమకథ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్ల క్రితం ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ నేపాల్లో కలుసుకున్నారు. అక్కడే తాము పెళ్లి చేసుకున్నామని గతంలో వారు చెప్పారు. సీమా పాకిస్తాన్ నుంచి తన నలుగురు పిల్లలతో సహా భారత్కు అక్రమంగా తరలి వచ్చింది. అప్పటి నుంచి ఆమె నోయిడాలో భర్తతో పాటు ఉంటోంది. సచిన్, సీమా హైదర్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని రోజుల క్రితం సీమా హైదర్, సచిన్ల వీడియో వైరల్గా మారింది. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు ఏదైనా ప్రశ్న అడగవచ్చని ఆమె పేర్కొంది. తన గత, ప్రస్తుత జీవితం గురించి ఎవరైనా ఏదైనా అడగవచ్చని, అయితే మంచి విషయాలు గురించి అడిగితే మాత్రమే సమాధానం తన నుంచి వస్తుందని తెలిపింది. అంటే మంచి ప్రశ్నలను మాత్రమే అడగాలని ఆమె షరతు విధించించిందన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీమా హైదర్ ఇటీవల హిందూ పండుగలను జరుపుకుంటూ వార్తల్లో నిలిచారు. -
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు అసలు పని చేశామా లేదా అన్నది పాయింట్
వర్క్ కల్చర్పై ‘ఇన్ఫోసిస్’ కో–ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్ ‘70 హవర్స్ ఏ వీక్’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల కోణాలలో ఈ కామెంట్ గురించి చర్చోపచర్చల మాట ఎలా ఉన్నా స్టాండప్ కమెడియన్లు, మీమ్స్ సృష్టించే వాళ్లకు మాత్రం చేతినిండా పని దొరికింది. స్టాండప్ కమెడియన్ వివేక్ మురళీధరన్ వీడియోలో... ‘ఇప్పుడు మనం 70 హవర్స్ ఏ వీక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సెల్ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ‘వారానికి 70 గంటలు పని చేయాలంటే’ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతాడు. రోజుకు, వారానికి, నెలకు ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుందో చెబుతాడు. టోటల్గా చెప్పాలంటే సంవత్సరంలో మనకంటూ మిగిలేది రెండు నెలలే. అందుకే తరచుగా ఈ సంవత్సరం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అంటుంటాం’ అని వివేక్ అన్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా నవ్వారు. ఒకరు ‘పోకిరి’ సినిమా ‘ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా’ డైలాగుతో మీమ్ చేశారు... ‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదన్నయ్యా,,,, అసలు పనిచేశామా లేదా అన్నది పాయింట్’. -
ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ నాటకాలు: విజయసాయి రెడ్డి
ఢిల్లీ: చంద్రబాబుకు ఇంటి భోజనం అందుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జైలులో ప్రత్యేక గది కేటాయించారని తెలిపారు. ప్రతిరోజు మూడుసార్లు ముగ్గురు డాక్టర్లు చెక్ అప్ చేస్తున్నారని వెల్లడించారు. 8 మంది పోలీసులు కాపలాగా ఉంటున్నారని స్పష్టం చేశారు. నేరాలకు తగిన శిక్ష అనుభవించేందుకు చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ట్వీట్ చేశారు. నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా పోయాయని సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. ఎన్నాళ్ళీ తెలుగు డ్రామాల… pic.twitter.com/FvpkwM5kEE — Vijayasai Reddy V (@VSReddy_MP) October 14, 2023 'నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా దూరమై సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ డ్రామాలు' అంటూ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ఇదీ చదవండి: మరి ఇంత నీచంగా డ్రామాలు ఆడతారా? Follow the Sakshi TV channel on WhatsApp: -
50 శాతం కమిషన్ అంశంపై ప్రియాంక గాంధీపై కేసు..
భోపాల్: మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ఎంపీ కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్లపై కేసు నమోదైంది. అవినీతి అరోపణలపై నకిలీ లేఖను సోషల్ మీడియాలో జ్ఞానేంద్ర అవస్తీ పేరిట ప్రచారం చేస్తున్నారని బీజేపీ లీగల్ సెల్ కన్వినర్ నిమేశ్ పతాక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 50 శాతం కమిషన్ను ప్రభుత్వం రాబడుతుందని ట్వీట్టర్(ఎక్స్) వేదికగా వాద్రా ఆరోపణలు చేశారు. కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు వెళ్లడం లేదని కాంట్రాక్టర్లు హైకోర్టు సీజేకి లేఖ రాశారంటూ పోస్టు చేశారు. కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్లోనూ ఇలాగే కమిషన్ లేనిదే పనిజగట్లేదని ఆరోపణలు చేశారు. ఇదే విధంగా కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్లు, అరుణ్ యాదవ్లు పోస్టు చేశారు. मध्य प्रदेश में ठेकेदारों के संघ ने हाईकोर्ट के मुख्य न्यायाधीश को पत्र लिखकर शिकायत की है कि प्रदेश में 50% कमीशन देने पर ही भुगतान मिलता है। कर्नाटक में भ्रष्ट BJP सरकार 40% कमीशन की वसूली करती थी। मध्य प्रदेश में BJP भ्रष्टाचार का अपना ही रिकॉर्ड तोड़कर आगे निकल गई है।… pic.twitter.com/LVemnZQ9b6 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 11, 2023 వీరిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్ నాథ్, అరుణ్ యాదవ్లపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును దెబ్బతీయాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రియాంక గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. తప్పుడు ప్రచారాలతో ఎంతో కాలం లబ్ది పొందలేని చెప్పారు. సీఎం శివరాజ్ సింగ్ కూడా ఈ అంశంపై స్పందించారు. వారి మాటల్లో నిజం లేదని చెప్పారు. ప్రియాంక గాంధీ పోస్టుకు సంబంధించిన వ్యక్తులపై గ్వాలియర్లోనూ కేసులు నమోదయ్యాయని అన్నారు. मध्यप्रदेश में कांग्रेस मुद्दा विहीन होकर घृणित मानसिकता के साथ राजनीति कर रही है। प्रदेश कांग्रेस के नेताओं ने पहले राहुल गांधी जी से झूठ बुलवाया अब प्रियंका गांधी जी से झूठा ट्वीट करवाया। प्रियंका जी आपने जो ट्वीट किये हैं उसके प्रमाण दो अन्यथा हमारे पास कार्यवाही के सारे… pic.twitter.com/j9FfajhA9c — Dr Narottam Mishra (@drnarottammisra) August 12, 2023 ఇదీ చదవండి: ఎన్డీయేలోకి శరద్ పవార్..? తాజా భేటీ ఎందుకు..? -
నా ముక్కు కాదు..కేసీఆర్ ముక్కునే నేలకు రాయిస్తా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ జగిత్యాల టౌన్: ‘నేను నిరాధార ఆరోపణలు చేస్తున్నానని, నా ముక్కును నేలకు రాయాలని కవిత అంటోంది. నేను ముక్కు కాదు కదా.. కాలు కూడా నేలకు రాయను, కవిత తండ్రి కేసీఆర్ ముక్కునే గజ్వేల్లో నేలకు రాయిస్తాను’అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లపై నిర్వహించిన ధర్నాలో అర్వింద్ మాట్లాడుతూ, తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. పేదలకు నాలుగు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని భారీగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం వివిధ బడ్జెట్లలో కలిపి రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చూపించినా ఇళ్లు మాత్రం కట్టించలేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ఆడిట్ విభాగమే తేల్చిందన్నారు. ఇక్కడ నొక్కేసిన డబ్బులతోనే కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిందని, ఐరన్లెగ్ కవితను నమ్ముకున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలుపాలయ్యారని అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి పేదలకోసం 8 లక్షల ఇళ్లు కట్టించగా, తెలంగాణలో మాత్రం ఈ ప్రభుత్వం కట్టించిన ఇళ్లు గుండుసున్నా అని అర్వింద్ వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి నాకు తండ్రిలాంటి వారు ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి తనకు తండ్రిలాంటి వారని, కానీ, ఆయన సేవలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం తహసీల్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అరి్వంద్ మాట్లాడుతూ, పేద మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తానన్న హామీని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. -
పచ్చ విషం గక్కడమే పనిగా పెట్టుకున్నరామోజీరావు
-
జుకర్బర్గ్పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు!
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. ట్విటర్ తరహా వికేంద్రీకృత సోషల్ నెట్వర్క్ను ప్రారంభించే యోచనలో ఉంది. సాధ్యాసాధ్యాలపై మెటా కసరత్తు చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన వార్తను ట్విటర్లో షేర్ చేయగా ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. ట్విటర్ లాంటి సోషల్ నెట్వర్క్ను మెటా ప్రారంభించనున్నట్లు వచ్చిన వార్తలపై డిజీ కాయిన్ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ట్విటర్లో షిబెటోషి నకమోటో పేరుతో ఓ మీమ్ వీడియోను పోస్ట్ చేశారు. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ట్విటర్కు పోటీగా అలాంటి నెట్వర్క్ ప్రారంభిస్తే ఎలాన్ మస్క్తో విసుగు చెందిన యూజర్లు జకర్బర్గ్ను అమితంగా ఇష్టపడతారని రాశారు. దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ జుకర్బర్గ్ను ‘కాపీ క్యాట్’ అని సంభోదించారు. అయితే పిల్లి అని అక్షరాల్లో రాయకుండా పిల్లి ఎమోజీని ఉపయోగించారు. ఇదీ చదవండి: Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన ఫేస్బుక్ కసరత్తు చేస్తున్న ఈ కొత్త సోషల్ నెట్వర్క్కు ‘P92’ అనే కోడ్నేమ్ను పెట్టింది. దీనిపై అప్పుడప్పుడూ కొంతమంది తమ అభిప్రాయాలతో అప్డేట్లు ఇస్తున్నారు. కొత్త సోషల్ నెట్వర్క్ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మెటా ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. అయితే ఇతర వివరాలేవీ ఆయన చెప్పలేదు. Copy 🐈 — Elon Musk (@elonmusk) March 11, 2023 -
ఆర్ఆర్ఆర్ పై భరద్వాజ కామెంట్లపై నాగబాబు, రాఘవేంద్ర రావు విమర్శలు
-
బలహీనవర్గాలకు సీఎం జగన్ చేసిన మేలు చూసి బాబు ఓర్చుకోలేకపోతున్నారు
-
పొలిటికల్ కామెంట్ : రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ కోలుకుంటుందా ..?
-
సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు
సమంత ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమె రెట్టింపు శక్తితో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్యే స్వయంగా తెలిపింది. దీంతో సామ్ త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటూ ఇటూ ఫ్యాన్స్, అటూ సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆమె అనారోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని హీరో అఖిల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్, కీర్తి సురేశ్తో పాటు పలువురు నటీనటులు స్పందిస్తు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్గా హీరో పోస్ట్ అలాగే దగ్గుబాటి వారసురాలు, విక్టరి వెంకటేశ్ కూతురు అశ్రిత సైతం సామ్ పోస్ట్పై స్పందించింది. సమంత పోస్ట్కు అశ్రిత ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘నీ గురించి నీకు తెలియదు.. నీలో ఎంతో బలం ఉంది.. నీ శక్తి గురించి నీకు తెలియదు.. అనంతమైన ప్రేమను నీకు పంపుతున్నా’ అంటూ రెడ్ హాట్ ఎమోజీలను జత చేసింది. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్ కూడా సామ్ పోస్ట్పై స్పందించాడు. ‘నువ్వు మరింత శక్తి, బలంతో ఉండాలని కోరుకుంటున్నా. త్వరలోనే నువ్వు దీన్ని అదిగమిస్తావు సామ్’ అంటూ ధైర్యం ఇచ్చాడు. దీంతో వారి కామెంట్స్ చూసి సామ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే సామ్ ఆనారోగ్యంపై ఆమె మాజీ భర్త, హీరో నాగ చైతన్య స్పందన కోసం సమంత ఫ్యాన్స్తో పాటు అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయంటే.. Rambha Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం, ధ్వంసమైన కారు.. ఫొటోలు వైరల్ -
చంద్రబాబు, పవన్ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
-
భరత జాతికి ఒక ఆంగ్ల నాడి
‘ఎవరు ఆంగ్లో–ఇండియన్?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం. బ్యారీ ఒబ్రయన్ పుస్తకం దీనికి జవాబు చెబుతుంది. ‘‘ఇండియాకు మొదట వచ్చిన పోర్చుగీసువాళ్లు, ఆ తర్వాత బ్రిటిషర్లు... తమకు విధేయంగా ఉంటూ, తమ వలస పాలన విస్తరణ ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు అవసరమైన సంతతిని ఒక ప్రణాళిక ప్రకారం జాతుల మిశ్రమంతో ఆవిర్భవింపజేశారు’’ అని ఒబ్రయన్ రాశారు. స్వాతంత్య్రానంతరం ఇండియా పాల్గొన్న అనేక యుద్ధాలలో ఆంగ్లో–ఇండియన్లు కీలకమైన పాత్రను పోషించారు. ఇక అందరికీ కచ్చితంగా తెలిసుండే విషయం – మన విద్యారంగంలో, ముఖ్యంగా ఆంగ్ల భాషను బోధించడంలో ఆంగ్లో–ఇండియన్ పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయని! ప్రచురణకర్తలు నాకు కొత్త పుస్తకాలు పంపిన ప్రతిసారీ వాటిలో ఒకటి అమూల్య మైన రత్నం అయి ఉంటుంది. నా వృత్తిపరమైన సంతోషాలలో అదొకటి. తాజాగా నా చేతికి వచ్చిన ‘ది ఆంగ్లో–ఇండియన్స్ : ఏ పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ’ అనే బ్యారీ ఒబ్రయన్ పుస్తకం అటువంటి రత్నమే. పుస్తకం గొప్పగా ఉంది. అయితే కొన్ని చోట్ల సాహితీ శైలి కానటువంటి వివరణాత్మమైన దీర్ఘ సంభాషణలతో సాగుతుంది. అదొక అభిభాషణ... రచయితే నేరుగా మీతో మాట్లాడు తున్నట్లు, మీకు చెప్పడానికి ఇంకా ఎంతో ఉన్నట్లు! ‘‘మొదటొక మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నలే కదా మొదట వేయాలి! తర్వాత మిగతా విషయాలు. సరే, ఏంటంటే... మీరెప్పుడూ కూడా తమిళియన్ అంటే ఎవరు? బిహారీ అంటే ఎవరు? మలయాళీ అంటే ఎవరు? సిక్కులు అంటే ఎవరు? అనే ప్రశ్నల్ని దాదాపుగా విని ఉండరు. అయితే ఆంగ్లో–ఇండియన్ల విషయం పూర్తిగా వేరైనది. ‘ఆంగ్లో–ఇండియన్లు ఎవరు?’ అనే సందేహాన్ని ఒక ప్రశ్నగా మీరే కొన్నిసార్లు వేసుకుని ఉండొచ్చు. నిజం చెప్పాలంటే, ‘ఎవరు ఆంగ్లో–ఇండియన్?’ అనే ప్రశ్న... ‘ఎవరు బెంగాలీ?’ అనే ప్రశ్న కంటే సమాధానం చెప్పడం చాలా కష్టమైన ప్రశ్న’’ అంటారు బ్యారీ ఒబ్రయన్ ఉపోద్ఘాతంగా. గ్రీకు, రోమన్ పురాణాలలో సిరులు పొంగి పొర్లుతుండే ‘కార్నుకోపియా’ కొమ్ము వంటి (మన అక్షయ పాత్ర లాంటిది) ఈ పుస్తకంలో... ఆంగ్లో–ఇండియన్ల గురించిన సమస్త సమాచారమూ గ్రంథస్థమై ఉందా అనిపిస్తుంది కూడా... మనకు తెలిసింది బాగా తక్కువ కనుక! బ్యారీ ఒబ్రయన్ స్వయంగా ఆంగ్లో – ఇండియన్. తన సమూ హపు నాడిపై వేలు ఉంచి ప్రత్యక్షంగా పరిశీలించి చూసినవారు. వారసత్వం, సంస్కృతి, జీవన విధానం, సామాజిక అంశాలలో తన వారి సంపూర్ణ చైతన్యాన్ని లోతుగా పరిశోధించినవారు. ఆయన రాసిన ఈ పుస్తకంలో ఐరోపా సముద్ర శక్తుల ఆగమనం, ఆంగ్లో– ఇండియన్ల అవతరణ, స్వతంత్ర భారత నిర్మాణంలో వారి భాగ స్వామ్యం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఒబ్రయన్ ఆంగ్లో ఇండియన్ అయి ఉండటం ఒక్కటే ఈ పుస్తకానికి ప్రామాణికతను చేకూర్చలేదు. ముప్పై ఏళ్లకు పైగా ఒక సామాజిక కార్యకర్తగా తన సమూహం వ్యవహారాలలో పాల్పంచుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆంగ్లో–ఇండియన్లకు నామినేటెడ్ ప్రతినిధిగా కూడా ఉన్నారు. తన సమూహానికి సంబంధించిన ప్రతి వివరం, ప్రతి విశేషం, గణాంకాలతో సహా ఆయనకు అందుబాటులో ఉంచే విద్యా వంతులైన పరిశోధక విద్యార్థులు ఆయనతో ఉన్నారు. పైగా రచయిత. ఇంకేం కావాలి ఒక అమూల్యమైన పుస్తకం రావడానికి! ఆంగ్లో–ఇండియన్లు అనుకోకుండా, యాదృచ్ఛికమైన కలయిక లతో అవతరించిన ప్రత్యేక సంతతి కానే కాదని ఈ పుస్తకం చదివే వరకు నాకు తెలియదు. వలసవాదులు ఉద్దేశ పూర్వకమైన ప్రయత్నా లతో శ్రద్ధగా అంటుకట్టి వీళ్లను సృష్టించారు. ‘‘ఆంగ్లో – ఇండియన్ల పుట్టుక అప్రమేయమైనది కాదు. ఇండియాకు మొదట వచ్చిన పోర్చు గీసువాళ్లు, ఆ తర్వాత బ్రిటిషర్లు... తమకు విధేయంగా ఉంటూ, తమ వలస పాలన విస్తరణ ప్రక్రియ వేగవంతం అయేందుకు అవసరమైన సంతతిని ఒక ప్రణాళిక ప్రకారం జాతుల మిశ్రమంతో ఆవిర్భవింపజేశారు’’ అని ఒబ్రయన్ రాశారు. నాకు తెలియని మరొక విషయం – స్వాతంత్య్రానంతరం ఇండియా పాల్గొన్న అనేక యుద్ధాలలో ఆంగ్లో–ఇండియన్లు కీలక మైన పాత్రను పోషించారని! ముఖ్యంగా వాళ్లు భారత వైమానిక దళంలో పైలట్లుగా ఉన్నారు. ‘‘1947–48 ఇండో–పాక్ యుద్ధంలో తమ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించిన పైలట్లలో సగంమంది ఆంగ్లో– ఇండియన్లే. 1965, 1971 యుద్ధాలలో గగనతలంలో మెరుపులా ఉరిమిన వారిలోనూ ఆంగ్లో–ఇండియన్లు ఉన్నారు. శత్రువుపై వీరోచితంగా వైమానిక దాడులు జరిపిన ఆనాటి గ్రూప్ కెప్టెన్లలో 20 శాతం మంది, వింగ్ కమాండర్లలో 30 శాతం మంది ఆంగ్లో– ఇండియన్లే’’ అంటారు ఒబ్రయన్. ఇంకా అనేక ఆసక్తికరమైన వివ రాలు పుస్తకంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 0.01 శాతంగా ఉన్న ఆంగ్లో–ఇండియన్లు ఎన్ని యుద్ధ పతకాలు సాధించారో చూడండి. 4 మహావీర చక్ర, 25 వీర చక్ర, 2 కీర్తి చక్ర, 2 శౌర్యచక్ర అవార్డులతో పాటు, 22 వాయుసేన, 13 పరమ విశిష్ట సేవ, 17 అతి విశిష్ట సేవా పతకాలను వీరు సాధించారు! ఆంగ్లో– ఇండియన్లు ఎక్కువగా కోల్కతాలో, చెన్నైలలో నివాసం ఏర్పరచుకుని ఉండేవారు. స్వాతంత్య్రానంతరం అరవైలు, డెబ్బైలు, ఎనభైలలో అధిక సంఖ్యలో కలకత్తా నుంచి బ్రిటన్కు వెళ్లి స్థిరపడ్డారు. మెరుగైన జీవితం కోసం వారు అటువైపు మళ్లారని అంటారు. ఇప్పుడిక నాకు తెలిసిన విషయం – నేననుకోవడం మీకూ కచ్చి తంగా తెలిసుండే విషయం – మన విద్యారంగంలో, ముఖ్యంగా ఆంగ్ల భాషను బోధించడంలో ఆంగ్లో–ఇండియన్ పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయని! ఆ పాఠశాలల నుంచి ఏ స్థాయిలోని వారు వచ్చారో చూడండి. ఒబ్రయన్ చెబుతున్న దానిని బట్టి... జె.ఆర్.డి. టాటా, సల్మాన్ రష్దీ, ఫరీద్ జకారియా (వీళ్లంతా ముంబైలోని క్యాథడ్రల్ అండ్ జాన్ క్యానన్లో విద్యను అభ్యసిం చినవారు), సయీద్ జాఫ్రీ (విన్బెర్గ్ అలెన్, ముస్సోరీ); అమితాబ్ బచ్చన్, కబీర్ బేడీ (షేర్వుడ్ కాలేజ్, నైనితాల్), అరుంధతీ రాయ్ (లారెన్స్, లోవ్డేల్), డాక్టర్ రాజా రామన్న, నందన్ నీలేకని, కిరణ్ మజుందార్ షా (బిషప్ కాటన్, బెంగళూరు), విశ్వనాథన్ ఆనంద్ (సెయింట్ బీడ్స్, చెన్నై) ఆంగ్లో – ఇండియన్లైన టీచర్లు, లెక్చ రర్లు, ప్రొఫెసర్ల దగ్గరే పాఠాలను, అనర్గళమైన ఆంగ్లభాషను నేర్చు కున్నారు. ఇప్పుడు మన దేశంలోని పెద్ద వాళ్లంతా మాట్లాడుతున్నది ఆంగ్లో–ఇండియన్ ఆంగ్లమేనని మనం మర్చిపోకూడదు. ఈ విష యాన్ని రూఢి పరచడానికి ఒబ్రయన్ ప్రముఖ భారతీయ రచయిత ఆలెన్ సీలే మాటల్ని మద్దతుగా తీసుకున్నారు. ‘‘భారతదేశంలో ఆంగ్లభాషను బ్రిటిష్ పాలకులు అధికారికంగా ఏమీ నిర్వీర్యం చేయ లేదు. నిజానికి ఆంగ్లో – ఇండియన్లే ఆ పనిని అనధికారికంగా చేశారు. మెకాలే ఇక్కడ ఆంగ్ల విద్యాబోధనకు పునాదులు వేసినా కూడా బ్రిటిష్ ఇంగ్లిష్ వ్యాప్తి జరగకపోవడానికి కారణం ఆంగ్లో – ఇండియన్లు తమదైన శైలిలో ఆంగ్ల భాషను బోధించడమే.’’ ‘ఆంగ్లో – ఇండియనిజమ్స్’పై ఉన్న అధ్యాయాన్ని చదివి ఉల్లాస భరితుడినయ్యాను. జిగ్గెరీ పోక్ (మోసపూరితమైన లేదా నిజాయితీ లేని ప్రవర్తన), గోయింగ్ ఫర్ ఎ లోఫ్ (సోమరిగా పచార్లు కొట్టడం), గ్యాసింగ్ టూ మచ్ (పొగడ్తలతో ఉబ్బేయడం) అనే పదబంధా లన్నిటినీ ఆంగ్లో–ఇండియన్లే సృష్టించారని ఒబ్రయన్ అంటారు. అది నిజమైనా, కాకున్నా అవి నన్నెంతో ఆకట్టుకున్నాయి. మాట తీరును బట్టి ఆంగ్లో ఇండియన్లను ఇట్టే కనిపెట్టవచ్చని అని కూడా ఆయన చెప్తారు. ‘గివ్–ఎవే’ పదంతో వారు మాటను పూర్తి చేస్తారు. కొందరు ‘నో’ లేదా ‘నా’ అనే పదాన్ని మాటకు కలుపుతారు. మరికొంతమంది అంత్య ప్రత్యయం (సఫిక్స్)గా ‘అప్’ అని గానీ, ‘అండ్ ఆల్’ అని గానీ అంటారు. అత్యంత సాధారణ పదం వచ్చేసి ‘మెన్’. ‘కమ్ ఆన్ మెన్’, ‘నో, మెన్’, ‘ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దిస్ మెన్’ (విసిగిపోయానబ్బా)... ఇటువంటివి. ఒక ఫ్రేజ్ మాత్రం నన్ను నా బాల్యంలోకి లాక్కెళ్లింది. ‘లెటజ్ గో నిన్నీ బైస్’(టు స్లీప్). మా అమ్మపాడిన ఈ లాలిపాట మూలం ఆంగ్లో–ఇండియన్ అని నాకు తెలీదు. ‘నిన్నీ బాబా నిన్నీ / మఖాన్, రోటీ, చిన్నీ / మేరా బాబా సోగయా / మఖాన్, రోటీ హో గయా / నిన్నీ బాబా నిన్నీ’. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
‘అండర్వేర్లు కొనుక్కునేందుకు ఢిల్లీ వెళ్లా’!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో ఊగిసలాట కొనసాగుతున్న వేళ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయ్. అందులో సోదరుడు బసంత్ వ్యవహరశైలి కూడా మరింత కాకరేపుతోంది. డుమ్కా ఎమ్మెల్యే అయిన బసంత్ సోరెన్ తన నియోజకవర్గాల్లో జరుగుతున్న అఘయిత్యాలపై స్పందిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. డుమ్కా ప్రాంతంలో ఓ ప్రేమోన్మాది.. మైనర్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపిన ఘటన, ఆ వెంటనే ఇద్దరు మైనర్ల హత్యాచార ఘటన చోటు చేసుకుంది. గత ఆరు నెలల్లో డుమ్కాలో మైనర్లపై దాడుల ఘటనలు ఏడుకు పైనే జరిగాయి. దీంతో జేఎంఎం పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. ఈ తరుణంలో.. శాంతి భద్రతలు పర్యవేక్షించకుండా బసంత్ సోరెన్ ఢిల్లీ పర్యటించడం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన అనంతరం బసంత్.. మైనర్ల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా.. ఇక్కడ ఇంత నేరాలు జరుగుతుంటే ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటూ మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన.. ‘‘నా దగ్గరి అండర్వేర్లు అయిపోయాయి. అందుకే వాటిని కొనుక్కునేందుకు ఢిల్లీకి వెళ్లా. కొనుక్కుని వచ్చా’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారాయన. నిజంగానే అందుకే వెళ్లారా? అని మీడియా మరోసారి ప్రశ్నించగా.. ‘అవును..’ అంటూ సమాధానం ఇచ్చారాయ. వెటకారంగా ఆయన ఇచ్చిన సమాధానంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. #WATCH | Dumka: "I had run out of undergarments, so I went to Delhi to purchase them. I get them from there," says JMM MLA and Jharkhand CM Hemant Soren's brother, Basant Soren when asked about his visit to Delhi amid recent political unrest in the state. (07.09.2022) pic.twitter.com/GBiNWZaLzr — ANI (@ANI) September 8, 2022 శిబు సోరెన్ కొడుకు, పేదల.. గిరిజనుల నేత అయిన బసంత్ సోరెన్.. ఢిల్లీకి అండర్వేర్లు కొనుక్కునేందుకు వెళ్లాడంటూ వెటకారంగా స్పందించింది బీజేపీ. ఇక జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితి తలెత్తగా.. బల నిరూపణలో నెగ్గారు జేఎంఎం నేత, సీఎం హేమంత్ సోరెన్. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు నిలకడగానే ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మాది మెయిన్ ఫ్రంట్ -
కరువుకు కవలపిల్లలు చంద్రబాబు ,లోకేష్ : కాకాని గోవర్ధన్ రెడ్డి
-
బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే!
హిందీ చిత్రపరిశ్రమలోని అందమైన జంటల్లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, బ్యూటీఫుల్ హీరోయిన్ దిశా పటానీ పెయిర్ ఒకటి. సినిమాల్లో వీరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీతో విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి టైగర్ ష్రాఫ్-దిశా పటానీ డేటింగ్లో ఉన్నట్లు ఎప్పటినుంచో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే గత కొంత కాలంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. టైగర్ ష్రాఫ్-దిశా బ్రేకప్ చెప్పుకున్నట్లు గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలతో వారి అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట. కెరీర్ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్. చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్గా 'లైగర్' సాంగ్ ఇదిలా ఉంటే మరోవైపు వారిద్దరి రిలేషన్ సరిగ్గానే ఉందని ఇటీవల టైగర్ షేర్ చేసిన ఓ వీడియో పోస్ట్ చెబుతోంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తున్న వీడియోను టైగర్ ష్రాఫ్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. 'నిజానికి ఇవాళ ట్రైనింగ్ తీసుకున్నట్లు లేదు. ఎందుకంటే తమను కొట్టాల్సిందిగా వారు చెప్పారు. అది నా ఐడియా అయితే కాదు' అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్కు నేను కూడా ఇలా చేయాలనుకుంటున్నాను అని దిశా పటానీ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో, రిప్లై నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దిశా పటానీ రిప్లైతో వారి మధ్య ఎలాంటి బ్రేకప్ జరగలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారట. ఇక వారు డేటింగ్లో ఉన్నారా? లేదా బ్రేకప్ చెప్పుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే. చదవండి: ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) -
నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?
Rakul Preet Singh Dance Video Goes Viral Jackky Bhagnani Comment: అతికొద్ది సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేసిన ఈ పంజాబీ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'రన్ వే 24', 'ఎటాక్' చిత్రాలతో బీటౌన్ ఆడియెన్స్ను పలకరించింది. ప్రస్తుతం రకుల్ చేతిలో థ్యాంక్ గాడ్, ఛత్రీవాలి, డాక్టర్ జీ, ఓ మై గోస్ట్, మిషన్ సిండ్రెల్లా, 31 అక్టోబర్ లేడీస్ నైట్ తదితర చిత్రాలు ఉన్నాయి. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది రకుల్. తాజాగా తన డ్యాన్స్తో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ కాగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్స్లో శిక్షణ తీసుకుంది. ఇందులో భాగంగానే 'పసూరి' (Pasoori) పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకుంటూ ఈ సాంగ్ తన ఫేవరెట్గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు కొడుతూ గంటలోనే సుమారు 3 లక్షలకుపైగా వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన సెలబ్రిటీలు ఓ మై గాడ్, చంపేశావ్ బేబీ అని కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. ఇక రకుల్ బాయ్ఫ్రెండ్, యాక్టర్ జాకీ భగ్నానీ డియర్ లవ్.. నాకు కూడా నేర్పించవా అని కామెంట్ చేశాడు. కాగా రకుల్ డ్యాన్స్ చేసిన 'పసూరి' సాంగ్ యూట్యూబ్లో 20 కోట్లకు పైగా వ్యూస్ సొంత చేసుకుని సెన్సేషనల్గా మారిన విషయం తెలిసిందే. చదవండి: జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ముందు కాషాయం వెనక పచ్చ స్క్రిప్ట్
-
అల్లు అర్జున్ భార్యపై సమంత 'హాట్' కామెంట్స్ వైరల్
Samantha Comment On Allu Arjun Wife Sneha Reddy Pic, Goes Viral: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో తెగ యాక్టివ్గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహరెడ్డి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరలో స్నేహ ఎంతో అందంగా కనిపించారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ స్నేహకు స్టైలింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్నేహరెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా పలువురు సెలబ్రిటీలు సైతం స్నేహపై ప్రశంసలు కురిపించారు. స్టార్ హీరోయిన్ సమంత సైతం హాట్.. అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్ సాంగ్లో కనిపించిన సంగతి తెలిసిందే. చదవండి: చై నుంచి రూ.50 కోట్లు దోచుకుందంటూ ట్వీట్.. స్పందించిన సామ్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్: ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్టీయూ సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ కె.జనార్దన్రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయని, ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైంది కాదన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి దళితబంధు ప్రవేశపెడితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
మాట నిలబెట్టుకోలేదనే కవితను ఓడించారు
బోధన్/కుత్బుల్లాపూర్: ప్రజలను మాటలతో మభ్యపెడితే ఓటుతో ఓడిస్తారని, మూతబడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్లే రైతులు సీఎం కేసీఆర్ కూమార్తె కవితను ఓడగొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని పీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ జలయజ్ఞం ద్వారా అప్పట్లోనే 60–70 లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. హుజూరాబాద్లో దళితబంధు అమలు తీరుపై కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే, ఓడిపోతామనే భయంతో తెలంగాణ–ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్.. సోనియాగాంధీ గురించి విమర్శించడం మానుకోవాలని సూచించారు. కుమారుడిని అదుపులో పెట్టుకోకపోవడం డి.శ్రీనివాస్ తప్పేనన్నారు. తాను త్వరలో గజ్వేల్, నిజామాబాద్లో భారీసభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ప్రభుత్వ విప్ అనిల్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
పరిమితిని తొలగిస్తేనే మరాఠా రిజర్వేషన్లు
ముంబై: రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తప్ప మరాఠా కోటా రిజర్వేషన్లను అమలు చేయలేమని శివసేన ఎంపీ సంజయ్ రావుత్ వ్యాఖ్యానించారు. ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరాఠా కోటా గురించే తాను సీఎంతో చర్చించినట్లు తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను సీఎంకు వివరించానన్నారు. మరాఠా కోటా అంశానికి సంబంధించి ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్ చవాన్ అఖిలపక్ష నాయకులతో వర్చువల్గా భేటీ అవుతారని వెల్లడించారు. రాష్ట్రాలు ఓబీసీ జాబితా రూపొందించుకునేలా అధికారం కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడితే చర్చకు పట్టుబడతానని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, ఎమ్మెన్నెస్ల పొత్తు గురించి మాట్లాడేందుకు సంజయ్ రావుత్ నిరాకరించారు. డిసెంబర్ 28వ తేదీన రాహుల్ గాంధీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డిసెంబర్ నెల ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పటివరకు ఏం జరుగుతుందో చూద్దామని సమాధానమిచ్చారు. -
సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇదంతా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ బాపట్ల లోక్ సభ సభ్యుడు నందిగం సురేష్.. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడిపైన పిటిషన్ వేయగానే టీడీపీ వాళ్లు నానా హైరానా చేశారని, మరి అదే పిటిషన్ కొట్టి వేస్తే మాత్రం టీడీపీ, పచ్చ మీడియా నోరు మెదపలేదన్నారు. రఘురామకృష్ణంరాజు తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని లోక్ సభ స్పీకర్కు చెప్పారని, మరి తన పార్టీ అధ్యక్షునిపై పిటిషన్ వేసిందాన్ని ఏమంటారో ఆయనకే తెలియాలని అన్నారు. ఆయన ఎన్ని ఫిర్యాదులు చేసినా, పిటీషన్లు వేసినా ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కాదా ఇలాంటి పనులు చేస్తున్నావంటూ ప్రశ్నించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాముడని ప్రజలే తేల్చారన్నారు. అందుకే 151 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజు రాక్షసులతో కలిసి పనిచేస్తున్నారని, వాళ్లకి ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారన్నారు. ఇక నైనా ఆ విషయాన్ని ఆయన తెలుసుకుని నడుచుకుంటే మంచిదని హితవు పలికారు. ‘ఢిల్లీలో కూర్చొని వైఎస్సార్సీపీ ఎంపీ అని చెప్పుకుని మాట్లాడటం కాదు. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలి’ అంటూ సవాల్ విసిరారు. ఎప్పటికైనా ఆయనకు తగిన శాస్తి జరగక తప్పదని జోష్యం చెప్పారు. ( చదవండి: పవన్ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా ) -
వ్వావ్! ఫ్రెండ్ షిప్ అంటే ఈ పిల్లులదే..
మీరు ఊసరవెల్లి సినిమాలో ‘లవ్ అంటే కేరింగ్.. ఫ్రెండ్ అంటే షేరింగ్’ అనే పాటను వినే ఉంటారు. ఈ ప్రేమలు మనుషుల్లోనే కాకుండా జంతువుల మధ్యలోనూ ఉంటాయి. ఇప్పటికే.. వీటికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ ఇంటి యజమాని తమ పిల్లుల ముందు గిన్నెలో ఆహరం పెట్టాడు. అయితే అవి రెండు ఏ మాత్రం కొట్టుకోకుండా, ఆహరాన్నిఒకదానికి మరొకటి సహయం చేసుకుంటూ తిన్నాయి. దీనిలో ‘ఒక పిల్లి తను ఆహరం తిన్న తర్వాత.. ఆ గిన్నెను ఎదురుగా ఉన్న మరో పిల్లి ముందు జరిపింది. ఆ రెండో పిల్లి కూడా ఆహరం తిన్నాక తిరిగి మొదటి దాని ముందుకు గిన్నె జరిపింది. ఇలా అవి రెండు ఆహరాన్ని కిందపడేయకుండా తిన్నాయి. షైయిల్డ్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడిది నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వాట్ ఎ కేరింగ్.. షేరింగ్’..‘క్యూట్ క్యాట్స్’...‘మీ ఫ్రెండ్షిప్కి హ్యట్సాఫ్’..అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు! -
అమితాబ్ సెక్సిస్ట్ కమెంట్స్ దుమారం
సాక్షి, ముంబై: మహిళలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నావారి అందం, సామర్ధ్యంపై చవకబారు కమెంట్స్, అనుచిత వ్యాఖ్యానాలు నిరంతరం మనం చూస్తూనే ఉంటాం. దీనికి సాధారణ వ్యక్తులనుంచి సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు ఎవ్వరూ అతీతులు కాదు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షోలో వివక్షా పూరిత వ్యాఖ్య చేశారు. దీంతో ట్విటర్లో దుమారం రేగుతోంది. తన పాపులర్ షోలో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్గా ఉన్న గీతా గోపీనాథ్కు సంబంధించిన ప్రశ్నను ఒక మహిళా కంటెస్ట్కు సంధించారు అమితాబ్. 2019నుండి గీతా గోపీనాథ్ ఏ సంస్థకు ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారనే ప్రశ్నను అడిగారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే ఆయన తన నైజాన్ని చాటుకున్నారు. గీతా ఫోటోను తెరపై చూపిస్తూ చాలా అలవోకగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమె ఫేస్ ఎంత అందంగా ఉంది..ఆర్థికవ్యవస్థతో ఆమె అందాన్ని ఎవరైనా జోడించి చూడగలమా ’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఈ వీడియోను గోపీనాథ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమితాబ్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్కుపెద్ద అభిమానిననీ తనకు ఈ వీడియో చాలా ప్రత్యేకమైనదంటూ ట్వీట్ చేయడం విశేషం. "గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" అని కూడా ఆమె అభివర్ణించారు. కానీ బిగ్బీ సెక్సిస్ట్ వ్యాఖ్యలపై ట్విటర్ యూజర్లు మాత్రం మండిపడుతున్నారు. ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ ఛానల్ యాంకర్, సీనియర్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ సహా పలువురు ఈ ట్వీట్ను రీట్వీట్ చేశారు. అతి చిన్న వయసులోనే గీతా గోపీనాథ్ సాధించిన గౌరవాన్ని గుర్తించకుండా, ఆమె అందాన్ని ప్రస్తావించడం విచారకరమని విమర్శిస్తున్నారు. Ok, I don't think I will ever get over this. As a HUGE fan of Big B @SrBachchan, the Greatest of All Time, this is special! pic.twitter.com/bXAeijceHE — Gita Gopinath (@GitaGopinath) January 22, 2021 -
చీప్ కామెంట్కు రకుల్ కౌంటర్
సినీ తారలకు సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లను ఉద్దేశించి ఆకతాయిలు చేసే కామెంట్స్ శ్రుతిమించుతున్నాయి. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రకుల్ కారునుంచి దిగుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి (@bhagath9_9 అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి) అసభ్యకర కామెంట్స్ చేశాడు. అయితే ఈ పోస్ట్ రకుల్ దృష్టికి వెళ్లటంతో ఆమె ఆ వ్యక్తి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం సమానత్వం, రక్షణ అంటూ చర్చలు జరపటం వల్ల ఉపయోగం లేదంటూ కామెంట్ చేసింది రకుల్. అయితే రకుల్ ఇచ్చిన సమాధానంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు రకుల్ ధైర్యాన్ని అభినందిస్తుంటే.. మరికొందరు ‘నీపై వచ్చిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానించావ్’ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. -
ప్రధాని భార్యపై కామెంట్.. జోకులు
సిడ్నీ: భాష.. దాని అనువాదంలో వచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. పొరపాటున తేడాలు వస్తే అర్థాలు మారిపోయి ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. తాజాగా ఫ్రాన్స్ ప్రధాని ఎమ్మాన్యుయేల్ మాక్రోన్కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్ భార్య లూసీని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మాక్రోన్.. మాల్కోమ్తో బుధవారం కీలక సమావేశంలో పాల్గొన్నారు. భేటీ ముగిశాక మాల్కోమ్ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఓ సందేశం ఇచ్చారు. ‘మీరిచ్చిన స్వాగతానికి ధన్యవాదాలు. మీకు, మీ ‘రుచికరమైన’ (Delicious)భార్య ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు’ అంటూ మాక్రోన్ పేర్కొన్నారు. అంతే... ఆ మాట ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించేసింది. ‘నోరు జారిన ఫ్రాన్స్ అధ్యక్షుడు’.. ‘ప్రధాని భార్యపై అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలు’.. అంటూ హెడ్డింగ్లతో ఊదరగొట్టేసింది. మరోపక్క సోషల్ మీడియాలో మాక్రోన్ స్టేట్మెంట్పై జోకులు పేలాయి. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందో? అని కొందరు.. వైన్ బదులు వైఫ్ అని పొరపాటున ఉచ్ఛరించారేమో అని కొందరు.. చాలా మందికి మట్టు ఆ కామెంట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ కార్యాలయం స్పందన... ‘నిజానికి ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు. అనువాద దోషంలో దొర్లిన ఓ తప్పిదం మూలంగానే ఆయన ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్ వంటకాలతో, ఫ్రెంచ్ అధికారులతో ఏర్పాసిన డిన్నర్ పట్ల మాక్రోన్ సంతోషం వ్యక్తం చేశారు. అందుకే టర్న్బుల్-ఆయన భార్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. Delicious-Delicieux ఫ్రెంచ్లో-Delightful(చూడముచ్చటైన) అర్థం. ఫ్రెంచి అనువాదకుడి ఉపన్యాసాన్నే మాక్రోన్ చదివి వినిపించారు. దీనిపై పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదు’ అని ఆస్ట్రేలియాలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అన్నట్లు గతేడాది ఫ్రాన్స్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆ సమయంలో మాక్రోన్ భార్య బ్రిగెట్టేను ఉద్దేశించి ట్రంప్ చేసిన ఓ వ్యాఖ్య చర్చనీయాంశమైంది. "I want to thank you for your welcome, thank you and your delicious wife for your warm welcome," -
పవన్పై అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
పశ్చిమ గోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో జరిగిన ‘ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ ఆడియో ఫంక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేశారు.‘ ఏసీ రూముల్లో సుఖాలను వదులుకుని, కోట్ల రూపాయల కెరీర్ వదులుకొని రాజకీయాలలోకి వచ్చారు. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు..కానీ చాలా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడారు, మాట్లాడించారు. అందరిదీ తప్పు, మాట్లాడింది లక్షల మందికి చూపించిన వాళ్లది ఇంకా పెద్ద తప్పు.. పవన్ కళ్యాణ్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. నాకు నచ్చలేదు. రాజకీయాల్లోకి వచ్చినపుడు విమర్శలు వస్తాయి. ప్రజారాజ్యం సమయంలోనే చిరంజీవిని పలువురు విమర్శలు చేయడం చూసి అలవాటైంది. మెగా కుటుంబమంతా ఒక్కటే’ అని వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ బాధ్యత మరిచింది..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : నాయకులు పదవుల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేసి తర్వాత దాని విలువలు మర్చారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభానికి ఆయన బుధవారం మహబూబ్నగర్కు వచ్చారు. ఈ సందర్భంగా రిబ్బన్కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, కనీస బాధ్యతలను ప్రభుత్వాలు మరిచి, పూర్తిగా వాటిని కాలరాసే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా సభలు ఏర్పాటు చేసుకోవడమనేది రాజ్యాంగ హక్కు, ఇందుకు 29న పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా.. అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అయితే జన సమితి సభ నిర్వహిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న భయం పట్టకుందని, అందుకే అనుమతి ఇవ్వడం లేదన్నారు. పార్టీ ఇలా ప్రారంభం నుంచి పోరాటాలతోనే ప్రారంభం అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, వాస్తవాలను మాత్రమే మాట్లాడామన్నారు. ఇలా ప్రశ్నిస్తే ఎన్నో త్యాగాలు చేసి కుర్చీ అప్పజెప్పారు.. మా ఇష్టం వచ్చినట్లు పాలిస్తామన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ఊరికే రాలేదు.. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అమరులయితే వచ్చింది.. వారిని స్మరించుకునేందుకు ప్రభుత్వం ఒక స్థూపం కూడా నిర్మించకపోవడం దారుణమన్నారు. అందుకు ఈ నెల 29న హైద్రాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే సభకు వచ్చే ప్రతి ఒక్కరు ఒక ఇనుప ముక్కను వెంట తీసుకురావాలని, తెచ్చిన ముక్కను కరగదీసి అక్కడే అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టులు, పైరవీల కోసమే రాజకీయాలు ఎన్నో ఏళ్ల తర్వాత కనీస న్యాయం జరుగుతుందని కళలుగన్న తెలంగాణ ప్రజలకు నాయకులు కనీస న్యాయం చేసే పరిస్థితి కనిపించడంలేదన్నారు. కాగా, కేవలం కాంట్రాక్టులు, పైరవీల కోసమే కుర్చీలు ఎక్కారని, ఎక్కడ భూ సెటిల్మెంట్లు చేయవచ్చు అనుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు. జమ్ముకాశ్మీర్లో బాలికలపై జరిగిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటు అన్నారు. శ్రీరెడ్డి అనే నటికి అవకాశాలు ఇవ్వకుండా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పంటలు పండక.. బోర్లు ఎండిపోయి.. వడగండ్ల వానపడి వేల ఎకరాళ్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అని ప్రశ్నించారు. అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం చూపిన తెగువ ఇక్కడి ప్రజలు మరిచి పోలేదని, అనుకున్న స్థాయిలో ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రత్నామ్నాయ పార్టీలు అవసరమని, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది ముందే తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం ఒకేఒక్క కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగి పూర్తిస్థాయిలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టీజేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి, నాయకులు బాల్కిషన్, మంత్రి నర్సింహయ్య, ప్రభాకర్, ఆంజనేయులు, వెంకటస్వామి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రెవెన్యూ సంఘాల నిరసన
జగిత్యాల: నర్సంపేట జిల్లాలో ఎమ్మెల్యే మాధవరెడ్డి కలెక్టర్లు మస్కూరుల కంటే అధ్వానంగా పనిచేస్తున్నారని ఎద్దేవ చేస్తూ మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కలెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తున్న కలెక్టర్లపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్కుమార్, ఎండీ.వకీల్, టీఎన్జీవోల అధ్యక్షుడు శశిధర్, కృష్ణ, మధుగౌడ్ పాల్గొన్నారు. -
‘ఏపీ అంటే చిన్న చూపా.. రక్తం మరిగిపోతోంది’
సాక్షి, ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడూ చిన్నచూపేనని, ఆంధ్ర ప్రజల సమస్యలను నెరవేర్చడంలో కేంద్రానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండు వారాలుగా పోలవరంపై తాను అడిగిన నాలుగు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం ఖర్చు భరిస్తానని చెప్పి పీపీఏ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వంచించడానికి నడుముకట్టుకుందని వ్యాఖ్యానించారు. పీపీఏ కాదని అర్థరాత్రి ప్రాజెక్టు నిర్వహణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నారని ఆరోపించారు. పోలవరం ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమా? కాంట్రాక్టర్ల కోసమా? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం, సొంత లాభం కోసం కేంద్రం సహకరించదని చంద్రబాబు గ్రహించిన తర్వాతే క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారని ఆయన విమర్శించారు. దుగ్గిరాజ పట్నం పోర్టుకు సంబంధించి ఊసే లేదని, కేంద్ర హోంశాఖ నిస్సంకోచంగా, నిర్లక్ష్యంగా, ఏపీకి రైల్వే జోన్ లేదని చెప్పటం హాస్యాస్పదమన్నారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
బీజేపీపై టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు
విజయనగరం : బీజేపీ పై టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..తమిళనాడులో బీజేపీ ఘోరపరాజయం పాలైందని గుర్తు చేశారు. బీజేపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు వాస్తవాలు గ్రహించాలని సూచించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ప్రత్యేక ప్యాకేజీని సైతం బీజేపీ నేతలు పక్కనపెట్టారని విమర్శించారు. టీడీపీ నేతలను రెచ్చగోట్టే ప్రయత్నం చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. పోలవరాన్ని సైతం అడుగడుగునా అడ్డుకుంటున్నారని బీజేపీపై తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. -
గర్ల్ ఫ్రెండ్ను కామెంట్ చేశాడని..
నరసాపురం: నరసాపురంలో ఇద్దరు మైనర్లు ఘాతుకానికి ఒడికట్టారు. ఏదో సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ను కామెంట్ చేశాడనే అక్కసుతో ఓ మైనర్ బాలుడు, తన స్నేహితుడైన మరో మైనర్తో కలసి పట్టణంలోని ప్రకాశం రోడ్డులో ఉన్న గడ్డియ్య టీ సెంటర్లో పనిచేసే దండు గంగరాజు (30)ను మెడకు తాడు బిగించి హత్య చేసి శవాన్ని గోదావరిలో పడేశారు. నిందితులిద్దరూ అదే టీకొట్టులో పని చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత హత్యాఘాతుకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. నరసాపురం డీఎస్పీ టీటీ ప్రభాకర్బాబు గురువారం తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని పీచుపాలెం దాటిన తర్వాత రూరల్ పరిధిలో గోదావరిలో శవాన్ని గత అక్టోబర్ 12న కనుగొన్నారు. మృతుడు పట్టణంలోని టీకొట్టులో పనిచేసే గంగరాజుగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగరాజు కుటుంబం 15 ఏళ్ల నుంచి నరసాపురం మండలంలోని దర్బరేవు గ్రామంలో స్థిరపడింది. అదే కొట్టులో పనిచేసే ఓ మైనర్కు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏదో సందర్భంలో తన గర్ల్ఫ్రెండ్ను గంగరాజు కామెంట్ చేశాడని కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మరో స్నేహితుడితో కలసి పార్టీ ఇస్తానంటూ అక్టోబర్ 10న గోదావరి గట్టుకు తీసుకెళ్లి హత్యచేశారు. ఒకరు చేతులు వెనక్కి పట్టుకోగా, మరొకరు మెడకు తాడు గట్టిగా బిగించి చంపేశారు. శవాన్ని గోదావరిలో పడేసి, మరుసటి రోజు నుంచి మామూలుగా టీకొట్టులో పని చేస్తున్నారు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత శవం దొరకడంతో రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ మైనర్లను కూడా విచారించగా నేరం ఒప్పుకున్నారు. గంగరాజు మృతితో భార్య కవిత, రెండేళ్ల కుమారుడు, మూడు నెలల పాప అనాథలయ్యారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరు మైనర్లు కూడా 18 సంవత్సరాలు నిండటానికి దగ్గర్లో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులిద్దరినీ ఏలూరు జువైనల్ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ ఎం.సుబ్బారావు, రూరల్ ఎస్సై కె.సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'ఆదినారాయణ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలి'
హైదరాబాద్: ఎస్సీలను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేశ్, నారాయణ స్వామి, సునీల్కుమార్లు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆదినారాయణ రెడ్డిని తక్షణమే కేబినేట్ నుంచి బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మరెవ్వరూ అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేకుండా ఆదినారాయణ రెడ్డిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎస్సీలకు రాజ్యాంగంలో పదేళ్లు మాత్రమే రిజర్వేషన్ ఇస్తే ఏడుపదులైనా వారు మారలేదని; ఎస్సీల వెనుకబాటుకు వారే కారణమని, వారికి ఎంతో మేలు చేయాలని ఆలోచించినా.. ఎస్సీలు సరిగా చదవరని; ఎస్సీలు శుభ్రంగా ఉండరని; ఎస్సీల చేతిలో పట్టా భూమి ఉండదని.. ఆదినారాయణ రెడ్డి నోటికి హద్దు లేకుండా మాట్లాడారని అన్నారు. స్వతంత్ర దినోత్సవ నాడు మంత్రి స్ధాయిలో ఉండి ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశంలోని దళితులందరినీ కించపరిచేవిధంగా ఉన్నాయని అన్నారు. రాజకీయంగా దిగజారి మంత్రి పదవి దక్కించుకున్న ఆది నారాయణ రెడ్డి.. ఇప్పుడు మనిషిగా కూడా దిగజారిపోయారని విమర్శించారు. -
కొంప ముంచిన ఇన్ఫీ సీవోవో వ్యాఖ్యలు
ముంబై: ఇన్ఫోసిస్ సంచలన వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ సెక్టార్ లో తీవ్ర అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఇన్ఫీ టాప్ ఎగ్జిక్యూటివ్ చేసిన కమెంట్లు ఐటీ షేర్ల కొంపముంచాయి. ఇన్పీ సీవోవో ప్రవీణ్ రావు తమ ఖాతాదారుల ఐటీ వ్యయాలను తగ్గనున్నాయన్న వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ముఖ్యంగా నిన్నటి మార్కెట్ లో భారీ పుంజుకున్న ఐటీ దిగ్గజ షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు తమ క్లయింట్స్ ఐటీ వ్యయాలను చూస్తున్నారంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. తమ అంతర్జాతీయ ఖాతాదారులు బిల్లింగ్ రేటును దాదాపు 50శాతం తగ్గించాలని చూస్తున్నారన్నారు. ఇది 150 బిలియన్ డాలర్ల దేశీయ పరిశ్రమ ఆదాయంపై ప్రభావం చూపించనుందని చెప్పారు. దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో దాదాపు అన్ని ఐటీ షేర్లలో భారీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఐటీ మేజర్లు ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ సహా ఇతర టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇన్ఫీ యాజమాన్యం వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. మిడ్సెషన్ తరువాత ప్రధానంగా ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి. అటు సీవోవో ప్రవీణ్రావు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రైస్కట్ గురించి తాను చెప్పలేదని, తప్పుగా అర్థం చేసుకున్నారని యుబి ప్రవీణ్ రావు వివరణ ఇచ్చారు. -
చలపతిరావు కామెంట్పై రకుల్ ఫైర్
రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ వేదికగా సీనియర్ నటుడు చలపతి రావు మహిళలపై వాడిన అసభ్య పదజాలంపై హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీటర్ ద్వారా స్పందించారు. ఆలస్యంగా స్పందించడానికి గల కారణాన్ని చెబుతూ.. చలపతి రావు చేసిన వ్యాఖ్య అర్ధం తనకు తెలియదని మీడియాలో వస్తున్న వార్తల ద్వారా ఆ విషయం తెలుసుకున్నట్లు చెప్పారు. చలపతిరావు చేసిన కామెంట్కు అర్ధం తెలిసివుంటే స్టేజ్ మీదే సమాధానం ఇచ్చేదాన్నని, ఆ కామెంట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ సీనియర్ నటుడిగా ఆయనకు ఉన్న స్ధానాన్ని, వయసును గుర్తు పెట్టుకుని మాట్లాడివుంటే బాగుండేదని అన్నారు. మహిళలపై అలాంటి పదజాలాన్ని వినియోగించడం వల్ల తోటి వారిని తప్పుడు మార్గంలో ప్రోత్సహించినట్లు ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లపైనా చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. కెరీర్ ఆరంభంలో చాలా సందర్భాల్లో చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. చాలా సార్లు మిన్నకుండిపోయానని, కానీ ఇప్పుడు జరిగిన సంఘటనతో మాత్రం నోరు మెదపకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. అయితే, చలపతిరావు మాట్లాడుతున్న సమయంలో తాను, నాగచైతన్య స్టేజ్పై నవ్వడానికి కారణం ఆయన చేసిన కామెంట్ కాదని తెలిపింది. ఇదే విషయంపై హీరో నాగ చైతన్య కూడా ట్వీటర్ ద్వారా స్పందించారు. తాను నవ్వడానికి కారణం వేరే ఉందని తెలిపారు. అబ్బాయిలే విషపూరితం ప్రస్తుతం టాలీవుడ్లోని క్రేజీ హీరోయిన్లలో రకుల్ ప్రీతి సింగ్ ఒకరు. రకుల్, నాగ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం 'రారండోయ్ వేడుకచూద్దాం' ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చిత్ర విశేషాలను పంచుకుంది. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అనే చైతూ డైలాగ్పై మాట్లాడుతూ తన ఉద్దేశంలో అబ్బాయిలు విషపూరితం అని వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి దర్శకుడు సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కల్యాణ్ కృష్ణ. దీంతో మరోసారి నాగ్ కుటుంబానికి కృష్ణ బ్రేక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. #respectwomen pic.twitter.com/mXYZCvMPwI — Rakul Preet (@Rakulpreet) 23 May 2017 -
నైతికత లేకుండా మంత్రి వర్గ విస్తరణ జరిగింది
-
’నేను చాలా గొప్పగా ఫీల్ అవ్వట్లేదు’
-
వాళ్లకే మంత్రి పదవి ఇవ్వమని చెప్పాను
-
షోలే సినిమాలో గబ్బర్ సింగ్ కేసీఆర్: రేవంత్
హైదరాబాద్: అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను స్పీకర్ సస్పెండ్ చేశారని టీడీపీ నేత రేవంత్రెడ్డి అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిం చిన మంత్రి హరీష్ను, అసెంబ్లీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. షోలే సినిమాలో గబ్బర్సింగ్లా కేసీఆర్ సభలో ప్రజా సమస్యలను చర్చకు రానీయలేదని ఆరోపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమైందని ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అన్నారు. రెండు పార్టీల నేతలు ఒకరినొకరు పరస్పరం పొగుడుకున్నారని ఆరోపించారు. -
అభివృద్ధి చూసి ఓటేశారు
పాలకొల్లు సెంట్రల్ : ప్రజాశ్రేయస్సును పక్కన పెట్టి బీజేపీని ఓడించాలనే ధ్యేయంగా అన్ని పార్టీలు కలిసి పనిచేసినా అభివృద్ధిని మాత్రం ఓడించలేకపోయారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శనివారం రాష్ట్ర స్వచ్ఛభారత్ కన్వీనర్ డాక్టర్ బాబ్జీ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ తమది గాలివాటం గెలుపు కాదు వంద శాతం అభివృద్ధి విజయమని ఉత్తర్ప్రదేశ్ ఫలితాలు నిరూపించాయి. పార్టీ విజయం సాధిస్తుందని తెలుసు కానీ 320కి పైగా స్థానాలు గెలుచుకోవడం చూస్తుంటే ప్రధాని మోదీ పథకాలు ప్రజలపై ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుందన్నారు. త్వరలో ఏపీలోనూ బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకోసం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నామని, ఇక్కడ కూడా విజయబావుటా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ నోట్ల రద్దుతో బీజేపీకి ప్రజాధరణ లేదని విపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశారని, ప్రజాతీర్పు చూసిన తరువాత ఓటింగ్ యంత్రాల వైఫల్యమని అంటున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, క్వాయర్ బోర్డు డైరెక్టర్ పీవీఎస్ వర్మ, రావూరి సుధ, ఉన్నమట్ల కబర్ది పాల్గొన్నారు. -
ప్రజలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు
-
'అమ్మాయిలు ఆ దుస్తులు ధరించకూడదు'
తిరువనంతపురం: పురుషులను రెచ్చగొట్టే విధంగా మహిళలు దుస్తులు ధరించకూడదంటూ ఓ క్రైస్తవ మత ప్రభోదకుడు చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన పాస్టర్ సెర్మొన్ వీడియో ఫేస్బుక్లో సంచలనం సృష్టిస్తోంది. వీడియోలో ఆయన ఏమన్నారంటే.. కొన్ని చర్చిల్లో చెప్పినట్లు పెద్ద గుంపుకు తాను బోధనలు చేయనని చెప్పారు. అలాంటి చోట్ల అమ్మాయిలు ముందు వరుసలో మోడరన్ వేర్ ధరించి.. సెల్ఫోన్ను చేతిలో పట్టుకుని కూర్చుంటారని అది తనకు నచ్చదని తెలిపారు. కనీసం జుత్తును కూడా వారు సరిగా దువ్వుకుని రారని.. చర్చికి వచ్చే సమయంలో కూడా ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు ఇప్పటివరకూ అర్ధం కాలేదని చెప్పారు. అలా దుస్తులు ధరించి చర్చికి రావొచ్చా? అని ఆయన సభకు వచ్చిన అమ్మాయిలను ప్రశ్నించారు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ధరిస్తున్న దుస్తులపై తనకు ఫిర్యాదు చేసినట్లు సెర్మొన్ చెప్పారు. అలాంటి వారిని చర్చి వద్ద చూస్తుంటే తాము పాపాలకు గురౌతామని అబ్బాయిలు వాపోయినట్లు తెలిపారు. మహిళలు వాళ్ల సమస్యలపై ఫిర్యాదులు (పెళ్లి ఎందుకు జరగడం లేదనో, ఉద్యోగం ఎందుకు రావడం లేదనో తదితరాలపై) చేస్తారని.. అందుకు కారణం వారు ధరిస్తున్న దుస్తులేనని అన్నారు. చుడీదార్లు చాలా చక్కగా ఉంటాయని అమ్మాయిలు వాటినే ధరించాలని అన్నారు. కొంతమంది అమ్మాయిల్లో సతాను ప్రవేశించిందని అందుకే మోడరన్ దుస్తుల వైపు ఆకర్షితులౌతున్నారని చెప్పారు. -
లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేస్తున్నారు
-
టీఆర్ఎస్ పాలనపై కోదండరాం వ్యాఖ్యలు
-
అసలు పెద్ద నోట్ల రద్దు ఎవరి కోసం?
న్యూఢిల్లీ: ‘కచ్చితంగా ఏడాదిలోగా భారత దేశాన్ని నగదు రహిత దేశంగా (క్యాష్లెస్ ఇండియా)గా మార్చి చూపిస్తాం’ అని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, ఎకో వ్యవస్థాపకులు, సీఈవో అభిషేక్ సిన్హా, ఐస్పిరిట్ సహ వ్యవస్థాపకులు శరద్ శర్మ ముక్త కంఠంతో చెప్పారు. అదెప్పుడంటే 2016, జనవరి 16వ తేదీన ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో ‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ పేరిట జరిగిన కార్యక్రమంలో. స్టార్టప్ ఇండియా ఆర్థిక విధానాన్ని ఆవిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సును సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సిలికాన్ వ్యాలీ నుంచి దాదాపు పాతిక మంది ప్రసిద్ధ కంపెనీల సీఈవోలు కూడా హాజరయ్యారు. మూడు కంపెనీల సీఈవోలు ప్రతిజ్ఞ నెరవేరాలంటే 2017, జనవరి 16వ తేదీ నాటికి భారత దేశం నగదు రహిత దేశంగా మారాలి. ఆ సదస్సు ముగిసిన నాటి నుంచి పెద్ద నోట్ల రద్దు వరకు ఈ మూడు కంపెనీలేవీ నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు తీసుకున్న పెద్ద చర్యలేవీ కనపించడం లేదు. ఈ రోజు నుంచి రూ. 500, రూ. 1000 రూపాయల నోట్లు చిత్తు కాగితాలతో సమానమంటూ ప్రధాని మోదీ నవంబర్ 8వ తేదీన చేసిన ప్రసంగంలోనూ ఎక్కడా నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఒక్క మాటైనా లేదు. కానీ ఆ మరుసరోజు పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఆయన ఫొటోలతో పేటీఎంలాంటి కంపెనీలు భారీ ఎత్తున వాణిజ్య ప్రకటనలను విడుదల చేశాయి. ప్రైవేట్ యాడ్కు ప్రధాని ఫొటోను ఉపయోగించడంపై వివాదం కూడా చెలరేగిన విషయం తెల్సిందే. అభివద్ధి చెందిన దేశాలతోపాటు మనమూ అభివద్ధి చెందాలంటే నగదు రహిత ఆర్థిక వ్యవస్థవైపు అతివేగంగా అడుగులు వేయాల్సిందేనని, నూటికి నూరు శాతం సాధ్యం కాకపోయినా, అతి తక్కువ నగదును ఉపయోగించే స్థాయికి ఎదగాలని నవంబర్ 26వ తేదీన దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. నల్లడబ్బును అరికట్టేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. నవంబర్ 8వ తేదీన నల్లడబ్బును వెలికితీయడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశానంటూ తన ప్రసంగంలో 18 సార్లు చెప్పిన మోదీ, నాడు ఒక్కసారి కూడా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు డిసెంబర్ 30వ తేదీ వరకు గడువు పెడుతూ మోదీ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించి సరిగ్గా ఈ రోజుకు 30 రోజులు. అయినా పేదలు, కూలీలు, వలస కూలీలు, చిల్లర వ్యాపారస్థులు, పాకా హోటళ్ల నోట్ల కష్టాలు తీరలేదు. ఇక బీద, బిక్కీ పాట్లు చెప్పలేం. నోట్ల రద్దు కారణంగా వైద్యం అందక మరణిస్తున్న రోగుల రోదనలు ఆగలేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే మొత్తం నల్ల ఆస్తుల్లో నల్లడబ్బు మూడు నుంచి ఐదు శాతానికి మించిలేదు. కేవలం అంత నల్లడబ్బు కోసం ఇంతమంది బడుగు వర్గాలను బాధలకు గురిచేయడం ఎంతమేరకు సమంజసం. నాడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లు పేదల బ్యాంక్ ఖాతాల్లో 15లక్షల రూపాయలను నరేంద్ర మోదీ జమ చేస్తారా? ఇప్పుడు నల్లడబ్బుతో బయటపడిన వారికి కఠిన శిక్షలు విధిస్తారా? ఇప్పటివరకు ఎంత నల్లడబ్బును పట్టుకున్నారో, ఎంత నల్లడబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ అయిందో చెప్పగలరా? అసలు పేద ప్రజల ప్రయోజనాలనాశించి నల్లడబ్బును వెలికితీయడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారా? ఏడాదిలోగా నగదు రహిత దేశంగా భారత్ను మారుస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన పేటీఎం లాంటి కార్పొరేట్ పెద్దల కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారా? –––––––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
'జయలలితే నాకు ఎప్పటికీ స్పూర్తి'
-
ఏపీ హక్కుల్ని కాలరాస్తున్న చంద్రబాబు
-
అవసరానికి అనుగుణంగా బాబు మాటలు
-
లోకేష్... ‘వైట్ ఎలిఫెంట్’: టీడీపీ ఎమ్మెల్యే
నోరు జారిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ కాకినాడ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్పై టీడీపీ ఎమ్మెల్యే వర్మ చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. నారా లోకేశ్ని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ‘వైట్ ఎలిఫెంట్’తో పోల్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపైనా దూకుడుగా మాట్లాడిన వర్మ.... అదే ఊపులో తమ యువ నాయకుడు నారా లోకేష్ ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎదుగుతున్నారని, ఆయనపై అనవసరంగా బురదజల్లుతున్నారంటూ ఆరోపించారు. ‘ఒక ఏనుగు మీద... తెల్ల ఏనుగు మీద’ బురద జల్లేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏనుగు తనపని తాను చేసుకుపోతుందని లోకేష్నుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు, పార్టీ నేతలు నివ్వెరపోయారు. ఎమ్మెల్యే వర్మ కామెంట్స్పై టీడీపీ నేతలే విస్తుపోయారు. వైఎస్సార్ సీపీని విమర్శించడమే లక్ష్యంగా ప్రెస్మీట్ పెట్టి పనిలో పనిగా తమ యువనేతపై నోరుజారిన సదరు ఎమ్మెల్యే తీరు పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. లోకేష్కు, రాజప్పకు జగన్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పార్టీ సమావేశంలో జరిగిన సంభాషణకు వక్రభాష్యం చెప్పారంటూ ఆయన ఆరోపించారు. -
విద్యార్థులు లేకుండా వేడుకలా..?
ఎస్కేయూ : యూనివర్సిటీ విద్యార్థులు లేకుండా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తారా అంటూ ఎస్కేయూ విద్యార్థి జేఏసీ సోమవారం విలేకరుల సమావేశంలో విమర్శించింది. జాతీయ జెండా ఆవిష్కరణ సమయం మార్పు అంశం విద్యార్థులకు తెలియజేయడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడింది. దీంతో కేవలం క్యాంపస్ స్కూలు విద్యార్థులు మాత్రమే కార్యక్రమాలకు హాజరయ్యారని పేర్కొంది. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. లింగారెడ్డి, గెలివి నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, జయచంద్ర, మోహన్రెడ్డి, భానుప్రకాష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేశులు, సుబ్బరాయుడు, వేమన్న, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, రమణ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్ యాదవ్, అక్కులప్ప పాల్గొన్నారు. -
పాప క్షమాపణే దేవుని సువార్త
-
కుటిల రాజకీయాలు మాను కోవాలి
-
న్యాయానికి వందనాలు
-
'దేశమేమి వణకదు.. ముందు నోరు విప్పు'
ముంబయి: తాను నోరు విప్పితే దేవం వణుకుద్ది అంటూ వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే వెంటనే ఆ పని చేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చెప్పింది. ఆ నిజాలేమిటో వెంటనే ప్రజలకు తెలియజేయాలని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ శనివారం మీడియాతో అన్నారు. నెల క్రితం వరకూ మహారాష్ట్ర సర్కారులో మంత్రిగా పనిచేసి, ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేసిన ఏక్ నాథ్ ఖడ్సే గురువారం తాను గొంతు విప్పితే భారతదేశం మొత్తం గజగజ వణుకుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత నవాబ్ స్పందిస్తూ 'తాను నోరు విప్పితే దేశం వణికిపోద్ది అంటూ ఖడ్సే వ్యాఖ్యలు చేశారు. అతడు వెంటనే నోరు విప్పితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అతడు నోరు విప్పితే వణికేది దేశం కాదు.. బీజేపీ. నాకు తెలిసి బీజేపీలోనే అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఒక వేళ నువ్వు (ఖడ్సే) అండర్ వరల్డ్ డాన్ దావూద్ తో మాట్లాడి ఉండి ఆ విషయాలు నీ పార్టీ నాయకులకు చెబితే ఆ నిజాలేమిటో బయటకు చెప్పు. నీకు తెలిసిన విషయాలేమిటో నువ్వు కచ్చితంగా బయటపెట్టాలి' అని డిమాండ్ చేశారు. -
'నేను నోరు తెరిస్తే.. దేశం వణుకుద్ది'
ముంబై: నెల క్రితం వరకూ మహారాష్ట్ర సర్కారులో మంత్రిగా పనిచేసి, ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేసిన ఏక్ నాథ్ ఖడ్సే గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను గొంతు విప్పితే భారతదేశం మొత్తం గజగజ వణుకుతుందన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి, శివసేనతో పార్టీ కలవడానికి తానే కారణమని చెప్పారు. లేకపోతే సేనకు చెందిన నాయకుడే రాష్ట్రంలో సీఎం అయ్యేవారని అన్నారు. అండర్ వరల్డ్ డాన్, ప్రస్తుతం పాకిస్తాన్ లో నివసిస్తున్న దావూద్ ఇబ్రహీం నుంచి ఫోన్ కాల్స్, ల్యాండ్ డీల్స్ తదితర వివాదాల్లో ఖడ్సే చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు ఒత్తిడి పెంచడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. కాగా, ఖడ్సేకు దావూ్ద్ తో ఎప్పటినుంచో సంబధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశాన్ని వణికించే సమాచారం తన వద్ద ఉందని చెబుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ, కాంగ్రెస్ ల అధికార ప్రతినిధులు ఖడ్సేను వెంటనే కస్టడీకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై స్పందించిన నగ్మా
రేప్ పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఒక వైపు ట్విట్టర్ లో దుమారం రేపుతుండగా.. మరో వైపు కొంతమంది ప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. తన సినిమా ‘సుల్తాన్’ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉందంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా ఖండించారు. సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన సల్మాన్ ఖాన్ మహిళలపై చిన్నచూపు చూడటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సల్మాన్ ఖాన్ చేసిన పని తప్పే అయినా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అతని క్యారెక్టర్ ను శకించడం తగదని అన్నారు. బహుశా రేప్ బాధిత మహిళల జీవితం గురించి చెప్తూ ఇలా అని ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇక రేప్ అనేది చిన్న విషయం అనే భావనను సల్మాన్ ప్రజల్లోకి పంపారని దీనిపై ఆయన క్షమాపణలు చెప్పినా ఉపయోగం ఉండదని ప్రముఖ కాలమిస్ట్ అన్నా ఎమ్. వెట్టికడ్ పేర్కొన్నారు. సల్మాన్ పై తనకు ఎలాంటి దురాభిప్రాయం లేదని కానీ, ఇలాంటి సంఘటనల్లో పురుషులకు వెన్నుదన్నుగా నిలబడటం ములాయం లాంటి వాళ్లకు సాయం చేసినట్లేనని, వాళ్లు అబ్బాయిలు వాళ్లు తప్పులు చేస్తూనే ఉంటారని అన్నావెట్టికాడ్ అన్నారు. మహిళలపై సల్మాన్ వ్యాఖ్యలు అతని మైండ్ సెట్ ను తెలియజేస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం అన్నారు. సల్మాన్ లాంటి సెలబ్రిటీలు పబ్లిక్ లో మాట్లాడే ముందు ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలని హితబోధ చేశారు. రేప్ అనే విషయాన్ని సల్మాన్ చిన్నవిషయంగా భావించలేదని, అయితే ఈ విషయంపై దేశమంతా ఇప్పుడు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని పూజా బేడీ వ్యాఖ్యానించారు. -
కలెక్టర్ను హీరోయిన్లా ఉన్నారని..
ఓ జిల్లా కలెక్టర్ను పట్టుకుని మీరు హీరోయిన్లా ఉన్నారని, కానీ ఇంతకు ముందెప్పుడు తెరమీద నటిస్తుండగా చూడలేదన్న ఎమ్మెల్యేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్ మాట్లాడారు. సర్గుజా జిల్లా కలెక్టర్ రితూ సేన్ను చూసి, ఆమె చాలా అందంగా ఉందని, హీరోయిన్లా ఉందిగానీ ఆమె నటించడం తానెప్పుడూ చూడలేదని అన్నారు. అంతటితో ఆగకుంగా.. తన 48 ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ లాంటి పిచ్చివాడిని చూడలేదని అన్నారు. సీతాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భగత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీంతో స్పందించిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ను అడ్డగించడం, తప్పుడు వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
అది జాత్యహంకారం..
రాహుల్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలపై జైట్లీ * నల్లధనంపై పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టదు * నగలపై ఎక్సైజ్ సుంకం ఉపసంహరణ కుదరదు * బడ్జెట్పై లోక్సభలో చర్చకు ఆర్థికమంత్రి జవాబు న్యూఢిల్లీ: నల్లధనం వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసిన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలు జాత్యహంకార మనఃస్థితిని ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తిప్పికొట్టారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండానే.. ఆ వ్యాఖ్య రాజకీయంగా సరైనది కాదని, తెల్లగా (ఫెయిర్) లేని వారు ఆకర్షణీయంగా (లవ్లీ) ఉండబోరన్నది ఆ వ్యాఖ్యల మనఃస్థితిని పేర్కొన్నారు. నల్లధనంపై ప్రభుత్వం ప్రకటించిన పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టే పథకం కాదని ఉద్ఘాటించారు. నల్లధనం వెల్లడించే వారు 30 శాతం పన్ను, 15% సర్చార్జి, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బడ్జెట్పై లోక్సభలో చర్చకు జైట్లీ సోమవారం సాయంత్రం సమాధానం ఇస్తూ.. ఆటంకతత్వం లేకపోతే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందగలదన్నారు. జీఎస్టీ, దివాలా బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలని కోరారు. నగలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్లను తిరస్కరించారు. జీఎస్టీ అమలు చేయటానికి సన్నాహంలో భాగంగా ఈ సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అలాగే.. రుణ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన వాణిజ్యవేత్త విజయ్మాల్యా దేశం విడిచి వెళ్లటంపై విపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. చట్ట వ్యవస్థ ఆ రుణాల వసూళ్లకు అడ్డంకిగా మారి, ఆయన తప్పించుకుపోవటానికి వీలు కల్పించిందా అన్న ప్రశ్న తలెత్తుతోందని వ్యాఖ్యానించారు. అనంతరం.. బడ్జెట్ కసరత్తులో తొలి దశను పూర్తిచేస్తూ వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అర్ధసత్యాల బడ్జెట్: విపక్షంఅంతకుముందు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. బడ్జెట్ అంతా ఎంతో బాగుందన్నట్లు చిత్రిస్తోందని.. అర్థసత్యాలతో నిండి ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ‘అచ్ఛే దిన్’ నినాదాన్ని గుర్తుచేస్తూ.. నిక్కర్ల నుంచి ప్యాంట్లకు ఎదిగిన ఆర్ఎస్ఎస్కు మాత్రమే మంచి రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బడ్జెట్కు నూరు శాతం మార్కులు ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. పరీక్ష రాసే వారిగా, ఆ పరీక్షను పరిశీలించే వారిగా మోదీయే వ్యవహరిస్తున్నారని తారిక్ అన్వర్ (ఎన్సీపీ) విమర్శించారు. బడ్జెట్ మధ్యతరగతికి వ్యతిరేకమైనదని సంతోక్సింగ్చౌదరి (కాంగ్రెస్) ధ్వజమెత్తారు. బడ్జెట్కు దిశానిర్దేశమేదీ లేదని, అంతా డొల్ల అని ప్రకాశ్నారాయణ్యాదవ్ (ఆర్జేడీ) విమర్శించారు. బడ్జెట్లో దూరదృష్టి లేదని తపస్మండల్ (టీఎంసీ) తప్పుపట్టారు. రైతులను కాపాడటానికి ఏదైనా చేయాలని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ విజ్ఞప్తిచేశారు. రైతుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం వద్ద ఏ మంత్రదండం ఉందని ధర్మేంద్రయాదవ్ (ఎస్పీ) ప్రశ్నించారు. బడ్జెట్ సంతులనంగా ఉన్నప్పటికీ.. కొన్ని లోపాలు ఉన్నాయని, నగలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని బుట్టా రేణుక (వైఎస్సార్ కాంగ్రెస్) ప్రభుత్వాన్ని కోరారు. పలువురు బీజేపీ సభ్యులు బడ్జెట్ను ప్రశంసించారు. -
రాహుల్ వ్యాఖ్యల్లో అజ్ఞానం కనిపిస్తోంది : జైట్లీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రేరేపించేవిగా ఉన్నాయని, ఫెయిర్ అండ్ లవ్లీ యోజన అంటూ ప్రభుత్వ పథకాలను రాహుల్ విమర్శించడంలో సమన్వయం కనిపించడం లేదని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సమంజసం కాదన్నారు. నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిర్ అండ్ లవ్లీ పథకాన్ని ప్రారంభించింది అంటూ రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... అటువంటి వ్యాఖ్యలు వ్యక్తుల్లోని అజ్ఞానాన్ని తెలియజేస్తాయని అన్నారు. 'ఫెయిర్ అండ్ లవ్లీ యోజన్' అంటూ రాహుల్ వాడిన పదబంధం రాజకీయ నాయకులు మాట్లాడే పద్ధతిలో లేదని, ఇది జాతి అభిప్రాయం అంటూ అరుణ్ జైట్లీ లోక్ సభ బడ్జెట్ చర్చ జరుగుతున్న సమయంలో పేర్కొన్నారు. -
'నా మనసులో మాట చెప్పడం ఇష్టంలేదు'
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదల కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై వ్యాఖ్యానించడానికి, రాజీవ్ కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించారు. దీనిపై ఏం చేయాలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ అంశంపై తానేమీ చెప్పలేనన్నారు. దీనిపై గురువారం స్పందించిన రాహుల్ దీనిపై తన మనసులోని మాటను బయటపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజీవ్ దోషులను విడుదల చేస్తే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదని లోకసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే గురువారం పార్లమెంట్లో అన్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ఐక్యతకే భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడు రాసిన లేఖను కేంద్ర హోంశాఖ బయటపెట్టడం శోచనీయమన్నారు. కాగా తమిళనాడు రాసిన లేఖను పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో తెలిపారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు నిందితులను విడుదల చేసే విషయంలో, కేంద్రం అనుమతి కావాలంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
స్వపక్షంలో విపక్షంలా కీర్తీ ఆజాద్
-
మిత్రా బెయిల్పై మమత 'నో కామెంట్స్'
పశ్చిమ బెంగాల్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా కుంభకోణంలో నిందితుడు, తన మంత్రి వర్గ సభ్యుడు మదన్ మిత్రాకు బెయిల్ లభించడంపై మాట్లాడడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. శారదా కుంభకోణం కేసులో గత సంవత్సరం డిసెంబర్ 12 న క్రీడలు, రవాణా మంత్రిగా పనిచేస్తున్న మదన్ మిత్రాను సీబీఐ అరెస్టు చేసింది. కాగా శనివారం ఆయనకు సిటీకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు విషయంపై మమతా బెనర్జి మాట్లాడుతూ.. 'అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశమైనందున దానిపై నేను మాట్లాడలేను' అని అన్నారు. -
ఆ చూపు మర్చిపోలేను!
జ్ఞాపకం అమ్మాయిల గురించి కామెంట్ చేయడం అంటే నాకు భలే సరదా! అమ్మాయి కనిపిస్తే చాలు... వాళ్లు నొచ్చుకునేలా ఏదో ఒక కామెంట్ చేసేవాడిని. ఇది మంచి పద్ధతి కాదని ఒక్కరిద్దరు చెప్పినా ‘కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని పాడుతూ వారిని చాదస్తపుగాళ్లు, ఎంజాయ్ చేయడం రానివాళ్లంటూ వెక్కిరించేవాణ్ని. ఒకరోజు ఒక అమ్మాయి మా కాలేజీలో చేరడానికి వచ్చింది. నేను ఆమెను టీజ్ చేస్తుంటే... నా పక్కన ఉన్నవాళ్లు నవ్వడం ప్రారంభించారు. అవమానంతో ఆ అమ్మాయి ముఖం ఎర్రబారింది. కళ్లనిండా నీళ్లతో అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయింది. పది నిమిషాల తరువాత వాళ్ల అన్నయ్యను తీసుకొచ్చి ‘వీడే నన్ను కామెంట్ చేసింది’ అని చూపించింది. వాళ్ల అన్నయ్య చాలా సన్నగా ఉన్నాడు. దీంతో నేను మరింత రెచ్చిపోయాను. ‘మైక్ టైసన్ మీ అన్నయ్య అని ఒకమాట చెబితే నేను అలా చేసేవాడినా? మీ అన్నయ్య సిక్స్ప్యాక్ బాడీ చూస్తే చెమటలు పడుతున్నాయి’ అంటూ ఓవర్ యాక్షన్ చేయడం ప్రారంభించాను. ‘అలా మాట్లాడడం తప్పు తమ్ముడూ’ అన్నాడా అన్నయ్య శాంతంగా. ‘పోవోయ్’ అన్నాను నేను. నా తీరు అర్థమై పాపం ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ మౌనంగా నిష్ర్కమించారు. ఇది జరిగిన రెండు నెలల తరువాత ఓరోజు... మా వదినకు ఒంట్లో బాలేకపోతే, తనని తీసుకుని బైక్ మీద హాస్పిటల్కి బయలుదేరాను. ఒకచోట వర్షపు నీళ్లు, గుంతలు ఉండడంతో బైక్ స్లో చేశాను. అక్కడే కొందరు కుర్రాళ్లు ఉన్నారు. వాళ్లు మా వదిన్ని కామెంట్ చేయడం మొదలెట్టారు. పాపం మా వదిన సిగ్గుతో తల దించు కుంది. అది చూసి నా రక్తం మరిగి పోయింది. వెళ్లి అడగా లనుకున్నాను. కానీ వాళ్లు ఏడెనిమిది మంది ఉన్నారు. అందరూ కలిసి చావబాదుతారేమోనని భయమేసి వాళ్ల కామెంట్స్ విననట్టే నటించాను. ఇదా నువ్వు చేసేది అన్నట్టుగా అప్పుడు మా వదిన నా వైపు చూసిన చూపు నేనిప్పటికీ మర్చిపోలేను. ఆరోజు కాలేజీలో ఆ అన్నయ్య బలం నా బలం ముందు దిగదుడుపు అనే గర్వంతో విర్రవీగాను. ఇప్పుడా బలం ఏమైంది? అంతకంటే పెద్ద బలం ముందు తోక ముడిచింది! ఆ దెబ్బకి నా పొగరు అణిగి పోయింది. ఆ తర్వాత మళ్లీ ఏ అమ్మాయినీ కామెంట్ చేయలేదు నేను. - వీఆర్సీ, చిత్తూరు -
డ్యాన్స్ చేయడానికి లేమిక్కడ
కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: తాము అధికారంలో ఉన్నది విపక్షం డెరైక్షన్లో డ్యాన్స్లు చేయడానికి కాదని కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విపక్షం చెప్పినట్టు నడుచుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వలేదని, ప్రజాతీర్పు మేరకు ఐదేళ్లు నడుచుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటంపై స్పందిస్తూ కేంద్రమంత్రి ఢిల్లీలో శుక్రవారం ఇలా మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు చట్టంలోలేని వాటిని సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుండగా, విపక్ష పార్టీ స్కూల్లో అల్లరి పిల్లల్లా వ్యవహరిస్తోందన్నారు.షెడ్యూల్ 9, 10 లోని ఆస్తుల విషయాన్ని వచ్చే నెల 15వ తేదీ లోపు ఒక కొలిక్కి తెస్తామన్నారు. -
‘కశ్మీర్’ లేని చర్చలు వ్యర్థం
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్య వాషింగ్టన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ చర్చల్లో కశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఆ చర్చల్లో కశ్మీరీ నేతలను మూడో వర్గం(థర్డ్ పార్టీ)గా పరిగణించబోమన్నారు. భారత్తో చర్చలకు సంబంధించి.. కశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని కుండబద్దలు కొట్టారు. కశ్మీరీలను సంప్రదించకుండా, వారి అభిప్రాయం తీసుకోకుండా వారి భవితవ్యాన్ని నిర్ణయించలేమని సోమవారం పాక్ కేబినెట్ భేటీలో షరీఫ్ వ్యాఖ్యానించారని పాక్ పత్రిక ‘డాన్’ పేర్కొంది. జమాతుద్ దవాను పాక్ నిషేధించలేదు ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వం వహిస్తున్న ఉగ్రవాద సంస్థ జమాతుద్ దవా(జేయూడీ)పై, అఫ్ఘానిస్తాన్కు చెందిన హక్కానీ నెట్వర్క్పై పాక్ నిషేధం విధించలేదు. 60 నిషేధిత సంస్థలతో కూడిన అధికారిక జాబితాలో ఆ ఉగ్రవాద సంస్థల పేర్లు లేవు. అయితే అధికారుల నిశిత పరిశీలనలో ఉన్న జాబితాలో మాత్రం జేయూడీ ఉంది. ఐరాస నిషేధించిన సంస్థల్లో అదొకటి. సయీద్ను పట్టించినవారికి కోటి డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అయినా, సయీద్ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం జోక్యం చేసుకోం.. అమెరికా: భారత్-పాక్ చర్చల పునరుద్ధరణలో తాము ఎలాంటి పాత్రా పోషించబోమని అమెరికా స్పష్టం చేసింది. చర్చలు ఎలా, ఏయే అంశాలపై జరగాలనే విషయాన్ని ఆ రెండు దేశాల నేతలే నిర్ణయించుకోవాలంది. అయితే, ఇరుదేశాల మధ్య జాతీయ భద్రత సలహాదారు స్థాయి చర్చలు నిలిచిపోవడం తమను నిరుత్సాహపరిచిందని పేర్కొంది. ‘ఇరుదేశాల నేతలు చర్చలను పునరుద్ధరించుకుని ఉగ్రవాదం సహా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం. కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్తాన్లే ఆ సమస్యను పరిష్కరించుకోవాలన్న మా వైఖరిలో మార్పులేదు’ అని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. రష్యాలోని ఉఫాలో భారత్, పాక్ల ప్రధానులు చర్చలపై ఒక అంగీకారానికి రావడం తమకు సంతోషం కలిగించిందని, అయితే, ఆ ప్రక్రియకు అంతరాయం కలగడం దురదృష్టకరమని అన్నారు. -
ఆర్ఎంపీకి ఎక్కువ.. ఎంబీబీఎస్కు తక్కువ
మంత్రి లక్ష్మారెడ్డి చదువుపై రేవంత్ వ్యాఖ్య కొడంగల్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చదువు ఆర్ఎంపీకి ఎక్కువ.. ఎంబీబీఎస్కు తక్కువ అని ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆదివారం కొడంగల్లోని ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష్మారెడ్డి బీహెచ్ఎంఎస్ ధ్రువీకరణపై అనుమానాలు ఉన్నాయన్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తి ప్రజలను మోసం చేయడం కష్టం కాదన్నారు. లక్ష్మారెడ్డి చదువు మున్నాభాయి ఎంబీబీఎస్ లాంటిది కాదా? అని ప్రశ్నించారు. గుల్బర్గాలో ఉన్న హెచ్ఎంసీహెచ్కు కర్ణాటక ప్రభుత్వం 1987లో అనుమతి ఇచ్చిందని, అయితే మంత్రిఎన్నికల అఫిడవిట్లో 1987లో బీహెచ్ఎంఎస్ డిగ్రీ పాసైనట్లు పేర్కొన్నారని చె ప్పారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
వర్మానందం
-
చిరంజీవిపై..వర్మానందం
-
మాజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి ‘చెత్త’
మంత్రి దేవినేని ఉమ వివాదాస్పద వ్యాఖ్యలు కర్నూలు: ఉమ్మడి ఏపీలో అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన సుదర్శన్రెడ్డిని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ‘చెత్త’గా అభివర్ణించారు. రాష్ట్రానికి కృష్ణా నీటి వాటా తీసుకురావడంలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించడంలో సుదర్శన్రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గురువారమిక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదర్శన్రెడ్డిని కాకుండా.. నారిమన్ లాంటి వారిని నియమించమంటే అప్పటి సీఎం వైఎస్ వినిపించుకోలేదని ఆరోపించారు. ఫలితంగామన వాదనలు బలహీనమై కర్ణాటక, మహారాష్ట్రలకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. కాగా రాయలసీమకు నీళ్లు రావడం ప్రతిపక్ష నేత జగన్కు ఇష్టంలేనట్లుగా ఉందని ఉమ వ్యాఖ్యానించారు. -
'ఆ జగడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది'
సునీల్ గవాస్కర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పేసర్ మిషెల్ జాన్సన్తో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి జగడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దూకుడు కారణంగా జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ‘మీడియా సమావేశంలో క్రికెట్ గురించే మాట్లాడాలి. మైదానంలో జరిగిన ఇతర విషయాల గురించి అక్కడే వదిలేయాలి. కోహ్లి మాట్లాడిన విధానం తెలివైనదనిపించుకోదు. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, ద్రవిడ్ ఇంతకంటే కఠిన పరిస్థితులే ఎదుర్కొన్నారు. కానీ వారి ప్రవర్తన ఇలా ఉండేది కాదు. అవతలి వ్యక్తి రెచ్చగొడితే స్పందించడం కరెక్టే అయినా మనం కూడా అదే పనిగా ఇతరులపై నోరుపారేసుకోవడం సముచితం కాదు. దీనివల్ల అతడి వికెట్ కూడా పడింది. ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది’ అని గవాస్కర్ విమర్శించారు. -
ఫేస్బుక్ వాడుతున్నారా.. జాగ్రత్త!
-
ఎందుకిలా..?!
మొన్నటిదాకా అత్తగారు, ఆడపడచుల చేతిలో నానా ఆరళ్లకూ గురైన స్త్రీ కూడా, తాను అత్తగారిగా మారినప్పుడు మరికాసిన్ని హంగులు కలిపి మరీ అత్తగారి హోదానే ప్రదర్శిస్తుంది కానీ, కొత్తకోడలిని ఆదరించి అక్కున చేర్చుకోవాలనుకోదు! ‘‘అత్తయ్యగారూ... మా అమ్మకి బొత్తిగా ఒంట్లో బాగోలేదట. ఒక్కసారి చూసివస్తాను’’ సూటిగా అత్తగారి ముఖంలోకి చూడటానికి కూడా భయపడుతూనే కాలిబొటనవేలిని నేలకు రాస్తూ అడిగింది అమల. ‘‘ఇదిగో అమ్మాయ్! మా అమ్మకి బాగోలేదు, మా అక్క పురిటికి పుట్టింటికొచ్చింది, చెల్లాయికి పెళ్లిచూపులు, నాన్నకి యాక్సిడెంటయింది, తమ్ముడికి పరీక్షలు... అంటూ రెండు మూడు నెలలకోసారి పుట్టింటికెళ్లి పదేసి రోజులు అక్కడ కూచుంటుంటే ఇంటిల్లిపాదికీ వండిపెట్టడం నా వల్ల కాదమ్మా...’’ అంటూ ముఖం చిట్లించింది కనకమ్మ. చేసేదేమీ లేక గుడ్లల్లో నీళ్లు గుడ్లలోనే కుక్కుకుని అర్జంటుగా ఏదో పనున్నట్టు వంటింట్లోకి దూరింది అమల. కోడలు పుట్టింటికెళ్లిన సమయంలో బాత్రూమ్లో తను పడిపోయినప్పుడు చిన్న కూతురు వచ్చి పది రోజులుండి మరీ సపర్యలు చేయటం, తన భర్తకు సుస్తీ చేసినప్పుడు పెద్దకూతురికి బదులు అల్లుడే ఉద్యోగానికి లీవ్ పెట్టి వచ్చి హాస్పిటల్లో ఆయనతోబాటే ఉండి సేవలు చేయడం కనకమ్మకి ఎందుకో గుర్తులేదు! బస్సులో స్త్రీలకు రిజర్వ్ చేసిన సీటులో దర్జాగా కూర్చుని ఉంటాం... చంటిపిల్ల తల్లి వచ్చి మనవైపు నిస్సహాయంగా చూసినప్పుడు ‘అన్నింటిలోనూ సమాన హక్కులుండాలని బ్యానర్లు పట్టుకుంటారు, ఇందులో మాత్రం రిజర్వేషనుండాలని కొట్లాడతారు’ అంటూ చీప్గా కామెంట్ చేసి, ఉదారంగా సీటిచ్చినట్టు పోజుకొడతారు కొందరు ప్రబుద్ధులు. అలాంటివారికి అంతకు మునుపు తను భార్యతో, తల్లితో కలిసి బస్సెక్కినప్పుడు లేడీస్ సీటులో కూర్చున్న వాళ్లని లేపి మరీ తన వాళ్లని కూర్చోబెట్టిన విషయం గుర్తురాదెందుకో! కొందరింతే! తమకో న్యాయం... తమ పొరుగువారికో న్యాయం అన్నట్టు ప్రవర్తిస్తారు. వీళ్లనేమనాలో అర్థం కాదు... అక్కడిదాకా ఎందుకు... మొన్నటిదాకా అత్తగారు, ఆడపడచుల చేతిలో నానా ఆరళ్లకూ గురైన కోడలు కూడా, తాను అత్తగారిగా మారినప్పుడు మరికాసిన్ని హంగులు కలిపి మరీ అత్తగారి హోదానే ప్రదర్శిస్తుంది కానీ, కొత్తకోడలిని ఆదరించి అక్కున చేర్చుకోవాలనుకోదు. కూతురిని కట్టుకోబోయే వాడికి కట్నం ఇచ్చేటప్పుడు వియ్యాలవారిని కాళ్లావేళ్లా పడి బతిమాలిన ఆడపిల్ల తల్లిదండ్రులు రేపు తమ ఇంటికి కోడలిగా రాబోయే పిల్ల ఉత్తచేతులతో రావడాన్ని హర్షించరు. కట్నకానుకలు ఇవ్వలేని వియ్యాలవారిని అస్తమానం ఆడిపోసుకోవడం మానుకోరు. అల్లుడేమో అత్తమామలకు విధేయంగా ఉండాలి, కొడుకు అలా ఉంటే మాత్రం వాళ్ల దృష్టిలో వాజమ్మగా మిగిలిపోతాడు. రెండు నాలుకల ధోరణి అంటే ఇదేనేమో...