కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పరార్ | chandrababu left hyderabad due to the vote for note case | Sakshi
Sakshi News home page

కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పరార్

Published Mon, Mar 6 2017 2:13 PM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM

కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పరార్ - Sakshi

కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పరార్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం చేకూర్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన నేపథ్యంపై రామకృష్ణారెడ్డి వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో స్పందించారు. ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ చేయడమంటే సుప్రీంకోర్టును చంద్రబాబుకు చుక్కెదురైనట్లేనని ఆయన అన్నారు.

చంద్రబాబునాయుడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ సొత్తును దోచుకుంటూ అక్రమంగా సంపాదించిన లంచాల సొమ్ముతో అవసరం లేని తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయారని చెప్పారు. "మనవాళ్లు దే బ్రీఫ్ డ్ మీ" అనే గొంతు ఆయనదే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని, అయినా అటు తెలంగాణ ఏసీబీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఇద్దరూ కూడా ఢిల్లీ పెద్దల కాళ్లు, గడ్డాలు పట్టుకుని తప్పించుకోజూశారని మండిపడ్డారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement