vote for note case
-
దొంగదారే రహదారి.. ఆడియో లీక్.. రేవంత్ రెడ్డితో అడ్డంగా దొరికినా మళ్లీ అదే పని
-
ఓటుకు నోటు కేసు... విచారణ వాయిదా ఈ సారి కోర్టుకు రేవంత్
-
రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు
-
ఓటుకు నోటు కేసు విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్
-
బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే. కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేదిలేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ.. జూలై 24కు విచారణను వాయిదా వేసింది. విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు’’ అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఇదీ చదవండి: సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా -
ఓటుకు నోటు కేసులో బాబుకు సుప్రీం షాక్
-
సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసుపై విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్పై విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్పై, ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న మరో పిటిషన్పై కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, ఈ పిటిషన్లపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇక, పిటిషన్పై విచారణ సందర్బంగా ఈ కేసు నిన్న రాత్రే లిస్ట్ అయినందున విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాద సిద్దార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో, కోర్టు పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, విచారణను వాయిదా వేసింది. ఇక, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు చంద్రబాబు డబ్బులను ఎరగా చూపించారు. ఈ సందర్బంగా ‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’ అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. అయితే, చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. -
చంద్రబాబు ఓటుకు నోటు..దెబ్బ మీద దెబ్బ..
-
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ
-
మళ్లీ ‘ఓటుకు కోట్లు’ కేసు బయటకు తీస్తారేమో సార్!
మళ్లీ ‘ఓటుకు కోట్లు’ కేసు బయటకు తీస్తారేమో సార్! -
ఓటుకు కోట్లు కేసులో నిందితులకు ఈడీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఈడీ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్జే) కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నిందితులుగా మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్ ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయసింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతోపాటు జెరూసలెం మత్తయ్య, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డి కుమారుడు వేం క్రిష్ణకీర్తన్లనూ చేర్చింది. అక్టోబర్ 4న వారిని ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎంఎస్జే తుకారాంజీ సమన్లు జారీ చేశారు. ఈడీ అభియోగపత్రం ప్రకారం నిందితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనీలాండరింగ్కు సహకరించడం లేదా ఆ కుట్రలో భాగస్వామి కావడం తదితర అభియోగాలు ఉన్నాయి. వారిపై నేరం రుజువైతే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో కీలక సాక్షుల విచారణ పూర్తయ్యింది. అయితే ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదంటూ ఇటీవల ఎంపీ రేవంత్రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు.. ప్రత్యేక కోర్టు విచారణను నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్, సండ్రలకు సుప్రీంలో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన పేరు తొలగించడాన్ని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ సండ్ర వీరయ్య, ఏసీబీ కోర్టుకు ఈ కేసు విచారించే పరిధి లేదంటూ రేవంత్రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రేవంత్ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సండ్ర తరఫున న్యాయవాది కె.గులాటిలు వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటువేయాలంటూ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డిసహా మరో ఇద్దరు లంచం ఇస్తూ దొరికారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశా రని గులాటి తెలిపారు. కేసుతో సండ్రకు సంబంధం లేదని వెల్ల డించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని సిద్దార్ధ లూత్రా తెలిపారు. అయితే, ఈ కేసులో స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్రెడ్డి తదితరులు రెడ్హ్యాండెడ్గా దొరికారని, ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్ తెలిపారు. వాదన అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. మంగళవారంలోగా కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణ సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. -
ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్
హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. కేసులో ఐ విట్నెస్లను వాగ్మూలం న్యాయస్థానం రికార్డు చేసింది. అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ వచ్చేనెల(సెప్టెంబర్) 6కు వాయిదా వేశారు. ఆరేళ్లుగా విచారణ 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. కాగా ఈ కేసుకు సంబంధించి రేవంత్రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. -
ఏసీబీ కోర్టులో నేడు ఓటుకు కోట్లు కేసు విచారణ
-
ఏసీబీ స్పెషల్ కోర్టు లో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
ఓటుకు నోటు కేసు: జూలై 7న విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు రానుంది. జూలై 7 నుంచి సాక్షుల విచారణ కొనసాగించాలని ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. జూలై 7 నుంచి 13 వరకు 18 మంది సాక్షుల విచారణకు ఏసీబీ కోర్టు షెడ్యూల్ను ఖరారు చేసింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ స్టీఫెన్సన్తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్కు చుక్కెదురు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై హైకోర్టులో రేవంత్రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆరేళ్లుగా విచారణ 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. -
‘‘మహానాడు ఆత్మస్తుతి.. పరనిందలా సాగింది’’
తాడేపల్లి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు.. అందుకే మహానాడు ఆత్మస్తుతి.. పరనిందలా సాగింది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రెండేళ్లుగా చంద్రబాబు, ముఖ్యమంత్రిపై విమర్శలకే పరిమితం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో బాబు "బ్రీఫ్డ్ మీ" వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం చూసింది.. ఫోరెన్సిక్ ఈ వ్యాఖ్యలను నిజమని తేల్చిందన్నారు బొత్స. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. కానీ ప్రజలను మేనేజ్ చేయలేరు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు నైజం దోచుకోవడం.. దాచుకోవడమే. మహానాడు ద్వారా చంద్రబాబు ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు యత్నించారు’’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక కమిట్మెంట్తో, ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళ్తున్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి క్షణం సీఎం జగన్ శ్రమిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 99 శాతం నేరవేర్చాం. సంక్షేమ పథకాల ద్వారా లక్షా 20 వేల కోట్లను నేరుగా ప్రజలకే అందించాం. ప్రతి అంశాన్నిr రాజకీయం చేయాలనే చంద్రబాబు యత్నం. ఆయన జూమ్ కార్యక్రమాలను చూస్తుంటే నవ్వొస్తుంది’’ అంటూ బొత్స ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్ట్ను కాంట్రాక్ట్లకు కట్టబెట్టి పూర్తిగా దోచుకున్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం పూర్తి కాలేదు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లే ప్రజలు తిరస్కరించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే మేం చట్టాలు చేస్తున్నాం. ప్రతి చట్టంలోనూ సామాన్యుడికే మేలు జరిగేటట్లు చూశాం. చంద్రబాబు బెదిరింపులకు మేం భయపడం. రెండేళ్ల సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. మున్ముందు ఇంకా సంక్షేమ పాలన సాగుతుంది’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్లు ఆధారాలు
-
ఓటుకు కోట్లు కేసు..ఈడీ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాంపల్లి ఈడీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డిని ప్రధాన నిందితుడిగా, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ క్రిస్టియన్ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్, రేవంత్ అనుచరుడు రుద్రశివకుమార్ ఉదయసింహ, జెరుసలేం మత్తయ్యతోపాటు వేం కృష్ణకీర్తన్లను నిందితులుగా పేర్కొంది. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డికి ఓటేయాలని, రూ.5 కోట్లు ఇస్తామని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టి.. రూ.50 లక్షలు అడ్వాన్స్గా ఇస్తూ రేవంత్, ఇతర నిందితులు ఏసీబీకి పట్టుబడ్డారని తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో వేం నరేందర్రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ పాత్ర కూడా ఉన్నట్టు తేలడంతో ఆయన పేరునూ చార్జిషీటులో చేర్చినట్టు తెలిపింది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఈ చార్జి షీటులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేరును కూడా పలుచోట్ల ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇంతకుముందే చార్జిషీట్లు దాఖలు చేసిన ఏసీబీ కూడా చంద్రబాబు పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోలు వెలుగులోకి రావడం, ఆ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా ధ్రువీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈడీ చార్జిషీటు దాఖలు చేయడం మరింత ఉత్కంఠగా మారింది. మహానాడు వేదికగా కుట్ర 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా కూడా.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ తరఫున వేం నరేందర్రెడ్డిని పోటీలో పెట్టారు. ఎలాగైనా గెలవాలని, పలువురు ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి ఓటు వేయించుకోవాలని కుట్రపన్నారు. అప్పట్లో టీడీపీ కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డికి కొనుగోళ్ల బాధ్యత అప్పగించారు. ఇందులోభాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు గాలం వేయాలని నిర్ణయించారు. టీడీపీ మైనార్టీ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్, తెలుగు యువత నేత జిమ్మిబాబుల సాయంతో జేరుసలేం మత్తయ్యను కలిసి విషయం చెప్పారు. తర్వాత హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో జరిగిన టీడీపీ మహానాడుకు మత్తయ్యను తీసుకెళ్లారు. అక్కడ వేదిక వెనకాల ఉన్న గదిలో.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డిలతో మత్తయ్య సమావేశమయ్యారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పిస్తే.. రూ.50లక్షలు ఇస్తామని మత్తయ్యను ప్రలోభపెట్టారు. స్టీఫెన్సన్ ఓటింగ్కు గైర్హాజరైతే రూ.3 కోట్లు, అనుకూలంగా ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామని బేరం పెట్టారు. రూ.50 లక్షలు కమీషన్ వస్తుందని ఆశపడ్డ మత్తయ్య.. ఈ విషయాన్ని స్టీఫెన్సన్కు చెప్పారు. (మత్తయ్య ఈ మొత్తం వ్యవహారాన్ని వాంగ్మూలం రూపంలో ఇటీవల ఈడీకి లిఖితపూర్వకంగా రాసిచ్చారు). ఇదంతా భారీ కుట్ర అని గుర్తించిన స్టీఫెన్సన్ వెంటనే ఏసీబీకి సమాచారం ఇచ్చారు. రేవంత్, ఆయన అనుచరులు 2015 మే 31న స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు అడ్వాన్స్గా ఇస్తుండగా ఏసీబీ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. దీనిపై తొలుత టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కానీ ఈ కుట్ర తాలూకు బాగోతం మొత్తం వీడియోలు, స్టీఫెన్సన్తో ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు మాట్లాడిన ఆడియోలు వెలుగు చూడటం దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టించింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. పెద్ద మొత్తంలో డబ్బుల ఒప్పందాలు, సొమ్ము చేతులు మారడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ప్రీవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేసింది. 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేవంత్రెడ్డి, ఉదయసింహా, వేం నరేందర్రెడ్డి, సెబాస్టియన్, స్టీఫెన్సన్ల వాంగ్మూలాలను నమోదు చేసింది. అడ్వాన్స్గా తెచి్చన రూ.50 లక్షలు ఎలా వచ్చాయి, మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ ఉంచారు, విదేశాల నుంచి డబ్బులు వచ్చాయా? అన్న అంశాలపై దర్యాప్తు చేసింది. ఏపీకి వెళ్లిపో.. ఏమీ కాదంటూ లోకేశ్ భరోసా! ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో పాత్రధారి అయిన జేరుసలేం మత్తయ్య.. ఈ కుట్రకు సంబంధించి ఇటీవలే ఈడీ అధికారులకు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. తనను ఎవరెవరు కలిశారు, ఎవరు డబ్బులు ఎర వేశారు, మొత్తం వ్యవహారం ఎలా జరిగిందన్నది వివరంగా వెల్లడించారు. మొత్తం కుట్రలో చంద్రబాబుదే మాస్టర్ మైండ్ అని.. అప్పట్లో తాను విజయవాడకు పారిపోవడానికి చంద్రబాబు కుమారుడు లోకేశ్ సూచనలే కారణమని బయటపెట్టారు. మత్తయ్య వాంగ్మూలంలో చెప్పిన ప్రకారం.. రేవంత్ అరెస్టు విషయం తెలియగానే జిమ్మిబాబు సాయంతో మత్తయ్య ఎన్టీఆర్ భవన్కి వెళ్లారు. అక్కడ చంద్రబాబు కుమారుడు లోకేశ్ను కలిశారు. నీకేమీ కాదని, వెంటనే విజయవాడ వెళ్లిపోవాలని మత్తయ్యకు లోకేశ్ అభయమిచ్చారు. అక్కడ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజయవాడలో భద్రంగా ఉండొచ్చని చెప్పారు. ఈ సూచనల మేరకే మత్తయ్య విజయవాడ వెళ్లారు. అదే మహానాడు సమయంలో.. 2015 మహానాడు వేదికగానే ‘ఓటుకు కోట్లు’ కుట్ర జరిగింది. దీనికి సూత్రధారి చంద్రబాబేనని బయటపడటం సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా టీడీపీ మహానాడు వేడుకలు (ఆన్లైన్)లో జరుగుతుండగా.. ఈ వ్యవహారంలో ఈడీ చార్జిషీటు నమోదవడం ఆసక్తిగా మారింది. -
ఓటుకు కోట్లు కేసులో నిందితులపై అభియోగాల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్లపై ఏసీబీ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద నమోదు రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగం నమోదైంది. అయితే తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్హ్యాండెడ్గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఈనెల 19న సాక్షుల విచారణ, షెడ్యూలును ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. చదవండి : (బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే) (ఓటుకు కోట్లు కేసు: రేవంత్రెడ్డికి వార్నింగ్) -
ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తమకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్లు విడివిడిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఇదివరకు విన్నవించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కమిటీ వేశారు. ఇతరులకు మద్దతు ఇచ్చే దాని కన్నా తామే బరిలో ఉందామని, పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు న్నాయని ఆయా జిల్లాల మెజారిటీ నేతలు కమిటీకి సూచించినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్తో జరిగిన టీపీసీసీ ముఖ్యుల జూమ్ కాన్ఫరెన్స్లో కూడా అదే అభిప్రాయం వెల్లడైంది. కాగా, ఈ స్థానానికి మొత్తం 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వం వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, మరో గిరిజన నేత బెల్లయ్యనాయక్ల పేర్లను కూడా తీవ్రంగానే పరిశీలిస్తున్నారు. మానవతారాయ్, బెల్లయ్య నాయక్లు సోమవారం పార్టీ పెద్దలను కలసి టికెట్ విషయమై తమ వాదనలను వినిపించారు. అయితే, టీపీసీసీ ముఖ్యనేతలు కసరత్తు పూర్తి చేసిన తర్వాత ముగ్గురు నేతల పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు. రంగారెడ్డి ఆశావహులతో చర్చలు కాగా, రంగారెడ్డి–హైదరాబాద్– మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు సమావేశమై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. ఈ స్థానానికి టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్రెడ్డి, జి.చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జి.వినోద్రెడ్డిలతో కూడా సంప్రదింపులు జరిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఉపాధ్యాయ నేత హర్షవర్ధన్రెడ్డిలతోసహా 24 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోంచి మూడు పేర్లను ప్రతిపాదించి మంగళవారం ఏఐసీసీకి పంపనున్నట్టు సమాచారం. పిటిషన్ పునర్విచారించాలని రేవంత్ అభ్యర్థన ఏసీబీ అభిప్రాయం కోరుతూ 18కి విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: తమపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం సిద్ధమవుతుండగా, పిటిషన్ను తిరిగి విచారించాలంటూ రేవంత్ ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తన తరఫు న్యాయవాది వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని కీలక అంశాలపై వాదనలు వినిపించలేకపోయారని అందులో పేర్కొన్నారు. మరోసారి విచారణ జరిపితే తమ వాదనలు పూర్తిగా వినిపిస్తామని విన్నవించారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేసిన న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు... ఈ పిటిషన్పై అభ్యంతరం ఉంటే తెలియజేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. తమపై నమోదు చేసిన అభియోగాలను ఎలక్షన్ ట్రిబ్యునల్ మాత్రమే విచారించాలని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు విచారించే పరిధి లేదని రేవంత్రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా, చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నందమూరి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 18న వెలువరించనుంది. -
బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పాత్ర మరోసారి స్పష్టమైంది. ఈ కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఇటీవల ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం వ్యవహారా నికి మాస్టర్మైండ్ చంద్రబాబేనని కుండబద్దలుకొట్టాడు. ఈ కుట్ర ఎప్పుడు, ఎలా జరిగింది? తెలంగాణ ప్రభు త్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు మొదలు పెట్టిన ఎమ్మెల్యేల కొను గోలు విషయంలో ఎవరి పాత్ర ఏమిటన్నది పూసగుచ్చినట్లు వివరించాడు. కుట్రకు తెరతీసింది చంద్రబాబు అని, అమలు చేసింది రేవంత్రెడ్డి అని, ఇందుకోసం తనకు రూ.50 లక్షలు ఎరవేసి వాడుకున్నారని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మత్తయ్య ఏమి చెప్పాడంటే.. ‘టీడీపీ తెలుగు యువత నాయకుడు జిమ్మీబాబు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. 2015 మే నెలలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పాల్గొనే ఓ కార్యక్రమానికి జిమ్మీబాబును ఆహ్వానిద్దామని బంజారాహిల్స్లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లా. అప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంత నాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ నాకు చెప్పాడు. ఇదే విషయమై చంద్రబాబు, రేవంత్లతో చర్చించేందుకు హిమాయత్సాగర్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రావాలని సూచించాడు. చదవండి: (సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం) జిమ్మీ సూచన మేరకు మర్నాడు హిమాయత్సాగర్లో జరుగుతున్న మహానాడుకు వెళ్లా. అక్కడ జిమ్మీబాబు మహానాడు వేదిక వెనుకాల ఉన్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. తొలుత నేను భయపడ్డా. తప్పని వారించా. కానీ రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, పైగా వారు నాకు గుడ్విల్ కింద రూ. 50 లక్షలు లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్కు గైర్హాజరైతే రూ. 3 కోట్లు చెల్లిస్తామన్నారు. ముందుగా రూ. 50 లక్షలు అడ్వాన్సుగా మిగిలినది తరువాత అందజేస్తామన్నారు’ అని మత్తయ్య మత్తయ్య ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ గదిలోనే.. ‘‘అప్పుడు.. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంతనాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ చెప్పాడు. ఇదే విషయమై వారితో చర్చించేందుకు నన్ను మహానాడు వేదిక వెనుక ఉన్న గది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చంద్రబాబు, రేవంత్రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, నాకు గుడ్విల్ కింద డబ్బులిచ్చి లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా’’ తొలుత స్టీఫెన్సన్ నమ్మలేదు... ‘నేను మర్నాడు స్టీఫెన్స్న్ ఇంటికి వెళ్లి బోయిగూడలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించా. కార్యక్రమం అనంతరం డీల్ గురించి చెబితే తొలుత స్టీఫెన్సన్ నమ్మలేదు. రేవంత్రెడ్డితో మాట్లాడించాలన్నాడు. లాలాగూడకు చెందిన మాల్కం టేలర్, సీతాఫల్మండికి చెందిన ఆంథొనీ ద్వారా స్టీఫెన్సన్ను ఒప్పించే ప్రయత్నం చేశా. ఆయన ఒప్పుకోగానే ఈ విషయాన్ని రేవంత్రెడ్డి, జిమ్మీబాబులకు టీడీపీ క్రిస్టియన్ సెల్ ఇన్చార్జి హ్యారీ సెబాస్టియన్ ద్వారా తెలియజేశా. తరువాత మరోసారి అతనికి ఫోన్ చేసినప్పుడు రేవంత్, చంద్రబాబులకు సమాచారం ఇచ్చానని, వారు అదే పనిలో ఉన్నారన్నాడు. పని పూర్తికాగానే నీకివ్వాల్సింది ఇచ్చేస్తారని సెబాస్టియన్ సమాధానమిచ్చాడు. మర్నాడు సెబాస్టియన్కు మళ్లీ ఫోన్ చేయగా రేవంత్రెడ్డి రెండుసార్లు స్టీఫెన్సన్ని ఆయన నివాసంలో కలిసినట్లు చెప్పాడు. అంతేకాకుండా చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో కూడా మాట్లాడాడని చెప్పాడు. దీంతో వెంటనే నేను జిమ్మీబాబుకు కాల్ చేసి నా వాటా ఏమైంది? అని అడిగా. ప్రస్తుతం చంద్రబాబు వేం నరేందర్రెడ్డి ద్వారా స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు రూ. 50 లక్షలు సిద్ధం చేస్తున్నారని, అది అవగానే నాకు ఏర్పాటు చేస్తామని చెప్పాడు. మర్నాడు రేవంత్రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిందన్న విషయం టీవీల ద్వారా తెలుసుకున్నా. నన్ను ఏ–4 నిందితుడిగా చూపడంతో రసహ్యంగా జిమ్మీబాబు సాయంతో వెంటనే టీడీపీ ఆఫీసులోకి వెళ్లా. అక్కడ నారా లోకేశ్ను కలిశా. నాతో మాట్లాడిన లోకేశ్.. ఏమీ భయపడొద్దన్నాడు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్ను మేనేజ్ చేస్తానని అభయమిచ్చాడు. వెంటనే విజయవాడ వెళ్లు, అక్కడ టీడీపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ రక్షణ ఉంటుందని హామీ ఇచ్చాడు’ అని వాంగ్మూలంలో జెరూసలేం మత్తయ్య పేర్కొన్నాడు. చంద్రబాబును కలిసిన మాట వాస్తవమే..! ఈ కేసుకు సంబంధించి జిమ్మీబాబు, మాల్కం టేలర్, ఆంథొనీ, సెబాస్టియన్లు తనకు పూర్వ మిత్రులని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను పలు పనులపై కలిశానని మత్తయ్య చెప్పుకొచ్చాడు. అలాగే పలు అధికారిక కార్యక్రమాలతోపాటు ఓటుకు నోటు కుట్ర విషయంలోనూ 2015 మే నెలాఖరులో చంద్రబాబును తాను కలిసిన మాట నిజమేనని అంగీకరించాడు. ఈ కేసు విషయంలో మొదటి నుంచి చంద్రబాబుపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్రెడ్డి ఆయనకు రూ. 50 లక్షలిస్తూ మభ్యపెడుతుండగా ఆడియో వీడియోలతో సహా ఏసీబీ రికార్డు చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే రేవంత్, వేం నరేందర్రెడ్డి, జెరూసలేం మత్తయ్యను విచారించిన ఈడీ... చంద్రబాబు చుట్టూ ఉచ్చుబిగించే ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారప్రీ కుట్రకు సూత్రధారి చంద్రబాబే అని మొదటి నుంచి వస్తున్న ఆరోపణలకు మత్తయ్య వాంగ్మూలంతో మరింత బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎలా ముందుకు వెళ్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్ కొట్టివేయటంతో అభియోగాలపై ట్రైల్స్ ప్రారంభించింది. సండ్రా వెంకటవీరయ్యపై విచారణ ప్రారంభమైంది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయసింహపై ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్ల కేసును విచారణ జరిగింది. మొదటిసారి నిందితులపై అభియోగాలపై విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై అభియోగాలపై చార్జస్ ప్రేమ్ చేసింది. సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 120బి, రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదు చేసింది. అభియోగాలను సండ్ర వెంకట వీరయ్యకు కోర్టు చదివి వివరించింది. అభియోగాలను సండ్ర వెంకటవీరయ్య అంగీకరించలేదు. ఇదే క్రమంలో సండ్రా, ఉదయసింహల డిశ్చార్జ్ పిటీషన్స్ ను గతంలో ఏసీబీ కోర్టు, హైకోర్టు కొట్టివేసింది. ఇక ఇతర నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు కోర్టుకు హజరుకాగా గైర్హాజరైన ఉదయ్ సింహాపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. గత విచారణ లోనే నిందితులు అందరూ ఎట్టి పరిస్థితి లో హాజరుకావాలి అని సీరియస్ గా ఆదేశించింది. అయినప్పటికీ ఉదయసంహ హాజరు కాపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఉదయసింహ, సెబాస్టియన్, సండ్రల డిశ్చార్జ్ పిటీషన్స్ కోర్టు తోసిపుచ్చడంతో త్వరలోనే ఇతర నిందితుల అందరిపై సైతం నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభించనుంది ఏసీబీ కోర్టు. ఇక ఇదే కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. ఓటుకు కోట్ల కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. అభియోగాల నమోదుపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
చంద్రబాబు, రేవంత్ నుంచి ప్రాణహాని
సాక్షి, నాంపల్లి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు కోట్లుకేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. ఈ కేసులో అప్రూవర్గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన కు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు వివరించారు. ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డిలేనని చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా ఎంపీ రేవంత్రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: (అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు) -
ఓటుకు కోట్లు... ఆశ చూపింది సెబాస్టియనే..!
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు లంచం ఇస్తామని ప్రలోభపెట్టింది ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న బిషప్ హ్యారీ సెబాస్టియన్ అని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ కుట్రలో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై గురువారం ఏసీబీ అదనపు ఎస్పీ రమణకుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయి. సెబాస్టియన్ ఫోన్లో కుట్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను ఓటు కోసం ప్రలోభపెట్టడం అవినీతి నిరోధక చట్టం కింద నేరం. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారన్న సెబాస్టియన్ వాదనలో నిజం లేదు. స్టీఫెన్సన్తో ముందుగా ఫోన్లో మాట్లాడిందని సెబాస్టియన్. అడ్వాన్స్గా 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్రెడ్డితో కలసి సెబాస్టియన్ స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్మెంట్కు వచ్చారు. కేసు నమోదు చేసిన తర్వాత సెబాస్టియన్ సెల్ఫోన్ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా అనేక ఆధారాలు లభించాయి’’ అని తెలిపారు. ( ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ) అంతేకాక ‘‘అభియోగాల నమోదుపై 2018 మార్చి 5 నుంచి దాదాపు రెండున్నర ఏళ్లుగా నిందితులు సమయం తీసుకుంటూనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈనెల 9న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్రావు అభియోగాలు నమోదు చేయాలని మరోసారి ప్రత్యేక కోర్టును కోరారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు గత అక్టోబరు 12న డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయగా.. ఇతర నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని లేదా నేరుగా వాదనలు వినిపించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే సెబాస్టియన్ తరఫు న్యాయవాది పలు వాయిదాలు తీసుకున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేయండి’’ అని కౌంటర్లో కోరారు. ఈ పిటిషన్పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. -
ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ స్పెషల్ పీపీ సురేందర్రావు ప్రత్యేక కోర్టుకు నివేదించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఓటు కోసం ప్రలోభపెట్టిన కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు మంగళవారం విచారించారు. కుట్రలో నిందితుల పాత్ర ఉందనేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. (తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు) రేవంత్రెడ్డితో కలసి వీరంతా ఈ కుట్రలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. మరో నిందితుడు ఉదయసింహ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డి నుంచి రూ.50 లక్షల నగదు తెచ్చారని వివరించారు. రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన డబ్బు తెచ్చారని, స్టీఫెన్సన్ ఇంటికి తెచ్చి ఇచ్చింది కూడా ఉదయసింహనే అని పేర్కొన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలంటూ అన్ని ఆధారాలతో కౌంటర్లు దాఖలు చేశామని, ఈ నేపథ్యంలో వారి పిటిషన్లు కొట్టివేసి నిందితులపై అభియోగాలను నమోదు చేయాలని సురేందర్రావు నివేదించగా, ఈ కేసులో నిందితుల తరఫున వాదనలు వినేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
‘ఓటుకు కోట్లు’ కేసుపై సుప్రీంలో మరోసారి పిటిషన్
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఎర్లీ హియరింగ్ కోసం ఆర్కే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. సుప్రీం కోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. కాగా, 2015లో తెలంగాణలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు అప్పటి ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టారు. ఈ క్రమంలో అప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్రెడ్డి రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్రెడ్డి కొన్ని రోజులపాటు జైలులో గడిపారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడినట్టు కూడా చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 2016లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. -
ఈడీ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి
-
ఈడీ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. కేసుకు సంబంధించిన పత్రాలతో ఈడీ అధికారుల ముందు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గత వారం ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయులను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. 2015 మే 30న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి రూ.50 లక్షలతో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘నా కుమారులను ఇరికించడం సరికాదు’
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఈడీ ఎదుట వేం నరేందర్ రెడ్డి విచారణ ముగిసింది. నరేందర్ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను విచారించిన ఈడీ... నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు, మిగతా నాలుగున్నర కోట్ల గురించి కూడా ఆరా తీసింది. ఈ సందర్భంగా వారు పొంతన సమాధానాలు చెప్పడంతో సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. బ్యాంకు స్టేట్మెంట్స్, ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఇచ్చిన సమాచారంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది. కాగా ఏసీబీ చార్జ్షీట్ ఆధారంగా ఈ కేసులో నిందితులందరినీ విచారించే అవకాశం ఉంది. ఈమేరకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీచేసిన ఈడీ వారం రోజుల్లో విచారణకు రావాలని ఆదేశించింది. నా కొడుకులను ఇరికించడం సరికాదు ఓటుకు కోట్లు కేసులో తనతో పాటు తన ఇద్దరు కుమారులకు ఈడీ నోటీసులు ఇచ్చిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ అనంతరం మాట్లాడుతూ.. ‘ ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహకు కూడా నోటీసులు ఇచ్చారు. నాతో పాటు నా కొడుకులను విచారించడం చాలా బాధేసింది. వారిని ఇరికించడం సరికాదు. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థల విచారణను ఉద్దేశపూర్వకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిజాలన్నీ కోర్టు విచారణలో తేలతాయి. ఎప్పుడు విచారణకి పిలిచినా హాజరవుతా’ అని పేర్కొన్నారు. కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ కేసులో ఈడీ ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉదయ సింహను విచారించిన సంగతి తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసు: ఈడీ విచారణకు నరేందర్ రెడ్డి కొడుకు
-
ఓటుకు కోట్లు కేసు; ‘నా కుమారులను ఇరికించడం సరికాదు’
-
ఓటుకు కోట్లు కేసు : ఈడీ విచారణలో నరేందర్ రెడ్డి
-
ఓటుకు కోట్లు కేసు : నరేందర్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్రెడ్డి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు లెక్కలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ ముందు ఉంచి మరీ... రూ. 50 లక్షలతో పాటు ఇవ్వజూపిన మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన సమాచారంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కీర్తన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ కేసులో ఈడీ ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉదయ సింహను విచారించిన సంగతి తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసు; వేం నరేందర్రెడ్డికి ఈడీ నోటీసులు
-
ఓటుకు కోట్లు కేసు; నరేందర్రెడ్డికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట్లు’ కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి రోలింగ్హిల్స్లోని ఆయన ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
సీబీఐ అంటే నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావ్?
-
నీ దేశద్రోహ చర్యలు సిగ్గుచేటు
సాక్షి, గుంటూరు : ఓటుకు నోటు కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తనకు ఏదో జరగబోతోందనే ఊహలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు అండ్ కో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారని ఆరోపించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే తన బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఐటీ అధికారులకు సహకరించం, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెబుతుండమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. చక్రం తిప్పుతున్నానని ఫీలవుతున్నారు.. దేశం మొత్తం చక్రంలాగా తిరిగి వచ్చిన చంద్రబాబు తానే చక్రం తిప్పుతున్నట్లు ఫీలవుతున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. బాబుకు శాలువాలు కప్పిన వారంతా ఎన్డీఏ వ్యతిరేకులేనని పేర్కొన్నారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం బ్రోకర్ పనులు చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావ్? చంద్రబాబు చేసిన అక్రమాలు వెలికితీస్తారనే భయంతోనే బరితెగించి దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ సంస్థలను ధిక్కరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణలో ట్విటర్లో పేర్కొన్నారు. చంద్రబాబుకు.. అర్బన్ నక్సలైట్లు, వేర్పాటువాదులకు తేడా లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీబీఐ తన పని తాను చేస్తుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. పోలీసుల తనిఖీని కేవలం దొంగలు, నేరస్తులు మాత్రమే వ్యతిరేకిస్తారని ఎద్దేవా చేశారు. -
ఓటుకు నోట్లు ఇంగ్లీష్ రిపీట్
సాక్షి, హైదరాబాద్ : మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్.. లాంటి పదాలు వినగానే గుర్తొచ్చే సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఇంగ్లీష్లో ప్రసంగించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇంగ్లీష్పైనే కాకుండా వాయిస్పైన సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు ప్రసంగం వింటూంటే ఓటుకు నోట్లు కేసు తాలుకూ ఇంగ్లీష్ మళ్లీ రిపీటైంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆ స్వరంతో అలాంటి ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి మరొకరులేరంటూ కామెంట్లు పెడుతున్నారు. వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ అని మూడేళ్ల క్రితం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన మాటలు, వాట్ ఆల్ హి స్పోక్... అంటూ హీరో శివాజీని ఉద్దేశించి ఇంగ్లీష్లో చంద్రబాబు చెప్పిన మాటలు అచ్చు ఒకేలా ఉన్నాయి అంటూ పోల్చి చూస్తున్నారు. రెండు వాయిస్లు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండటంతో .. ఎలా తప్పించుకుంటావ్ బాబూ ఆ ఇంగ్లీష్ మనదేగా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా దొరకడం, అరెస్టు కావడం తెలిసిందే. స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందే చంద్రబాబునాయుడు ఆయనకు ఫోన్ చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రలోభాలకు గురిచేసిన ఆడియో అప్పట్లో సంచలనం రేపింది. -
రేవంత్ రెడ్డి అక్రమార్జనపై సోదాలు
-
డొంక కదులుతోంది..!
-
నేను ఎలాంటి తప్పు చేయలేదు
విజయవాడ: తాను ఎలాంటి తప్పు చేయలేదని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. ఏసీబీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ల అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నందుకే తనపై కక్ష గట్టి ఏసీబీ కేసులంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు ఇప్పించినందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. కేవలం తాను సాక్షిగా మాత్రమే విచారణకు హాజరయ్యాను అని తెలిపారు. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నుంచి తాను భూములు కొన్నది వాస్తవమేనని తెలిపారు. తాను చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశానని తెలియజేశారు. చంద్రబాబు అవినీతి బట్టబయలు చేస్తున్నందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కాపు సోదరుడు, డీఎస్పీ దుర్గా ప్రసాద్ దగ్గర భూములు సక్రమంగా కొనుగోలు చేయడం తప్పేమైనా అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు. సంవత్సరన్నర నుంచి నడుస్తున్న ఈ కేసులో తాను అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. కేవలం సాక్ష్యం కోసం మాత్రమే ఈ కేసులో హాజరయ్యానని చెప్పారు. ఆర్కే దగ్గర కీలక సమాచారం రాబట్టారని టీడీపీ వారు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయడం మొదలు పెట్టారని, అందులో వాస్తవం లేదని అన్నారు. కేవలం ఏసీబీ అధికారులు, దుర్గా ప్రసాద్ ఎవరో తెలుసా, ఆయన దగ్గర ఎప్పుడు ఆస్తులు కొనుగోలు చేశారు అనే చిన్న ప్రశ్నలు మాత్రమే అడిగి వదిలేశారని, అందులో దాచిపెట్టవలసినంత పెద్ద విషయాలేమీ లేవని, ఇవి అందరికీ తెలిసిన విషయాలేనని చెప్పారు. రైతుల పొట్టకొట్టి రాజధానిలో వేలాది ఎకరాలు చంద్రబాబు దోచుకున్నాడని, తమిళనాడులో ఉన్న మన రాష్ట్రానికి చెందిన సదావర్తి భూములు కూడా కొట్టేసేందుకు తండ్రీకొడుకులు కుట్ర పన్నారని, ఇలా చంద్రబాబు నాయుడు దోచుకుంటున్న వాటికి ఆధారాలు సేకరించి తాను న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో తనపై కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కూడా మేనేజ్ చేయగల సమర్దుడు చంద్రబాబు అని ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత డిసెంబర్లో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎర్లీ హియరింగ్ పిటిషన్ కూడా వేశానని తెలిపారు. సుప్రీం కోర్టు కూడా దీన్ని స్వీకరించిందని తెలిపారు. ఒత్తిళ్లకు లొగి తెలంగాణ ఏసీబీ ఓటుకు నోటు కేసును సరిగా దర్యాప్తు చేయడంలేదని, సీబీఐ దర్యాప్తు చేస్తేనే అసలు నిజం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి 2017 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 5 సార్లు సుప్రీం కోర్టును ఆశ్రయించానని..అందుకే తనపై కక్ష కట్టాడని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. -
ఓటుకు నోటు కేసులో మౌనం ఎందుకు?
-
మూడో చార్జిషీట్లో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మూడో చార్జిషీట్ సిద్ధమవుతోంది. ఇందులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చబోతోంది. ఈ కేసులో ఇప్పటికే రేవంత్రెడ్డిని ఎ–1గా పేర్కొంటూ ఏసీబీ రెండు చార్జి షీట్లు దాఖలు చేసింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు కీలకంగా మారిన రూ.50 లక్షలు ఎక్కడ్నుంచి వచ్చాయన్న దానిపై ఏసీబీకి ఆధారాలు లభించినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు అందజేయడానికి డబ్బు సమకూర్చిన వారిలో ఒక ఏపీ మంత్రితోపాటు టీఆర్ఎస్లో చేరిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ప్రమేయాన్ని ఏసీబీ గుర్తించింది. ఈ వివరాలు మూడో చార్జిషీట్లో పేర్కొనే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. అలాగే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనంటూ హైదరాబాద్, చండీగఢ్ ఫోరెన్సిక్ విభాగాలు వెల్లడించాయి. ఈ ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మూడో చార్జిషీట్లో చంద్రబాబునాయుడు పేరును చేర్చబోతున్నారు. రెండు రోజుల్లో సిద్ధం మూడో చార్జిషీట్ సిద్ధమవుతోందని, రెండ్రోజుల్లో ఇది న్యాయశాఖ పరిశీలనకు వెళ్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మూడో చార్జిషీట్కు అవసరమైన అన్ని సాంకేతికపరమైన ఆధారాలు లభించాయని ఆ వర్గాలు తెలియజేశాయి. కేసులో మరో చార్జిషీట్ అవసరం ఉండకపోవచ్చని ఏసీబీ భావిస్తోంది. పూర్తి వివరాలతో వచ్చే వారంలో చార్జిషీట్ను వేయబోతున్నామని, అయితే ఇదే తుది చార్జిషీట్ అని చెప్పలేమని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతో సమావేశం అనంతరం ఏసీబీ అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు. చివరి రెండు చార్జిషీట్లలో పేర్కొన్న కొన్ని అంశాలను మూడో చార్జిషీట్ ద్వారా సవరించబోతున్నారు. అప్రూవర్గా మారుతానని జెరూసలెం మత్తయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన వాంగ్మూలం మరోసారి తీసుకోవాలా లేదా అన్న విషయంలో కూడా న్యాయనిపుణులతో ఏసీబీ సంప్రదింపులు జరుపుతోంది. చంద్రబాబే ఏ–1: న్యాయ నిపుణులు నోటుకు కోట్లు కేసులో ఏ–1 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని చంద్రబాబు స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టడం చూస్తే ఈ కేసులో అంతిమ లబ్ధిదారు ఆయనే అవుతారన్నది న్యాయ నిపుణుల వాదన. ‘‘ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డితోపాటు చంద్రబాబుకు సన్నిహితుడైన సెబాస్టియన్ రూ.50 లక్షలు తీసుకుని స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లారు. ఆ డబ్బు రేవంత్ లేదా సెబాస్టియన్ది కాదు. ఎవరో తెరవెనుక సమకూర్చిన డబ్బుని తెచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరివి, ఎక్కడ్నుంచి సమకూర్చారన్నది ఈ కేసులో ప్రధానాంశం’’అని సీనియర్ న్యాయవారి ఒకరు అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు తన పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలని స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టడమే ఈ కేసులో కీలకం అవుతుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
చార్జీషీట్లో చంద్రబాబు?
-
వెంటాడుతున్న పాపం
-
ఓటుకు కోట్లు: మంత్రులుతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం
-
ఓటుకు కోట్లు : మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
-
ఓటుకు కోట్లు కేసు.. కేసీఆర్పై రేవంత్ విమర్శలు!
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావులు కలసి కుట్ర పన్నుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసు వెలుగులోకి వచ్చిన రోజు కంటే ఇప్పుడే దీనికి అధిక ప్రాధాన్యం కల్పించి తమను భయపెట్టి, బెదిరించి, లొంగదీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాష్ట్రంలో విస్తృతంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, నాలుగేళ్లలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. కేసీఆర్ బంధువైనా, ఆయన సామాజికవర్గానికి చెందిన వ్యక్తైనా దర్జాగా సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని మండిపడ్డారు. లంచం అడిగితే చెప్పుతో కొట్టాలన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కిన అధికారి సంజీవరావును ఇంకా పదవిలో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఏసీబీ, ముఖ్యమంత్రి వ్యవహార శైలి సరిగా లేదని అన్నారు. తెలంగాణ ఏసీబీ 2016లో 125 కేసులకు ఆధారాలు లేవంటూ వాటిని మూసేసిందని చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వెల్లడించిన నివేదికలో ఈ విషయం ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏ–1గా ఉండగా, సెబాస్టియన్ ఏ–2గా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏ–3గా, ఉదయ్సింహ ఏ–4గా, జెరూసలెం మత్తయ్య ఏ–5గా ఉన్నారు. అయితే ఇప్పుడు కుట్ర మొత్తం చంద్రబాబుదే అని స్పష్టం కావడంతో ఏ–1గా ఆయన పేరు చేర్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఓటుకు కోట్లు : మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లు తనను బలిపశువు చేస్తున్నాయని కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు స్టీఫెన్సన్తో పాటు చాలా మందిని కొనుగోలు చేసి ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరికి టీడీపీ నాయకులు ఫోన్ చేశారన్న విషయాన్ని బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులను ప్రలోభపెట్టి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ప్రమేయమున్న అందరిపై పూర్తి దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఎవరెవరిని కోనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయాలను సైతం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసును పునఃసమీక్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరారు. -
ఓటుకు కోట్లు కేసు.. చంద్రబాబు మంతనాలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం లంచ్ బ్రేక్లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, అయన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో మళ్లీ కదలిక రావడం, ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేదిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో కీలక సమావేశం నిర్వహించిన నేపథ్యంలో చంద్రబాబు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నోటుకు కోట్లు కేసు విషయంలో రాజకీయంగా ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఈ సమావేశంలో మంత్రులతో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. మాకు భయం లేదు: సోమిరెడ్డి మరోవైపు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసుపై స్పందించారు. ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై ఎలాంటి కేసు లేదని, గతంలో హైకోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష చేసినంతమాత్రాన ఏమీ కాదని అన్నారు. ఓటుకు కోట్లు కేసుపై తమకెలాంటి భయం లేదని చెప్పారు. మత్తయ్య పిటిషన్ సమయంలో దీనిపై క్లారిటీ ఇచ్చిందని తెలిపారు. -
ఓటుకు కోట్లు కేసు: కేసీఆర్ కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్ : అత్యంత కీలకమైన ఓటుకు కోట్లు కేసునకు సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం మధ్యాహ్నం మరోసారి అధికారులతో సమావేశమయ్యారు. ఓటుకు కోట్లు కేసుతో పాటు, చంద్రబాబునాయుడు భూ అక్రమాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న అనేక కేసులకు సంబంధించి దర్యాప్తు పురోగతిని, కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల పూర్వాపరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు అధికారవర్గాలు తెలిపాయి. అనేకమైన కీలక కేసులపై తుది విచారణ పూర్తి చేయడానికి సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ ను నియమించే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. కీలకమైన కేసుల పురోగతిని పరిశీలిస్తూ ముందుకు తీసుకెళ్లడానికి అన్నింటినీ కలిపి ఒక ఒక ప్రత్యేక కమిషన్ నియమించడమా లేక కేసు తీవ్రతను బట్టి కమిషన్ నియమించడమా అన్నది ఇంకా తేలాల్సి ఉందని అధికారవర్గాలు చెప్పాయి.. ఓటుకు కోట్లు లంచాలు ఇస్తూ పట్టుబడిన కేసులో సూత్రధారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నందున ఆయనను ఏ-1 నిందితుడిగా అభియోగాలు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు రుజువైనందున ఈ కుట్రలో ఆయనే కీలకం అవుతారని న్యాయనిపుణులు ఇప్పటికే తేల్చిచెప్పారు. కేసులో ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొనాల్సి ఉంటుందని సోమవారం ప్రగతిభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టికి తెచ్చారు. ‘‘చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఓటుకు కోట్లు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోమారు తెరపైకి రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. -
‘ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీనా?’
సాక్షి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీనా?.. సోమవారం చంద్రబాబు చేసిన ర్యాలీ ప్రభుత్వానిదా..? పార్టీదా..? నాలుగేళ్లు ఘోరాలు, పాపాలు చేసి ఇప్పుడు ర్యాలీలు చేస్తారా..? కాల్ మనీ కేసు రిపోర్ట్ ఏమైంది? ఎవరినైనా అరెస్టు చేశారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3000 అత్యాచార ఘటనలు జరిగాయని, వాటిపై తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు రక్షణ ఇచ్చింది చంద్రబాబేనని, ఇపుడు మహిళలకు రక్షణ అంటే నమ్మేదెవరన్నారు. చంద్రబాబు మానస్థిక పరిస్థితి బాగానే ఉందా అని ఎద్దేవా చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదిక.. చంద్రబాబు వాయిస్సే నని తేల్చింది కాబట్టి బాబు గౌరవంగా పదవి నుంచి తప్పుకోవాలన్నారు. -
‘కేసీఆర్తో లాలూచీ పడి.. పారిపోయి వచ్చారు’
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా తుళ్లూరులో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తుళ్లూరు మండలంలోని శాకమూరులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మరిచారన్నారు. దళిత నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మూడేళ్లుగా చర్యలేవి? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో బాబు అడ్డంగా దొరకడం వల్లే ఏపీ ప్రజల హక్కులను పణంగా పెట్టి విజయవాడకు పారిపోయివచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో లాలూచీ పడి ఏపీ నీటి హక్కులను రాసిచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి చట్టం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఓటుకు నోట్లు కేసు విచారణను నిష్పక్షపాతంగా చేయాలని సూచించారు. గత మూడేళ్లుగా ఈ కేసులో చర్యలు లేవంటే.. ఇక సామాన్యునికి ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో చంద్రబాబుపై చాలా అవినీతి ఆరోపణలొచ్చాయని, కానీ ఏ ఒక్క అంశంపై విచారణ చేయించుకోలేదన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలని తెలిపారు. బాబుకు పరిపాలనపై పట్టు లేనందునే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలకు మహిళలు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేవని పేర్కొన్నారు. -
చంద్రబాబే ఏ-1
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు ‘ఓటుకు కోట్లు’ కేసు కొలిక్కి రాబోతోంది! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ కేసులో ఏ–1 నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోబోతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు రుజువైనందున ఈ కుట్రలో ఆయనే కీలకం అవుతారని న్యాయ నిపుణులు ఇప్పటికే తేల్చిచెప్పారు. కేసులో ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొనాల్సి ఉంటుందని సోమవారం ప్రగతిభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టికి తెచ్చారు. ‘‘చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఓటుకు కోట్లు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోమారు తెరపైకి రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. మూడేళ్ల నాటి కేసు మూడేళ్ల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా దొరకడం, అరెస్టు కావడం తెలిసిందే. స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందే చంద్రబాబునాయుడు ఆయనకు ఫోన్ చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రలోభాలకు గురిచేసిన ఆడియో అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏ–1 నిందితుడిగా పేర్కొన్న మొదటి చార్జిషీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డులో ఆ వాయిస్ చంద్రబాబుదా కాదా అని నిర్ధారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టింది. ఆడియో టేపులను చండీగఢ్ ఫోరెన్సిక్ విభాగానికి పంపింది. అది చంద్రబాబు వాయిసేనంటూ ఫోరెన్సిక్ విభాగం ఇటీవలే నివేదిక ఇచ్చింది. కారణమేంటో గానీ రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు ఏ మాత్రం ముందుకు సాగలేదు. చండీగఢ్ ఎఫ్ఎస్ఎల్ ధ్రువీకరణ స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియోను ధ్రువీకరించుకునేందుకు ఏసీబీ చాకచక్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కాకుండా చండీగఢ్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో వాయిస్ను శాంపిల్ను పరీక్ష చేయించింది. అంతకుముందే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం బాబు ఆడియో శాంపిల్స్ను ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో పరీక్ష చేయించారు. అది చంద్రబాబు గొంతే అని స్పష్టంగా తేలడంతో ఆయన.. బాబుపై విచారణ జరపాలంటూ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీరా ఇప్పుడు ఏసీబీ అధికారికంగా పరీక్షించిన వాయిస్ టెస్టులో అది చంద్రబాబు గొంతేనని మరోసారి అధికారికంగా ధ్రువీకరించడంతో కేసులో కదలిక వచ్చింది. ప్రఖ్యాతిగాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నాలుగు రోజుల క్రితం బాబు ఆడియో నివేదిక ఏసీబీ చేతికి అందింది. అన్ని ఆధారాలు లభ్యం కావడంతో రా>ష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు నాలుగు రోజులుగా లోలోపల కసరత్తు చేస్తోంది. కుట్ర మొత్తం బాబుదే.. ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ..’అంటూ సంభాషించింది చంద్రబాబు అని తేలడంతో ఓటుకు కోట్లు కేసులో కుట్ర మొత్తం చంద్రబాబుదిగానే ఏసీబీ చార్జిషీట్ రూపొందిస్తోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణతో సెక్షన్లు చేర్చబోతోంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏ–1గా ఉండగా, సెబాస్టియన్ ఏ–2గా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏ–3గా, ఉదయ్సింహ ఏ–4గా, జెరూసలెం మత్తయ్య ఏ–5గా ఉన్నారు. అయితే ఇప్పుడు కుట్ర మొత్తం చంద్రబాబుదే అని స్పష్టం కావడంతో ఏ–1గా ఆయన పేరు చేర్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు. ఆ తర్వాత మిగిలిన నిందితుల పేర్లను చేరుస్తామని అధికారులు తెలిపారు. 2015 జూలై 28న తొలి చార్జిషీట్ ఓటుకు కోట్లు కేసులో ముందుగా అరెస్టయిన రేవంత్రెడ్డి, సెబాస్టియన్, సండ్ర, ఉదయ్సింహలను విచారించిన ఏసీబీ అధికారులు 2015 జూలై 28న మొదటి చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఆడియో, వీడియో శాంపిల్స్, స్టీఫెన్సన్, సెబాస్టియన్, రేవంత్, తదితరుల ఫోరెన్సిక్ రిపోర్టులను 2017 మార్చిలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో పొందుపరిచారు. ఇప్పుడు బాబే అసలు నిందితుడని తేలడంతో ఏసీబీ ఈ నెల చివరి వారంలో తుది చార్జిషీట్ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎవరి ఒత్తిడికీ లొంగవద్దు: కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఓటుకు కోట్లు కేసు పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు, ఏసీడీ మాజీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్చంద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కేసులో చట్టం తని పని తాను చేసుకుపోవాలని, ఆధారాలు బలంగా ఉన్నప్పుడు ఎవరి ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదని, చార్జిషీట్ దాఖలు చేయాల్సిందేనని సీఎం అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగనున్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి. గవర్నర్ దృష్టికి.. ఆదివారం రాత్రి సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ భేటీలోనూ ఈ కేసు ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. గవర్నర్కు కేసు పురోగతిని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబుపై తీసుకోబోతున్న చర్యలను కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావడంతో చార్జిషీట్, నిందితుల జాబితాలో చేర్చడం వంటి అంశాల్లో గవర్నర్ నుంచి అనుమతి కూడా రాష్ట్ర ప్రభుత్వం పొందినట్టు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వచ్చే పదిహేను రోజుల్లో ఏసీబీ కోర్టులో పూర్తి స్థాయి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు జీఏడీ నుంచి అనుమతి తీసుకున్నామని, గవర్నర్ నుంచి కూడా అనుమతి లభించినట్టు ఏసీబీలోని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బాబు వివాదాస్పద నిర్ణయాలపై పునఃసమీక్ష ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీ అనే సంస్థకు రాజధాని హైదరాబాద్లో క్రీడా మైదానాలు అప్పగించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తిరగదోడాలని, దానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలో దుబాయ్కి చెందిన ఎమ్మార్ సంస్థకు గోల్ఫ్ కోర్సు పేరిట దాదాపు 500 ఎకరాలు కట్టబెట్టిన వైనంపైనా విచారణ జరుపనుంది. ఎమ్మార్, రహేజాతో పాటు చంద్రబాబు హయాంలో సాగిన అన్ని భూ లావాదేవీల వెనుక గుట్టును రాబట్టాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులకు సంబంధించి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. సెబాస్టియన్ (బాబు అనుచరుడు): హలో స్టీఫెన్సన్: యా బ్రదర్.. సెబాస్టియన్: బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు, బి ఆన్ ద లైన్ (బాబు గారు మీతో మాట్లాడుతారు మీరు లైన్లో ఉండండి) స్టీఫెన్సన్: యా చంద్రబాబు: హలో.. స్టీఫెన్సన్: సర్ గుడ్ ఈవెనింగ్ సర్.. చంద్రబాబు: ఆ.. గుడ్ ఈవెనింగ్ బ్రదర్, హౌ ఆర్ యూ స్టీఫెన్సన్: ఫైన్.. థ్యాంక్యూ సర్ చంద్రబాబు: మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్ (మనవాళ్లు నాకు అంతా వివరించారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిన పని లేదు) స్టీఫెన్సన్: యస్ సర్.. రైట్ సర్ చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు, వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటాను. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తా) స్టీఫెన్సన్: ఎస్ సార్.. రైట్ సార్.. చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లం ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.. ఎలాంటి సమస్యా లేదు) స్టీఫెన్సన్: ఎస్ సర్ చంద్రబాబు: దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వుయ్ విల్ వర్క్ టుగెదర్ (అది మా హామీ.. మనం కలసి పని చేద్దాం) స్టీఫెన్సన్ : రైట్...థాంక్యూ సర్.. చంద్రబాబు: థాంక్యూ. చంద్రబాబు–ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మధ్య నడిచిన ఫోన్ సంభాషణ ఇదీ.. -
ఓటుకు కోట్లు
-
ఓటుకు కోట్లు ఆగేదెప్పుడు ?
-
బ్రీఫ్డ్ కేస్
పంచ్నామా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి చిక్కులు తప్పవు. మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సరిపోదు. అవతలి వాళ్లు అప్రమత్తం కాకుండా చూసుకోవడం కూడా మన పనే. ఇదంతా ఎందుకంటే... చంద్రబాబు నాయుడి కేసు గురించే. తెలంగాణ ఏసీబీ వారికి కించిత్ మర్యాద లేదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆట పట్టించకూడదన్న ఇంగితం అసలే లేదు. థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ నడిపిన సీనియర్ని అల్లరి చేయకూడదన్న మంచితనం ఏ కోశానా లేదు. ఏమీ లేవు కాబట్టే... తెలంగాణ ఏసీబీ వారు అందరూ మర్చిపోయిన ఓటుకు కోట్లు కేసు వ్యవహారాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చారు. ఓటుకు కోట్లు కేసులో ఛార్జిషీటు దాఖలు చేసిన ఏసీబీవారు అందులో చంద్రబాబు నామజపమే చేశారు. ఏకంగా 22సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించారు. పాపం చంద్రబాబు నాయుడు ఎంతో గుట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికలో తమ అభ్యర్ధిని గెలిపించుకోవడం కోసం జస్ట్ ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుక్కుందామని ప్రయత్నిస్తే ఆ ప్లాన్ అంతా చెడగొట్టింది ఏసీబీ. చేసింది చాలదన్నట్లు... ఆ ఎమ్మెల్యేలను కొనడానికి చంద్రబాబు నాయుడు ఏం ప్లాన్ వేశారో రేవంత్ రెడ్డి చేతికి డబ్బుల సూట్కేస్ ఇచ్చి ఎలా పంపారో... స్టీఫెన్ సన్తో చంద్రబాబు ఏమేం బేరసారాలు ఆడారో అంతా రహస్యంగా రికార్డు చేసింది ఏసీబీ. పెద్దమనుషులు ఏదో వ్యవహారంలో రహస్యంగా బేరసారాలు ఆడుకుంటూ ఉంటే ఆ ఫోను సంభాషణ వినడమే తప్పు. విన్నది కాక దాన్ని రికార్డు చేయడం అత్యంత అమర్యాదకరమైన విషయం. పోనీ రికార్డు చేశారే అనుకుందాం... దాన్ని ఏసీబీ వారు తమకి బోరు కొట్టినపుడు కాలక్షేపానికి వింటే సరిపోతుంది. అలా చేయకుండా దాన్ని మొత్తం పబ్లిక్కి తెలిసేలా చేయడం... మహాదారుణం. ‘ఎక్కడికి వెళ్తున్నాం మనం’ అని వాపోతున్నారు బాబు. ఈ దేశంలో ఎంత రహస్యంగా పనులు చేసుకుందామన్నా కుదరడం లేదని పాపం చంద్రబాబు నాయుడు ఎంతగా మనస్తాపం చెందారో? ముఖ్యమంత్రి పదవిలోఉన్నాక... తమ పార్టీకి ఓ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోడానికి... ఎమ్మెల్యేలను కొనడం నేరమెలా అవుతుంది? ఎమ్మెల్యేలకు డబ్బులు కూడా ఇవ్వకుండా వారి మద్దతు అడిగితే తప్పవుతుంది కానీ... చక్కగా యాభై లక్షల సూట్ కేస్ ఇచ్చి పంపిన ధర్మప్రభువు చంద్రబాబు నాయుడి విషయంలో ఏసీబీ వారు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గంగానే ఉందని మర్యాదస్థులంతా చాలా మర్యాదగా చెవులు కొరుక్కుంటున్నారు. ఇది చాలదన్నట్లు ఇదే సమయంలో సుప్రీం కోర్టు కూడా చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. అది కూడా ఓటుకు కోట్లు కేసుకు సంబంధించినదే.ఇవన్నీ చూశాక చంద్రబాబులాంటి మనుషులకు ఇవి రోజులు కావేమోనన్న బెంగ గుండెల్ని కోసేస్తోంది. అయితే సుప్రీం నోటీసుల గురించి ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని... అలాంటి కేసులు నోటీసులు తాను చాలానే చూశానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుచరుల్లో ఇపుడు అదే చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు ధీమాకి కారణం ఏమిటా అని వారు ఆలోచిస్తున్నారు. ‘ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు?’ అంటే అర్ధం... ఇంకా ఇలాంటి వ్యవహారాలు చాపకింద చాలా తోసేశారా? అని పచ్చచొక్కాలు నర్వస్గా బెల్లు కొట్టేసుకుంటున్నారు. మీడియానీ రాజకీయనాయకులనూ మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు ఇపుడేం చేస్తారా అని వారంతా అలజడితో సైకిల్ టైర్లలో గాలి తీసి కొడుతూ... తీసి కొడుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడి బ్రీఫింగ్ అండ్ బ్రీఫ్కేస్ గ్యాంగ్ మాత్రం మా బాస్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కేసులు లేకుండా చేయగలరు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏంటో వారి ధీమా? వాళ్ల బ్రీఫ్కేసులలో ఎంత ధీమా ఉందో?... మీరే ఆలోచించండి. - నానాయాజీ -
కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పరార్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం చేకూర్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన నేపథ్యంపై రామకృష్ణారెడ్డి వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో స్పందించారు. ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ చేయడమంటే సుప్రీంకోర్టును చంద్రబాబుకు చుక్కెదురైనట్లేనని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ సొత్తును దోచుకుంటూ అక్రమంగా సంపాదించిన లంచాల సొమ్ముతో అవసరం లేని తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయారని చెప్పారు. "మనవాళ్లు దే బ్రీఫ్ డ్ మీ" అనే గొంతు ఆయనదే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని, అయినా అటు తెలంగాణ ఏసీబీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఇద్దరూ కూడా ఢిల్లీ పెద్దల కాళ్లు, గడ్డాలు పట్టుకుని తప్పించుకోజూశారని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం మీద హక్కులు ఉన్నా హైదరాబాద్ను వదులుకున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా ఆనకట్టలు కడుతున్నా నోరెత్తలేదని.. పార్లమెంట్ సాక్షిగా లభించిన హామీ, ఆంధ్రరాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉంది. గత మూడు సంవత్సరాలుగా దీనిపై మేం పోరాడుతున్నాం. దివంగత రాజశేఖర రెడ్డి స్పూర్తితో, పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అండదండలతో మా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ కేసులో తెలంగాణ మేజిస్ట్రేట్ కోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. స్టీఫెన్ సన్ తో "మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ" మాట్లాడిన వాయిస్ ను టెస్ట్ చేయించి, మాట్లాడింది చంద్రబాబు నాయుడేనని రూజువుచేయించి కోర్టుకు సమర్పించడం జరిగిందని చెప్పారు. దానిపై చంద్రబాబుకు నోటీసులు జారీచేయడం శుభపరిణామమని చెప్పారు. -
డబ్బులిస్తూ దొరికిపోయినా చంద్రబాబుపై చర్యలుండవా?
‘యువభేరి’లో నిలదీసిన విద్యార్థిని గుంటూరు: ‘‘ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోతే అతడిని ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఒక విద్యార్థి పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోతే అతడిని డిబార్ చేస్తారు. మరి సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ఓటుకు కోట్లు’ కేసులో సాక్ష్యాలతో సహా దొరికిపోతే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ వైఎస్సార్సీపీ గురువారం గుంటూరులో నిర్వహించిన యువభేరిలో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని శ్రీవిద్య సంధించిన ప్రశ్న ఇది. యువభేరి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు మైక్ ఇచ్చి మాట్లాడించారు. వివిధ అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు, ప్రత్యేక హోదా పోరాటం, ఓటుకు కోట్లు కేసు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ఆంక్షలు తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తమ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని తేల్చిచెప్పారు. హోదా కోసం పోరాడేవారికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. హోదా ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. -
ఐక్యతతోనే తప్పేను ముప్పు
విశ్లేషణ నేటి మన ‘ప్రజాస్వామ్యం’ మేడిపండులా ఉంది. కుల, మత తత్వాలు స్వైర విహారం చేస్తు న్నాయి. ‘ధనస్వామ్యం’ రాజ్యమేలుతున్నది. కమ్యూనిస్టు పార్టీలు, ఇతర రాజకీయపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు లౌకికత కోసం తక్షణమే ఏకం కావాలి. అణగారిన దళిత, ఆదివాసి, మహిళా, మైనారిటీ, వెనుకబడిన కులాల ప్రజానీకం, దేశభక్తియుత శక్తులు, ఐక్యమై ఈ దిగజారుడును నిలువరించేందుకు మహత్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. స్వార్థ, సంకుచిత రాజకీయ చక్రభ్రమణానికి అతీతంగా మరో స్వతంత్ర పోరాటం అవసరం. ఇంతవరకూ మన ప్రజలెన్నడూ ఎరుగనంతటి ప్రజా వ్యతిరేక, మతతత్వ, కులతత్వ, నిరంకుశ, ధనస్వామ్య పాలన కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ సాగు తున్నది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాలను భూస్థాపితం చేసిన చంద్రబాబు ఇక్కడ అధికారంలో ఉండగా, గుజరాత్లో సాగిన మత తత్వ రక్తతర్పణానికి బాధ్యత వహించవలసిన నాటి బీజేపీ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రధానిగా ఉన్నారు. తమాషా ఏమంటే, ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోదీ రాజీనామా చేయాలని కోరిన చంద్ర బాబు.. తిరిగి ఏనాడూ బీజేపీతో పొత్తు పెట్టుకోనని 2004 ఎన్నికల్లో బహి రంగంగా ప్రకటించారు. ఒట్టుతీసి గట్టునపెట్టి, నిర్లజ్జగా పదవీ వ్యామో హంతో 2014 ఎన్నికలో అదే బీజేపీతో జతకట్టి, ఎన్డీఏలో భాగస్వామి కూడా అయినారు. విదేశాల్లోని నల్లధనం ఏదీ? ‘ఎన్నికల ప్రజాస్వామ్యం’లో ప్రజలకు అలవిగాని వాగ్దానాలతో అర చేతిలో వైకుంఠం చూపించి, వంచించే కళలో ఆరితేరడం ఒక ప్రధాన అర్హతగా నిరూపితమైంది. ‘అధికారంలోకి వచ్చిన 15 రోజులలోగా మన కుబేరులు దేశంలో అక్రమంగా సంపాదించి విదేశాలలో దాచిన లక్షల కోట్ల నల్లధనాన్ని దేశానికి తిరిగి తీసుకువచ్చి, ప్రతి సామాన్య భారతీయుని బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని 2014 ఎన్నికల్లో మోదీ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి 30 నెలలయినా ఒక్క రూపాయి కూడా అలా జమ కాలేదు. పైగా ‘‘స్వచ్ఛందంగా మీవద్ద ఉన్న నల్లధనాన్ని ప్రకటిస్తే మీపై చర్య లుండవు. మీకు రాయితీ కూడా ఇస్తాం’’ అంటూ ఆయన ప్రభుత్వం, నల్లధన కుబేరులను ప్రాథేయపడుతున్నది. వాగ్దాన భంగ వంచనా శిల్పంలో చంద్ర బాబు అగ్రగణ్యులని తెలిసిందే, ముఖ్యంగా ఈ రెండేళ్ల పాలనలో ఆయన అది నిరూపించి చూపారు. అయినా వారిరువురి విజయం ‘ప్రజాస్వామ్య’ విజయమేనట! ఇది మతస్వామ్యం, కులస్వామ్యం ఎన్నికలలో ప్రజల మధ్య మతపరమైన చిచ్చుపెట్టి మెజారిటీ మతం వారు భావోద్వేగాలకు గురయ్యేలా చేసి, అందుకోసం బీజేపీ వంటి పార్టీలు ఎంతకైనా తెగించడానికి ప్రయత్నించడం చూస్తున్నదే. ప్రతి ఎన్నికలకూ అయోధ్యలో రామాలయ నిర్మాణం తెరపైకి వస్తూనే ఉంటుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఖాయమే అయినా... ఏడాది లోపల (ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ముందు) అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి మ్యూజియం నిర్మిస్తామంటున్నారు. ఇది, హిందూ మతతత్వం కాదనీ, ‘టూరిజం’ దృష్టితో కోట్లాది శ్రీరామ భక్తులను ఆకర్షించే ఆదాయ వనరు మాత్రమేననీ కేంద్ర పర్యాటక మంత్రి ఉవాచ. అంటే పేరు రాముడిది, పైసలు ప్రభుత్వానికి. ‘అందరికీ వికాసం అందరికీ అభివృద్ధి’ అన్న మోదీ నినాదం... ఆచరణలో పరమత ద్వేషమే ప్రధానంగా గల మతతత్వంతో మనుగడ సాగిస్తున్నది. అందుకే ముస్లిం స్త్రీలకు వ్యతిరేకమైన ‘తలాక్’ విధానాన్ని రద్దు చేసేందుకు ఆదేశిక సూత్రాలలోని ఉమ్మడి పౌర స్మృతిని ఎజెండాలోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ముస్లిం మహిళలకు తగు న్యాయం జరగాల్సిందే. కానీ హిందూ మహిళలు, పురుషులతో సమానంగా జీవించ గలుగు తున్నారా? అలాగే క్రిస్టియన్ మహిళలకు న్యాయం జరగనక్కరలేదా? ఇంతెం దుకు? పార్లమెంటులో స్త్రీలకు 30 శాతం స్థానాలు రిజర్వు చేయాలన్న ప్రతి పాదన రెండు దశాబ్దాలుగా పార్లమెంటులో నానుతూనే ఉన్నది. ఆదేశిక సూత్రాలను అమలుపరచడం అన్నది నెపం కాకపోతే... వాటిలోనే ఉన్న ప్రజోపయోగకరమైన మద్యపాన నిషేధం వంటి అంశాలను అమలు జర పరేం? మతతత్వం, కులతత్వం ఆధారంగా ఓట్లు పొంది గద్దెనెక్కడం మన ప్రజాస్వామ్యం ప్రత్యేకత. ఏపీ జనాభాలోS6–7 శాతం కూడా లేని ఆధిపత్య కులాల అధికార దర్పం మనమెరిగినదే. ప్రస్తుత ప్రభుత్వం కులాధిపత్య సాధన విషయం మన శాసనసభలో, మంత్రి వర్గంలో వారి ఆధిపత్య కులం ఎంత శాతంగా సాపేక్షికంగా అధికంగా ఉన్నదో చూస్తున్నాం. కులతత్వంలో కూరుకుపోయినా, మతతత్వంలో మునిగిపోతున్నా ‘మన ప్రజాస్వామ్యం’ అందరికీ ఆదర్శమని పాలక వర్గాల ప్రచారం. అంతేకాదు 2014 ఎన్నికలలో మరో ముఖ్య కులం ఓట్లు తమ వైపు తిప్పుకునేందుకే పాపులర్ సినిమా నటుడు పవన్ కల్యాణ్ మద్దతు కోసం చంద్రబాబు ప్రాకులాడారని తెలి సిందే. ఇదీ మన ‘కులస్వామ్య’ ‘మతస్వామ్య’ ప్రజాస్వామ్య స్వరూపం. ‘ఓటుకు కోట్లు’ అవినీతి కాదట! ప్రజలలో నూటికి 70 శాతం కేవలం పొట్ట నింపుకోడానికే పడరాని పాట్లు పడుతుంటే... పార్లమెంటులోని ప్రజా ప్రతినిధులలో దాదాపు సగం మంది దశ, శత, సహస్ర కోటీశ్వరులు. ఈ ఆర్థిక అసమానతలు నానాటికీ పెరు గుతుండగా, ధనరాశులు కుప్పలుతెప్పలుగా వృద్ధి చేసుకుంటున్న కోటీ శ్వరులను చూసి ‘‘ఆహా! మన దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో’’నని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనడం, ఇతర ప్రలోభాలు పెట్టి తమవైపు తిప్పుకోవడమూ, తద్వారా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమూ సర్వసాధారణమై పోయింది. ఇక మన సీఎం చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ‘ఓటుకు కోట్లు’ ఉదంతం గురించి చెప్పనవసరమే లేదు. ‘ఈ కేసు ఎన్నికల అవకతవకలకు సంబంధించినదేగానీ’ అవినీతి పరిధిలోకి రాదని బాబు తరఫున అటార్నీ జనరల్ చేసిన వితండ వాదన అపూర్వం. డబ్బు సంచులతో ఎన్నికలను అపహాస్యం చేసినా అది అవినీతి కాదట. ‘వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షం అనేది ఉండరాదని’ ఒక సీఎం స్వయంగా చెబుతున్నారు. అంతే కాదు తదనుగుణంగా ప్రతిపక్షం పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మరీ నగ్నమైన ఉదాహరణ వంద ఓట్ల మెజారిటీతో గెలిచిన మన కోడెల శివప్రసాద్ 2014 ఎన్నికలలో 11 కోట్ల రూపాయలకుపైగా తాను ఖర్చు చేసినట్లు బాహాటంగా చేసిన ప్రకటన. అయినా ఎన్నికల కమిషన్ ఆయనపై ఏ చర్యనూ గైకొనలేదు. సైనిక చర్యను చిన్నచూపు చూడటమేగా? ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేనంతగా దిగజారి యూపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో అనుమానాస్పదమైన తమ విజయం కోసం మన సేనల ప్రతిష్టను, గౌరవాన్ని, ప్రజలలో వారి పట్ల ఉన్న ప్రేమాభి మానాలను ‘ఓట్ల’కు వాడుకుని గట్టెక్కాలని బీజేపీ కుయుక్తులు పన్నడం గర్హనీయం. ఇటీవల ఆక్రమిత కశ్మీర్ వెంబడి సరిహద్దులలోనీ యుడీ సెక్టర్లో, పాక్ సైన్యం అండదండలతో ఉగ్రవాదులు దొంగ దెబ్బతీసి 20 మంది మన వీర జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూక దాడికి సహజంగానే మన ప్రజానీకం దేశభక్తితో స్పందించారు. అయితే మన సైన్యం ఆ దుశ్చర్యకు ప్రతీకారంగా మన సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసి, దాదాపు 40 మంది ఉగ్రవాదులను హతమార్చింది. మన సైన్యం చేసిన ఈ సాహస కృత్యాన్ని కూడా తమ ఘనకార్యంగా బీజేపీ చౌకబారు ప్రచారం చేసుకుంటోంది. వాస్తవమేమంటే, ఇలాంటి దేశభక్తియుత ప్రతీకార సైనిక చర్యలు, ఏ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాని ఎవరు అనే దానితో నిమిత్తం లేకుండా గతం లోనూ జరిగాయి. కానీ ఆయా పార్టీలుగానీ, ప్రధానులు గానీ ఇలా బడాయి ప్రకటనలు చేసుకోలేదు. అది రాజ్యతంత్రం. కానీ ఈసారి మోదీ సర్జికల్ దాడులు తన వలననే, తమ పాలనవల్లనే సాధ్యమైనట్లు ప్రచారం చేసుకుం టున్నారు. ‘కుమ్మరి సారె మీద ఈగ వాలి తన ప్రభావం వల్లనే సారె తిరుగు తున్నదనుకున్నట్లు’ అది తమ వల్లనే సాధ్యమైందంటూ ఆ ‘సైనిక చర్య’ను చులకన చేస్తున్నారు. బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా, కార్గిల్ స్థావర యుద్ధంలో మన సైనికుల వీరోచిత పాత్ర వీరికి తెలిసి ఉండదా? ఇక ‘అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుకలేదన్నట్లు కేంద్రమంత్రి వెంకయ్య ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే ఎన్నిక’ అంటున్నారు. ఆయన అనని దల్లా ‘ఏక పార్టీ, ఏక వ్యక్తి పాలన’ అనే. ఈ వాదన అశాస్త్రీయమే కాదు, దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సమాఖ్య స్వభా వానికి, లౌకికతత్వానికి ప్రమాదం. ఈ ధోరణికి పరాకాష్టగా మన ప్రధాని మోదీ మన సైన్యాన్ని పరమ కిరాతకమైన ఇజ్రాయిల్ సైన్యంతోనూ, ప్రపంచ ఉగ్రవాద స్థావరంవలే ఉన్న అమెరికా సైన్యంతోనూ పోలుస్తున్నారు. మేడిపండుగా మారుతున్న ప్రజాస్వామ్యం నేటి ‘ప్రజాస్వామ్యం’ మేడిపండులా ఉంది. కుల, మతతత్వాలు స్వైర విహారం చేస్తున్నాయి. అన్ని విలువలకూ తిలోదకాలిస్తూ ‘ధనస్వామ్యం’ రాజ్యమేలుతున్నది. దీన్ని పరిమిత ప్రజాస్వామ్యం అంటారో, అ«థారిటేరి యనిజం అంటారో, నియంతృత్వం అంటారో, ఫాసిజం అంటారో... సాంకే తికంగా నిర్వచనమేమిటో, తర్వాత శాస్త్రీయ చర్చలలో తేల్చుకోవచ్చు. దేశం నేటి ఎన్డీఏ తిరోగామి పాలనలో మధ్యయుగాల నాటి అంధకారంలోకి దిగ జారి అతి అధ్వాన దిశగా పయనిస్తున్నది. రోగ నిర్ధారణ పేరుతో రోగి మల మూత్ర రక్త పరీక్ష, ఎక్స్రే, స్కానింగ్, యం.యం.ఆర్, ఈసీజీ, సీటీస్కాన్ అంటూ ప్రస్తుతం పరీక్షల కోసం నిరీక్షణ మాదిరి కాలయాపన సాగితే చివరకు రోగ నిర్ధారణ అయ్యేసరికి ఇక వైద్యం అవసరం ఉండకపోవచ్చు. ఇక శషబిషలకు తావులేకుండా దేశ పురోగమనం కోసం అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం కావాలి. కమ్యూనిస్టులే సరిపోరు. రాజకీయ పార్టీలు ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దేశ ప్రజాస్వామ్య శక్తులు లౌకికత కోసం ఏకం కావాలి. అవి కూడా సరిపోవు. అణగారిన ప్రజానీకం సామాజిక న్యాయపోరాట దళిత, ఆదివాసి, మహిళా, మైనారిటీ, వెనుకబడిన కులాల ప్రజానీకం, వారి నేతలు, దేశభక్తియుత శక్తులు, వ్యక్తులు ఐక్యమై ఈ దిగజారుడును నిలువరించేందుకు మహత్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించితేనే, అంధకార బంధురంగానున్న మన ప్రజల జీవితాలను కాపాడగలం. స్వార్థ, సంకుచిత రాజకీయ చక్రభ్రమణానికి అతీతంగా మరో స్వతంత్ర పోరాటం అవసరం. వ్యాసకర్త : ఏపీ విఠల్, మార్క్సిస్టు విమర్శకులు మొబైల్ : 98480 69720 -
'కేసు నుంచి రక్షించినందుకే సన్మానాలు'
-
'కేసు నుంచి రక్షించినందుకే సన్మానాలు'
తిరుపతి : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుళ్లిద్దరూ తోడు దొంగలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాబు పాలనతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి చంద్రబాబును రక్షించినందుకే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు రాష్ట్రంలో సన్మానాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, వెంకయ్యలిద్దరూ గోబెల్స్ను మించిన ఘనులని ఆయన ఎద్దేవా చేశారు. అర్థరాత్రి సమయంలో లెఫ్ట్, ప్రజాసంఘాల నేతలను అరెస్ట్ చేయడం దారుణమని భూమన చెప్పారు. -
దొంగలా దొరికావు బాబూ..
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరిక గుడివాడ : ఓటుకు కోట్లు కేసులో దొంగలా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ‘నేను నిప్పుని అని చెప్పుకునే చంద్రబాబు కోర్టుమెట్లు ఎందుకు ఎక్కాడని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక శరత్ థియేటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసులు మాఫీ చేయించుకోవటంతో చంద్రబాబు ఎక్స్ఫర్టు అని చెప్పారు. వీలైతే వెన్నుపోటు పొడవటం, లేదంటే కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన సమర్ధులు లేరని అన్నారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఆయన ఇంటికెళ్లి కేసులు పెట్టొద్దని కాళ్లు పట్టుకున్నాడని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్చైర్మన్ అడపా బాబ్జీ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు పాల్గొన్నారు. -
దర్యాప్తు ఆపండి..!
-
'చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు'
తిరుపతి: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కైన సీఎం చంద్రబాబు ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసుతో తనకు ప్రమేయం లేదని చంద్రబాబు కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయగలరా? అని నవీన్కుమార్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలో బాబు జైలుకెళ్లడం తప్పదని జోస్యం చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'కేసీఆర్.. ఓటుకు కోట్లు కేసును తేల్చాలి'
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకం అని చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏసీబీ కోర్టు ఆదేశాలతోనైనా ఓటుకు కోట్లు కేసును తేల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేయం ఉందని అందరికీ తెలిసిందే'ని అని ఆయన అన్నారు. ఈ కేసు విషయంలో అప్పట్లో రెండు రాష్ట్రాల సీఎంలు సవాళ్లు విసురుకున్నారనీ, ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం రాజీపడ్డారని ఎమ్మెల్సీ రంగారెడ్డి విమర్శించారు. -
ఆరు నెలలకే ఫ్రెండ్స్ అయ్యారు ఎలా ?
రహస్యం 2015 అంతు చూస్తామని .. ఆరు నేలలకే ఫ్రెండ్స్ అయ్యారు ఎలా ? ఈ ఏటి మేటి మిస్టరీగా తెలంగాణ, ఏపీ సీఎంల వ్యవహార శైలి హైదరాబాద్: ‘నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.. నగ్నంగా, పచ్చిగా పట్టపగలే దొరికిన దొంగవు నువ్వు.. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది..’ ‘నేను కళ్లు తెరిస్తే కష్టాలే.. నన్ను అరెస్టు చేస్తే నీ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజు. నా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం నీకెవరిచ్చారు? ట్యాపింగ్ కేసులో నువ్వు జైలుకు వెళ్లకతప్పదు..' ...ఈ తిట్లు, భీకర హెచ్చరికలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు! ఎవరు, ఏ సందర్భంలో అన్నారో రెండు రాష్ట్రాల ప్రజలందరికీ సుపరిచితమే!! కేసుల మీద కేసులు.. టేపుల మీద టేపులు.. నువ్వు తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో రెండంటా అన్నట్టుగా ఉండేది ఇరువురి నేతల వ్యవహారం. ఏదేమైనా ఆ ఇద్దరూ చెప్పిందొకటే.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందని..(?)’ కానీ ఏమైంది? ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టు ‘తగిన శాస్తి’ జరిగిందా? చంద్రబాబు హెచ్చరించినట్టు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లారా? ఏదీ జరగలేదు. 2015 మొదటి అర్థభాగం వరకు రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేలా చేసిన ఇరు రాష్ట్రాల చంద్రుల మధ్య అదే ఏడాది చివరికి వచ్చేసరికి ‘సఖ్యత’ చోటుచేసుకుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెట్టారు. నోటికి వచ్చినట్లు తిట్టుకున్న కొద్ది కాలానికే మాటలు కలిశాయి. మర్యాదలు పెరిగాయి. కేసుల అలజడి అసలే లేదు. పెపైచ్చు తమ తమ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ఇరువురు ఒకరి నివాసానికి మరొకరు వెళ్లి ఆహ్వానాలు ఇచ్చుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం వెళ్తే.. కేసీఆర్ తలపెట్టిన అయుత చండీయాగానికి ఏపీ సీఎం హాజరయ్యారు. గడచిన ఏడాదిలో సగ భాగం కంటే ఎక్కువ కాలం ఉప్పు-నిప్పుగా ఉన్న బాబు-కేసీఆర్ ఇప్పుడు పాలు-నీళ్లలా కలిసిపోయారు. కలిస్తే చాలు పరస్పరం అభివాదాలు, నవ్వులు, సరదా ముచ్చట్లు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు, ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైపోయాయన్నదే సామాన్యుల మదిని తొలుస్తున్న ప్రశ్న! తన పని తాను చేసుకుపోవాల్సిన చట్టం ఎవరికి చుట్టంగా మారింది? ఏలికలు ఒక్కటవగానే కేసులెందుకు మూలన పడ్డాయి?! అందరినీ సమానంగా చూడాల్సిన చట్టం కొందరిని ఎందుకు ఎక్కువ సమానంగా చూస్తోంది? పదేళ్లు హైదరాబాద్ మాదే అని హూంకరించిన చంద్రబాబు 2016 జూన్ నాటికి హైదరాబాద్లో ఏపీ సచివాలయానికి తాళాలు వేయాలని ఎందుకంటున్నారు? ఇవ న్నీ గతేడాది మిగిల్చిన శేష ప్రశ్నలు! మొత్తంగా 2015.. జనం చెవిలో పాలకులు పెట్టిన పూలకు తార్కాణంగా నిలిచిపోయింది!! ‘ట్యాపింగ్’ గోల ఇదీ.. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసుకు ప్రతిగా ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ఐపీఎస్, ఐఎఎస్ అధికారులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. తెలంగాణలో తన ను అప్రతిష్టపాలు చేశారని గమనించిన చంద్రబాబు ఏపీలో కొత్త డ్రామాకు తెరతీశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసును రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది కాస్త బెడిసికొట్టడంతో లాభం లేదనుకుని ట్యాపింగ్ కేసు పెట్టి కేసీఆర్పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారు ఇరుక్కుంటుందని అంతా భావించారు. కాల్ డేటా సమర్పించాలని విజయవాడలో పోలీ స్ కమిషనర్ సెల్ఫోన్ కంపెనీలను ఆదేశిం చారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వాల్సిందేనని విజయవాడ కోర్టు తేల్చిచెప్పింది. సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ఐపీఎస్, ఒక ఐఎఎస్ అధికారి జైలుకేనంటూ ఏపీ మంత్రులు మండిపడ్డారు. కొన్నాళ్లు పోతే గానీ అసలు విషయం బోధపడలేదు. కేసుల సంగతి దేవుడెరుగు చంద్రబాబు హైదరాబాద్ రావడమే మానేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగితేనో లేదా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తప్ప హైదరాబాద్ రావడం లేదు. పదేళ్ల పాటు రాజధాని అంటూ గొప్పలకు పోయిన సీఎం చంద్రబాబు ఇప్పుడు.. అబ్బే హైదరాబాద్ నుంచి ఉద్యోగులంతా అమరావతి రావాల్సిందేనని హుకుం జారీ చేశారు. ‘ఓటుకు కోట్లు’లో హడావుడి ఇలా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇచ్చారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని రేవంత్రెడ్డిని అరెస్టు చేశారు. అంతే కాదు కేసును చాలా స్పీడ్గా నడిపించారు. స్టీఫెన్సన్తో మాట్లాడిన చంద్రబాబు ఫోన్ సంభాషణల టేపులు బయట పెట్టారు. ఇంకేముంది చంద్రబాబుకు కష్టకాలమే అనుకున్నారు. దానికి తగ్గట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే స్థాయిలో చంద్రబాబుపై చెలరేగిపోయారు. ఓటుకు కోట్లు కేసులో బాబుకు ఇబ్బందులు తప్పవని అందరూ అనుకున్నారు. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి ఏసీబీ విచారిస్తుందని భావించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చంద్రబాబు ఫోన్ సంభాషణ టేపులు బయటపడ్డ వెంటనే ఈ కేసు కీలక దశకు చేరుకుందని ఏసీబీ అధికారులు హడావుడి చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని గంభీరమైన ప్రకటనలు చేశారు. నేను కళ్లు తెరిస్తే...: చంద్రబాబు ‘‘నేను కళ్లు తెరిస్తే కష్టాలే. నన్ను అరెస్టు చేస్తే నీ ప్రభుత్వ పతనం తప్పదు. నీకు ఎన్ని అధికారాలు ఉన్నాయో నాకూ అన్ని అధికారాలు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య తగవులు వద్దు. నువ్వు కాదని మొండికేస్తే విషయం చాలా దూరం వెడుతుంది. సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా. స్టింగ్ ఆపరేషన్ పేరుతో ప్రభుత్వానికి చెందిన వారు ఫోన్లు ట్యాప్ చేస్తావా..? ఇది నీచాతి నీచం. మాకూ ఏసీబీ ఉంది. మీ ఏసీబీ హైదరాబాద్లో ఉంటే మా ఏసీబీ కూడా హైదరాబాద్లోనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు జైలుకు వెళ్లక తప్పదు. ఠి జూన్ 9న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్పై చంద్రబాబు విసుర్లు బాబును బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు: కేసీఆర్ ‘‘చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది. నగ్నంగా, పచ్చిగా పట్టపగలే దొరికిన దొంగవు నీవు. అరచి పెడబొబ్బలు పెట్టి ఏదో చేయాలనుకుంటున్నావు. కేసులో ఇరికిస్తే ఇరికే మనిషివా నువ్వు చంద్రబాబూ..? హైదరాబాద్ నీ అబ్బ జాగీరా, నీ తాతదా... కేసీఆర్ నీ లెక్క దొంగ కాదు, లత్కోరు పని చేయడు...’’ జూన్ 9న నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ వ్యాఖ్యలివీ! -
చంద్రబాబు తప్పించుకొని తిరుగుతున్నాడు
-
‘ఓటుకు కోట్లు’ కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు ఉచ్చు బిగుసుకుంటోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన విషయం విదితమే. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియో, ఆడియోలను నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ (ఎఫ్ఎస్ఎల్)కు అందజేశారు. అలాగే కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్తో సండ్ర ఫోన్లో జరిపిన సంభాషణలను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. టేపులన్నీ నిజమైనవేనని నిర్ధారించినందున వారికి స్వర నమూనా పరీక్షలు నిర్వహించాలని గతంలో ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వర నమూనాలను అసెంబ్లీ అధికారులు గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. వారిరువురితో పాటు సెబాస్టియన్, ఉదయసింహ మీడియాతో మాట్లాడిన టేపులను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణకు అందజేయాలంటూ ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. -
‘ఓటుకు కోట్లు’పై ‘బాబు’ వ్యూహరచన!
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఓటుకు కోట్లు’ కేసు సీఎం చంద్రబాబునాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని గట్టిగా ప్రశ్నించవచ్చని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీపార్టీ(టీడీపీపీ) సమావేశాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు దాదాపు 3 గంటలపాటు జరిగే ఈ భేటీలో ఓటుకు కోట్లు అంశమే ప్రధాన చర్చనీయాంశంగా కనిపిస్తోంది. సమావేశానికి బీజేపీ ఎంపీలను కూడా ఆహ్వానించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు ఆడియో టేపులు టీవీ చానళ్లలో ప్రసారమవడం తెలిసిందే. ఈ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినట్లూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్లమెంటులో ఈ అంశంపై గట్టిగా నిలదీసే అవకాశాలున్నాయని టీడీపీ అంచనా వేసింది. దీంతో ఈ అంశాన్ని ఎదుర్కొనే విషయంలో టీడీపీపీ సమావేశంలో తమ పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఆ మేరకు తెలంగాణ సర్కారు తమ ఫోన్లు ట్యాప్ చేసిందనే ఎత్తుగడతో ఈ అంశాన్ని ఎదుర్కొనాలని సూచించనున్నట్టు తెలిసింది. ఇందుకు మిత్రపక్షమైన బీజేపీ సాయం కూడా కోరాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఇదిలాఉండగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చినవిధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి అధిక నిధులు రాబట్టుకోవడం వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించనున్నారు. 2014 సెప్టెంబర్ 20న విజయవాడలో జరిగిన టీడీపీపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైనా చర్చ జరగనుంది. ప్రతినెలా రాష్ట్రంలోని ఏదో ఒకప్రాంతంలో సమావేశమై అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించుకోవాలని అప్పట్లో ఎంపీలు నిర్ణయించారు. విశాఖ-చెన్నై కారిడార్ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా, విశాఖ, తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలకు కేంద్రం భారీ నిధులందించేలా ఒత్తిడి తేవాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. నూతన రాజధానికోసం అధికమొత్తంలో నిధులు రాబట్టే మార్గాలపైనా చర్చించారు. అయితే ఆ సమావేశం ముగిశాక ఈ అంశాలపై మరోసారి చర్చించడంగానీ, కేంద్రంపై ఒత్తిడి తేవడంగానీ జరగలేదు. ప్రత్యేక హోదాపైనా అధికారపార్టీ ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. ప్రత్యేక రైల్వేజోన్, కొల్లేరు కాంటూరు కుదింపు, మెట్రోరైలు ఏర్పాటు, విమానాశ్రయాలకు నిధులు, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు వంటి విషయాలను కేంద్రంవద్ద ప్రస్తావించి వాటికోసం తీవ్రస్థాయిలో పట్టుబట్టిన సందర్భాలూ కరువే. -
ఓటుకు కోట్లు కేసులో కీలకఘట్టానికి ఏసీబీ!
-
మంత్రులతో చంద్రబాబు అత్యవసర సమావేశం
-
మోదీకి మోకరిల్లి గట్టెక్కే యత్నం
-
మోదీకి మోకరిల్లి గట్టెక్కే యత్నం
చంద్రబాబుపై పీసీసీ ఆరోపణాస్త్రాలు ఏడాది పాలనంతా అవినీతిమయమంటూ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్లు పట్టుకుని ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యత్నిస్తున్నారని పీసీసీ ఆరోపించింది. ప్రధాని చొరవ చూపితే ఈ కేసునుంచి బాబుకు తాత్కాలికంగా ఉపశమనం లభించినా మున్ముందు తప్పించుకోజాలరని హెచ్చరించింది. టీడీపీ ఏడాది అవినీతి పాలనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ రేవంత్రెడ్డి వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబనే విషయం స్పష్టమైందని, అయితే దోషులకు శిక్ష పడాలనే నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఏపీ, తెలంగాణ సీఎంలు సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఏడాదిలోనే చంద్రబాబు రూ. 4 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అది బాబు గొంతే : రామచంద్రయ్య శాసనమండలిలో విపక్షనేత రామచంద్రయ్య మాట్లాడుతూ టెలిఫోన్ సంభాషణల్లో ఉన్నది బాబు గొంతేనన్నారు. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి శని, ఆదివారాల్లో సన్మానాలు, సభలు, పత్రికా సమావేశాలు నిర్వహించే బీజేపీ కేంద్ర నాయకత్వం రేవంత్రెడ్డి ఉదంతం తర్వాత రాష్ట్రానికి, హైదరాబాద్కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పల్లంరాజులు మాట్లాడుతూ ఏపీలో కేసీఆర్పై నమోదైన కేసులపై సిట్ ఎందుకు వేస్తున్నారో చెప్పాలన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేవీపీ రామచంద్రరావు, కిల్లి కృపారాణి, కాసు వెంకట క్రిష్ణారెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళి, తులసిరెడ్డి, దేవినేని రాజశేఖర్, గంగా భవానితో పాటు వివిధ జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
టీడీపీ కాచుకుని ఉంది.. తస్మాత్ జాగ్రత్త!
మంత్రులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసు పరిణామాలతో రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసులో ఇరుక్కోవడంతో టీడీపీ నేతలు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా మెదలాలని సూచించారు. లంచాలు, ప్రలోభాలకు లొంగిపోతే, అవినీతి, అక్రమాలకు పాల్పడితే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదముందని బుధవారం నాటి కేబినెట్ సమావేశంలోనే మంత్రులను సీఎం సుతిమెత్తగా హెచ్చరించారు. టీడీపీ కాచుకుని ఉన్నందున స్టింగ్ ఆపరేషన్లు, ఫోన్ రికార్డింగ్లు చేసే ప్రమాదముందని నొక్కి చెప్పారు. కొత్త వ్యక్తుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, పరిచయస్తులను కూడా నమ్మకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ట్యాపింగ్ చేస్తున్నారంటూ గోల చేస్తున్న టీడీపీ.. అవకాశం దొరికితే తెలంగాణ అధికారులపై కూడా బురద జల్లేందుకు వెనుకాడకపోవచ్చని నిఘా వర్గాలను కేసీఆర్ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ ఈ సమాచారం చేరవేశారు. -
'సమాధానం చెప్పకపోవడం విచారకరం'
విశాఖపట్నం: ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారి సీఎం చంద్రబాబేనని నిర్ధారణయిందని మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. నిన్న వెలుగుచూసిన ఆడియో సంభాషణ ప్రపంచంలోనే సంచలనం అయిందని పేర్కొన్నారు. ఇంతవరకు చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేదంటే రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతుందని శ్రీనివాస్ అన్నారు.