అల్లీపురం: వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన మహేశ్వర్ రావు(45) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎమ్వీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
విశాఖలో చైన్ స్నాచర్ అరెస్ట్
Published Mon, Nov 23 2015 1:18 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
Advertisement
Advertisement