ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ నాటకాలు: విజయసాయి రెడ్డి | MP Vijaya Sai Reddy Comments Over Fake Allegations On Chandrababu Naidu Health In Jail - Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ నాటకాలు: విజయసాయి రెడ్డి

Published Sat, Oct 14 2023 12:22 PM | Last Updated on Sat, Oct 14 2023 1:30 PM

Vijaya Sai Reddy Comment On Chandrababu Naidu Jail - Sakshi

ఢిల్లీ: చంద్రబాబుకు ఇంటి భోజనం అందుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జైలులో ప్రత్యేక గది కేటాయించారని తెలిపారు. ప్రతిరోజు మూడుసార్లు ముగ్గురు డాక్టర్లు చెక్ అప్ చేస్తున్నారని వెల్లడించారు. 8 మంది పోలీసులు కాపలాగా ఉంటున్నారని స్పష్టం చేశారు. నేరాలకు తగిన శిక్ష అనుభవించేందుకు చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ట్వీట్ చేశారు.

'నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో  చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా దూరమై సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ డ్రామాలు' అంటూ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: మరి ఇంత నీచంగా డ్రామాలు ఆడతారా?

Follow the Sakshi TV channel on WhatsApp: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement